- అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో లో ప్రవాసాంధ్ర చిరంజీవి శివాని పేరిశెట్ల భరతనాట్య అరంగేట్రం కార్యక్రమం
- Shccc ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన ఆలయ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం
- స్టాక్టన్ హిందూ సాంస్కృతిక మరియు సామాజిక కేంద్రం యొక్క కుంభాభిషేకం
- ఉస్మానియా విశ్వవిద్యాలయం సాంకేతికశాఖాధిపతి ఆచార్య డా లక్ష్మీనారాయణ గారి మీట్ అండ్ గ్రీట్
- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నాట్స్ 2019 సభ్యత్వ నమోదు ..
- ఇండియా డే పెరేడ్ లో పాల్గొన్న ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్
- హాంగ్ కాంగ్ హేవిళంబి ఉగాది వేడుకలు
- Kargil Vijay Diwas, Hong Kong
- మిల్పీటస్ లో వైభవంగా మనబడి విద్యార్ధుల స్నాతకోత్సవం !
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్
- Telugu Ugadi Mega Celebrations In Toronto, Canada
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ విజయ్ దివస్ సంబరాలు
- Iafc Congratulates Indian Americans Who Got Elected
- శ్రీ ఆర్.పీ. సింగ్ - మీట్ అండ్ గ్రీట్
- నిరసన ర్యాలీ ఫర్ పాకిస్థాన్
- Raja Krishnamoorthy For Us Congress - Fundraising In Dallas
- Bjp జాతీయ నాయకులు పేరాల చంద్రశేఖర్ గారికి ఘన సన్మానం !
- అమెరికాలో కనువిందు చేసి నయనానందం కలిగించే వసంతఋతువు
- బేకర్స్ ఫీల్డ్ లో శ్రీవేంకటేశ్వరుని క్రొత్త నివాసం
- Sri Ranga Ramanuja Swami Visits Usa
- Indian American Teens Adhvik And Yuktha Captivate Audiences With Their Indian Classical Art Debut Performances
- ఆస్ట్రేలియా సిడ్నీ లో వినూత్నంగా జరిగిన విజయ గొల్లపూడి కథలసంపుటి ‘నీ జీవితం నీ చేతిలో’ మరియు శ్రీ పెయ్యేటి రంగారావు గారి భావగీతాలు ‘రంగానందలహరి’ పుస్తక ఆవిష్కరణ మహోత్సవం
- స్కాట్లాండ్ లో మొట్టమొదటిగా జరుగబోవు అష్టావధానము...
- డాలస్లో మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద వైభవంగా యోగా
- టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు వారికి రాష్ట్ర గవర్నర్ చే ప్రత్యేక గుర్తింపు
స్కాట్లాండ్ లో మొట్టమొదటిగా జరుగబోవు అష్టావధానము
ప్రపంచములోనే అత్యంత సుందరమైన దేశాలలో స్కాట్లాండ్ ఒకటి. బ్రిటన్ లో ఉన్నవారికి మాత్రమే కాకుండా ఐరోపా మరియు ఇతర దేశాల వారికి అదొక యాత్రాస్థలం.
స్కాట్లాండ్ లో జులై 9 న మొట్టమొదటిసారి ఒక గొప్ప అష్టావధానమును తలపెట్టి, ఆ కార్యక్రమములో తెలుగు ఔత్సాహికులు (ప్రసాద్ మంగళంపల్లి, రంజిత్ నాగుబండి, శైలజ గంటి, సాయికుమారి దొడ్డ, హిమబిందు జయంతి, విజయ్ కుమార్ రాజు పర్రి, మిథిలేష్ వడ్డిపర్తి, పండరి జైన్ పొలిశెట్టి, మమత వుసికల, అనంత రామానంద్ గార్లపాటి, సత్య శ్యాం జయంతి, నిరంజన్ నూక) ఇలా 12 మంది పృచ్ఛకులుగా పాల్గొనబోతున్నారు. అవధానిగా త్రిభాషా మహాసహస్రావధాని, శ్రీ ప్రణవ పీఠాధిపతి బ్రహ్మశ్రీ “వడ్డిపర్తి పద్మాకర్” గారు వ్యవహరించబోతున్నారు. ప్రార్థనా గేయాన్ని స్కాట్లాండ్ లో గాయకుడుగా ప్రఖ్యాతి చెందినటువంటి బాలుడు అనీష్ కందాడ ఆలపించబోతున్నాదు.
ఈ కార్యక్రమ నిర్వాహకులైన శ్రీ విజయ్ కుమార్ రాజు గారు అందరినీ రాజధాని ఎడింబర్ఘ్ కు ఆహ్వానిస్తున్నారు. అవధాని మరియు పృచ్ఛకుల మధ్యన జరుగబోతున్న ఈ ఆసక్తికరమైన, రసవత్తరమైన సాహితీ ప్రక్రియను జరుపుటకు ఎడింబర్ఘ్ హిందూ మందిర్ నందు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అంతే కాకుండా రోజంతా మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు (ప్రవచనాలు, ధర్మ సందేహాలు, భోజన ప్రసాదం, పాదపూజలు) నిర్వహించబడుతున్నాయి. మరిన్ని విశేషాలకొరకు ఆహ్వాన పత్రికను చూడగలరు. ప్రత్యక్ష ప్రసారాన్ని అనేక వెబ్ సైట్ల ద్వారా చేయడానికి సన్నాహాకాలు జరుగుతున్నట్లు కార్యనిర్వాహకులు చెబుతున్నారు.
కావున అందరు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆధ్యాత్మికత యందు మునిగి తేలాలని ఆశిద్దాం.