TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
నలబై దొంగలు
శేఖర్, సుందరం, అరవింద్...అనే ముగ్గురు మిత్రులు బార్ లో కూర్చుని తమ
జీవితంలో కాకతాళీయంగా జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటున్నారు.
మొదటగా శేఖర్ " నా భార్య రాముడు భీముడు సినిమా చూసిన తరువాత
కవలపిల్లల్ని కన్నది " అని చెప్పాడు.
" నీ భార్య రాముడు భీముడు చూసి కవల పిల్లల్నే కన్నది...మరి నా భార్య
ముగ్గురు మొనగాళ్ళు సినిమా చూసిన తరువాత ముగ్గురు పిల్లల్ని కన్నది "
అని అరవింద్ చెప్పాడు.
ఆ మాటలు విన్న సుందరం కంగారుగా లేచి " అయ్యో...నేను ఇంటి దగ్గర
బయలుదేరేటప్పుడు నా భార్య ఆలీబాబా నలబై దొంగలు సినిమా చూస్తుంది. ఆ
తరువాత నలబై మంది దొంగలను కంటే..." అని అక్కడి నుండి పరుగు తీశాడు.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచారు శేఖర్, అరవింద్.
|