
-వైరల్ గా మారిన పూనమ్ కౌర్ ట్వీట్
-తన ట్వీట్ లో ఏముంది
-క్రైస్తవంలోకి మారిన కాపు కమ్యూనిటీ వారసత్వం ఎవరు
-అర్ధం కానీ ఎన్నో ప్రశ్నలు
పూనమ్ కౌర్(Poonam kaur)..సినీ నటిగా కంటే సోషల్ మీడియాని రఫ్ఫాడించడం ద్వారా ఎక్కువ ఫాలోయింగ్ ని సంపాదించిందని చెప్పుకోవడంలో ఎలాంటి దాపరికం లేదు. బహిరంగ రహస్యమే. ఆ విషయం పూనమ్ కౌర్ కి కూడా తెలుసు. ఆమె చేసే ట్వీట్ లకి అయితే భారీ అభిమాన గణం ఉంది. అసలు ఉదయాన్నే ఆమె ఎక్స్ అకౌంట్ ని చెక్ చేసే పనినే జాబ్ గా మలచుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవర్ని ఉద్దేశించి చేస్తుందో చెప్పకపోయినా ఆ వ్యక్తి ఎవరో మాకు తెలుసనీ సంబరపడిపోతుంటారు. దీన్ని బట్టి పూనమ్ ట్వీట్స్ కి ఉన్న రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా 'అంతకి మించి' అనే రీతిలో సంచలన ట్వీట్ చేసింది. ట్వీట్ లో ఏముందో చూద్దాం.
also read: ఆ సినిమాకి మాత్రం నో.. వెంకటేష్ నిర్ణయంలో న్యాయముందా!
కొంతమంది హిందూ మతాన్ని కేవలం దుస్తులలో మాత్రమే అనుసరిస్తారు. ఆ లబ్ధిదారులు తమ పిల్లలకి మూడు నెలల వయసు ఉన్నప్పుడే క్యాథలిక్ చర్చిలో బాప్టిజం ఇప్పించడం జరిగింది. మేమెప్పుడూ మా వారసత్వాన్ని మార్చుకోలేదు. కాపు కమ్యూనిటీ యొక్క గొప్ప పాత వారసత్వం ఆర్థడాక్స్ కాథలిక్ క్రైస్తవ మతంగా మార్పించడంలో రాయబారిగా వ్యవహరిస్తున్నారు. యూపీలో దీన్ని లవ్ జిహాద్ అంటారు. ఏపీలో ఇది సెలెక్టివ్ గా మారుతుందని ట్వీట్ చేసింది. పూనమ్ గతంలో కొన్ని సంచలన ట్వీట్స్ చేసి ఆ వెంటనే డిలీట్ చేయడంతో, ప్రెజెంట్ ట్వీట్స్ ని స్క్రీన్ షాట్స్ గా తీసుకొని కొంత మంది నెట్టింట షేర్ చేస్తున్నారు.
?s=20







