చలికాలంలో సాసువ ఆకు లేదా ఆవాల ఆకు తినాలని చెప్పేది ఇందుకే..!
ఆహారం శరీరానికి చాలా మేలు చేస్తుంది. సరైన ఆహారం తీసుకుంటే ఎలాంటి జబ్బులు అయినా తగ్గుతాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది. అందుకే సీజన్ కు తగ్గట్టు ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెబుతుంటారు. చలికాలంలో సాసువ ఆకు లేదా ఆవాల ఆకు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటారు. ఆవాలు చెట్టు నుండి లభించినప్పుడు దాని మీద పొట్టు కూడా తీయకుండా పసుపు రంగులో ఉంటే వాటిని సాసువలు అంటారు. ఇక ఆవాల గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. ఈ ఆవాలు పండే మొక్కల ఆకులను ఆహారంలో తీసుకుంటారు. ఇప్పట్లో చాలా మంది ఈ ఆకుల వినియోగం తగ్గించారు కానీ పెద్దల కాలం నాడు ఈ ఆకులను వంటల్లో వినియోగించేవారు. ఆవాల చెట్టు ఆకులను ఆహారంలో తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. పోషకాలు.. ఆవాల మొక్క ఆకులలో విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-కె, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, సోడియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా మేలు చేస్తాయి. ప్రయోజనాలు.. ఆవాల మొక్క ఆకులను ఆహారంలో తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో సహజంగానే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉండటానికి ఆహారంలో ఆవాల మొక్క ఆకులు తీసుకోవాలి. ఈ ఆకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మోషన్ సాఫీగా జరగడంలో సహాయపడుతుంది. ఆవాల మొక్క ఆకులలో అమైనో ఆమ్లాలు, ఫైబర్ సహా అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. చలికాలంలో ఈ ఆకులు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండదు. ప్రోటీన్లు, విటమిన్లు సమృద్దిగా ఉండటం వల్ల ఆవాల మొక్క ఆకులు తింటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలే సమస్య తగ్గడం నుండి జుట్టు ఆరోగ్యంగా పెరగడం వరకు అన్ని రకాలుగా జుట్టుకు మేలు చేస్తుంది. ఆవాల మొక్క ఆకులలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఆహారంలో తీసుకుంటే ఉంటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది. ఈ కారణంగా ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారికి ఆవాల మొక్క ఆకులు చాలా మేలు చేస్తాయి. ఆవాల మొక్క ఆకులు తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. శరీరంలో రక్తహీనత తొలగిపోతుంది. ఇది వేడి చేసే గుణం కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఆకులు ఆహారంలో తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది. *రూపశ్రీ.
read moreయూరిక్ యాసిడ్ కు, కీళ్ల నొప్పులకు 15రోజుల్లో చెక్ పెట్టే ఆయుర్వేద చిట్కా..!
యూరిక్ యాసిడ్ నేటి కాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్-రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తిన్నప్పుడు ఏర్పడే పదార్థం. ఇది రక్తంలో పేరుకుపోతుంది. శరీరం నుండి తొలగిపోనప్పుడు ఇది కీళ్లలో స్ఫటికాల రూపంలో పేరుకుపోతుంది. దీని కారణంగా ఆర్థరైటిస్, మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. యూరిక్ యాసిడ్ను తగ్గించుకోవడానికి అనేక వైద్య చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆయుర్వేద చిట్కాల ద్వారా కూడా యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించవచ్చు. యూరిక్ యాసిడ్ తగ్గించడానికి అల్లోపతి ఔషధాల కంటే ఆయుర్వేద మందులు మెరుగైన ఫలితాలను ఇస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో యూరిక్ యాసిడ్ ను, కీళ్ల నొప్పులను 15రోజులలో తగ్గించే ఆయుర్వేద ఔషధం గురించి తెలుసుకుంటే.. కావలసిన పదార్థం.. వాము.. 1టీ స్పూన్ తురిమిన అల్లం.. 1టీ స్పూన్ తయారీ విధానం.. రెండు గ్లాసుల నీటిలో ఒక చెంచా వాము, ఒక స్పూన్ తురిమిన అల్లం వేసి బాగా ఉడికించాలి. రెండు గ్లాసుల నీరు కాస్తా ఒక గ్లాసుగా మిగిలే వరకు ఉడకబెట్టాలి. ఈ నీళ్ళను వడగట్టాలి. ఎప్పుడు తాగాలి.. వాము గింజలు, అల్లం ఉడికించిన నీళ్లను ఉదయాన్నే తాగాలి. దీన్ని ఉపయోగించడం ద్వారా కేవలం 15 రోజుల్లోనే ఫలితాలను పొందవచ్చు. ఇది ఆయుర్వేదంలో చాలా శక్తివంతమైన ఔషధం అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. 15రోజులు ఈ ఔషధాన్ని ఉపయోగించిన తర్వాత యూరిక్ యాసిడ్ స్థాయి పరీక్షిస్తే యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గడాన్ని గమనించవచ్చు. దీన్ని 15 రోజుల కంటే ఎక్కువ వాడుతుంటే యూరిక్ యాసిడ్ సమస్య పూర్తీగా తగ్గిపోతుందని అంటున్నారు. *రూపశ్రీ.
read moreఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకుంటే ఇన్ని షాకింగ్ ఫలితాలు ఉంటాయని తెలుసా?
