LATEST NEWS
  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను మళ్లీ తగ్గించింది. ఆర్డీఐ వడ్డీ రేట్లను తగ్గించడం వరుసగా ఇది మూడో సారి ఈ రోజు ముగిసిన ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించింది. గతంలో పాతిక బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ ఈ సారి 50 బేసిస్ పాయిట్లను తగ్గించింది. ఈ తాజా తగ్గింపుతో రెపో రేటు 6 నుంచి 5.50 శాతానికి దిగివచ్చింది. ఈ తగ్గింపు వల్ల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయి. ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియాకు తెలిపారు. ఈ సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను 3.7 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.  మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం ఈ రోజు ముగిసింది.  
ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఉత్కంఘగా  ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేర‌కు "AP DSC 2025 ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు శుభాకాంక్షలు!" అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.  ఇక‌, ఈ రోజు (జూన్ 6, 2025) ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 30 తేదీ వరకు కొనసాగుతాయి. ఈ మెగా డీఎస్సీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 137, ఇతర రాష్ట్రాల్లో 17  మొత్తం 154 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ రెండు షిఫ్టులలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం షిఫ్టు 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్టు 2:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ తరువాత తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డీఎస్సీ  ఫైలు మీదే తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే. 
అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అక్కినేనిఅఖిల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.  శుక్రవారం (జూన్ 6) తెల్లవారు జామున మూడు గంటలకు అఖిల్ జనాబ్ మెడలో తాళి కట్టారు. ఈ వివాహ వేడుకకు  మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్  సహా  టాలీవుడ్ తారలంతా కదిలి వచ్చారు.   గురువారం (జూన్ 5) రాత్రి నుంచే వివాహ వేడుకలు ఆరంభమయ్యాయి.  వెకేషన్ లో ఉన్న అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, శోభిత దంపతులు కూడా వెకేషన్ ను ముగించుకుని వివాహానికి హాజరయ్యారు. ఇక ఆదివారం (జూన్ 8)న అఖిల్ జనాబ్ ల పెళ్లి రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్, బాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ హాజరౌతారని తెలుస్తోంది. అలాగే పలువురు రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్తలూ కూడా ఈ రిసెప్షన్ కు హాజరయ్యే అవకాశం ఉంది.  ఆదివారం (జూన్ 8) వివాహ రిసెప్షన్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు అక్కినేని ఫ్యామిలీ తెలిపింది.  
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం (జూన్ 6) హాజరు కానున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు  ఆర్థిక, విధాన నిర్ణయాలు, బ్యాంకు గ్యారంటీల విడుదల, అంచనాల పెంపుపైనా కమిషన్ ఈటలను ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి సీఎం కేసీఆర్​ కేబినెట్​లో ఈటల రాజేందర్​ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రాజెక్టుకు నిధుల విడుదల, ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న ఆర్థిక, విధానపరమైన నిర్ణయాలపై ఆయనను కమిషన్​ ప్రశ్నించనుంది.   ఇక మాజీ మంత్రి హరీష్ రావు  సోమవారం (జూన్ 9) కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కమిషన్ ఎదుట ఈ నెల 11న హాజరు కానున్నారు. వాస్తవానికి కేసీఆర్ ఈ  నెల5నే విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన విజ్ణప్తి మేరకు కమిషన్ విచారణకు 11కు వాయిదా వేసింది.   అసలు కేసీఆర్, ఈటల, హరీష్ రావులను విచారించకుండానే కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని ముందుగా భావించినప్పటికీ  ఆ తరువాత వీరిని కూడా విచారించాలని నిర్ణయం తీసుకుంది.  విచారణలో భాగంగా ఇప్పటికే 109 మంది రిటైర్డ్​ ఈఎన్​సీలు, ఇంజనీర్లు, అధికారులు, పలువురు ప్రైవేట్​ వ్యక్తుల నుంచి స్టేట్​మెంట్లను తీసుకున్న కమిషన్, వారి స్టేట్ మెంట్ల ఆధారంగా  తుది నివేదికను ఇప్పటికే సిద్ధం చేసింది.  ఇప్పుడు కేసీఆర్​, హరీశ్​ రావు, ఈటల రాజేందర్​ వాంగ్మూలాలనూ నమోదు చేయాలని కమిషన్ వారికి నోటీసులు పంపింది. 
వైసీపీ ప్రభుత్వ  అరాచక పాలన, ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలను కూటమి సర్కార్ వ్యూహా త్మకంగా ప్రజలలో ప్రచారం చేస్తున్నది. జగన్ దుష్టపాలనను జనం మరచిపోయే అవకాశం లేకుండా వాటి ప్రభావంతో రాష్ట్రం ఏ విధంగా దెబ్బతింది. ప్రజా ప్రయోజనాలకు ఎలా భంగం వాటిల్లింది వంటి విషయాలను ప్రజలకు వివరిస్తూ.. ముందుకు సాగుతోంది. ముఖ్యంగా జగన్ నవరత్నాలు అంటూ అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలలో మరీ ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలలో ఇప్పటికీ ఒకింత సానుకూలత ఉందన్న అంచనాల నేపథ్యంలో  ఆ సానుకూలతను రూపుమాపి, అంటే జగన్ సంక్షేమ పథకాలను జనం మరిచిపోయేలా మరింత సంక్షేమం, దానితో పాటే అభివృద్ధి, ఆ అభివృద్ధి ఫలాలు జనానికి అందేలా జాగ్రత్తలు తీసుకుంటూ కూటమి సర్కార్ అడుగులు వేస్తున్నది. అదే సమయంలో సంక్షేమ పథకాల పేరిట జగన్ జనానికి చేసిన దగాను సమర్థవంతంగా, ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తున్నది.    ముఖ్యంగా రేషన్ పంపిణీ విషయంలో జగన్ ఇంటింటికీ రేషన్ అంటూ వాహనాల ద్వారా రేషన్ సరఫరా అనే కార్యక్రమాన్ని జగన్ అప్పట్లో చేపట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ అంటూ వాహనాలను రద్దు చేసింది.  ఈ విషయంలో తొలుత ఒకింత వ్యతిరేకత వ్యక్తమైనట్లు కనిపించినా.. ఒకటి రెండు రోజులలోనూ ఆ వ్యతిరేకత మటుమాయమైంది. అంత పకడ్బందీగా దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు జగన్ హయాంలో ఇంటింటికీ రేషన్ అన్నది ఒక మాయావస్త్రంగా మారిందనీ, వాహనం ఇంటి ముందుకు వచ్చి రేషన్ పంపిణీ చేసిన దాఖలాలు లేవనీ, ఎక్కడో    కూడలిలో రేషన్ పంపిణీ వాహనం అందితే అక్కడకు పరుగులు పెట్టాల్సి వచ్చేదని లబ్ధిదారులు బాహాటంగా చెబుతున్నారు. దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ వల్ల తాము తాపీగా వెళ్లి తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడిందని అంటున్నారు.  