
Arjun Reddy lady Shalini sizzles in transparent white
Publish Date:Jun 9, 2025
Arjun Reddy has given huge fame to Shalini Pandey. The young beautiful actress came across as a chubby cute lady in the film but she lost some extra pounds and looks like a stunning model. She is proud of her body and flaunts it in different photoshoots, too.
The actress has shocked many with see through transparent white top that too completely soaked in water. She looks glamorous and sizzles in this dress almost exposing her body parts like in Wild Things style. Her seductive poses add to the hotness and boldness in these photos.
While the Marathi actress is trying to make her name in Bollywood, she is not been appearing in Telugu Cinema. Let's hope that she gets the best opportunities to explore her career further in Telugu language, too.
Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
NBK Akhanda 2 Teaser raises anticipation
Publish Date:Jun 9, 2025
నటసింహ తాండవం మొదలైంది.. ‘అఖండ2’ టీజర్ అదిరింది!
Publish Date:Jun 9, 2025
Is Trivikram going to direct Allu Arjun's subject with Ram Charan?
Publish Date:Jun 9, 2025
షాకిచ్చిన తమ్ముడు.. విజయ్ ఏం చేస్తాడు..?
Publish Date:Jun 9, 2025
నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం.. ఇదే గాడ్ ఆఫ్ మాసెస్ జైత్రయాత్ర!
Publish Date:Jun 9, 2025
(జూన్ 10 నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా..)
నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటేనే అభిమానులు ఆనందంతో కేరింతలు కొడతారు. ‘జై బాలయ్యా..’ అంటూ తమ అభిమాన కథానాయకుడికి జేజేలు పలుకుతారు. బాలయ్య చెప్పే వీరోచిత డైలాగ్స్కి పులకించిపోతారు. తెరపై బాలకృష్ణ కనిపిస్తే చాలు అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. పవర్ఫుల్ డైలాగులు చెప్పాలన్నా, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించాలన్నా అది బాలయ్యకే సాధ్యం అనేది నందమూరి అభిమానుల్లో ఉన్న అభిప్రాయం. దానికి తగ్గట్టుగానే ప్రేక్షకుల్ని, అభిమానుల్ని తన డైలాగులతో చైతన్యపరిచే బాలయ్య.. ఆ తరహా క్యారెక్టర్సే చేస్తూ ఆకట్టుకుంటున్నారు. నటరత్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసి 50 ఏళ్ళుగా తన కెరీర్ను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. క్రమశిక్షణ, వృత్తి పట్ల గౌరవం తండ్రి నుంచి ఆయనకు సంక్రమించిన మంచి లక్షణాలు. ఎన్టీఆర్లాగే పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ అభిమానుల్ని గణనీయంగా పెంచుకున్నారు బాలకృష్ణ. 1974లో ‘తాతమ్మకల’ చిత్రంతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం ఎలా సాగింది, సినిమాల పరంగా, రాజకీయంగా ఆయన సాధించిన విజయాలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం.
1960 జూన్ 10న మద్రాసులో నటరత్న నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు మగ సంతానంలో ఆరోవాడిగా జన్మించారు నందమూరి బాలకృష్ణ. అప్పుడు చిత్ర పరిశ్రమ మద్రాస్లోనే ఉండడంతో బాలకృష్ణ బాల్యం అంతా అక్కడే గడిచింది. కొంత వయసు వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చి నిజాం కాలేజీలో బి.కాం పూర్తి చేశారు. 14 సంవత్సరాల వయసులో తండ్రి దర్శకత్వంలో రూపొందిన తాతమ్మకల చిత్రంలో తొలిసారి నటించారు బాలయ్య. 1974లో ఈ సినిమా విడుదలైంది. అప్పటి నుంచి 1983 వరకు 11 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. వీటిలో 6 సినిమాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. 1975లో వచ్చిన అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో ఎన్టీఆర్కు తమ్ముడిగా నటించారు. అలాగే దానవీరశూర కర్ణ చిత్రంలో అన్నయ్య హరికృష్ణ అర్జునుడి పాత్ర పోషించగా, కుమారుడు అభిమన్యుడు పాత్రలో బాలకృష్ణ నటించారు.