నిమ్మరసం భారతీయుల ఆహారంలో ప్రధాన భాగం. నిమ్మరసాన్ని వంటల్లో మాత్రమే కాకుండా రిఫ్రెషింగ్ డ్రింక్స్ లోనూ, డిటాక్స్ డ్రింక్స్ లోనూ ఉపయోగిస్తారు. నిమ్మరసాన్ని భారతీయ సంప్రదాయ వంటల తయారీలోనూ ఉపయోగిస్తారు. నిమ్మరసాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా నిమ్మరసాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. నిమ్మరసం సిట్రస్ జాతికి చెందిన పండు. దీన్ని పండు అని పిలుస్తామే కానీ నేరుగా దీన్ని తినలేము. చాలా పుల్లగా ఉండే నిమ్మరసాన్ని పానీయాలలోనూ, వంటల్లోనూ పులుపు కోసం జోడించుకుంటారు. ఇక నిమ్మకాయలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉదయాన్నే తాగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మలబద్దకం, అజీర్ణం సమస్యలను కూడా తొలగిస్తుంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే పేగులు శుభ్రపడతాయి. శరీరం శుద్ది అవుతుంది. శరీరంలో ఉండే మలినాలు బయటకు పోతాయి. ప్రతి ఒక్కరి శరీరంలో టాక్సిన్లు ఉంటాయి. ఇవి ఆహారం, తాగే పానీయాలు, నీరు, వాతావరణం కారణంగా శరీరంలో చేరతాయి. ఈ టాక్నిన్లను తొలగించుకోవాలంటే డిటాక్స్ వాటర్ తాగాలి. డిటాక్స్ వాటర్ తాగితే శరీరం డిటాక్స్ అవుతుంది. అందుకోసం ఉదయాన్నే నిమ్మరసం కలిపిన నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో విష పదార్థాలు, వ్యర్థాలు అనబడే టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. నిమ్మకాయలో విటమిన్-సి ఉంటుందనే విషయం తెలిసిందే. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోజూ నిమ్మరసం కలిపిన నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగుతూ ఉంటే రోగనిరోధక శక్తి బలపడి వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇది రోజంతా శరీరాన్ని చురుగ్గా ఉండేలా చేస్తుంది. నిమ్మరసంలో ఉండే సమ్మేళనాలు శరీరానికి చురుకుదనం ఇస్తాయి. నిమ్మరసంలో ఉండే విటమిన్-సి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇవ్వడం మాత్రమే కాదు.. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో ఉండే అదనపు కొవ్వును కూడా తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గాలని అనుకునేవారికి చాలా మంచి పానీయం. నిమ్మరసం కలిపిన నీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే కొన్ని రోజులలోనే బరువు విషయంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. నిమ్మకాయలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుంది. ఎలాగంటే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తపోటు ఎక్కువైన సందర్బాలలోనే గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే నిమ్మరసాన్ని అధిక రక్తపోటు ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉండి గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మధుమేహం ఉన్నవారికి కూడా నిమ్మరసం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం కలిపిన నీటిని తాగుతుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. *రూపశ్రీ.
read moreవిటమిన్-డి లోపిస్తే ఈ లక్షణాలు కనిపిస్తాయి..!
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల విటమిన్లు, ఎంజైమ్ లు, పోషకాలు, ప్రోటన్, ఫైబర్.. వంటివన్నీ చాలా అవసరం అవుతాయి. ఇవన్నీ శరీరం ఫిట్ గా ఉండటంలో సహాయపడతాయి. అయితే శీతాకాలంలో సూర్య రశ్మి తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి సూర్యుడి ఉనికి చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. శరీరానికి సూర్యుడి లేత కిరణాలు తగిలినప్పుడు శరీరంలో విటమిన్-డి ఉత్పత్తి అవుతుంది. కానీ సూర్యరశ్మి లేకపోవడం వల్ల విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. శరీరంలో విటమిన్-డి లోపం ఏర్పడినట్టు కొన్ని లక్షణాల ద్వారా చెప్పవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. అలసట.. శరీరం అలసిపోయిందని చెప్పే చాలా మంది ఎక్కువ పని చేయడం, నిద్ర సరిగా లేకపోవడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం వంటివి కారణాలుగా చెబుతుంటారు. కానీ ఆహారం బాగా తీసుకుని, శరీరానికి తగిన విశ్రాంతి లభించి, మంచి నిద్ర లభించి, ఎక్కువ అలసట తెప్పించే పనులు చేయకపోయినా సరే.. అలసటగా అనిపిస్తుంటే అది విటమిన్-డి లోపానికి ముఖ్య లక్షణంగా పేర్కొంటారు. కండరాల నొప్పి.. శరీరం కాల్షియం ను గ్రహించాలన్నా, ఎముకలు దృఢంగా ఉండాలన్నా విటమిన్-డి చాలా అవసరం. కాళ్లు, వెన్ను, కీళ్లు, కాలి కండరాలు బలహీనంగా ఉండటం, పట్టేయడం వంటివి జరుగుతూ ఉంటే అది కూడా విటమిన్-డి లోపానికి కారణం కావచ్చు. ఎముకల నొప్పి.. ఎముకల నొప్పి, బలహీనత, ఎముకలు పెళుసుగా ఉండటం, నడుస్తున్నప్పుడ లేదా ఇతర పనులు చేస్తున్నప్పుడు ఎముకలు శబ్దం రావడం వంటివి జరుగుతుంటే శరీరంలో విటమిన్-డి లోపం కూడా ఉన్నట్టే అర్థం. ఎందుకంటే విటమిన్-డి ఉంటేనే శరీరంలో కాల్షియం ఏర్పడుతుంది. విటమిన్-డి లోపిస్తే కాల్షియం కూడా ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. మూడ్.. చాలామందికి ఉన్నట్టుండి మూడ్ మారిపోతూ ఉంటుంది. చిన్న విషయాలకు చిరాకుగా, కోపంగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారికి విటమిన్-డి లోపం ఉండే అవకాశం ఉంటుంది. మూడ్ స్వింగ్స్ అయ్యేవారిలో విటమిన్-డి లోపం ఉంటుంది. విటమిన్-డి లోపం ఒత్తిడి హార్మోన్లు పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలడం.. జుట్టు పలుచగా మారుతున్నా, జుట్టు రాలిపోతున్నా, జుట్టు విరిగిపోతున్నా.. బలహీనంగా మారుతున్నా అది విటమిన్-డి లోపానికి సంకేతమే.. రోగనిరోధక వ్యవస్థ.. శరీర రక్షణ వ్యవస్థ బలంగా ఉండటంలో విటమిన్-డి చాలా సహాయపడుతుంది. విటమిన్-డి లోపిస్తే తరచుగా జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలకు లోనవుతుంటారు. గాయాలు.. సాధారణంగా శరీరం మీద ఏదైనా గాయం జరిగితే అది నయం కావడానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది. కానీ గాయాలు నయం కావడానికి నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం పడుతుంటే శరీరంలో విటమిన్-డి లోపం ఉన్నట్టే లెక్క. *రూపశ్రీ
read moreబరువు తగ్గడానికి భలే ట్రిక్స్.. ఈ నాలుగు పనులు చెయ్యండి చాలు..!