ఇక పరామర్శల పేర జగన్ రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ లకు మద్దతుగా నిలుస్తున్నారన్న విషయాన్ని ప్రజలకు వివరించడంలో కూడా కూటమి సర్కార్ విజయం సాధించిందనే చెప్పాలి. ముఖ్యంగా తెనాలి ఐతానగర్ సంఘటనలో జగన్ పరామర్శ బూమరాంగ్ అయ్యింది. దళిత సంఘాలలో జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపించింది. పోలీసులు బహిరంగంగా ఐతానగర్ లో రౌడీషీటర్లకు ఇచ్చిన ట్రీట్ మెంట్ ను జనం హర్షించారు. అటువంటి రౌడీ షీటర్లకు జగన్ అండగా నిలవడమేంటన్న ఆగ్రహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అలాగే జనవరి 4 వెన్నుపోటు దినం అంటూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చి.. జగన్ బెంగళూరు ప్యాలెస్ లో కూర్చోడాన్ని వైసీపీ క్యాడరే జీర్ణించుకోలేకపోతోంది. అధినాయకుడు నిరసనలలో పాల్గొననప్పుడు తాము మాత్రం ఎందుకు అన్నట్లుగా చాలా ప్రాంతాలలో వెన్నపోటు దినం నిరసనలకు వైసీపీ క్యాడర్ దూరంగా ఉంది. దీంతో వైసీపీ నేతలు ఆ నిరసన కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. ఆ కారణంగా అవి జనానికి పట్టని నిరసనలుగా మిగిలిపోయాయి. అదే సమయంలో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేనలు నిర్వహించిన సంబరాలు ఆర్భాటంగా, ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. జనం కూడా ఆ వేడుకలలో స్వచ్ఛందంగా పాలుపంచుకున్న పరిస్థితి కనిపించింది.  దీంతో రాష్ట్రంలో వైసీపీ భవిష్యత్ పై ఆ పార్టీ వర్గాలలోనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 
ALSO ON TELUGUONE N E W S
2004లో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జై’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన వేణు ఎల్దండి.. తేజ సినిమాల ద్వారానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జబర్దస్త్‌ షో ద్వారా బాగా పాపులర్‌ అయ్యారు. హాస్యనటుడిగా దాదాపు 200 సినిమాల్లో నటించిన వేణు.. దర్శకుడిగా అవతారమెత్తి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 2023లో వేణు రూపొందించిన ‘బలగం’ చిత్రం ప్రతి ఒక్కరి మనసును తాకింది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి ఉత్తమ చిత్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే గద్దర్‌ అవార్డు లభించింది. అలాగే ఫిలింఫేర్‌ అవార్డులతోపాటు మరికొన్ని అవార్డులు ఈ సినిమా గెలుచుకుంది. ఈ సినిమా తర్వాత వేణు ఎలాంటి సినిమా చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ‘ఎల్లమ్మ’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. బలగం చిత్రాన్ని నిర్మించిన దిల్‌రాజే ఈ సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనుంది.  ప్రీ ప్రొడక్షన్‌లో ఉండగానే ‘ఎల్లమ్మ’ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. నితిన్‌ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రతి విషయంలోనూ కేర్‌ తీసుకుంటూ ముందుకెళ్తున్నారు వేణు. ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. బలగం చిత్రం బంధాలు, అనుబంధాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఎమోషన్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎల్లమ్మ చిత్రం ఒక గ్రామదేవత నేపథ్యంలో రూపొందిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని వార్తలు వస్తున్నాయి. నితిన్‌ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. తన కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఫిలిం అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు నితిన్‌.  ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ విషయం ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవకముందే చిత్ర యూనిట్‌కి వేణు ఒక కండిషన్‌ పెట్టినట్టు తెలుస్తోంది. అదేమిటంటే.. షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులు సెట్‌లో ఎవరూ సెల్‌ వాడకూడదు అనేది ఆ కండీషన్‌. షూటింగ్‌కి వచ్చే ముందే సెల్‌ ఫోన్స్‌ను సరెండర్‌ చెయ్యాలని సూచిస్తున్నారు. సాధారణంగా రాజమౌళి తను చేసే సినిమాలకు ఇలాంటి కండీషన్స్‌ పెడుతుంటారు. ఇప్పుడు వేణు కూడా అతన్నే ఫాలో అవుతూ తన యూనిట్‌కి స్ట్రిక్ట్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇస్తున్నారని తెలుస్తోంది. మీడియా, సోషల్‌ మీడియా విపరీతంగా పెరిగిపోయిన కారణంగా కొన్ని సినిమాల్లోని కీలక సన్నివేశాలు లీక్‌ అవడం మనం చూస్తున్నాం. అలాంటివి జరగకూడదని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘ఎల్లమ్మ’ చిత్రంతో మరోసారి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసేందుకు వేణు సిద్ధమవుతున్నారట. నితిన్‌ కూడా తాను హీరోలా కాకుండా ఒక సాధారణ నటుడిగా వేణుకి తన పూర్తి సహకారాన్ని అందించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 
  థియేటర్ల వ్యవస్థ బ్రతకాలంటే పర్సంటేజ్ సిస్టం తీసుకు రావాలని డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పర్సంటేజ్ సిస్టంకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. పర్సంటేజ్ సిస్టం గురించి కాకుండా, ముందు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఎలానో ఆలోచించాలని హితవు పలికారు. అలాగే పెద్ద హీరోలు వేగంగా సినిమాలు చేయాలని సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ పెట్టారు.    "ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావలా.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప.. ఇలాగ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే.. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది." అని బన్నీ వాస్ రాసుకొచ్చారు.    
మలయాళ, తమిళ, తెలుగు సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ నటుడుగా మంచి పేరు తెచ్చుకుంటున్న షైన్‌ టామ్‌ చాకో కుటుంబం యాక్సిడెంట్‌కి గురైంది. టామ్‌ చాకో కుటుంబం వెకేషన్‌కి వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తమిళనాడులో వీరు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కి గురైంది. ఈ ప్రమాదంలో తండ్రి సి.పి.చాకో మృతి చెందారు. టామ్‌ చాకోతోపాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురించి తెలిసి మలయాళ చిత్ర పరిశ్రమ షాక్‌ అయింది. టామ్‌ చాకో తండ్రి మృతి పట్ల అందరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. టామ్‌ చాకో త్వరలోనే కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.  2002లో నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన టామ్‌ చాకో.. మలయాళంలో దాదాపు 50 సినిమాల్లో నటించారు. తెలుగులో నాని హీరోగా నటించిన దసరా చిత్రంతో పరిచయమయ్యారు. ఈ సినిమాలో విలన్‌గా అందర్నీ భయపెట్టాడు టామ్‌ చాకో. ఆ తర్వాత దేవర, డాకు మహారాజ్‌, రాబిన్‌హుడ్‌ చిత్రాల్లోనూ అదే తరహా పాత్రలు పోషించారు. తన కెరీర్‌లో ఎక్కువగా నెగెటివ్‌ క్యారెక్టర్స్‌ చేయడం ద్వారానే పేరు తెచ్చుకున్నారు టామ్‌ చాకో. దానికి తగ్గట్టుగానే నిజజీవితంలోనూ విచిత్రంగా ప్రవర్తిస్తాడనే పేరు కూడా అతనికి ఉంది. చాలా సందర్భాల్లో అతను వ్యవహరించిన తీరు అందరికీ అనుమానాలను కలిగించింది. ఏదైనా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడా అనే సందేహాన్ని కూడా పలువురు వెలిబుచ్చారు. తన ప్రవర్తనతో, వివాదాలతో అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ నెటిజన్లకు ట్రోలింగ్‌ ఫిగర్‌గా నిలుస్తుంటారు టామ్‌ చాకో.
  అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ ఓ ఇంటివాడు అయ్యాడు. జూబ్లీ హిల్స్ లోని నాగార్జున నివాసంలో నేడు తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన జైనాబ్ తో అఖిల్ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులు, రామ్ చరణ్ - ఉపాసన దంపతులు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తదితరులు హాజరయ్యారు.    అఖిల్, జైనాబ్ ల వివాహం సమీప బంధువులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. జూన్ 8 ఆదివారం నాడు అన్నపూర్ణ స్టూడియో లో రిసెప్షన్ వీరి రిసెప్షన్ ఘనంగా జరగనుంది. ఈ రిసెప్షన్ కు సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్నారు.    అఖిల్, జైనాబ్ ల నిశ్చితార్థం 2024 నవంబర్ లో జరిగింది. నేడు వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు.  
2016 వ సంవత్సరంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)హీరోగా వచ్చిన 'పెళ్లి చూపులు' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి  రీతు వర్మ(Ritu Varma). ప్రేమ ఇష్క్ కాదల్,  నా రాకుమారుడు, కేశవ, టక్ జగదీష్, వరుడు కావలెను, మజాకా వంటి విభిన్న చిత్రాలు తన ఖాతాలో ఉన్నాయి. తమిళ భాషలో కూడా రెండు చిత్రాల్లో నటించి తన సత్తా చాటింది. ఈ నెల 6 న జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న 'దేవిక అండ్ డానీ'(Devika and danny)అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో భాగంగా రీతు వర్మ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే ఒక సినిమా రూపొందుతుంది. కానీ సినిమా ప్లాప్ అయితే చాలా సార్లు అందులో నటించిన హీరో, హీరోయిన్స్ ని నిందిస్తారు. గోల్డెన్ లెగ్ , ఐరెన్ లెగ్ అనే ట్యాగ్స్  ఇస్తుంటారు. ఒక వేళ సినిమా హిట్ అయినా అది అదృష్టానికి సంబంధించిన విషయం. చేసే ప్రతి సినిమా విజయవంతం కావాలని, ప్రొడ్యూసర్ కి లాభాలు రావాలని అనుకుంటాను. కానీ ఆ విధంగా జరగనప్పుడు బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు అలాంటి వారి గురించి పట్టించుకోకుండా  తర్వాత చెయ్యబోయే సినిమా గురించి ఆలోచిస్తున్నాను. విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకులని అలరించాలనేదే నా ప్రధాన లక్ష్యం. దేవిక అండ్ డానీ లో నా క్యారక్టర్ సహజంగా ఉండి ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుందని చెప్పుకొచ్చింది.   
  బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్ లో ఓ సినిమా రానుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ పై ఆమిర్ స్పందించాడు. "నేను, లోకేష్ కలిసి ఓ సూపర్ హీరో ఫిల్మ్ చేయబోతున్నాం. ఈ బిగ్ స్కేల్ యాక్షన్ ఫిల్మ్.. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలవుతుంది." అని ఆమిర్ చెప్పుకొచ్చాడు.   ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్'తో జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే 'దాదా సాహెబ్ ఫాల్కే' బయోపిక్ తో పాటు, మహాభారత ప్రాజెక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. వీటితో పాటు సూపర్ హీరో ఫిల్మ్ కోసం లోకేష్ తో చేతులు కలుపుతున్నారు.   'ఖైదీ', 'మాస్టర్', 'విక్రమ్', 'లియో' వంటి సినిమాలతో లోకేష్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ప్రస్తుతం రజినీకాంత్ తో 'కూలీ' చేస్తున్నాడు. నాగార్జున, ఉపేంద్ర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ఆమిర్ ప్రత్యేక పాత్రలో మెరవనుండటం విశేషం. ఇలా కూలీ కోసం మొదటిసారి చేతులు కలిపిన ఆమిర్-లోకేష్.. ఆ తర్వాత ఓ భారీ యాక్షన్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది.  
తమిళ చిత్ర పరిశ్రమలో 'విశాల్'(Vishal)కి ఉన్న ప్రత్యేక స్థానం గురించి అందరకి తెలిసిందే. యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరైన విశాల్ 2004 లో 'చెల్లమే' అనే మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. గత సంక్రాంతికి వచ్చిన 'మదగజరాజా' తో కలుపుకొని, ఇప్పటి వరకు సుమారు ముప్పై ఐదు చిత్రాల దాకా చెయ్యగా, నిర్మాతగాను వ్యవహరిస్తూ పలు అభిరుచిగల చిత్రాలని అందిస్తు వస్తున్నాడు. 2022 లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్(Lyca Productions)విశాల్ పై చెన్నై హైకోర్టు లో పిటిషన్ వేసింది. సదరు పిటిషన్ లో విశాల్ తాను నటించిన 'వీరమై వాగే చూడమ్' మూవీ టైంలో 21 .29 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇచ్చే వరకు ఆయన నిర్మించే సినిమా హక్కులని మాకు చెందే విధంగా ఒప్పందం కుదిరింది. కానీ 'వీరమై వాగే చూడమ్' సినిమా హక్కులని విశాల్ వేరే వాళ్లకి ఇచ్చాడని లైకాప్రొడక్షన్స్ తన పిటిషన్ లో పేర్కొంది. అప్పట్నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, రీసెంట్ గా ఈ విషయంపై చెన్నై హైకోర్టు తన తీర్పులో, విశాల్ 30 శాతం వడ్డీతో 21 .29 కోట్లు చెల్లించాలని వెల్లడి చేసింది.  'వీరమై వాగే చూడమ్' కి విశాల్ నిర్మాతగాను వ్యవహరించాడు. కత్తి, ఇండియన్ 2 , దర్బార్,  పొన్నియెన్ సెల్వన్ పార్ట్ 1 , పార్ట్ 2 ,చంద్రముఖి 2 , లాల్ సలాం, వేట్టయ్యన్ వంటి చిత్రాలు లైకా సంస్థ నుంచి వచ్చాయి.  