1984లో సంతాన భారతి, పి.వాసు దర్శకత్వంలో వచ్చిన సాహసమే జీవితం చిత్రంతో సోలో హీరోగా పరిచయమయ్యారు బాలయ్య. ఈ సినిమా తర్వాత డిస్కోకింగ్, జననీ జన్మభూమి చిత్రాలు చేసినా అవి ఆశించిన విజయాన్ని అందించలేదు. అదే సంవత్సరం కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన మంగమ్మగారి మనవడు చిత్రం ఘనవిజయం సాధించి బాలకృష్ణ కెరీర్ను టర్న్ చేసింది. విడుదలైన అన్ని సెంటర్స్లో శతదినోత్సవం జరుపుకుంది. హైదరాబాద్లో 565 రోజులు ప్రదర్శింపబడి రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలోని తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు బాలకృష్ణ. ఆ తర్వాత శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర చిత్రంలో చేసిన సిద్ధయ్య పాత్ర నటుడిగా ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది.
ఆ తర్వాత కథానాయకుడు, ఆత్మబలం, బాబాయ్ అబ్బాయ్, భలే తమ్ముడు, నిప్పులాంటి మనిషి వంటి సినిమాల్లో విభిన్నమైన చిత్రాలతో ముందుకెళ్తున్న బాలకృష్ణకు ముద్దుల కృష్ణయ్య చిత్రంతో విజయపరంపర మొదలైంది. ఆ సంవత్సరం ఆయన చేసిన సినిమాల్లో ఆరు సినిమాలు సూపర్హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఒక హీరో ఒకే సంవత్సరం చేసిన ఆరు సినిమాలు సూపర్హిట్ కావడం అనే రికార్డు ఇప్పటికీ బాలకృష్ణ పేరు మీదే ఉంది. ఆ తర్వాత మువ్వగోపాలుడు, రాము, ఇన్స్పెక్టర్ ప్రతాప్, భలేదొంగ, ముద్దుల మావయ్య, బాలగోపాలుడు, నారీ నారీ నడుమ మురారి, లారీ డ్రైవర్ వంటి సూపర్హిట్ సినిమాలతో టాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగారు బాలయ్య. ఆ తర్వాత చేసిన ఆదిత్య 369, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి సినిమాలు ఆయన రేంజ్ని మరింత పెంచాయి.
నిప్పురవ్వ, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలిసింహం, వంశానికొక్కడు సినిమాలు బాలకృష్ణను టాలీవుడ్లో టాప్ హీరోని చేశాయి. ఆ తర్వాత కూడా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన బాలకృష్ణకు సరికొత్త ఇమేజ్ను తెచ్చిపెట్టిన సినిమా సమరసింహారెడ్డి. సెంటిమెంట్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు వంటివి చేస్తూ వచ్చిన బాలయ్యను ఒక ఫెరోషియస్ క్యారెక్టర్లో చూపించి ప్రేక్షకులకు, అభిమానులకు ఒక కొత్త బాలకృష్ణను పరిచయం చేశారు దర్శకుడు బి.గోపాల్. అంతకుముందు బాబాయ్ అబ్బాయ్, సీతారామకళ్యాణం వంటి సినిమాల్లో కామెడీని అద్భుతంగా పండిరచిన బాలయ్య.. సమరసింహారెడ్డితో దాన్ని పక్కన పెట్టి రౌద్ర పూరితమైన పాత్రలు పోషించడానికి పరిమితమైపోయారు. ఎందుకంటే బాలయ్యను ఆ తరహా పాత్రల్లో చూసేందుకే ప్రేక్షకులు, అభిమానులు ఇష్టపడేవారు. ఆ తర్వాత నరసింహనాయుడు చిత్రంతో మరో బ్లాక్బస్టర్ని అందుకున్నారు. ఇక అక్కడి నుంచి ప్రతి సినిమాలోనూ పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేస్తూ ఆ తరహా క్యారెక్టర్లు తాను మాత్రమే చెయ్యగలనని ప్రూవ్ చేసుకున్నారు. లక్ష్మీనరసింహా, సింహా, లెజెండ్, అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ వంటి పూర్తి యాక్షన్ సినిమాలు చేస్తూ తిరుగులేని మాస్ హీరోగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అఖండ2తో మరో బ్లాక్బస్టర్ని తన ఖాతాలో వేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
నటరత్న ఎన్.టి.రామారావు పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. బాలకృష్ణ కూడా ఆ తరహా పాత్రలు పోషించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. దానవీరశూర కర్ణ, అక్బర్ సలీం అనార్కలి, వేములవాడ భీమకవి, శ్రీమద్విరాటపర్వం, శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం వంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన బాలకృష్ణ.. సోలో హీరో అయిన తర్వాత భైరవద్వీపం చిత్రంతో మొదలుపెట్టి శ్రీకృష్ణార్జున విజయం, ఆదిత్య 369, శ్రీరామరాజ్యం, పాండురంగడు, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాల్లో.. జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రలు అత్యద్భుతంగా పోషించి ఆ తరహా సినిమాలు చెయ్యడం నందమూరి వంశానికే సాధ్యం అని మరోసారి నిరూపించారు.
