LATEST NEWS
వైసీపీ సోషల్ మీడియా విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా జరిగిన దాడులు, అసభ్యకర పోస్టుల వెనుక ఉన్న ఆర్థిక మూలాల గురించి పోలీసులు సజ్జల భార్గవ్‌రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు. ముఖ్యంగా ఈ కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ నెట్‌వర్క్‌ను నడపడానికి ఎవరెవరు సహకరించారు? అనే కోణంలో దర్యాప్తు సాగింది.  విచారణ సమయంలో పోలీసులు ముఖ్యంగా నిధుల వ్యవహారంపై ఆరా తీశారు. సోషల్ మీడియా వింగ్ నడపడానికి భారీ మొత్తంలో ఖర్చవుతుందని, ఆ నిధులను ఎవరు సమకూర్చారనేది ఇప్పుడు కేసులో కీలకంగా మారింది.  ఏ1 నిందితుడు వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భార్గవ్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే విచారణకు సజ్జల భార్గవ్ రెడ్డి సహకరించలేదనీ, చాలా ప్రశ్నలకు ఆయన  తెలియదు, గుర్తులేదు' అని సమాధానమిచ్చినట్లు సమాచారం.ఈ కేసులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే..  నిందితులు వాడిన పరికరాల గురించి పోలీసులు అడిగిన ప్రశ్నలు. పోస్టులు పెట్టడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను అప్పగించాలని పోలీసులు కోరగా..  భార్గవ్‌రెడ్డి   నిరాకరించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలు ఉంటేనే వాటిని ఇస్తానని ఆయన స్పష్టం చేశారని అంటున్నారు. రాజకీయ నేతలను, ముఖ్యంగా మహిళా నేతలను లక్ష్యంగా చేసుకుని చేసిన అసభ్యకర పోస్టుల వెనుక ఎవరి ప్రోద్బలం ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షర్మిల, విజయమ్మ వంటి వారిపై జరిగిన వ్యక్తిగత దాడుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ పోస్టుల తయారీ మరియు వ్యాప్తి కోసం ప్రత్యేక టీమ్‌లు పనిచేశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో అన్నమయ్య ప్రాజెక్ట్ వంటి సున్నితమైన అంశాలపై కూడా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసుల దర్యాప్తు కేవలం పోస్టులకే పరిమితం కాకుండా, ఆ వ్యవస్థ వెనుక ఉన్న ఆర్థిక వనరులపై కూడా ఫోకస్ పెట్టింది. తదుపరి విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భార్గవ్‌రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు, తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసులో మరికొంత మంది వైసీపీ నేతలకు కూడా నోటీసులు అందే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  
  బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నియమించబోయే కమిటీలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించనున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ అప్పగించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ అంతర్గత సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేసినప్పుడు… తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం పాటించారని విమర్శించారు. “వాళ్లు తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ పౌరుషం లేదా?” అని ప్రశ్నించారు.“ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా… క్షమాపణ చెప్పించేవాళ్లం” అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు స్పందించకపోవడం పౌరుషం లేని వ్యవహారమని విమర్శించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణను వ్యవసాయం సహా అన్ని రంగాల్లో ముందంజలో నిలబెట్టామని… ఇప్పుడు మాత్రం భూముల కబ్జాలు, కూల్చివేతల్లో నెంబర్ వన్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని… రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల తీరు చూస్తే జాలి వేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డిని జనరల్ సెక్రటరీగా ప్రకటించి, కార్యవర్గానికి పరిచయం చేశారు కేసీఆర్.  
తెలంగాణ రాజకీయ యవనికపై  భారత రాష్ట్ర సమితి  అధినేత కే. చంద్రశేఖరరావు తనయ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల  ఎంట్రీ సంచలనాలకు వేదికైంది. పార్టీ ప్రకటన సందర్భంగా తన కన్నతండ్రిపై ఆమె చేసిన వ్యాఖ్యలు, విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలలో ఎదిగిన కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు  తండ్రి బాటను వీడి సొంతంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం  చర్చనీయాంశమైంది.  తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో సరికొత్త పార్టీని ప్రకటించిన ఆమె, గతంలో తండ్రి స్థాపించిన పార్టీ పేరులోని అక్షరాలనే మళ్ళీ తెరపైకి తీసుకురావడం ఆసక్తిరేకెత్తిస్తోంది. అన్నిటికీ మించి తన తండ్రిని మరమనిషి, గుంటనక్కల చేతిలో బంది అంటూ ఓ రేంజ్ లో విమర్శించడంతో అంతా దీనిపై బీఆర్ఎస్ రియాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందా అని ఇసక్తిగా ఎదురు చూశారు. బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.   ముఖ్యంగా కేసీఆర్ మౌనం వ్యూహమా? భయమా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ హాట్ గా సాగుతోంది. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కవిత వ్యాఖ్యల వెనుక పటిష్టమైన, పకడ్బందీ వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు.  అయితే కేసీఆర్ మౌనమే ఇప్పుడు అందరికి అర్ధం కాకుండా పోయింది.  తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలపైనే కాదు.. ఆమెను  నుండి కవితను బహిష్కరించిన నాటి నుండి ఇప్పటి  వరకూ కేసీఆర్   ఏ సందర్భంలోనూ తన కుమార్తె గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు.  కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కవిత చేసిన అవినీతి ఆరోపణల నుంచి తనను మరమనిషిగా అభివర్ణించడం వరకూ కవిత ఎంత పరుషంగా మాట్లాడినా కేసీఆర్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించారు.  దీంతో కేసీఆర్ మౌనం వ్యూహాత్మక, కన్నబిడ్డ అన్న మమకారమా? అన్న చర్చ జరుగుతోంది.   కేసీఆర్ మౌనం ఇలాగే కొనసాగితే.. రానున్న రోజులలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కవిత భారీగా చీల్చడం ఖాయమన్న భావన పార్టీ వర్గాలలోనే వ్యక్తమౌతోంది.  
  తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి. ఇక, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.  విజయ్‌ పాపులారిటీ, అనూహ్యంగా పెరిగిన పోలింగ్‌, ప్రశాంతంగా ఎన్నికలు ముగియడం వంటి కారణాలతో.. టీవీకే ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ఇక, విజయ్ తన పార్టీ గెలుపుపై భారీగా ఆశలు పెట్టుకున్నారని.. ఆయన ఏకంగా మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలనే జాబితాను సైతం ఆల్రెడీ సిద్ధం చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.  ఇంత‌కీ ఈ జాబితాలో ఎవ‌రి పేర్లు ఉన్నాయి? అని చూస్తే.. బుస్సీ ఆనంద్. ఈయ‌న‌ టీవీకే జనరల్ సెక్రటరీ. ఈయన విజయ్‌కు అత్యంత సన్నిహితుడు, అంతేనా పార్టీ వ్యవహారాలన్నీ చూసుకునే వ్యక్తి. ఈయనకు అత్యంత కీలకమైన శాఖ- బహుశా హోం లేదా మున్సిపల్ శాఖ.. దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఆదవ్ అర్జున. ఈయన ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందారు. ఈయనకు ఆర్థిక లేదా ఐటీ శాఖల బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం జరుగుతోంది.కె.ఎ. సెంగోట్టయన్. గతంలో ఏఐఏడీఎంకే లో సీనియర్ మంత్రిగా పనిచేసిన ఈయన, విజయ్ పార్టీలో చేరడంతో ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక శాఖ ఇచ్చే అవకాశం ఉంది. వేణుగోపాల్, మాజీ ఎంపీ. ఈయనకు కూడా సీనియారిటీ కోటాలో చోటు దక్కవచ్చని సమాచారం. కె.జి. అరుణ్‌రాజ్. పార్టీ సిద్ధాంతకర్త, ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఈయన పేరు కూడా పరిశీలనలో ఉంది.మహిళా కోటా విష‌యానికి వ‌స్తే.. విజయ్ తన మంత్రివర్గంలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తున్నట్లు, ఇందులో భాగంగా విజయలక్ష్మి వంటి మహిళా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కేవలం అనుభవం ఉన్నవారినే కాకుండా, చదువుకున్న యువతను కూడా తన కేబినెట్‌లోకి తీసుకోవాలని విజయ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పేర్లు కేవలం రాజకీయ విశ్లేషకులు, పార్టీ వర్గాల నుంచి అందుతున్న లీకుల ఆధారంగానే ప్రచారంలో ఉన్నాయి. మే 4వ తేదీన వెలువడే ఫలితాల తర్వాతే ఈ జాబితాపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తొంద‌ర ప‌డి ముందే కూసిన కోయిల‌లు త‌ర్వాత బొక్క బోర్లా ప‌డ్డం  కూడా ఉంది. గ‌త ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్ త‌న పార్టీ వ‌ర్గాల వారిని ఒక హైప్ లో ఉంచ‌డానికిగానూ.. ప్ర‌మాణ స్వీకార వేదిక‌, హోట‌ళ్ల బుకింగ్ వంటి ఎన్నో ముంద‌స్తు ఏర్పాట్లు చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, అది కాస్తా తుస్సు మ‌న‌డంతో వైసీపీ కార్య వ‌ర్గ‌మంతా  డీలా ప‌డిపోయింది.  అన్న‌ట్టు ఎన్డీయే కూట‌మి చంద్ర‌బాబును త‌మ తెలుగు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా చూపితే, విజ‌య్ తాను జ‌గ‌న్ తో క‌ల‌సి దిగిన ఫోటోల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఇప్పుడు చూస్తే ఆయ‌న‌లా ముంద‌స్తు జాబితాలు సిద్ధం చేయ‌డం వంటి హంగామా చూస్తుంటే ఇదేదో తేడాగా ఉందే అన్న అనుమానాలు కూడా వ‌స్తున్నాయ్. ఎందుకంటే ఏ స‌ర్వే కూడా విజ‌య్ కి 10- ప‌దిహేను సీట్ల కంటే ఎక్కువ వ‌చ్చేలా చెప్ప‌లేదు. అందుకే ఈ హంగామా చూస్తుంటే డౌట్ గా ఉందంటున్నారు కొంద‌రు.
తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేడు తన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. సాధారణంగా   ఆవిర్భావ దినోత్సవం రోజున   రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ప్లీనరీ నిర్వహించడం, కేడర్‌లో ఉత్సాహం నింపాలని ఏ పార్టీ అయినా భావిస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తమ సత్తా చాటడానికి ఘనంగా, అట్టహాసంగా జరుపుకుంటాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయితే.. ఆవిర్భావ దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించి క్యాడర్ ను వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం చేయడానికి అందివచ్చిన అవకాశంగా ఆవిర్భావ దినోత్సవాన్ని చూస్తుంది. అయితే తెలంగాణలో మాత్రం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అందుకు భిన్నంగా..  వేసవి తీవ్రతను సాకుగా చూపుతూ ప్లీనరీని రద్దు చేసింది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.  పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీని రద్దు చేయడంపై పార్టీలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.   రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ  నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.  పైకి సామాజిక బాధ్యతతోనే ప్రజలు, కార్యకర్తల క్షేమాన్ని కాంక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్నా..  సాధారణంగా వేసవిలో కూడా సాయంత్రం వేళల్లో బహిరంగ సభలు నిర్వహించే సంప్రదాయం ఉందని, ఇటీవల జగిత్యాలలో జరిగిన సభే ఇందుకు నిదర్శనమనీ గుర్తు చేస్తున్నారు. ఆ సభకు పార్టీ అధినేత కేసీఆర్ కూడా హాజరైన విషయాన్ని  ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం రోజున బహిరంగ సభ జరపకపోవడం పట్ల పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ వ్యక్తం అవుతున్నది.  ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  బీఆర్ఎస్ తన సత్తా చాటుకోవడానికి ప్లీనరీ కీలకమని అంటున్నారు.  ముఖ్యంగా  కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో అధినేత కేసీఆర్  క్యాడర్‌కు దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అంటున్నారు.  ఇలాంటి కీలక తరుణంలో కేసీఆర్ ప్రజల ముందుకు రాకపోవడం..   తన వాణిని వినిపించకపోవడం పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    తన సొంత కుమార్తె కవిత తనపై చేసిన  విమర్శలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే  కేసీఆర్ బహిరంగ సభ విషయంలో వెనక్కు తగ్గారన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.   భారీ బహిరంగ సభకు బదులుగా తెలంగాణ భవన్‌లో కేవలం కీలక నేతలతో మాత్రమే ఇండోర్ సమావేశాన్ని నిర్వహించారు.   పార్టీ తన పూర్వ వైభవాన్ని చాటుకోవడానికి ఈ ఆవిర్భావ దినోత్సవం ఒక వేదికగా మారుతుందని ఆశించిన కార్యకర్తలకు ఈ నిర్ణయం   నిరాశను మిగిల్చింది. 