  Cast: Kamal Haasan, Silambarasan, Trisha Krishnan, Abhirami, Ashok Selvan, Nasser, Aishwarya Lekshmi, Joju George  Crew:  Written by Kamal Haasan, Mani Ratnam  Music by A R Rahman  Cinematography by Ravi K. Chandran  Editing by A. Sreekar Prasad  Directed by Mani Ratnam  Produced by Kamal Haasan, R. Mahendran, Mani Ratnam, Siva Ananth, Udhayanidhi Stalin   Kamal Haasan and Mani Ratnam duo have delivered an all-time classic like Nayakudu and many have been waiting for them to re-unite from past 4 decades. Now, they have come up with Thug Life, along with Simbu and Trisha in this one. The movie released today and let's discuss about it in detail.    Plot:  Rangaraya Shaktivel (Kamal Haasan) is a powerful gangster in Delhi and he saves Amar (Silambarasan), a news paper boy during a shootout in Mumbai. Amar looses his father due to Shaktivel's elder brother Manikkam (Nasser)'s cruel act. Hence, Shakti saves Amar and promises him that he will find Chandra, Amar's sister.  Years pass, Amar becomes younger brother to Shakti and they both grow a close bond so much so that it is hard to differentiate between them. But during one attack by Sadanand (Mahesh Manjrekar), Shakti doubts Amar's involvement. In retaliation, Amar shakes hand with Manikkam and tries to kill Shakti. What happens next? Watch the movie to know more.    Analysis:  Mani Ratnam and Kamal Haasan are known for delivering such classics that people start expecting more and more from them. Something novel and innovative seems to come naturally to them but they seem to have resorted to an age old story with very lean screenplay.  The narrative feels too lethargic and very basic that you wonder if these two greats have really worked together on the script or did they just pass off something workable. Their touches show up here and there but the film is like flesh and muscles assembled together without a skeleton.  Kamal Haasan performed well within the limitations of the character. Being his long time dream to make this film, many expect it to be a much better than just a generic gangster film. Simbu is good and he did his job well. Trisha couldn't really deliver her best in this role.  Abhirami, Ashok Selvan seem wasted. Joju George also got a forgettable role. AR Rahman's music is not that effective. Technically, the de-aging and framing is again good. Still, not the work that we expect from a Mani Ratnam film. Overall, the movie feels too lethargic and is a very generic and disappointing gangster drama.    Bottomline:  Not what we expect from Mani Ratnam and Kamal Haasan combination.    Rating: 2/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them.  
తారాగణం: కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, నాజర్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్ తదితరులు సంగీతం: ఎ. ఆర్. రెహమాన్ డీఓపీ: రవి కె. చంద్రన్ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ ప్రొడక్షన్ డిజైనర్: శర్మిష్ట రాయ్  రచన: మణిరత్నం, కమల్ హాసన్ దర్శకత్వం: మణిరత్నం నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ బ్యానర్స్: రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిమ్స్, మద్రాస్‌ టాకీస్‌, రెడ్ జెయింట్ మూవీస్ విడుదల తేదీ: జూన్ 5, 2025   లోకనాయకుడు కమల్ హాసన్, లెజండ్రీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో  తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'థగ్ లైఫ్' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో చూద్దాం. కథ రంగరాయ శక్తివేల్ నాయకర్ అలియాస్ శక్తివేల్ రాజ్( కమల్ హాసన్) పేరున్న ఒక గ్యాంగ్ స్టర్.    రాజ్యం, అధికారం కోసం అన్నదమ్ములు, తండ్రి కొడుకులు ఒకరినొకరు చంపుకుంటారనే, భావాన్ని బలంగా నమ్ముతాడు. భార్య లక్ష్మి(అభిరామి),పెళ్లీడుకొచ్చిన కూతురు అంటే ఎంతో ప్రేమ. గతంలో శక్తివేల్, పోలీసులకి మధ్య జరిగిన కాల్పుల్లో అమర్ ( శింబు) తండ్రి చనిపోతాడు. దీంతో ఏడేళ్ల వయసున్నఅమర్ ని శక్తివేల్ తన ఇంటికి తీసుకెళ్లి కొడుకుగా పెంచుతాడు. ఆ కాల్పుల టైంలోనే ఆరేళ్ల వయసున్న అమర్ చెల్లెలు చంద్ర(ఐశ్వర్య లేష్మి) తప్పిపోతోంది.దీంతో ఎప్పటికైనా నీ చెల్లెలని నీకు అప్పగిస్తానని అమర్ కి శక్తివేల్  మాటిస్తాడు. శక్తీ వేల్ కి సంబంధించిన గ్యాంగ్ వ్యవహారాలన్నింటిని అమర్ చూస్తు ఉంటాడు. సదానంద్(మహేష్ మంజ్రేకర్) గ్యాంగ్, శక్తీ వేల్  ని చంపటానికి ట్రై చేస్తుంది. ఇంద్రాణి (త్రిష) తనకి ఇష్టం లేకపొయినా, ఒక ముఠా వల్ల కాల్ గర్ల్ గా బతుకుతుంటే, శక్తీ వేల్  ఆమెని కాపాడతాడు. ఇద్దరకీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడటంతో రిలేషన్ లో ఉంటారు. శక్తీ వేల్  కి సంబంధించిన ఒక రహస్యాన్ని అమర్ కి శక్తీ వేల్ అన్నయ్య మాణిక్యం (నాజర్) చెప్తాడు. దీంతో   అమర్ కి శక్తివేల్ శత్రువుగా మారతాడు. శక్తీ వేల్  గురించి  అమర్ కి మాణిక్యం చెప్పింది  నిజమేనా!  శక్తివేల్ ని చంపడానికి అమర్ ఏం చేసాడు?  తనని చంపాలనుకున్న అమర్ ని శక్తివేల్ ఏం చేసాడు? ఆ పోరాటంలో  ఎవరు గెలిచారు? ఎవరు బలయ్యారు?  