ఇక ఆయనకు లభించిన పురస్కారాల గురించి చెప్పాలంటే.. సినీ పరిశ్రమకు చేస్తున్న సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మభూషణ్ పురస్కారాన్ని అందించింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ నేషనల్ అవార్డును బాలకృష్ణకు అందించింది. నరసింహనాయుడు, సింహా, లెజెండ్ చిత్రాలకు మూడు సార్లు ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే వివిధ సంస్థలు బాలకృష్ణకు పలు పురస్కారాలు అందించాయి.
వ్యక్తిత్వ పరంగా చూస్తే.. టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోలందరి కంటే భిన్నమైన వ్యక్తి బాలకృష్ణ. తన మనసులో ఉన్నది నిర్మొహమాటంగా బయటికి చెప్పడం, తప్పు జరిగితే దాన్ని నిర్భయంగా ఖండిరచడం వంటి లక్షణాలు ఎన్టీఆర్ నుంచి అలవడ్డాయి. తన సహనటీనటులను, తన కంటే సీనియర్ నటీనటులను గౌరవించడం, నిర్మాతల శ్రేయస్సు కోరుకోవడం, దర్శకులకు పూర్తి స్వేచ్ఛనివ్వడం వంటివి బాలకృష్ణలో ఉన్న మంచి లక్షణాలు. సినిమాల్లోనే కాదు, టీవీ షోల్లోనూ అంతే ఉత్సాహంగా పాల్గొంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు బాలయ్య. ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అన్స్టాపబుల్ షోకి బాలకృష్ణ హోస్ట్ అని ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎంతో గంభీరంగా ఉండే ఆయన దగ్గరికి వెళ్ళడానికే చాలా మంది భయపడుతుంటారు. కానీ, ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అనీ, ఎంతో జోవియల్గా మాట్లాడతారని బాలకృష్ణను దగ్గరగా చూసినవారు చెప్తుంటారు. అందుకే అన్స్టాపబుల్ షోకి ఆయన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. షోకి వచ్చిన సెలబ్రిటీస్తో ఎంతో సరదాగా మాట్లాడుతూ వారితో కలిసి పోతారు. షో చూస్తున్నవారికి ఎంతో ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలంటే.. 1982లో ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ప్రతి ఎలక్షన్లో ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు కోసం ప్రచారం చేశారు బాలకృష్ణ. 2014లో హిందూపూర్ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2019లో, 2024లో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఇక బాలకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా తల్లి బసవతారకం పేరు మీద అత్యాధునిక సౌకర్యాలతో ‘బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ను 2000 సంవత్సరంలో ప్రారంభించారు. దీనికి నందమూరి బాలకృష్ణ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేవిధంగా ఈ హాస్పిటల్ను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు కొన్ని వేలమందికి ఈ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందించారు.
వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1982లో 22 ఏళ్ళ వయసులో వసుంధరాదేవిని వివాహం చేసుకున్నారు బాలకృష్ణ. వీరికి ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ. పెద్ద కుమార్తె బ్రాహ్మణి వివాహం.. చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్తో జరిగింది. అలాగే రెండో కుమార్తె తేజస్వినికి వైజాగ్ ఎం.పి. భరత్తో వివాహం జరిపించారు. కుమారుడు మోక్షజ్ఞను తన నట వారసుడిగా పరిచయం చెయ్యాలనే ప్రయత్నాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. ఒక మంచి సినిమా ద్వారా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘అఖండ2’ చిత్రం చేస్తున్నారు బాలకృష్ణ. ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది. మరో విశేషం ఏమిటంటే.. సూపర్స్టార్ రజినీకాంత్ చేస్తున్న ‘జైలర్2’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు నందమూరి బాలకృష్ణ.