ALSO ON TELUGUONE N E W S
  కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని అక్కినేని వారు ఏమంటా చెప్పారో కానీ, ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ అదే పాటని పాడుకోవాల్సిన పరిస్థితి. అఖిల్(Akhil)లెనిన్ మూవీనే  ఆ సాంగ్ పాడుకునే పరిస్థితిని కల్పిస్తుంది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం  లెనిన్(Lenin)జూన్ 26న రిలీజ్ కాబోతుందని మేకర్స్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. కానీ ఈ డేట్ నుంచి కూడా మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు పెద్దినే కారణమని రీసెంట్ గా పెద్ది(Peddi)ని జూన్ 25 న రిలీజ్ చేస్తామని బుచ్చిబాబు ప్రకటించాడు. దీంతో నిను వీడని నీడను నేనే అనే  రీతిలో పెద్ది వెంటపడుతుండటంతో లెనిన్ రిలీజ్ డేట్ మారవచ్చనేది టాక్. నిజానికి  లెనిన్ మే 1న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ పెద్ది ఫస్ట్ రిలీజ్ డేట్ ఏప్రిల్ 30 కావడంతో క్లాష్ వద్దనుకొని  జూన్ 26కి వాయిదా వేశారు. మరి ఇప్పుడు జూన్ 25నే పెద్ది బరిలో దిగబోతుంది. మరి ఒకే రోజు గ్యాప్‌లో రెండు భారీ సినిమాలు విడుదల కావడం అనేది ఇబ్బందే. ట్రేడ్ వర్గాలు సైతం క్లాష్ వద్దని అనుకుంటారు. పైగా అఖిల్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్నాడు. హిట్ కూడా కంపల్ సరి దీంతో జూన్ రేసు నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. Also read: Vandemataram: షార్ట్ ఫిల్మ్ తీస్తే 15 లక్షలు.. కేంద్రం బంపర్ ఆఫర్  ఏది ఏమైనా రిలీజ్ డేట్ వాయిదా పడినా కూడా ఈ సారి అఖిల్ బాక్స్ ఆఫీస్ ని చెడుగుడు ఆడటం ఖాయమనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. అఖిల్ సరసన భాగ్య శ్రీ  భాగ్యశ్రీ బోర్సే జత కడుతుండగా ఇప్పటికే విడుదలైన 'వారేవా వారేవా' సాంగ్ యు ట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. ఆ ఇద్దరి మధ్య కనపడ్డ కెమిస్ట్రీ  కూడా లెనిన్ పై అంచనాలని పెంచుతుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న లెనిన్ కి మురళి కిషోర్ అబ్బూరి దర్శకుడు. పక్కా యాక్షన్ డ్రామా.  
తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యానికి అగ్ర తాంబూలం ఇస్తూ అద్భుతమైన కామెడీ సినిమాలను రూపొందించి హాస్యబ్రహ్మ అనిపించుకున్న డైరెక్టర్ జంధ్యాల. ఆయన కలం నుండి జాలువారిన డైలాగులు, ఆయన సృష్టించిన విలక్షణమైన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూనే ఉన్నాయి. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన చూపులు కలిసిన శుభవేళ చిత్రంలోని కొన్ని హాస్య సన్నివేశాల సమాహారమే ఈ వీడియో. నరేష్, మోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నూతన్ ప్రసాద్, సుత్తి వీరభద్రరావు తదితరులు నటించిన ఈ సినిమాలోని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  జంధ్యాల గారి కామెడీలో అతిపెద్ద బలం ఆయన పాత్రల చిత్రణ. ఏదో ఒక విచిత్రమైన అలవాటు లేదా మేనరిజం ఉన్న పాత్రలను సృష్టించి, వాటి ద్వారా సహజమైన హాస్యాన్ని పండించడంలో ఆయన దిట్ట. ఈ వీడియోలో అలాంటి పాత్రల సందడి చూస్తుంటే పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు రావడం ఖాయం. ముఖ్యంగా భాష మీద పట్టుతో ఆయన రాసే డైలాగులు ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం. ఈ వీడియోలో ప్రముఖ నటులు బ్రహ్మానందం, సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు వంటి దిగ్గజాల నటన హైలైట్‌గా నిలిచింది. ఒకరు పద్యాలతో విసిగిస్తుంటే, మరొకరు అర్థం లేని లాజిక్కులతో తలపోటు తెప్పిస్తుంటారు. ఈ సన్నివేశాల్లోని టైమింగ్ మరియు ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే, ఎందుకు వీరిని హాస్య దిగ్గజాలు అంటారో మనకు అర్థమవుతుంది. ప్రతి సన్నివేశం ఒకదానికొకటి పోటీ పడేలా ఉండి ప్రేక్షకులను కట్టేస్తుంది. సాధారణంగా సినిమాల్లో హాస్యం అంటే వెకిలి చేష్టలు అనుకునే రోజుల్లో, స్వచ్ఛమైన తెలుగు పదాలతో, ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించిన ఘనత జంధ్యాల గారిది. ఈ వీడియోలో కూడా మనకు అలాంటి అద్భుతమైన 'జంధ్యాల మార్కు' పంచ్‌లు ఎన్నో కనిపిస్తాయి. సినిమా ఏదైనా, అందులో జంధ్యాల గారి టచ్ ఉంటే అది కచ్చితంగా నవ్వుల పువ్వులు పూయించాల్సిందే అని ఈ వీడియో మరోసారి నిరూపిస్తోంది. ప్రస్తుత కాలంలో ఎంతటి యాక్షన్ సినిమాలు వచ్చినా, ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ప్రేక్షకులు మళ్ళీ ఇలాంటి పాత కాలపు కామెడీ వైపే మొగ్గు చూపుతున్నారు. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్‌తో దూసుకుపోతోంది. "ఇలాంటి కామెడీ సీన్స్ మళ్ళీ చూడలేం, జంధ్యాల గారు గ్రేట్" అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