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడానికి బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. అధిక బరువు మధుమేహం, గుండె జబ్బులు, జీవక్రియకు సంబంధించిన అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి నిరంతరం కృషి చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే బరువు తగ్గడం అంత సులభం కాదని అనుకుంటారు. బరువు తగ్గడానికి జిమ్లో గంటల తరబడి చెమటలు పట్టించడం దగ్గర్నుంచి డైటింగ్, రకరకాల డైట్ ప్లాన్లు పాటించడం వరకు చాలా ఫాలో అవుతారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనాలు లభించకపోతే బరువు తగ్గడానికి డైటింగ్ లేదా వ్యాయామం మాత్రమే పనికిరావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కోసం రోజువారీ దినచర్యలో కొన్ని ప్రత్యేక మార్పులు అవసరం. ముఖ్యంగా నాలుగు పనులు చేయడం ద్వారా బరువు తగ్గవచ్చట. ఈ నాలుగు ఫాలో అయితే బరువు తగ్గడం ఇంత ఈజీనా అని మీరే ఆశ్చర్యపోతారు. నిద్ర.. చాలామంది బరువు తగ్గడానికి జిమ్ చేయడం, వ్యాయామాలు చేయడం, ఆహారం తక్కువ తీసుకోవడం వంటి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇలాంటివి కొనసాగించడం సరికాదు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరానికి విశ్రాంతి, తగినంత నిద్ర చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ప్రతి రాత్రి 7-9 గంటలు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. మంచి రాత్రి నిద్ర బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది. విశ్రాంతి.. వ్యాయామం చేయడం లేదా పరుగు వంటి మార్గాల ద్వారా బరువు తగ్గుతారు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వ్యాయామం అవసరమే కానీ దానితో పాటు కండరాలు తిరిగి రిపేర్ కావడానికి , అవి శక్తివంతంగా తయారవ్వడానికి వారానికి 1-2 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. సాధారణ వాకింగ్ లేదా యోగాతో పాటు పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి మంచి అవకాశం ఉంటుంది. కేలరీలు.. ఫిట్గా ఉండటానికి సులభమైన సూత్రం రోజువారీ తీసుకునే దానికంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయడం. చాలా మంది వారాంతాల్లో ఆహారం విషయంలో తరచుగా తమను తాము మోసం చేసుకుంటారు. ఈ సమయంలో కేలరీలు తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చిప్స్కు బదులుగా ఇంట్లో తయారుచేసిన పాప్కార్న్.. డెజర్ట్కు బదులుగా డార్క్ చాక్లెట్.. చక్కెర పానీయాలకు బదులుగా పండ్ల రసాలను ప్రయత్నించండి. ప్రోటీన్-రిచ్ అల్పాహారం కోసం, కాల్చిన మఖానా లేదా పనీర్ తినాలి. బరువు తగ్గడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. స్ట్రెస్.. ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వ్యక్తులు బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం రోజువారీ వాకింగ్ చేయాలి. లోతైన శ్వాస వ్యాయామాలు చేయాలి. ఆహారంలో గ్రీన్ టీ, బచ్చలికూర, వాల్నట్స్, గుమ్మడి గింజలు వంటి ఒత్తిడిని తగ్గించే ఆహారాలను చేర్చుకోవాలి. ఒత్తిడిని తగ్గించడానికి, కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి. మనస్సును ప్రశాంతపరిచే విషయాలపై దృష్టి పెట్టాలి. *రూపశ్రీ.
read moreకాళ్లను బలంగా ఉంచుకోవాలంటే.. ఇవి తినాల్సిందే..!
శరీర బరువు మొత్తం కాళ్లే మోస్తాయి. ఎండలో నడవడం, వానలో తడవడం.. క్లిష్టమైన దారిలో వెళ్లడం చేసినప్పుడు కాళ్లే మొదట బాధితులుగా మారతాయి. ఇక పరిగెత్తడం, వేగంగా నడవడం, రోజువారి కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనడం మొదలైన వాటికి కాళ్లు ఆరోగ్యంగా ఉండాలి. కాళ్లు బలహీనంగా ఉన్నా, కాళ్ల ఎముకలు, కండరాలు బలహీనంగా ఉన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, ఎముకలు బలహీన పడటం వంటి సమస్యలు ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాళ్లు బలంగా ఉండటానికి ఆహారం బాగా సహాయపడుతుంది. ఏ ఆహారాలు తింటే కాళ్లు బలంగా ఉంటాయో తెలుసుకుంటే.. పాలకూర, బచ్చలికూర.. పాలకూర, బచ్చలికూరలో ఐరన్, కాల్షియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి కండరాలకు మేలు చేస్తాయి. శరీరానికి చాలా శక్తిని అందిస్తాయి. ఆహారంలో బచ్చలికూర, పాలకూరను విరివిగా తీసుకుంటే కాళ్లు బలంగా ఉంటాయి. సాల్మన్ ఫిష్.. సాల్మన్ ఫిష్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల పునరుద్దరణలో సహాయపడతాయి. కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా సహాయపడతాయి. ఎముకలను బలంగా మార్చి కాళ్లు బలంగా ఉండేందుకు సాల్మన్ ఫిష్ తీసుకోవాలి. చిలకడదుంపలు.. చిలకడదుంపలలో సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తి అందించడంతో పాటు ఎక్కువ సేపు ఆ శక్తిని నిలిపి ఉంచుతాయి. చిలకడదుంపలను ఆహారంలో రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఎంతో మంచిది. కోడిగుడ్లు.. ప్రోటీన్, ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు పుష్కంలగా ఉండే ఆహారంల గుడ్లు కూడా ఒకటి. ఇవి కండరాల పెరుగుదలకు సహాయపడతాయి. కండరాల మరమ్మత్తుకు కూడా సహాయపడతాయి. రోజుకు ఒక గుడ్డు తింటూ ఉంటే కాళ్ల కండరాలు చాలా తొందరగా గట్టి పడతాయి. బలంగా మారతాయి. బాదం.. బాదంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్-ఇ ఉంటాయి. ఇవి కండరాలను బలంగా మారుస్తాయి. కండరాల ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి. కాళ్లు బలంగా ఉండటంలో సహాయపడతాయి. క్వినోవా.. క్వినోవాలో అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది చాలా గొప్ప ప్రోటీన్ మూలం ఉన్న ఆహారం. కండరాల బలాన్ని పెంచడానికి, కండరాలు తొందరగా కోలుకోవడానికి క్వినోవా బాగా సహాయపడుతుంది. *రూపశ్రీ.
read moreతరచుగా తలనొప్పి సమస్య వస్తోందా? బ్రెయిన్ ట్యూమర్ కి సంకేతం కావచ్చు..!