తెలుగు సినిమాలోని సీన్ని కాపీ చేసి తమిళ్లో బ్లాక్బస్టర్ కొట్టిన మురుగదాస్!
Publish Date:Jun 9, 2025
ఆ ఒక్క సినిమా మూవీ మొఘల్ జీవితాన్ని మార్చేసింది!
Publish Date:Jun 6, 2025
50 ఏళ్ళు తన గాన మాధుర్యాన్ని పంచిన ఎస్.పి.బాలు సినీ ప్రస్థానం ఇదే!
Publish Date:Jun 3, 2025
పరాజయాలతో మొదలై.. దిగ్గజ దర్శకుడిగా ఎదిగిన మణిరత్నం!
Publish Date:Jun 2, 2025
ఇప్పుడు నేనిలా ఉన్నానంటే దానికి కారణం సల్మాన్ ఖాన్!
Publish Date:Jun 9, 2025
గత రెండు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తున్న ఎంతో మంది నటీమణులు క్యాన్సర్ బారిన పడి ఆ తర్వాత పూర్తి ఆరోగ్యవంతులుగా తిరిగి వచ్చిన సంఘటనలు చూశాం. మనీషా కోయిరాలా, మహిమా చౌదరి, మమతా మోహన్దాస్, లీసా రే వంటి ప్రముఖ హీరోయిన్లు క్యాన్సర్ను జయించి తిరిగి తమ కెరీర్ను కొనసాగిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో పరిచయమున్న సోనాలి బెంద్రే కూడా ఉన్న విషయం తెలిసిందే. 2018లో జరిపిన వైద్య పరీక్షల్లో సోనాలికి మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉన్నట్టుగా తేలింది. దీంతో న్యూయార్క్లో క్యాన్సర్కి సంబంధించిన చికిత్స చేయించుకున్నారు. నాలుగో స్టేజీలో ఉన్న క్యాన్సర్ అయినప్పటికీ దాన్ని జయించి 2021లో పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు సోనాలి. తాను క్యాన్సర్తో బాధపడుతున్న రోజుల గురించి, న్యూయార్క్లో చికిత్స తీసుకుంటున్న సమయంలో తనలో ఆత్మస్థయిర్యాన్ని పెంచిన ఓ హీరో గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు సోనాలి.
‘1994లో బాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా నటిగా పరిచయమయ్యాను. 1999 వరకు దాదాపు పాతిక హిందీ సినిమాల్లో నటించాను. మణిరత్నంగారి సినిమా ‘బాంబే’లో నేను చేసిన ‘హమ్మా హమ్మా..’ సాంగ్కి చాలా మంచి పేరు వచ్చింది. ఆ సమయంలోనే తెలుగు, తమిళ భాషల్లో కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాను. నా మొదటి డెలివరీ వరకు నటించాను. ఆ తర్వాత తల్లిగా నా బాధ్యతను నిర్వర్తించాను. కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత కొన్ని టీవీ షోలలలో హోస్ట్గా, జడ్జిగా కూడా వ్యవహరించాను. ఆ సమయంలోనే నాకు క్యాన్సర్ ఉందని తేలింది. దాంతో నా కెరీర్కి మరోసారి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. న్యూయార్క్లో చికిత్స తీసుకున్నాను. ఆ రోజులు నా జీవితంలో ఎంతో విషాదభరితమైనవిగా చెప్పాలి. అలాంటి సమయంలో నాకు ఎంతో ధైర్యాన్నిచ్చిన హీరో సల్మాన్ ఖాన్. ట్రీట్మెంట్ ఎలా జరుగుతోంది అనే విషయాల గురించి ప్రతిరోజూ ఎంక్వయిరీ చేసేవారు. అంతేకాదు, రెండు సార్లు న్యూయార్క్ వచ్చి నన్ను పరామర్శించారు కూడా. నాలో నింపిన ధైర్యానికి ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. కొన్ని సందర్భాల్లో మెడిసన్స్ కంటే మన ఆత్మీయులు చెప్పే మాటలు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయని నాకు అర్థమైంది’ అంటూ సల్మాన్ఖాన్ తన ఆరోగ్యంపై చూపించిన కేర్ గురించి వివరించారు.