Tabu is officially teaming up with Tollywood star Nagarjuna for his highly anticipated 100th film, tentatively titled King 100. The duo, who previously shared the screen in the 1996 romantic hit Ninne Pelladatha, are coming together after a gap of 28 years. Tabu recently confirmed the news on social media, sharing a picture of a clapperboard from Annapurna Studios to mark the beginning of the shoot.   Directed by Ra. Karthik, the milestone project has been steadily building momentum. Nagarjuna earlier mentioned that Tabu was eager to be part of his 100th film as soon as she heard about it, emphasizing their long-standing professional bond. However, fans expecting a recreation of their classic 90s romance might be surprised, as Nagarjuna clarified they will not be romantically paired in this film.   He plays the title role, while Tabu takes on a crucial character, with two other actresses set to play the romantic leads. The shoot has officially commenced and progressing rapidly. Heavily rumored to be an action-driven narrative under the working title Asurudu, the film is expected to have a wide, multi-language release, promising a fresh cinematic outing for the veteran actors.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    ఏది ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నే..  వందేమాతరం(Vandemataram)గేయం మన విశ్వ జననిలో పుట్టి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సృజనాత్మకతని నింపుకున్న వారికి ఒక బంపర్ ఆఫర్ ని తీసుకొచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. వందేమాతరం ఫ్రేమ్స్ పేరిట మూడు విభాగాల్లో ఫిలిం మేకింగ్ కాంపిటేషన్ ని నిర్వహిస్తుంది. సదరు కాంపిటేషన్ లో రీల్స్, ఏఐ ఫిల్మ్స్,  షార్ట్ ఫిల్మ్స్ అనే విభాగాలు ఉన్నాయి. ప్రతి విభాగంలో టాప్ 3 విజేతలకి ప్రైజ్ మని ఇవ్వనుంది. రీల్స్ లో 1 .50 లక్షలు, ఏఐ ఫిల్మ్స్ కి ఐదు లక్షలు, షార్ట్ ఫిలింకి 15 లక్షలు ఇవ్వనుంది. ఆ విభాగంలో మీరు తెరకెక్కించిన వాటిని vandemataram150 .in లో ఎంట్రీ లని సబ్మిట్ చెయ్యాలి.    Also read: Chiranjeevi vs raviteja: ఫ్యాన్స్ అసంతృప్తి.. దయచేసి మా మాట పట్టించుకోండి  
    -అసంతృప్తిలో చిరు, రవితేజ ఫ్యాన్స్..  -టైటిల్స్ విషయంలో షేకవుతున్న  సోషల్ మీడియా..  -అసలు కథ తెలియాలంటే వాచ్ థిస్ స్టోరీ అభిమాని లేనిదే హీరోలు లేరులే అనేది నూటికి నూరుపాళ్లు నిజం. ఈ నిజాన్ని జస్టిఫై చెయ్యాలనే ఆలోచన ఎవరకి రాదు. ముక్కోటి దేవతలు సైతం అభిమాని లేనిదే హీరోలు లేరని ముక్త కంఠంతో ఆమోద ముద్ర వేసే పరిస్థితి. ఇప్పుడు ఆ అభిమానులు మెగాస్టార్  చిరంజీవి(Chiranjeevi),మాస్ మహారాజా రవితేజ(Raviteja)కి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఆ  విజ్ఞప్తి ఏంటో చూద్దాం. చిరు,బాబీ ల మూవీ మరికొద్ది రోజుల్లో షూటింగ్ కి వెళ్లనుంది. ఈ మూవీకి 'కాకాజీ' అనే టైటిల్‌ని ఫిక్స్ చేయబోతునట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో సైతం కన్ఫార్మ్ టైటిల్ అనే హోదాలో ఉంది. దీంతో మెజారిటీ మెగా ఫ్యాన్స్ నెట్టింట్లో తిష్ట వేసి 'చిరంజీవి వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి 'కాకాజీ' టైటిల్ ఏమాత్రం సెట్ అవ్వదు. పైగా చాలా సాఫ్ట్‌గా ఉండటంతో పాటు వినడానికి ఇబ్బందిగా ఉంది. గతంలో 'వాల్తేరు వీరయ్య' అని పవర్‌ఫుల్ పేరు పెట్టిన బాబీ, ఇప్పుడు ఇలాంటి టైటిల్ అనుకోవడం ఏంటి? దయచేసి టైటిల్ కాకాజీ కాదని నోట్ రిలీజ్ చేయాలనీ కోరుతున్నారు.  ఇక రవితేజ  'రాజా రాజా చోర' ఫేమ్ హసిత్ గోలి దర్శకత్వంలో ఒక మూవీ కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'అక్కాయిలు బాగున్నారా అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రవితేజ మార్కు మాస్ ఎలిమెంట్స్ ఆశించే అభిమానులకి  ఈ టైటిల్ అస్సలు మింగుడు పడటం లేదు. మాస్ మహారాజా అని పిలుచుకునే మా హీరోకి ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ టైటిల్ ఏంటి? మొన్న చేసిన  'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టైటిల్ కొంచం విబిన్నంగానే ఉంది. కానీ అక్కాయిలు బాగున్నారా అనేది మరీ పాతకాలపు సినిమా పేరులా ఉంది. పైగా ఇమేజ్ కి సూటవ్వదు.  దయచేసి ఆ టైటిల్ ని ఫిక్స్ చెయ్యకండి మహా ప్రభో అంటున్నారు. Also read: Nagarjuna: 20 ఏళ్ళ తర్వాత నాగ్ సరసన కన్ఫార్మ్  ఈ రెండు టైటిల్స్ కూడా ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుండి అధికారికంగా ప్రకటించబడలేదు. ఇవి కేవలం వర్కింగ్ టైటిల్స్ లేదా పరిశీలనలో ఉన్న పేర్లు మాత్రమే కావచ్చు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ చూస్తుంటే, మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకోక తప్పేలా లేదు. గతంలో కూడా ఫ్యాన్స్ ఒత్తిడి వల్ల చాలా సినిమాల టైటిల్స్ మారిన సందర్భాలు ఉన్నాయి.  