తన చెల్లెలని   తెచ్చి ఇస్తానని అమర్ కి మాట ఇచ్చిన శక్తివేల్ అది నెరవేర్చాడా? చివరకి ఎవరి క్యారక్టర్ ఎలా ముగిసిందనేదే థగ్ లైఫ్ కథ    ఎనాలసిస్  గ్యాంగ్ స్టర్ అనే పాయింట్ ని కథావస్తువుగా ఎంచుకున్నారు గాని, దాని పరిధి ని మాత్రం ఎక్కువ గాచూపించలేదు.బయట ప్రపంచంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో అలాగే చూపించారు. సినిమాకి కావాల్సిన నాటకీయత అనేది లోపించింది. చాలా సీన్స్ ని కావాలని పెట్టినట్టుగా అనిపిస్తుంది. సినిమా చివర వరకు ఇదే పంథాతో వెళ్లారు. ఫస్ట్ హాఫ్  విషయానికి వస్తే కమల్ హాసన్ ఎంట్రీ తో పాటు ఆయన క్యారక్టర్ చెప్పిన డైలాగులుతో, మొదటి పావుగంట ఇంట్రెస్ట్ గానే అనిపిస్తుంది. కానీ సీన్స్ వచ్చే కొద్దీ సినిమాలో ఏమి లేదని అర్ధమవుతుంది. క్యారెక్టర్స్ ఎలివేషన్ కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ కథని సృష్టించలేకపోయారు. అమర్ తో శక్తీ వేల్ రాజ్ తన చెల్లెల్ని ఎప్పటికైనా తెచ్చి ఇస్తానంటాడు. కాబట్టి చంద్ర క్యారక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమెని పోలీస్ ఆఫీసర్ గా పెట్టి అమర్ కి ఆమెకి మధ్య గొడవని సృష్టించాల్సింది. దీంతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరిగేది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్  లో కథలో ఏమైనా స్పీడ్ ఉంటుంది అనుకుంటే అది కూడా లేదు. కమల్ పగ తీర్చుకోవడంతోనే సరిపోయింది. ఇంద్రాణిగా త్రిష క్యారక్టర్ ప్రధాన మైనస్ గా నిలిచింది. కథ లో ముఖ్యమైన క్యారక్టర్ గా ఆమెని మార్చుకోవచ్చు. కానీ ఆ విధంగా చెయ్యలేదు. ఇంద్రాణి ని అమర్ తీసుకెళ్లడం అనే పాయింట్  ని మాత్రం అసలు జీర్ణించుకోలేం. శక్తి వేల్ రాజ్ పై కోపంతోనే తీసుకెళ్లాడు. ఆమె ఒంటి మీద చెయ్యి కూడా వెయ్యలేదంటే బాగుండేది. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది    నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు కమల్ హాసన్(Kamal Haasan)మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడంతో పాటు, రంగరాయ శక్తివేల్ నాయకర్ క్యారక్టర్ తన కోసమే పుట్టినట్టుగా జీవించాడు. కళకి సంబంధించి ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో,వాటన్నింటిలో తన గ్రిప్ ఏ మాత్రం తగ్గదని కూడా  మరోసారి చాటి చెప్పినట్టయింది..  అమర్ క్యారక్టర్ లో శింబు నటనలో మెరుపులు లేకపోయినా, పాత్ర పరిధి మేరకి బాగానే చేసాడు.   అభిరామి, నాజర్, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ ,ఇలా మిగతా పాత్రల్లో చేసిన అందరు తమ పాత్రల మేరకు మెప్పించారు. ఫొటోగ్రఫీ మూవీకి ప్రాణంగా నిలిచింది. ఏ ఆర్ రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగున్నా, కొన్ని చోట్ల తేలిపోయింది. సీన్ కి సంబంధం లేకపోయినా మ్యూజిక్  వచ్చింది. ఇక దర్శకుడిగా మణిరత్నం సక్సెస్ అయినా కథనంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. డైలాగ్స్ తో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయి.  ఫైనల్ గా చెప్పాలంటే ఒకే పాయింట్ పై సినిమా నడవడం, కథనాల్లోని లోపాలు థగ్ లైఫ్ కి మైనస్      రేటింగ్ 2 /5                                                                                                             అరుణా చలం   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them.     
  ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం పి. మహేష్ బాబు దర్శకత్వంలో 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రామ్ నెక్స్ట్ మూవీ సైతం మైత్రి బ్యానర్ లోనే రూపొందనుందని తెలుస్తోంది. ఈ మూవీని శివ నిర్వాణ డైరెక్ట్ చేసే అవకాశముందని సమాచారం.   'నిన్ను కోరి', 'మజిలీ' సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు శివ నిర్వాణ. మూడో చిత్రం 'టక్ జగదీష్' నేరుగా ఓటీటీలో విడుదలైంది. గత చిత్రం 'ఖుషి' భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టి, ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది. ఈ చిత్రాన్ని మైత్రి సంస్థ నిర్మించడం విశేషం. అయితే 'ఖుషి' ఆశించిన విజయాన్ని అందుకోనప్పటికీ.. శివ నిర్వాణ ప్రతిభ మీద నమ్మకంతో.. మైత్రి మరో సినిమా నిర్మించడానికి సిద్ధమైనట్లు వినికిడి.    శివ నిర్వాణ ఓ మంచి కథని సిద్ధం చేశాడని, అది రామ్ కి సరిగ్గా సరిపోయేలా ఉందని అంటున్నారు. ఇప్పటికే మైత్రి వీరిద్దరి మధ్య మీటింగ్ ఏర్పాటు చేసిందని, శివ చెప్పిన స్టోరీ లైన్ కి రామ్ ఇంప్రెస్ అయ్యాడని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతి మనిషి తన జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. అయితే కోరుకున్నంత సులభంగా అలాంటి జీవితం లభించదు. నిజానికి ప్రశాంతమైన జీవితం వేరు, సుఖాల మయమైన జీవితం వేరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ముందు. ప్రశాంతమయమైన జీవితం కావాలి అంటే…  ప్రతి నిముషంలోని ఆనందాన్నీ, సంతృప్తినీ వెలికి తీయగల గని కార్మికుడి లాగా పని చేయాలి. మనం ఎంత సాధించినా, ఎంత డబ్బునూ, ఆస్తుల్నీ సంపాదించినా చివరికి మన వెనకున్న ఎవరికో ఒకరికి సర్వం సమర్పించి అంతా వదలి వెళ్ళాలన్న సాధారణ సత్యాన్ని ఆకళింపు చేసుకోవాలి. అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు నిజంగా మనం సంతృప్తికరంగా జీవించగలమా అంటే అవును  జీవించగలం.  కొంతమంది ఏమి చేస్తారంటే… ఎదుటి వాళ్ళు కార్లు, బంగాళాలు కొంటూ విలాసవంతంగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళు ఎంత గొప్పగా బ్రతుకుతున్నారు అని అంటారు. కానీ ఎలాంటి గొడవలు, చింతలు లేకుండా హాయిగా ఉన్నవారే నిజమైన గొప్ప జీవితం కలిగి ఉన్నవారు అనే విషయాన్ని గ్రహించాలి.  మరికొందరు గొప్పగా బ్రతకడం అంటే అది అదృష్టం వలన లభించేది అని అనుకుంటారు. కానీ అది అదృష్టం వల్ల దొరికేది కాదు. అది మనకు మనంగా ఎంచుకొనే తెలివైన ఎంపిక.  