చాలా మంది తరచుగా తలనొప్పి, సాధారణ జ్వరం వంటి సమస్యలను చాలా లైట్ గా తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వీటి వల్ల తీవ్రమైన ఆరోగ్య దుష్ప్రభావాలు కూడా కలిగి ఉంటాయని తెలుసా..? అకారణంగా జ్వరం రావడం, తలనొప్పి రావడం.. ఉన్నట్టుండి సుస్తీ చేయడం వంటి సమస్యలు అంతర్లీన వ్యాధుల సంకేతాలు కావచ్చు. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకమైన సమస్య కూడా కావచ్చు. అలాంటి సమస్యలలో బ్రెయిన్ ట్యూమర్ ఒకటి. బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం బ్రెయిన్ ట్యూమర్ వల్ల రెండున్నర లక్షల మందికి పైగా మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకీ బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలేంటి? తెలుసుకుంటే.. 2020లో బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ కారణంగా 2.46 లక్షల మంది చనిపోయారు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పటికీ.. చాలా ఏళ్ల వరకు దాని గురించి ఎవరికీ తెలియదని, ఆ సమస్య అంత సులువుగా గుర్తించలేమని వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో మెదడులో కణితి చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఈ కారణంగా దాని లక్షణాలు కనిపించవు. ఈ పరిస్థితిలోకొన్ని సాధారణ సంకేతాలను తెలుసుకోవడం, వీటిని గుర్తించడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ ఉందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల గురించి తెలుసుకునే ముందు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం! మెదడు కణితులు మెదడులో లేదా దాని చుట్టూ ఉన్న కణాల అనియంత్రిత పెరుగుదల కారణంగా ఏర్పడతాయి. ఇది క్యాన్సర్కు కూడా కారణం కావచ్చు. మెదడులో 120 కంటే ఎక్కువ రకాల కణితులు అభివృద్ధి చెందుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఇతర వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇది కాకుండా ప్లాస్టిక్, రసాయన పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు కూడా ప్రమాదంలో పడవచ్చు. జన్యుశాస్త్రం, జీవనశైలి-ఆహారం మొదలైనవాటితో పాటు అనేక రకాల పర్యావరణ పరిస్థితుల కారణంగా బ్రెయిన్ ట్యూమర్ బాధితులుగా మారే అవకాశం ఉంది. తలనొప్పి.. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు చాలా రకాల సమస్యలు ఎదుర్కుంటారు. తలనొప్పి దాని అత్యంత సాధారణ లక్షణం. ఉదయం వేళలో తలలో నొప్పి లేదా ఒత్తిడి పెరగడం లేదా నిరంతర తలనొప్పి చాలా సందర్భాలలో బ్రెయిన్ ట్యూమర్కి సంకేతం అని వైద్యులు చెబుతున్నారు. మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. మెదడు కణితి లక్షణాలు దాని పరిమాణం, అది పెరిగే ప్రదేశంపై ఆధారపడి ఉంటాయి. అనేక సందర్భాల్లో మెదడు కణితి ఎంత వేగంగా పెరుగుతుందనే దానిపై కూడా లక్షణాలు ఆధారపడి ఉంటాయి. తలనొప్పి దాని ప్రారంభ సంకేతంగా పరిగణించబడుతుంది. అందుకే దానిని విస్మరించవద్దు. ఈ లక్షణాలు కూడా.. మెదడులో కణితితో బాధపడుతున్న వ్యక్తులు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతారు. ఇది అనేక రకాల లక్షణాలను కలిగి ఉంటుంది. ఉదయం సమయంలో తలనొప్పి లేదా ఒత్తిడి చాలా దారుణంగా ఉంటాయి. ఎక్కువసార్లు చాలా తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది. వికారం లేదా వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది. కంటిచూపు సరిగా లేకపోవడం, ఒక వస్తువు రెండుగా కనిపిండం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. చేతులు లేదా కాళ్ళలో సంచలనం లేదా కదలిక తగ్గడం జరుగుతుంది. శారీరక సమతుల్యత, మాట్లాడటంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. కాలక్రమేణా జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్నాయ తరచుగా తల తిరగడం లేదా ప్రపంచం తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అనుమాలు వద్దు.. సకాలంలో చికిత్స తీసుకుంటే బ్రెయిన్ ట్యూమర్ తీవ్రమైన సమస్యగా మారే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పెద్దవారు, స్థూలకాయులు లేదా రసాయనాలకు ఎక్కువగా గురయ్యేవారు మెదడు కణితి సంకేతాలపై తీవ్రమైన శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. వ్యాధిని సకాలంలో గుర్తించినట్లయితే, దాని చికిత్స, కోలుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే మెదడులో పెరిగే అన్ని కణుతులు బ్రెయిన్ క్యాన్సర్ కాదని గుర్తుపెట్టుకోవాలి. *రూపశ్రీ
read moreవేడి నీళ్లతో స్నానం చేయడం ఎంతవరకు ఆరోగ్యం?
స్నానం శారీరక శుభ్రతలో ప్రధాన భాగం. ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించడం చిన్నతనం నుండి అలవాటుగా వచ్చేస్తుంది. కొందరైతే రోజులో రెండుపూటలా స్నానం చేస్తారు. ఇది శరీరానికి చాలా రిఫ్రెషింగ్ అనుభూతి ఇస్తుంది. అధిక శాతం మంది స్నానానికి వేడి నీరే ఉపయోగిస్తారు. ముఖ్యంగా చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీరుతో స్నానం చేస్తుంటారు. ఇది ఎంత వరకు ఆరోగ్యం. బాగా వేడిగా ఉన్న నీటితోస్నానం చేయడం వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? తెలుసుకుంటే.. చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. అందుకే చాలామంది పొగలు కక్కుతున్న నీటితో స్నానం చేస్తారు. చాలా వరకు గమనిస్తే చలికాలంలో స్నానం చేసి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే బాత్రూమ్ నుండి మంచు పొగ బయటకు వచ్చినట్టు వేడనీటి ఆవిర్ల పొగ బయటకు వస్తుంది. పొగలు కక్కే వేడి నీరు శరీరానికి చాలా రిలాక్స్ గా అనిపించినా అది చర్మానికి చాలా చెడు చేస్తుంది. ముఖ్యంగా చర్మం కందిపోవడం, ఎర్రబడటం జరుగుతుంది. చలికాలంలో ముందే చర్మం తొందరగా పొడిబారే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మరింత వేడినీరు పడటం వల్ల చర్మం దెబ్బతింటుంది. చర్మం సహజమైన మెరుపును కోల్పోతుంది. లో బిపి.. చాలామందికి ఉండే సమస్య. ఈ మధ్యకాలంలో అధిక బీపీ కంటే లో బీపీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. లో బీపీ సమస్యలు ఉన్నవారు వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదని అంటున్నారు. దీని వల్ల శరీరంలో రక్తనాళాలు వ్యాకోచించి రక్తపోటును మరింత తగ్గేలా చేస్తాయట. ఈ కారణంగా శరీరంలో రక్తపోటు తగ్గిపోయి ప్రమాదకర పరిస్థితికి దారి తీసే అవకాశం ఉంటుందట. ఎప్పుడో ఒకసారి శరీరం బాగా అలసిపోయినప్పుడు, చాలా చలిగా ఉన్నప్పుడు వేడినీటితో స్నానం చేసినా పర్లేదు.. కానీ ప్రతిరోజూ పొగలు కక్కే నీటితో స్నానం చేస్తుంటే మాత్రం చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారికి చాలా ఇబ్బంది అనే చెప్పాలి. చాలా వేడిగా ఉన్న నీరు చర్మం పిహెచ్ బ్యాలెన్స్ ను పాడు చేస్తుంది. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల చర్మమే అంత దెబ్బతినే అవకాశాలు ఉన్నప్పుడు.. చాలా సున్నితంగా ఉండే తల చర్మం, వెంట్రుకలు మరింత సమస్యకు లోనవుతాయి. బాగా వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. వేడి నీరు జుట్టు పొడిగా మారడానికి, సున్నితంగా మారడానికి, డ్యామేజ్ కావడానికి కారణం అవుతుంది. ఫలితంగా జుట్టు పెరుగుదల అస్సలు ఉండదు. చాలా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది శరీరానికి చాలా ప్రమాదకరంగా పరిగణించబడుతుంది. అందుకే స్నానానికి వేడినీరు ఉపయోగించాలి అనుకుంటే ఆ నీరు గోరువెచ్చగా ఉండాలి. అంతే కానీ పొగలు కక్కే నీటితో స్నానం చేయకూడదు. *రూపశ్రీ.
read more15రోజుల్లో పొట్ట తగ్గడానికి అద్బుతమైన మార్గం ఇది.. !
