Forty Thieves

నలబై దొంగలు

శేఖర్, సుందరం, అరవింద్...అనే ముగ్గురు మిత్రులు బార్ లో కూర్చుని తమ

జీవితంలో కాకతాళీయంగా జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటున్నారు.

మొదటగా శేఖర్ " నా భార్య రాముడు భీముడు సినిమా చూసిన తరువాత

కవలపిల్లల్ని కన్నది " అని చెప్పాడు.

" నీ భార్య రాముడు భీముడు చూసి కవల పిల్లల్నే కన్నది...మరి నా భార్య

ముగ్గురు మొనగాళ్ళు సినిమా చూసిన తరువాత ముగ్గురు పిల్లల్ని కన్నది "

అని అరవింద్ చెప్పాడు.

ఆ మాటలు విన్న సుందరం కంగారుగా లేచి " అయ్యో...నేను ఇంటి దగ్గర

బయలుదేరేటప్పుడు నా భార్య ఆలీబాబా నలబై దొంగలు సినిమా చూస్తుంది. ఆ

తరువాత నలబై మంది దొంగలను కంటే..." అని అక్కడి నుండి పరుగు తీశాడు.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచారు శేఖర్, అరవింద్.