సిల్వర్ స్క్రీన్ పై యువసామ్రాట్ హోదాలో కింగ్ నాగార్జున(Nagarjuna),లేటెస్ట్ క్రేజీ తార హోదాలో టబు(Tabu)'నిన్నేపెళ్లాడుతా' మూవీలో డాన్స్ చేస్తుంటే అభిమానులు,ప్రేక్షకులే కాదు ప్రొజెక్టర్ రూమ్ లో ఉన్న స్టాఫ్ సైతం చిందులేసే వాళ్ళు . పైగా స్క్రీన్ మొత్తం తమ సొంత ఖర్చుతో లైటింగ్ చేయించిన వాళ్ళు సైతం ఉన్నారు. దీన్ని బట్టి ఆ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ కి ఉన్న కెపాసిటీని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ సెల్యులాయిడ్ వద్ద ఆ సందడి భాగ్యం దొరకనుంది. నాగార్జున 100వ చిత్రం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో టబు చేయడం కన్ఫార్మ్ అయ్యింది. ఈ విషయానికి ద్రువీకరిస్తు టబు తన ఇన్ స్టా అకౌంట్ లో ఒక సోఫాలో 100 చిత్రానికి సంబంధించిన క్లాప్ బోర్డు ఉంచింది. ఇప్పుడు ఈ న్యూస్ తో ఇరువురి కాంబో అభిమానుల్లో జోష్ వచ్చింది. పైగా నాగ్ ఇరవై ఐదేళ్ల యువకుడిగా కూడా కనిపించబోతున్నాడనే టాక్ వస్తుంది. ఈ నేపథ్యంలో టబు రోల్ పై మరింత ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు.  నాగ్,టబు నిన్నేపెళ్లాడుతాతో పాటు 'ఆవిడా మా ఆవిడే, సిసింద్రీ లో ఒక సాంగ్ లో చేసిన విషయం తెలిసిందే.   Also read: Divya Sathyaraj: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న కట్టప్ప కూతురు.. సపోర్ట్ చేయండి తమిళ దర్శకుడు రా కార్తీక్(Ra karthik)దర్శకత్వలో తెరకెక్కుతుండగా కింగ్ 100 , లాటరీ కింగ్ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా నాగ్ తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ పై నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ దగ్గరలోని కులుమనాలిలో షూటింగ్ ని జరుపుకుంటుంది.  
  -కట్టప్ప కూతురంటే ఏం అనుకుంటున్నారు -అల్లాటప్పా కాదు -నా స్టైల్ నే వేరప్పా  మరి కట్టప్ప కూతురు కాన్ఫిడెన్స్ ఏంటో చూద్దాం  తండ్రి పోలికలు కూతురుకి వస్తే అదృష్టం అంటారు. అలాంటిది మరి అచ్చు గుద్దినట్టు తండ్రి రూపాన్నే పుణికి పుచ్చుకుంటే.. అదృష్టం యొక్క స్థాయి ఇంకొంచం ఎక్కువ అని చెప్పవచ్చు. మరి అలాంటి ఒక అదృష్ట వంతురాలు మన కట్టప్ప డాటర్ దివ్య సత్యరాజ్(Divya Sathyaraj). వృత్తి రీత్యా న్యూట్రిషనిస్ట్‌. అంటే ఆరోగ్యం, పోషణ మరియు ఆహార శాస్త్రంకి సంబంధించిన డాక్టర్. ఇప్పుడు ఈ డాక్టర్ మాటల దెబ్బకి 'హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే అని కొంత మంది నెటిజన్స్ పాడుకునే పరిస్థితి. మరి ఈ డాక్టరమ్మ ఏం మాట్లాడిందో చూద్దాం.     రీసెంట్ గా ఒక ఛానల్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో దివ్య మాట్లాడుతు 'పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ అవసరమని నేను భావించడం లేదు. ఒక పురుషుడు, ఒక స్త్రీ పరస్పరం ఇష్టపడితే కలిసి జీవించవచ్చు. దానికి పెళ్లి అనే ముద్ర అవసరం లేదు. పెళ్లి చేసుకుంటేనే పిల్లల్ని కనాలనే నిబంధన కూడా అక్కర్లేదు. నా వరకైతే పెళ్లి చేసుకోకుండానే తల్లిని కావడానికి సిద్ధం. ఒక మహిళకి తన శరీరంపై తన జీవిత నిర్ణయాలపై పూర్తి హక్కు ఉంటుంది. తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం వంటి సంప్రదాయాల కంటే మనసుల కలయికే ముఖ్యమని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలు వైరల్ అవ్వడమే కాకుండా వైరల్ కి సరికొత్త పదాన్ని కనిపెట్టాల్సిన పరిస్థితి. ఈ డాక్టరమ్మ ఇంతటితోనే ఆగలేదు. మూఢనమ్మకాలు, జాతకాలపై తన ప్రతాపాన్ని చూపించింది. మా నాన్న నాస్థికుడు కావడంతో నా జాతకం రాయించలేదు. ఈ విషయంలో జాతకం లేని అమ్మాయిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానని కూడా వెల్లడి చేసింది. Also read:  Prabhas: ప్రభాస్ స్టైల్ లో మార్పులు  దీంతో కొంత మంది ఆమె అభిప్రాయాలని ఏకీభవిస్తుండగా, మెజారిటీ నెటిజన్స్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. డాక్టరమ్మ పెళ్లి అనే పవిత్రమైన బంధం ఉంది కాబట్టే ఇంకా ఈ విశ్వం తన మనుగడని చాలా డేర్ గా కొనసాగిస్తోంది. జాతకాలు అనేవి లేనప్పుడు రాత్రి, పగలు ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కట్టప్ప డాటర్ డాక్టరమ్మ తన మాటలతో మంత్ ఎండ్ అని డల్ గా ఉన్న వాళ్ళల్లో కూడా జోష్ ని తీసుకొచ్చింది.  