టాలీవుడ్ ప్రేక్షకులకు సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందం, అభినయం కలగలిసి బాలీవుడ్ హీరోలా కాకుండా తెలుగమ్మాయిలానే కనిపించే సోనాలి.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్హిట్ సినిమాల్లో నటించారు. అలాగే హిందీలో సల్మాన్ఖాన్ వంటి హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం టీవీ షోలలో హోస్ట్గా, జడ్జిగా తన కెరీర్ను కొనసాగిస్తున్నారు సోనాలి.
‘ధూమ్4’ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన ఎన్టీఆర్ డైరెక్టర్!
Publish Date:Jun 5, 2025
మూడో భార్యని కలవడానికి ముందు థెరపీ చేయించుకున్నాను..దటీజ్ అమీర్ ఖాన్
Publish Date:Jun 2, 2025
సల్మాన్ ఖాన్ కేసులో జితేందర్ సింగ్ అరెస్ట్..విచారణలో ఏం చెప్పాడో తెలిస్తే షాక్ అవుతారు
Publish Date:May 22, 2025
సైనికుల తల్లుల బాధ మీకు అర్ధమవుతుందా!
Publish Date:May 13, 2025
నాగుల చవితి కోసం ఆన్లైన్లో రక్తపింజరి ఆర్డర్...ఎంత ఆర్గానిక్ హృదయమో
Publish Date:Jun 9, 2025
జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రాఘవ స్కిట్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. రాఘవ అలాగే లేడీ గెటప్ మోహన్ కలిసి ఈ స్కిట్ వేశారు. ఐతే లేడీ గెటప్ మోహన్ ఆన్లైన్ లో ఒక పామును బుక్ చేసాడు. ఆ ఆర్డర్ ఇంటికి వచ్చింది. ఇక రాఘవ మాములుగా ఆ ప్యాక్ తీసుకుని "ఎం బుక్ చేసావే" అని అడిగాడు రాఘవ. "పాము బుక్ చేశా. ఆరు నెలల్లో నాగుల చవితి వస్తోంది కదా పాలు పోయాలని పామును బుక్ చేశా" అని చెప్పింది. దాంతో రాఘవ షాకయ్యాడు. "ఇంతకు ఎం పాము బుక్ చేసావ్ " అన్నాడు రాఘవ. "మన పక్కింటి రష్మీ కట్ల పాము బుక్ చేసిందని ఆవిడ మీద ఒక పుట్ట ఎక్సట్రా ఉండాలని చెప్పి రక్త పింజరిని బుక్ చేశా." అనేసరికి ఇంట్లోకి వెళ్లి ఆ పామును తెచ్చిన ప్యాకింగ్ ని చూసి ఏంటి మూత తెరిచి ఉంది అని కంగారు పడ్డాడు. "గాలి ఆడాలని మూత ఓపెన్ చేసి పెట్టా" అని మోహన్ చెప్పాడు. దాంతో రాఘవ అదిరిపడ్డాడు. "ఎక్కడుందో అది" అని కంగారు పడ్డాడు రాఘవా.
ఇక మోహన్ ఐతే అదేదో పెంపుడు పాము ఐనట్టు "రక్తమ్మా..రక్తమ్మా.." అని పిలిచేసరికి రాఘవకు కోపం తన్నుకొచ్చింది. "ఏ కన్నంలో ఉందో వెతుకు" అన్నాడు రాఘవ. ఇంతలో మరో ఆర్డర్ డెలివరీ వచ్చేసరికి "ఎం ఆర్డర్ తెచ్చావ్" అన్నాడు రాఘవ. "బర్రెను బుక్ చేశారండి" అన్నాడు డెలివరీ బాయ్. "ఈమె బర్రెను బుక్ చేశావా" అన్నాడు కోపంగా. "పాముకు పాలు పోయాలి కదా..పాముకు ప్యాకెట్ పాలు పడతాయో లేదో అని బర్రెను బుక్ చేశా" అని చెప్పింది. దాంతో రాఘవ "నీ ఆర్గానిక్ హృదయానికి దణ్ణమె బాబు" అన్నాడు. ఇలా ఈ వారం జబర్దస్త్ షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేయబోతోంది.