స్థూలకాయం అనేది చాలా మంది బాధపడుతున్న తీవ్రమైన సమస్య. నడుము చుట్టూ కొవ్వు, చేతుల మీద కొవ్వు, తొడల మీద కొవ్వు, చంకల మీద కొవ్వు, పొట్ట మీద కొవ్వు, తుంటి మీద కొవ్వు ఇలా శరీరంలో ఎక్కడ చూసి కొవ్వు పేరుకుపోయి శరీరం దెబ్బతినడం మొదలవుతుంది. ఊబకాయం అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఈ మొండి కొవ్వు వల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులకు కూడా కారణం అవుతుంది. డైట్ చేసినా, వ్యాయామం చేసినా, యోగా చేసినా, జిమ్కి చేసినా, రన్నింగ్కి చేసినా, వాకింగ్ చేసినా, బోలెడు రకాల వెయిట్ లాస్ పానీయాలు, ట్రిక్స్, టిప్స్ మొదలైనవి అన్నీ ఫాలో అయినా అవన్నీ బరువు తగ్గడానికి, ముఖ్యంగా పొట్ట తగ్గించుకోవడానికి. నిజానికి వేలకొద్దీ పరిష్కారాలతో ఇంటర్నెట్ నిండిపోయింది. విచిత్రం ఏంటంటే..చాలా మందికి ఈ టిప్స్ తో ఫలితం ఉండటం లేదు. బరువు తగ్గడానికి అన్ని పద్ధతులను ప్రయత్నించి అలసిపోయినవారికి భలే టిప్ ఇప్పుడు సహాయపడుతుంది. ఆయుర్వేదం చెప్పిన ఈ సీక్రెట్ టిప్ ఏంటంటే.. శరీర కొవ్వు మొత్తం శరీరానికి హాని కలిగిస్తుంది. ఇది ఊబకాయానికి అతి పెద్ద కారణం. కొవ్వును కరిగించడం చాలా కష్టమైన పని. కానీ సరైన టిప్ ను ఫాలో అయితే ఈ పని సులభం అవుతుంది. కావలసిన పదార్థాలు.. 10 గ్రాముల పచ్చి పసుపు, 4 నల్ల మిరియాలు, ఒక చెంచా సొంపు తయారీ విధానం.. పచ్చి పసుపును బాగా గ్రైండ్ చేసి, దాని తర్వాత ఆ మిశ్రమంలో సోపు వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని స్టవ్ మీద ఉంచి బాగా మరిగించి తరువాత వడకట్టాలి. మంచి ఫలితాలను పొందడానికి ఉదయం ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని త్రాగాలని వైద్యు చెప్పారు. కావాలంటే రెండు సార్లు తాగొచ్చు. దీనితో కేవలం 15 రోజుల్లో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. *రూపశ్రీ.
read moreనెలరోజులపాటు జాజికాయ నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
జాజికాయ మసాల దినుసుల్లో ఒకటి. ఇది చాలా రకాల వంటల తయారీలో ఉపయోగిస్తారు. కేవలం వంటల్లోనే కాకుండా పురాతన కాలం నుండి వైద్యంలోనూ, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లోనూ ఔషదంగా కూడా జాజికాయను ఉపయోగిస్తున్నారు. జాజికాయ నీళ్లను నెలరోజుల పాటు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే షాకవుతారు. పోషకాలు.. జాజికాయ నీళ్లను నెల రోజులు క్రమం తప్పకండా తాగడం వల్ల కలిగే లాభాలు తెలుసుకునే ముందు జాజికాయలో ఉండే పోషకాలు తెలుసుకోవాలి. జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రయోజనాలు.. జాజికాయలో ఉండే పోషకాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు జాజికాయ నీటిని తాగాలి. దీని వల్ల నిద్ర బాగా వస్తుంది. జాజికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. జాజికాయ నీరు శరీరంలో కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. జాజికాయ నీరు తాగుతుంటే బరువు తగ్గుతారు. శరీరాంలో ఉంటే టాక్సిన్లను తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. జాజికాయ వాసన చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫలితంగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. జాజికాయ నీళ్లు తాగుతుంటే మానసికంగా రిలాక్స్ గా ఉంటారు. జాజికాయ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు ఎసిడిటీ, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. జాజికాయ నీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే పొట్ట శుభ్రంగా ఉంటుంది. *రూపశ్రీ.
read moreపిసిఓయస్ దేశంలో ప్రతి 5వ మహిళకు ఉన్న సమస్య.. జాగ్రత్త తీసుకోకపోతే ముప్పు తప్పదా?