ఇలాంటి ఎంపిక ఎలా సాధ్యం అని ప్రశ్నించుకుంటే.. మనం ఆలోచించడం మొదలు పెట్టాలి ముందు.  ఈ రోజున మనకు తెల్సిన పరిస్థితుల మధ్య, మనం అనుభవిస్తున్న పరిస్థితుల మధ్య, మనం సిద్ధంగా ఉన్న అవకాశం లభించినప్పుడు ఆనందంగా గడపగలమో..... లేక మనకు తెలియని రేపటి పరిస్థితుల మధ్య, మనం చూడలేని పరిస్థితులలో ఆనందంగా గడపగలమో నిర్ణయించుకోవాలి.   భవిష్యత్తు అనేది కేవలం మనం మన ఊహల్లో నిర్మించుకొనే ఒక సామ్రాజ్యం. ఈ వాస్తవమైన ఈ రోజుని ఆనందంగా జీవించలేనపుడు.. రేపటి రోజున ఎలా ఆనందంగా జీవించగలం? కాలం మన మృత్యువునీ ఎన్నటికీ వాయిదా వెయ్యదు, అది దానికి సమయం వచ్చినప్పుడు అట్లా మనల్ని తీసుకుని వెళ్లిపోతుంది. అలాంటప్పుడు మన ఆనందపు సమయాన్ని మాత్రం మనం ఎందుకు వాయిదా వెయ్యడం. మనకు దొరికిన గొప్పవరం ఏదైనా ఉందంటే అది ఈరోజే.., ఇది మళ్ళీరాని అవకాశం, ఈ రోజున మనం అనుభవించిన సంతోషాలూ, గడిపిన క్షణాలు మళ్ళీ అదే విధంగా మరో రోజు ఉండకపోవచ్చు.   ఒక వేళ మన ఆయుష్షు లక్ష రోజులైతే... అది ఖచ్చితంగా ప్రతి రోజూ ఓ విలక్షణమైన పుస్తకం లాంటింది.  ఏ పుస్తకమూ మరో పుస్తకంలా ఉండదు. అలాగే  మన అద్భుతమైన రోజు భవిష్యత్తులో మరో రోజు పునరావృతం కాదు. ప్రతి రోజు ఓ సరిక్రొత్త అనుభవం. అందుకే ఏ సరిక్రొత్త అనుభవాన్ని వదులుకోకూడదు. బోటన వ్రేలి గుర్తులు ప్రపంచంలో ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవో అలాగే మన జీవితకాలంలోని ఏ రెండు రోజులూ ఒకేలా వుండవు. సరిక్రొత్త విశేష విజయాలను, అవకాశాలను ఈ రోజే సృష్టించుకోవాలి.  మరో రోజును వేరొక అవకాశాన్ని సృష్టించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మనం గతంలో జరిగిన సంఘటనలనీ, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే ఆలోచనలతో, నిన్నటినీ, రేపటినీ కలిపి ఈ రోజు జీవించడానికి ప్రయత్నిస్తుంటాం. నిన్నటి పాత జీవితాన్ని మళ్ళీ నేడు బ్రతకడం ఎందుకు, వస్తుందో రాదో తెలియని రేపటిని ఈ రోజే జీవించాలన్న తపన ఎందుకు కేవలం నేటిని ప్రశాంతంగా జీవిస్తేచాలాదా!                                     ◆నిశ్శబ్ద.
ఆశనిరాశల్ని..... విజయవైఫల్యాల్ని మైలురాళ్ళుగా మిగిల్చి మరో సంవత్సరం మన కళ్ళముందు నుంచి కనుమరుగయింది. సరికొత్త సవాళ్ళతో మనం ఎంత సాహసి కులమో తేల్చేందుకు కొత్త సంవత్సరం స్వాగతించింది. నిజానికి కాలానికి తరతమ భేదాలుండవు. అందరికీ మంచినే పంచాలనుకుంటుంది. కాని ఎవరి ప్రయత్నాన్ని బట్టి వారికి ఆ యా ఫలితాల్ని ప్రసాదిస్తుంది. అందుకే ఆశావహులకు బృందావనమైతే... నిరాశావాదులకు అదే కాలం కాటేసే కాలనాగవుతుంది.  గతాన్ని గతంలోనే పూడ్చిపెట్టి... సరికొత్త ఆశలతో ముందుకు సాగిపోవాలి. అందుకోసం అందరూ పాటించాల్సిన కొన్ని విషయాలివి. అస్పష్టం... అనాలోచితం ప్రస్తుతం చాలా సందర్భాల్లో విఫలమవడానికి కారణం మన పరిధిని, మన సామర్ధ్యాన్ని మనం సరిగ్గా అంచనా వేసుకోకపోవడం. ఫలితంగా చాలా మంది జీవితాలు అస్పష్టంగా, అనాలోచితంగా సాగిపోతున్నాయి. ఆంగ్ల విద్యావేత్త బ్రెండన్ 'once we accept our limits, we go beyond them' అంటారు. ముందు మన పరిమితుల్ని, వనరుల్ని తెలుసుకోగలగాలి. కాని దురదృష్టవశాత్తూ మనలో చాలామంది వయసు మించిపోతున్నా వారి వారి సామర్ధ్యాల్ని గుర్తించి మసలుకోలేకపోతున్నారు. పరుగులయితే పెడుతున్నాం... కానీ ఎక్కడికో చెప్పలేకపోతున్నాం. అలసిపోతున్నాం.  కాని అసలు ఎందుకో తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ముందు ఈ కొత్త ఏడాది లోనైనా మన గమ్యం పట్ల పూర్తి స్పష్టతను ఏర్పరచుకుంటే మంచిది. దానికి అనుగుణంగా మన గమనాన్ని నిర్దేశించుకావాలి.  ఆధునిక బలహీనతలు.. అష్టకష్టాలు.. సహజంగా మనలో ఉండే బలహీనతలకు తోడు నేడు ఆధునికమైనవి కూడా వచ్చి తోడయ్యాయి. అసలే కోతి, ఆపై పిచ్చి, కల్లు తాగి, నిప్పులు తొక్కి.... అన్నట్లుగా మారిపోయింది ప్రస్తుతం మన మనఃస్థితి. యుక్తవయసులో అసలే కుదురుగా ఉండని మనస్సును సెల్ఫోన్లు, ఇంటర్నెట్లు మరింత ఇరకాటంలో పడేశాయి. ఆధునిక మానవుడికి సెల్ఫోన్ రూపంలో మరో శరీరభాగం వచ్చి చేరినట్లయింది. విలాసాల్ని అవసరాలుగా భ్రమించడం వల్లనే ఈ ప్రమాదమంతా.   ఇవి మానసికంగా, శారీరకంగా ఎంత బలహీనుల్ని చేస్తున్నాయో యువతీయువకులు గమనించడం లేదు. ముఖ్యంగా జీవితానికి పటిష్టమైన మార్గాన్ని నిర్మించుకోవలసిన విలువైన ప్రాయంలో ఇవి  ఏకాగ్రతను ఛిన్నాభిన్నం చేస్తాయి. 'simple living high thinking'  ను  జీవనశైలికి మలచుకోవాలి. అలా చేస్తే ఈ ఆధునిక బలహీనతల నుండి బయటపడవచ్చు. ఆహారాలు... ఆహార్యాలు... భగవద్గీతను చదవడం కన్నా ముందు ఫుట్బాల్ ఆడి శరీరాన్ని దృఢం చేసుకోండి.  మానసికంగా, శారీరకంగా బలహీనపరిచే దేనినయినా విషంలా తిరస్కరించండి అనే వారు స్వామి వివేకానంద. బాణం గురి చేరాలంటే ముందు ధనుస్సు బలంగా ఉండాలి. ధనుస్సే బలహీనంగా ఉంటే, ఇక బాణం గురించి చెప్పేదేముంటుంది. ఆధునికత పేరుతో అస్తవ్యస్తమైన ఆహార, ఆహార్యాల వెంట పరుగులు తీస్తున్నాం. అందుకే మనలో చాలామంది ముఖాల్లో కృత్రిమ కాంతులు.... అద్దకపు అందాలు. వీటన్నింటికీ కారణం మన జీవనంలో సహజత్వం లోపించడం. పసిబిడ్డ ఉగ్గుపాల నుంచి పండ్లరసాల వరకు అన్నింటినీ మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నాం. భారతీయ జీవనవిధానానికి సరిపోలని సంస్కృతుల్ని దిగుమతి చేసుకొని మనకు మనమే కృతకంగా బ్రతుకులీడుస్తున్నాం. ఆహార, ఆహార్యాలనేవి వారి వారి భౌగోళిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వారసత్వంగా సంక్రమిస్తూ ఉంటాయి. ఒకరు ఇంకొకరి ఆహార, ఆహార్య, ఆచారాలను గుడ్డిగా అనుకరించడం వలన పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా మారిపోతుంది. అందుకే భౌతికంగా, బౌద్ధికంగా మనల్ని ధీరోదాత్తులను చేసే జీవనశైలిని అలవరచుకుంటే కొత్త ఏడాదిలో జీవితం విజయానికి చేరువ అవుతుంది.                                              *నిశ్శబ్ద.