Illu illalu pillalu : కొడుకు, కోడలి శోభనానికి ఏర్పాట్లు చేసిన రామరాజు.. టెన్షన్ లో వేదవతి!
Publish Date:Jun 8, 2025
Karthika Deepam 2 : దశరథ్ ని నాన్న అని పిలిచిన దీప.. జ్యోత్స్న కనిపెట్టేనా!
Publish Date:Jun 8, 2025
Brahmamudi : వాళ్ళని రౌడీల నుండి కాపాడిన అప్పు.. యామినితో పెళ్ళి వద్దన్న రాజ్!
Publish Date:Jun 8, 2025
విలన్ గా పెడితే శ్రీఆంజనేయం మూవీ ప్లాప్ అవుతుంది అన్నా...కృష్ణవంశి వినలేదు
Publish Date:Jun 7, 2025
రామ్ చరణ్ సంచలన నిర్ణయం.. సుకుమార్ ని కాదని త్రివిక్రమ్ తో..!
Publish Date:Jun 9, 2025
'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan).. ఆ తర్వాత 'ఆచార్య', 'గేమ్ ఛేంజర్' సినిమాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న 'పెద్ది'తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'పెద్ది' తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా కమిటై ఉన్నాడు చరణ్. ఇది తన కెరీర్ లో 17వ సినిమా. అయితే ఇప్పుడు సుకుమార్ ప్లేస్ ని త్రివిక్రమ్ కబ్జా చేసినట్లు తెలుస్తోంది.
ఈ జనరేషన్ టాలీవుడ్ టాప్-6 స్టార్స్ లో రామ్ చరణ్, ప్రభాస్ తప్ప మిగతా వారితో త్రివిక్రమ్ సినిమాలు చేశాడు. రామ్ చరణ్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. నిజానికి ఇది సుకుమార్ ప్రాజెక్ట్ తర్వాత ఉంటుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా సుకుమార్ సినిమా వెనక్కి వెళ్ళి.. త్రివిక్రమ్ మూవీ ముందుకు వచ్చిందని వినికిడి. RC17 కి త్రివిక్రమ్, RC18 కి సుకుమార్ దర్శకత్వం వహిస్తారట.
వాస్తవానికి త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, ముందుగా ప్రకటించిన త్రివిక్రమ్ సినిమాని కాకుండా.. అట్లీ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాడు బన్నీ. దాంతో త్రివిక్రమ్.. చరణ్ సినిమాని లైన్ లో పెట్టాడు.
చరణ్-త్రివిక్రమ్ కాంబో సెట్ కావడంతో.. అనూహ్యంగా సుకుమార్ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళింది. అయితే సుకుమార్.. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో ఓ సినిమా చేయనున్నారని వార్తలొస్తున్నాయి. RC17 తర్వాత ఇది ఉంటుందనే అభిప్రాయాలు మొదట వ్యక్తమయ్యాయి. కానీ, ఇప్పుడు త్రివిక్రమ్ సడెన్ ఎంట్రీ ఇవ్వడంతో.. షారుఖ్ సినిమాని పూర్తి చేసి, ఆ తర్వాత చరణ్ ప్రాజెక్ట్ పైకి సుకుమార్ షిఫ్ట్ అవుతారేమో అనిపిస్తోంది.
ముగ్గురు హీరోలతో త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..!
Publish Date:Jun 8, 2025
క్రేజీ కాంబో సెట్ చేసిన మైత్రి.. డైరెక్టర్ చెప్పిన స్టోరీకి హీరో ఫిదా..!
Publish Date:Jun 5, 2025
కథ, నిర్మాత రెడీ.. వినాయక్తో సినిమా అంటేనే భయపడిపోతున్న హీరోలు!
Publish Date:Jun 3, 2025
అఖిల్ అక్కినేని.. ఎంగేజ్మెంట్ సీక్రెట్గా చేసుకున్నాడు.. పెళ్లి కూడా అంతేనా?
Publish Date:May 27, 2025
థగ్ లైఫ్
Publish Date:Jun 5, 2025
భైరవం
Publish Date:May 30, 2025
శుభం
Publish Date:May 9, 2025
సింగిల్
Publish Date:May 9, 2025