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలను ప్రభావితం చేసే చాలా సాధారణ సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీలు అందరూ దీని బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి హార్మోన్ల అసమతుల్యత, నెలసరి సరిగా రాకపోవడం, అండాశయంలో తిత్తులు వంటి సమస్యలను కలిగి ఉంటుంది. దీని కారణంగా అనేక రకాల ఆరోగ్య దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంది మహిళలు పిసిఒఎస్ గురించి, దాని వల్ల వచ్చే సమస్యలను బహిరంగంగా చెప్పలేకపోతుంటారు. సకాలంలో వ్యాధి నిర్ధారణ, చికిత్స లేకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం భారతదేశంలోనే ప్రతి ఐదుగురు కౌమారదశలో ఉన్న మహిళల్లో ఒకరు PCOSతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దీని అంచనా 6% నుండి 21% మధ్య ఉంటుంది. ఒక అధ్యయనంలో నిపుణులు PCOS వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి దీనికి చికిత్స తీసుకోకపోతే భవిష్యత్తులో ఇది జ్ఞాపకశక్తి లేదా మెదడు సంబంధ సమస్యలను కూడా కలిగిస్తుందని అంటున్నారు. పిసిఓయస్.. PCOS వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకునే ముందు పిసిఓయస్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం..! పిసిఒఎస్ అనేది పునరుత్పత్తి వయస్సు గల మహిళల్లో వచ్చే వ్యాధి. హార్మోన్ల మార్పులకు సంబంధించిన ఈ సమస్యలో ఋతు చక్రం ప్రభావితమవుతుంది. ఇందులో పీరియడ్స్ అస్సలు జరగవు లేదా చాలా రోజుల పాటు కొనసాగవచ్చు. ఇది కాకుండా ఈ వ్యాధిలో అండాశయాల వెలుపలి అంచున ద్రవాలతో నిండిన చిన్న తిత్తులు ఉండవచ్చు. వీటిని సిస్ట్ లు అని అంటారు. PCOS యొక్క దీర్ఘకాలిక సమస్య. ఇది గర్భం దాల్చడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ ముప్పులు తప్పవా? 40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో పిసిఒఎస్ సమస్య మెదడు ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుందని ఓ అధ్యయనం కనుగొంది. PCOS ఉన్న స్త్రీలకు జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం, మధ్య వయసులో ఆలోచనా సామర్థ్యంలో మార్పులు ఎక్కువగా ఉంటాయట. ఇది జీవిత నాణ్యత, కెరీర్, ఆర్థిక భద్రతతో సహా అనేక విధాలుగా స్త్రీలను ప్రభావితం చేస్తుంది. పిసిఓయస్ ఉన్న మహిళలలో ఒత్తిడి కారణంగా అధికంగా ఆహారం తీసుకోవడం, అది కాస్తా అధిక బరువుకు కారణం కావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. వీటి కారణంగా ఊబకాయం, మధుమేహం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. *రూపశ్రీ.
read moreఎక్కువ కాలం జీవించాలంటే ఇప్పుడే ఈ 5 మార్పులు చేసుకోండి..!
ఎప్పుడైనా పెద్ద వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు. మనిషి ఆయుష్షు వందేళ్లు అని చెబుతారు. ఒకప్పటి మహర్షులు, ఋషులు వందల ఏళ్లు జీవించగలిగారు. తరువాత మన ముత్తాతలు, తాతలు వందేళ్ళకు పైగానే జీవించారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ కాలమే ఉంటున్నా ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనిని బట్టి చూస్తే.. క్రమంగా మనిషి ఆయుష్షు తగ్గుతూ వస్తోందని చెప్పవచ్చు. పరిశోధనలతో పాటు.. సమాజంలో జరుగుతున్న మరణాల రేటు, మరణాల వివరాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే వెంటనే జీవితంలో 5 మార్పులు చేసుకోవాలి. అవేంటో తెలుసుకుంటే. సమతుల ఆహారం.. ఆహారమే ఆరోగ్యం అని అంటారు. చాలా వరకు తీసుకునే ఆహారమే ఔషదంగా పనిచేసి చాలా రోగాలు నయం కావడంలో సహాయపడుతుంది. రోజూ సమతుల ఆహారం తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి పోషకాలు అందడంతో పాటు రోగనిరోధక శక్తి బలపడుతుంది. శరీరానికి శక్తి కూడా అందుతుంది. రోజులో కనీసం 5రకాల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలట. గోధుమలు, ఓట్స్, బ్రౌన్ రైస్, తృణధాన్యాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్ తో పాటూ అవసరమైన పోషకాలు, ప్రోటీన్ కూడూ ఉంటుంది. ప్రోటీన్ కోసం చేపలు, శనగలు, పప్పులు, జున్ను, పనీర్ వంటివి తినాలి. ఇవన్నీ శరీరానికి తగిన బలాన్ని ఇస్తాయి. శరీరంలో కండరాలను బలంగా ఉంచుతాయి. ఫిట్ గా ఆరోగ్యంగా ఉండటానికి వీలైనంత తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవాలి. చక్కెర జోడించి చేసిన ఆహారం, ఉప్పు ఎక్కువ జోడించి చేసిన ఆహారం తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్ లో సోడియం, చక్కెరలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం గింజలు, ఆలివ్ నూనె, చేపలు తినాలి. ఇవి మెదడుకు కూడా చాలా సహాయపడతాయి. వ్యాయామం.. రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. స్విమ్మింగ్, సైక్లింగ్ కూడా చేయవచ్చు. నిద్ర.. కనీసం 7 నుండి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇది మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి.. జీవితంలో ఎదురయ్యే చాలా రకాల సమస్యలకు ప్రధాన కారణం ఒత్తిడి. ఒత్తిడి లేకుండా చూస్తూ ఏ సమస్య అయినా చాలా తొందరగానే పరిష్కారం అవుతుంది. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేది ఒత్తిడే.. ద్యానం, శ్వాస వ్యాయామాలు, యోగ వంటివి ఫాలో అయితే ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు. నీరు.. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి నీరు చాలా అవసరం. శరీరం హైడ్రేటెట్ గా ఉండాలన్నా, శరీరంలో వ్యర్ఖాలు బయటకు వెళ్లిపోవాలన్నా రోజూ తగినంత నీరు తాగుతుండాలి. దీని వల్ల శరీరానికి సరైన శక్తి లభిస్తుంది. *రూపశ్రీ.
read moreవిటమిన్-డి లోపిస్తే డిప్రెషన్ వస్తుందా?