ఫ్యాన్స్ యందు ప్రభాస్(Prabhas)ఫ్యాన్స్ వేరయా అనే సామెత ఎందుకు పుట్టిందో మొన్న డార్లింగ్ రీ రిలీజ్ రోజు చూస్తే అర్ధమయ్యేది. ఫ్యాన్స్ ఎవరో, పబ్లిక్ ఎవరో తెలుసుకోలేని రీతిలో నానా హంగామా సృష్టించారు. ప్రభాస్ కి మాత్రమే దక్కే అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రభాస్ కూడా తన అభిమానులు గర్వపడేలా తన సినీ లైనప్ ఉండేలా చూసుకుంటున్నాడు. రీసెంట్ గా నెట్టింట్లో ప్రభాస్ కి సంబంధించిన ఫ్రెష్ న్యూస్ ఒకటి అభిమానులని, నెటిజన్స్ ని చక్కిలిగింతకి గురి చేస్తుంది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.    కల్కి  సీక్వెల్‌ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ), కమల్ హాసన్ (సుప్రీం యాస్కిన్) లపై కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించే పనిలో నాగ్ అశ్విన్(Nag Ashwin) బిజీగా ఉన్నారు. ప్రభాస్ కూడా మరికొన్ని రోజుల్లో జాయిన్ కానున్నాడు. ప్రభాస్ పార్ట్ 1 ని మించి  మరింత పవర్‌ఫుల్ అప్పీరెన్స్‌తో కనిపించనున్నాడు. ముఖ్యంగా 'కర్ణ' క్యారక్టర్ కి  సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్  హైలైట్‌గా నిలవనున్నాయి. దీనికోసం ప్రభాస్ ఫిజిక్ మరియు హెయిర్ స్టైల్‌లో కొన్ని మార్పులు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి భాగంలో కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే కనిపించిన కర్ణుడి పాత్ర, ఈసారి దాదాపు 30 నిమిషాల పైగా ఉంటుందని సమాచారం. Also read:  ఈ మూవీ వల్ల 20 జంటలు ఆత్మహత్య.. ఇందుకు బాధ్యులు ఎవరు సోషల్ మీడియాలో 'కల్కి 2' టైటిల్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రానికి 'కర్ణ 3102 BC' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ద్వాపర యుగ అంతానికి, కలియుగ ఆరంభానికి మధ్య ఉన్న కాలాన్ని ప్రతిబింబించేలా ఈ టైటిల్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  
గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, ఈసారి పక్కా ప్లానింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని హీరో నితిన్ (Nithin) భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపి ఒక సరికొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. తాజా సమాచారం ప్రకారం, నితిన్ తన తదుపరి చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ల ద్వయం నర్రి-సోము దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కొత్త దర్శకులు చెప్పిన లైన్ నితిన్‌కు బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్ (Rithika Nayak) హీరోయిన్‌గా నటించనుంది. నితిన్, రితికా జోడి వెండితెరపై ఫ్రెష్‌గా ఉంటుంది అనడంలో డౌట్ లేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ యొక్క రెగ్యులర్ షూటింగ్ మే 6 నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండటం విశేషం. ఆయన అందించే మెలోడీలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించేందుకు భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. నితిన్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'భీష్మ' వంటి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు అదే బ్యానర్‌లో వస్తున్న ఈ కొత్త సినిమా కూడా నితిన్ కెరీర్‌కు మంచి బూస్టింగ్ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కొత్త దర్శకుల ప్రతిభ, రితికా నాయక్ గ్లామర్, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ వెరసి ఈ సినిమాపై ఇప్పటి నుంచే పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి.  
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో ఒక భారీ సినిమా రూపుదిద్దుకోనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలని నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ బాలయ్యకు కథను వివరించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కొరటాల మార్క్ సామాజిక సందేశంతో పాటు, బాలకృష్ణ అభిమానులు కోరుకునే పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఉండబోతోంది.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర యూనిట్ ఈ ప్రాజెక్ట్‌ను మే నెల తొలివారంలో గ్రాండ్‌గా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో పాటు, ఈ కొరటాల ప్రాజెక్ట్‌ను కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రారంభోత్సవం రోజే అధికారికంగా వెల్లడించనున్నారు.  