పిల్లల పెంపకం ఒక కళ.  చాలామంది పిల్లలకు ఆహారం ఇవ్వడం, వారికి కావలసిన వస్తువులు సమకూర్చడం,  చదువు చెప్పించడం మొదలైనవి చేయడమే పిల్లల పెంపకం అనుకుంటారు. కానీ ఇవన్నీ పిల్లలకు అవసరమైనవి.. ఇవి మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే విషయాలు కూడా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. కొన్ని పద్దతులు,  విలువలు అలవాటు చెయ్యాలి.  5ఏళ్ల లూపే పిల్లలకు పిల్లలకు 5 విషయాలు తప్పక నేర్పిస్తే పిల్లలు వాటిని  జీవితాంతం వాటిని వదిలిపెట్టరు. అది వారి జీవితాన్ని బంగారంలా మారుస్తుంది. పిల్లలు దుఃఖం, బాధ, కోపం, సంతోషం మొదలైన భావోద్వేగాలను చాలా తొందరగా వ్యక్తం చేస్తారు. అయితే వీటిని వ్యక్తం చేసే విధానం ఒకటి ఉంటుంది.  ఆ విధానంలో వ్యక్తం చేయడం నేర్పిస్తే పిల్లలు దృఢంగా ఉంటారు.  దీన్ని 5 ఏళ్లలోపే పిల్లలకు నేర్పించాలి. ఇతరులను గౌరవించడం గొప్ప గుణం.  దీన్ని చిన్నతనం నుండే పిల్లలకు నేర్పించాలి.  భావోద్వేగాలు ఎంత ఉన్నా, ఎంత కోపం,  అసహనం ఉన్నా   ఇతరులను అవమానించి మాట్లాడకూడదని,  ఒకచోట కోపాన్ని ఇంకొక చోట తీసుకురాకూడదని చెప్పాలి.  తప్పులు ఎప్పుడూ అనుభవాలుగా,  గొప్ప పాఠాలుగా సహాయపడతాయి.  అయితే పిల్లలు మాత్రం తప్పు చేస్తే తప్పించుకోవడం, దాచిపెట్టడం చేస్తారు. కానీ పిల్లలు తాము చేసిన తప్పుల నుండి తప్పించుకోకుండా, దాచిపెట్టకుండా  వాటిని ఒప్పుకునేలా అలవాటు చెయ్యాలి. తాము తప్పు చేసినా, ఇతరులను నొప్పించినా పరిస్థితులకు అనుగుణంగా సారీ చెప్పడం, కృతజ్ఞత వెలిబుచ్చడానికి  థ్యాంక్స్ చెప్పడం  వంటివి పిల్లలకు నేర్పించాలి. ఎవరైనా తమను బాధపెడితే వారిని  క్షమించే తత్వాన్ని పిల్లలకు నేర్పించాలి. సమస్యలు అందరికీ వస్తాయి.  వయసుకు తగిన సమస్యలు ఉండనే ఉంటాయి.  అయితే  పిల్లలకు ఏ సమస్య వస్తుందో అని పెద్దలు ఎప్పుడూ గాభరా పడుతూ ఉంటారు.కానీ ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం కోసం పిల్లలే ఆలోచించేలా వారికి అలవాటు చెయ్యాలి.  ఇది వారి భవిష్యత్తును అందంగా మారుస్తుంది. ఒకరి మీద ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో లీడర్ షిప్ క్వాలిటీస్ పెరగడానికి దోహదం చేస్తుంది.                                                      *రూపశ్రీ.
ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ లో ఒక  భాగం. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి.  ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస సమయంలో  ఖర్జూరం తినడం తోనే ఆ రోజు ఉపవాసాన్ని విరమిస్తారు. పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరాలు ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి.  ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన 2 ఖర్జూరాలు తింటూ ఉంటే కలిగే మ్యాజిక్ ఫలితాలేంటో తెలుసుకుంటే తప్పకుండా ప్రతిరోజూ ఖర్జూరాలు తినడం మొదలుపెడతారు.. ఫైబర్.. నానబెట్టిన ఖర్జూరంలో అధికమొత్తంలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణవ్యవస్థను బలంగా మారుస్తుంది.  జీవక్రియను మెరుగుపరుస్తుంది.  మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.  పేగు  ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎనర్జీ.. నానబెట్టిన ఖర్జూరాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరానికి గొప్ప శక్తి అందుతుంది.  ఇది రోజును ఉత్సాహంగా ప్రారంభించేందుకు తోడ్పడుతుంది. రోజంతా చురుగ్గా ఉండాల్సి న వ్యక్తులు నానబెట్టిన ఖర్జూరం తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. స్కిన్.. చర్మం ఆరోగ్యం మీద దృష్టి ఉన్నవారు నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా అవసరం.  ఎందుకంటే నానబెట్టిన ఖర్జూరం చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.  ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె.. ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.   ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.  అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తింటే చాలా మంచిది. ఎముకలు.. ఖర్జూరంలో ఐరన్, కాల్షియం,  విటమిన్లు మంచి మొత్తంలో ఉంటాయి.  ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి.  ఎముకలు బలహీనంగా ఉన్నవారు ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా మంచిది. మధుమేహం.. ఖర్జూరం తీపి ఎక్కువగా ఉన్నా నానబెట్టిన తరువాత వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఈ కారణంగా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునే వారు నానబెట్టిన ఖర్జూరం తింటే చక్కెర స్థాయిలు ఆరోగ్యంగానే ఉంటాయి. రక్తహీనత.. భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు రక్తహీనత తో బాధపడుతున్నారు.  ఖర్జూరంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల నానబెట్టిన ఖర్జూరాలు రోజూ ఉదయమే తింటూ ఉంటే హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. ఒత్తిడి.. ఖర్జూరాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.  ఒత్తిడితో పోరాడేవారు రోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఒత్తిడి తగ్గుతుంది. తల్లిపాలు.. పరిశోధనల ప్రకారం పిల్లలకు పాలిచ్చే తల్లులు ఉదయాన్నే నానబెట్తిన ఖర్జూరం తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.                                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  కొలెస్ట్రాల్ అనేది ఒక ప్రధాన  సమస్యగా మారుతోంది.  దీనికి సరైన ఆహారం, దిగజారుతున్న జీవనశైలి, ఒత్తిడి. కారణం అవుతున్నాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్‌ విషయంలో ఆహారపు అలవాట్లు కూడా చాలా బాధ్యత వహిస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా గుండె  ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్‌లను తినకూడదని కొందరు హెచ్చరిస్తుంటారు. ఈ వాదనలో నిజమెంతో తెలుసుకుందాం.  జీడిపప్పులో ఉండే పోషకాల గురించి మాట్లాడితే, ఆరోగ్యానికి అవసరమైన 44 శాతం కొవ్వు, 30 శాతం కార్బోహైడ్రేట్స్, 18 శాతం ప్రోటీన్లను కలిగి ఉంటుంది. జీడిపప్పు పోషకాల పవర్ హౌస్‌గా పరిగణిస్తారు. పోషకాలు అధికంగా ఉండే జీడిపప్పు వినియోగం కొలెస్ట్రాల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంతో తెలుసుకుందాం.  జీడిపప్పు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? జీడిపప్పు అనేది డ్రై ఫ్రూట్, ఇది కొలెస్ట్రాల్‌ను పెంచని ఆహారం. సాధారణంగా జంతు ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే జీడిపప్పులో మాత్రం జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డిఎల్‌ను తగ్గించడమే కాకుండా, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులను కూడా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పు మొక్కల ఆధారిత ఆహారం. జీడిపప్పులో ఉండే కొవ్వులో ఎక్కువ భాగం స్టెరిక్ యాసిడ్ నుండి వస్తుందని, ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్‌పై ఎటువంటి ప్రభావం చూపదని అనేక పరిశోధనలలో నిరూపించారు. రోజుకు గుప్పెడు జీడిపప్పులు తినడం వల్ల గుండెకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.  జీడిపప్పు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది జీడిపప్పు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం గుండె జబ్బులను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆహారంలో తగినంత మొత్తంలో మెగ్నీషియం తీసుకోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.    గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆధునిక జీవనశైలి,  ఫాస్ట్ ఫుడ్ తినడం మొదలైనవి   ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వీటి కారణంగా  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్స్,  ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో  ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు,  ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి.  ఇవి శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం,  మూత్రపిండాల పనితీరు బలహీనపడటానికి దారితీస్తాయి. మూత్రపిండాల్లో లవణాలు,  ఖనిజాలు స్ఫటికీకరించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల  మూత్రపిండాల్లో రాళ్లు నివారించవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఒక సాధారణ సమస్యగా మారుతున్నప్పటికీ, వాటిని నివారించడం సులభం. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం, సమతుల్య ఆహారం,  సహజ మూలికల వాడకంతో  రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడకూడదు అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి.. హైడ్రేషన్:  మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి  హైడ్రేటెడ్ గా ఉండటం. "రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగడం వల్ల రాళ్లు ఏర్పడటానికి దోహదపడే కాల్షియం, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్‌ల వంటి ఖనిజాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. సాధారణ నీటితో పాటు, కొబ్బరి నీరు, బార్లీ నీరు అద్భుతంగా సహాయపడతాయి.  శరీరం నుండి విషాన్ని తొలగించడాన్ని ప్రోత్సహిస్తాయి.  నిమ్మకాయలు,  నారింజ వంటి సిట్రస్ పండ్లు కూడా మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయపడతాయి. ఎందుకంటే వాటిలో ఉండే సిట్రేట్లు ఆక్సలేట్‌లు స్ఫటికాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. సరైన హైడ్రేషన్ మూత్రపిండాలలో ఖనిజాలు పేరుకుపోకుండా మూత్రపిండాల పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తాయి.   మూలికలు.. కొన్ని మూలికలు మూత్రపిండాల పనితీరుకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి.  రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తాయి. సహజ నివారణలు విషాన్ని బయటకు పంపడంలో, ఖనిజాలు పేరుకుపోకుండా నిరోధించడంలో,  మొత్తం మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అత్యంత ప్రభావవంతమైన మూలికలు.. పునర్నవ .. ఇది సహజ మూత్రవిసర్జనగా పనిచేస్తుంది, అదనపు ద్రవాలు, విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. గోక్షుర .. మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇస్తుంది,  ఖనిజ స్ఫటికీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది. అరటి కాండం రసం.. మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేసి బయటకు పంపుతుంది. శతావరి.. మూత్రపిండాల వడపోతను పెంచుతుంది, ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. బూడిద గుమ్మడికాయ రసం.. 95 శాతం నీటి శాతం,  ఆల్కలీన్ లక్షణాలతో ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.  రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ల నివారణకు ఆహార విధానాలు.. కాల్షియం తీసుకోవడం పెంచాలి..  కాల్షియం గట్‌లోని ఆక్సలేట్‌లతో బంధిస్తుంది, మూత్రపిండాలలో వాటి స్ఫటికీకరణను నిరోధిస్తుంది. సోడియం వినియోగాన్ని పరిమితం చేయాలి.. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల కాల్షియం విసర్జన పెరుగుతుంది, రాళ్ళు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను తగ్గించాలి.. పాలకూర, దుంపలు,  బెండకాయలు వంటి ఆహారాలను మితంగా తినాలి,  వాటి ప్రభావాలను సమతుల్యం చేయడానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో జత చేయాలి. ఆల్కలీన్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. దోసకాయలు, పుచ్చకాయ,  కొబ్బరి నీరు మూత్రంలో ఆరోగ్యకరమైన pH సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. జంతు ప్రోటీన్‌ను పరిమితం చేయాలి.. మాంసం, గుడ్లు,  చేపలను అధికంగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...