Updated : Aug 14, 2020
హీరోయిన్ అనీషా అంబ్రోస్ గుర్తుందా? సందీప్ కిషన్ 'రన్', మంచు మనోజ్ 'ఒక్కడు మిగిలాడు', విశ్వక్ సేన్ 'ఈ నగరానికి ఏమైంది' సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్ 'గోపాల గోపాల', రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ'లో అతిథి పాత్రల్లో మెరిసింది. ఆమె ఈ రోజు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనీషాకి అబ్బాయి పుట్టాడు. ఈ విషయాన్ని తేజస్వి మదివాడ సోషల్ మీడియాలో చెప్పింది.
కథానాయికగా చోటామోటా చిత్రాలు చేస్తన్న సమయంలో అనీషా అంబ్రోస్ పెళ్లి చేసుకుంది. ఆమె భర్త పేరు గుణ జక్కా. అయితే, గర్భవతి అయిన విషయాన్ని తొలుత గోప్యంగా ఉంచారు. కొన్ని రోజుల తరవాత తేజస్వి పోస్ట్ ద్వారా అందరికీ తెలిసింది. ఇప్పుడు బిడ్డ పుట్టిన విషయాన్ని కూడా ఆమె చెప్పింది. వీళ్లిద్దరూ స్నేహితులు. ఇటీవలే అనీషా బేబీ షవర్ ఫంక్షన్ జరిగింది. కొన్ని రోజుల్లో శుభవార్త చెప్పింది.