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో 'ఫ్రోజెన్ షోల్డర్' (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో 'అడెసివ్ క్యాప్సులైటిస్' అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి, కనీసం చేయి పైకి ఎత్తడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడి దైనందిన జీవితం స్తంభించిపోతుంది. దీనిని కేవలం సాధారణ నొప్పి అని సరిపెట్టుకొని నిర్లక్ష్యం చేస్తే మున్ముందు కదలికలు మరింత కష్టతరంగా మారుతాయి. ఆధునిక వైద్యంలోని పెయిన్ కిల్లర్స్ కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుండగా, ఆయుర్వేదం ఈ వ్యాధిని మూలాల నుండి నయం చేసే అద్భుతమైన మార్గాలను చూపుతోంది. ఈ క్రమంలో ఫ్రోజెన్ షోల్డర్ లక్షణాలు, కారణాలు మరియు దీనిని శాశ్వతంగా నయం చేసే ఆయుర్వేద చికిత్సా పద్ధతుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రోజెన్ షోల్డర్ అంటే ఏమిటి? మన భుజంలోని కీలు చుట్టూ ఉండే కణజాలం (Capsule) వాపునకు గురై, మందంగా మారడం వల్ల భుజం కదలికలు తగ్గిపోతాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి మరియు బిగుతుగా ఉన్న భావన కలుగుతుంది. ప్రధాన కారణాలు: మధుమేహం (Diabetes): షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  గాయాలు: భుజానికి తగిలిన పాత గాయాలు లేదా శస్త్రచికిత్సల వల్ల.  థైరాయిడ్ సమస్యలు: హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా భుజం కండరాలు దెబ్బతినవచ్చు.  కదలిక లేకపోవడం: ఎక్కువ కాలం చేతికి పని చెప్పకపోవడం వల్ల కీళ్లు బిగుసుకుపోతాయి. ఆయుర్వేద చికిత్స - సహజ సిద్ధమైన పరిష్కారం: ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో 'వాత దోషం' పెరగడం వల్ల కీళ్లలో ద్రవాలు తగ్గి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఆయుర్వేదంలో ఫ్రోజెన్ షోల్డర్‌ను 'అవబాహుక' అని అంటారు. దీనికి అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన చికిత్సలు: అభ్యంగనం (Abhyangam): వేడి చేసిన ఆయుర్వేద తైలాలతో (మహానారాయణ తైలం వంటివి) మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది.   స్వేదనం (Swedanam): మూలికల ఆవిరి పట్టడం ద్వారా బిగుసుకుపోయిన కండరాలు వదులవుతాయి.   గ్రీవ వస్తి / పీచు: నొప్పి ఉన్న భాగంలో ప్రత్యేకమైన నూనెను నిల్వ ఉంచే ప్రక్రియ.   పౌష్టిక ఆహారం: వాతాన్ని తగ్గించే ఆహార పదార్థాలను తీసుకోవడం మరియు శొంఠి, గుగ్గులు వంటి మూలికలను వాడటం. ఫ్రోజెన్ షోల్డర్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీ మరియు ఆయుర్వేద చికిత్సలతో సులభంగా నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చేతి కదలికలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు ఆయుర్వేద జీవనశైలితో మీ భుజం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది,  ఇష్టంగా అనిపిస్తుంది,  తమ చుట్టూ ఒక కొత్త ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కాలంతో పాటు ప్రేమ కూడా మారుతూ ఉంటుంది.  ముఖ్యంగా పరీక్షలు పెడుతూ ఉంటుంది.  ఇద్దరు వ్యక్తులు సిన్సియర్ గా ఉన్నారా లేదా అనేది కూడా కాలమే డిసైడ్ చేస్తుంది. అయితే ప్రేమించిన చాలా మంది సంతోషం కంటే ఎక్కువ బాధపడిన సందర్బాలే ఉంటాయి.  పదే పదే మనోవేదనకు గురవుతూ ఉంటారు.  ప్రేమ అనేది కేవలం ఒక్కరితో అగేది కూడా కాదు.. చాలామంది ప్రేమలో ఫెయిల్యూర్ వచ్చాక లేదా బ్రేకప్ అయ్యాక.. మళ్లీ ఇంకొకరితో ప్రేమలో పడతారు. కానీ అక్కడ కూడా మళ్లీ బాధ.. పదే పదే మానసిక వేధన బహుమానంలా లభిస్తాయి.  అసలు ప్రేమించేవారికి పదే పదే మానసిక వేధన ఎందుకు ఎదురవుతోంది? ఇందులో తప్పు ఎవరిది? తెలుసుకుంటే.. బాధ కలిగినా అదే మార్గంలో ప్రయాణం.. చాలామంది ప్రేమలో ఉన్నప్పుడు అయినా జీవితంలో వేరే బంధంలో అయినా.. తమకు బాధ కలిగినా సరే.. అదే జోన్ లోనే ఉండటానికి ఇష్టపడతారు. చిన్నతనంలోని అనుభవాలు,  పెరిగిన వాతావరణం,  గతంలో ఏర్పడిన బందాల వల్ల కలిగిన బాధ.. బందంలో గౌరవం లేకపోవడం వంటివి మనిషిని మారేలా చేయాలి. కానీ చాలామంది కొత్తగా ఏర్పడే ప్రతి బందంలోనూ అవే తప్పులు పదే పదే చేస్తుంటారు. అందుకే పదే పదే మనోవేధన కూడా ఎదురవుతూ ఉంటుంది. ఎమోషన్స్ నుండి బయట పడలేకపోవడం.. చాలా మంది తమకు తెలియకుండానే తమలాంటి భాగస్వాములనే ఎంచుకుంటారు. ఇది వారి సబ్ కాన్షియస్ మైండ్  చేసే ఒక ప్రయోగం.  