శరీరానికి విటమిన్లు చాలా అవసరం. విటమిన్లలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆహారం నుండి లభిస్తాయి. కొన్ని ఆహారం తీసుకున్న తరువాత శరీరంలో విటమిన్ గా రూపాంతరం చెందుతాయి. కానీ విటమిన్-డి మాత్రం అలా కాదు.. ఇది ఎక్కువగా సూర్యకాంతి ద్వారా లభిస్తుంది. చాలామంది ఉదయాన్నే సూర్యుడి లేత కిరణాలలో కనీసం 10 నుండి 30 నిమిషాల వరకు గడపాలి అని చెప్పడం వెనుక కారణం ఇదే.. అయితే నేటి జీవనశైలి, బిజీ జీవితాలు, గదులలోనే కూర్చుని ఉద్యోగాలు చేయడం వంటి కారణాల వల్ల విటమిన్-డి లభించడం కష్టం అవుతుంది. అందునా చలికాలంలో సూర్య కాంతి మరీ ప్రభావవంతంగా ఉండదు. ఈ కారణంగా కూడా విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. అయితే.. విటమిన్-డి లోపం వల్ల డిప్రెషన్ సమస్య వస్తుందని అంటున్నారు వైద్యులు, ఆరోగ్య నిపుణులు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఎవరైనా సరైన కారణాలు లేకుండా డిప్రెషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టైతే అది విటమన్-డి లోపం కారణంగా వచ్చిన సమస్య కావచ్చని అంటున్నారు వైద్యులు. విటమిన్-డి ఎముకలకు మాత్రమే కాదు.. మెదడు సరైన పనితీరుకు కూడా చాలా ముఖ్యం. శరీరంలో సంతోషకరమైన హార్మోన్ ను ఉత్పత్తి చేసేది విటమిన్-డి నే.. దీవినల్లే మెదడు సరిగ్గా పనిచేస్తుంది. విటమిన్-డి మెదడులోని సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది. ఇది మానసిక స్థితిని నియంత్రిస్తుంది. తద్వారా మెదడు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఆరోగ్యకరంగా ఉంటుంది. మెదడు పనితీరు కూడా చురుగ్గా ఉంటుంది. అంతేనా.. మెదడులో ఆందోళన కలిగించే ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో కూడా విటమిన్-డి సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యానికి, మానసిక స్థితికి ఇంత అవసరమైన విటమిన్-డి లోపం ఏర్పడితే సెరోటోనిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మానసిక పరిస్థితి అప్పటికే సరిగా లేని వారి పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. విటమిన్-డి లోపిస్తే ఎమోషన్స్ కంట్రోల్ లో ఉండవు. దీని వల్ల ఎప్పుడూ నిరాశ, నిర్లక్ష్యం, చిరాకు, అసహనం వంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్-డి లోపం ఏర్పడే వారిలో డిప్రెషన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. సూర్యుడి లేత కిరణాలలో సమయం గడపడం, చేపలు, గుడ్లు, విటమిన్-డి కలిగిన పాలు.. వంటి ఇతర పదార్థాలు కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే విటమిన్-డి పుష్కలంగా లభిస్తుంది. శీతాకాలంలో విటమిన్-డి అంతగా లభ్యం కాదు కాబట్టి ఈ సీజన్ లో విటమిన్-డి కోసం చేపలు, గుడ్లు, పాలు బాగా తీసుకోవాలి. *రూపశ్రీ.
read moreనెలరోజుల పాటు ఒక గ్లాస్ మెంతి గింజల నీరు తాగితే ఏమవుతుందంటే..!
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఆకుకూరల పెంపకానికి విత్తనాలే మూలం. అయితే అన్ని విత్తనాలను నేరుగా తీసుకోలేం. ముఖ్యంగా మెంతికూరలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. మెంతికూరనే కాకుండా మెంతి గింజలను కూడా ఆహారంలో వాడతారు. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. మెంతి గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టినప్పుడు, దానిలోని పోషకాలు నీటిలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ మెంతి నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. మెంతులు ఒక మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక వ్యాధులను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. నెల రోజుల పాటు ప్రతిరోజూ ఒక గ్లాసు మెంతుల నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. మెంతి నీరు.. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల మెంతి గింజలు వేసి మూత పెట్టాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ఇలా రోజూ ఒక నెల రోజులు చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.. మెంతికూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నెల రోజుల పాటు రోజూ మెంతి నీరు తాగడం వల్ల మలబద్ధకం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెంతి కూరలో ఉండే ఎంజైమ్లు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. బరువు తగ్గడం సులభం.. మెంతికూరలో ఉండే కొన్ని మూలకాలు శరీరంలో ఉండే కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అదనంగా ఇది ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మెంతి నీళ్ళు తాగడం వల్ల జీవక్రియ పెరిగి శరీరంలో క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. మెంతికూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి . నెల రోజుల పాటు రోజూ ఒక గ్లాసు మెంతికూర నీరు తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి చిన్నచిన్న వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. చక్కెర స్థాయి నియంత్రణ.. మెంతికూరలో ఉండే కొన్ని మూలకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతి నీరు చాలా మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యం.. మెంతికూరలో ఉండే పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా రక్తపోటును అదుపు చేయడంలో మెంతి నీరు కూడా ఎంతగానో సహకరిస్తుంది. చర్మం మరియు జుట్టుకు.. మెంతికూరలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం-జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాదు మొటిమలు, మచ్చలను తొలగించి జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో కూడా మెంతి నీరు సహాయపడుతుంది. *రూపశ్రీ.
read moreనకిలీ నెయ్యిని 2 నిమిషాల్లో గుర్తించే సూపర్ టిప్ ఇదీ..!
నెయ్యి ఆరోగ్యానికి దివ్యమైన ఔషధం. ప్రతి రోజూ స్వచ్చమైన నెయ్యిని కనీసం ఒక స్పూన్ అయినా తీసుకుంటూ ఉంటే శరీరానికి చాలా మంచిదని చెబుతారు. ముఖ్యంగా నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్దకం, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి. గర్భంతో ఉన్నవారు నీటిలో కరివేపాకు వేసి బాగా మరిగించి ఆ నీటిలో ఒక స్పూన్ నెయ్యిని కలిపి తాగుతుంటారు. దీని వల్ల కడుపులో బిడ్డకు కూడా మంచిదని చెబుతారు. అయితే నెయ్యి స్వచ్చమైనది అయితేనే దాని వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. కల్తీ నెయ్యి వాడితే మాత్రం దాని వల్ల కలిగే ప్రయోజనాలకంటే జరిగే నష్టమే ఎక్కువ ఉంటుంది. తాజాగా కిలోల కొద్దీ నకిలీ నెయ్యి తయారుచేస్తున్న స్థావరం బయటపడటంతో నెయ్యి విషయంలో చాలా మంది కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో కల్తీ నెయ్యని 2 నిమిషాలలో ఎలా గుర్తించవచ్చో ఆహార నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టీ కమీషన్ హర్యానాలోని జింద్ నగరంలో దాడి చేసి నకిలీ దేశీ నెయ్యిని తయారు చేస్తున్న ఫ్యాక్టరీని కనుగొంది. ఈ ఆపరేషన్లో 1925 కిలోల నకిలీ నెయ్యి, 1405 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకున్నారు. గిడ్డంగిని ఢిల్లీ పోలీసులు సీల్ చేశారు. గోదాములో రంగులు, రసాయనాలు కూడా కనిపించాయని చెబుతున్నారు. సోడియం లారెత్ సల్ఫేట్ అనే రసాయనాన్ని జోడించి నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారట. భారతదేశంలో చాలా చోట్ల నకిలీ నెయ్యి, నూనె, పాలు మొదలైనవి తయారుచేసి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. నెయ్యిని ఎలా కల్తీ చేస్తారు? నెయ్యి లో కూరగాయల నూనె కలుపుతారు. చౌకైన కూరగాయల నూనె లేదా కూరగాయల ఫ్యాట్ ను నిజమైన నెయ్యితో కలపడం ద్వారా దాని పరిమాణం పెరుగుతుంది. దీని వినియోగం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. గుండె జబ్బులు, ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలాంటి కల్తీ నెయ్యి దీర్ఘకాలిక వినియోగం వల్ల ధమనులను అడ్డుకోవడానికి దారితీస్తుంది. స్టార్చ్.. నెయ్యి పరిమాణాన్ని పెంచడానికి పిండిని కలుపుతారు. ఇది కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్, బరువు పెరుగుట, జీవక్రియ రుగ్మతలకు కారణమవుతుంది. నకిలీ నెయ్యిలో ఉండే రసాయనాలు జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తాయి. నకిలీ నెయ్యిలో ట్రాన్స్ ఫ్యాట్, హానికరమైన నూనెలు ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. అలాంటి నెయ్యి తీసుకోవడం వల్ల లివర్ ఫెయిల్యూర్ లేదా మూత్రపిండాల సమస్యలకు కారణమవుతుంది. నెయ్యి కల్తీని ఇలా గుర్తించవచ్చు.. ఒక టెస్ట్ ట్యూబ్లో ఒక మి.లీ కరిగించిన నెయ్యిని తీసుకోవాలి. అందులో ఒక మిల్లీ.. Conc.HCLని జోడించండి ఆ తర్వాత అందులో అర చెంచా చక్కెర వేయాలి. రెండు నిమిషాలు బాగా షేక్ చేయాలి. నెయ్యిలో కల్తీ లేకపోతే దాని రంగు మారదు. నెయ్యి నకిలీ అయితే దాని రంగు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారవచ్చు. *రూపశ్రీ.
