Updated : Oct 22, 2023
దసరా సినిమాల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇందులోని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. పండుగ సీజన్ కి సరైన సినిమా కావడంతో కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో రోజురోజుకి వసూళ్ళను పెంచుకుంటూ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే రూ.70 కోట్లకు పైగా గ్రాస్ కి రాబట్టిన ఈ మూవీ.. ఐదో రోజు వంద కోట్ల మార్క్ ని అందుకునే అవకాశముంది.
భారీ అంచనాలతో అక్టోబర్ 19న విడుదలైన 'భగవంత్ కేసరి' మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని.. సంచలన వసూళ్ళతో సత్తా చాటుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.32.33 కోట్ల గ్రాస్ రాబట్టగా, రెండు రోజుల్లో రూ.51.12 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. ఇక మూడో రోజు, రెండో రోజుకి మించిన వసూళ్లు రాబట్టిన భగవంత్ కేసరి.. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.71.02 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు తరలి వస్తుండటంతో చాలా చోట్ల షోలు పెంచుతున్నారు. ఈ రెండు రోజులు ఆదివారం, దసరా కలిసి రావడంతో.. మూడో రోజు కంటే నాలుగు, ఐదు రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