read moreచలికాలంలో అరటిపండ్లు తినడం మంచిది కాదా?
చలికాలంలో తరచుగా ఆహారం మార్చుకుంటాం. ఈ సీజన్లో కొన్ని ఆహారాలు తినమని సలహా ఇస్తారు, కొన్ని తినవద్దని చెబుతారు. వీటిలో అరటిపండు ఒకటి. చలికాలంలో అరటిపండు తినకూడదని చాలా మంది చెబుతుంటారు. మరికొందరు అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, తింటే పర్లేదు అనుకుంటారు. చలికాలంలో అరటిపండు తినడం ఎంతవరకు సరైనదో, దాని వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏమిటో తెలుసుకుంటే.. అరటిపండు తినడం వల్ల చాలా మందికి శ్లేష్మం పెరగడం వల్ల జలుబు, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఆటంకం ఏర్పడుతుంది. రొమ్ము భాగం అంతా చాలా భారంగా ఉంటుంది. అరటిపండు చాలా తియ్యగా ఉంటుంది. ఇది కాస్త పచ్చిగా ఉన్నప్పుడు పర్లేదు కానీ బాగా పండేకొద్దీ ఇందులో చక్కెరల శాతం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా అరటిపండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి అరటి పండ్లను ఎక్కువ మోతాదులో తినడం వల్ల బరువు పెరుగుతారు . అరటి పండ్లు కాస్త దోరమాగనప్పటి కంటే పండే కొద్దీ చాలా తియ్యగా మారుతుంది. ఈ కారణంగా ఇందులో చక్కెరల శాతం ఎక్కువగా ఉంటుంది. సాధారణ వ్యక్తులు దీన్ని రోజుకు ఒకటి లేదా రెండు పండ్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇక డయాబెటిక్ రోగులు అరటిపండును పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అరటి పండు ఎప్పుడు తినకూడదంటే.. జలుబు, దగ్గు... మీకు జలుబు, దగ్గు లేదా జలుబు ఉంటే, మీరు అరటిపండు తినకుండా ఉండాలి, ఎందుకంటే కొంతమంది దాని వల్ల శ్లేష్మం పెరుగుతుందని ఫిర్యాదు చేయవచ్చు. రాత్రి.. రాత్రిపూట అరటిపండు తినడం మానుకోవాలి, ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి బరువును పెంచుతాయి. ఎన్ని అరటి పండ్లు తినవచ్చు.. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లను తినవచ్చు. అయితే బరువు తగ్గాలనుకుంటే ఎక్కువ అరటిపండ్లను తినకూడదు. చలికాలంలో అరటిపండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. అయితే, కొంతమందికి ఇది అలెర్జీ కావచ్చు. కాబట్టి, అరటిపండు తినే ముందు శరీర పరిస్థితిని బట్టి తినాలి, ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించాలి. *రూపశ్రీ.
read moreచలికాలంలో ఈ తప్పులు చేశారంటే.. గుండ్రాయిలా మారిపోతారు జాగ్రత్త..!
సీజన్ ఏదైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే సీజన్ కు తగ్గట్టు జీవనశైలి, ఆహార వేళలు, శారీరక చురుకుదనం మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో చాలామంది జీవనశైలి చాలా బద్దకంగా మారుతుంది. దీని వల్ల బరువు పెరిగి గుండ్రాయిలా మారిపోతారని అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. ఇంతకీ చలికాలంలో చాలామంది చేసే తప్పులేంటో తెలుసుకుంటే.. చలికాలంలో శారీరక శ్రమ తగ్గిపోతుంది. ఉదయం ఎంత సేపైనా చలి తగ్గదు.. సాయంత్రం చాలా తొందరగా చలి వచ్చేస్తుంది. ఈ కారణాల వల్ల ఇంటి పనులు, ఉద్యోగం చేసుకోవడంతో రోజును గడిపేస్తుంటారు. పైగా చలి కారణంగా తొందరగా తెల్లవారదు, సాయంత్రం తొందరగా చీకటి పడుతుంది. దీని వల్ల శరీరం బరువుగా అనిపిస్తుంది. ఇది కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది. చలికాలంలో చలి నుండి ఉపశమనం కోసం వేడివేడిగా పకోడాలు, సమోసాలు, మిర్చి బజ్జీలు బేకరీ ఆహారాలు ఎడాపెడా తింటారు. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువ తినడం వల్ల బరువు పెరుగుతారు. చలికాలంలో చలి కారణంగా తొందరగా నిద్ర లేవరు. దీని వల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది. ఎక్కువ సేపు నిద్రపోవడానికి కేటాయిస్తారు. దీని వల్ల బద్దకం పెరుగుతుంది. సాధారణ సమయంలో 7,8 గంటలు నిద్రపోతే చలికాలంలో 10 గంటల వరకు నిద్రపోయే వారు ఉంటారు. దీని వల్ల బరువు పెరుగుతారు. చలి కారణంగా చల్లని వాతావరణంలో నీరు తాగడం మరచిపోతుంటారు. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. చలికాలంలో శరీరంలో హార్మోన్ల మార్పులు ఏర్పడతాయి. దీని కారణంగా జీవక్రియ మందగిస్తుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. అంతేకాదు.. చలికాలంలో సీజనల్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువగా తినేస్తారు. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. *రూపశ్రీ.
read more













.webp)







.webp)
.webp)