గతంలో విషపూరితమైన సంబంధాలను అనుభవించి ఉంటే  మనస్సు వాటిని సాధారణమైనవిగా అంగీకరిస్తుంది. అందుకే పదే పదే అలాంటి రిలేషన్స్ వైపుకే  ఆకర్షితులు అవుతుంటారు. తమను తాము తక్కువగా  అంచనా వేసుకోవడం.. ఒక వ్యక్తి తమను తాము తక్కువగా అంచనా వేసుకున్నప్పుడు, వారు తరచుగా సంబంధాలలో తాము తక్కువ అన్నట్టు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎదుటి మనిషి వ్యక్తిత్వం గురించి పెద్దగా పట్టించుకోకుండా  పదే పదే తప్పుడు భాగస్వామిని ఎంచుకుంటారు. మార్పు పట్ల భయం.. చాలా మంది తాము తప్పులు చేస్తున్నామని తెలిసినా, మారడం వల్ల ఎదురయ్యే నష్టాలు,  ప్రమాదాలను చూసుకుని మారడానికి భయపడతారు.  అందుకే వారు అవే పాత పద్ధతులలో చిక్కుకుపోయి ఉంటారు. గత గాయాల ప్రబావం.. గత సంబంధాల వల్ల కలిగిన గాయం, పూర్తిగా మానకపోవడం వంటివి చాలామంది పదే పదే అవే తప్పులు చేసేలా చేస్తాయి.  ఇలాంటి వారు  భావోద్వేగపరంగా కోలుకునేంత వరకు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. గందరగోళం.. చాలా మంది ప్రేమకు , భావోద్వేగ అనుబంధానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోరు. వారు తప్పుడు వ్యక్తికి దగ్గరై, దానినే ప్రేమగా పొరబడతారు, తద్వారా అవే తప్పులను రిపీట్ చేస్తూ ఉంటారు.   ప్రేమలో లేదా రిలేషన్ లో  అవే తప్పులను పదే పదే చేయడం అనేది విధి రాసే రాత కాదు.. అది మనిషి  అలవాట్లు,  ఆలోచనా విధానం ఇచ్చే  ఫలితం. ప్రతి వ్యక్తి తన  పద్ధతులను గుర్తించి, తమను తాము  సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే ఇలా పదే పదే బాధపడే బంధంలో చిక్కుకోవడాన్ని నివారించగలుగుతారు. సింపుల్ గా చెప్పాలంటే.. ప్రతి మనిషి ప్రేమలో లేదా రెలేషన్ లో.. పదే పదే మానసిక వేదనకు అనుభవించడానికి అక్షరాలా ఆ మనిషి చేతులారా చేసుకునే తప్పులు,  పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడం,  పాత ఆలోచనలు, సిద్దాంతాలలో  చిక్కుకుని ఉండటం వంటివి కారణం అవుతాయి.                                    *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి. అయితే కూలర్లు వాడేవారు దాని శుభ్రత గురించి మాత్రం అంత శ్రద్ద తీసుకోరు. దీని వల్ల నీరు మురికిగా మారి దోమలు పెరగడానికి ఆవాసంగా మారడమే కాకుండా.. . కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచకపోతే కూలింగ్ కూడా పెద్దగా రాదు.   అయితే కూలర్ లో నీటిని ప్రతిరోజూ శుభ్రం చేయడం అంత ఈజీ ఏమీ కాదు.. కొన్ని కంపెనీల కూలర్లలో నీటిని నింపడం సులువే.. కానీ వాటిలో నీటిని తొలగించడం, శుభ్రం చేయడం కాస్త శ్రమతో కూడుకున్నదే.. అయితే.. కూలర్లలో నీరు ప్రతిరోజూ శుభ్రం చేయకపోయినా కొన్నిరోజుల పాటు నీరు శుభ్రంగా ఉండాలన్నా, తాజాగా అనిపించాలన్నా కేవలం ఒకే ఒక్క చిట్కా అద్బుతంగా పనిచేస్తుంది. అదేంటో తెలుసుకుంటే.. పటిక.. కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచడానికి పటిక చాలా సులభమైన,  ఇంటి చిట్కా. దీనిని నీటిలో వేయడం  వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కూలర్ ట్యాంక్‌లో నీరు తరచుగా ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది, ఇది తొందరగా మురికిగా మారే అవకాశం ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ నీటిలో దోమలు  ఆవాసం ఏర్పాటు చేసుకుని  గుడ్లు పెడతాయి. అయితే కూలర్ ఎక్కువ కాలం పనిచేయాలంటే   దానిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. నీటిలో ఒక చిన్న పటిక ముక్కను వేయడం వల్ల నీటిని శుభ్రపరచవచ్చు.  పైగా దోమల సమస్య కూడా తగ్గుతుంది. కూలర్ ట్యాంక్ లో పటిక వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నీటి స్వచ్చత.. పటిక నీటిలోని దుమ్ము, ధూళి , చిన్న కణాలను బంధిస్తుంది. ఈ కణాలు బరువెక్కి అడుగుకు చేరుకుంటాయి, దీనివల్ల పైన ఉన్న నీరు స్వచ్ఛంగా ఉంటుంది. దోమలకు చెక్.. పటిక నీటిని శుద్ధి చేయడం వల్ల దోమల గుడ్లు, లార్వాలు సులభంగా వృద్ధి చెందలేవు. దీనివల్ల దోమల సమస్య గణనీయంగా తగ్గుతుంది. దుర్వాసన.. కూలర్ నీటి నుండి ఏదైనా వింత లేదా దుర్వాసన వస్తుంటే, దానిని చాలా వరకు తగ్గించడంలో పటిక సహాయపడుతుంది. బ్యాక్టీరియా..  పటికకు తేలికపాటి యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి, ఇవి నీటిలో ఉండే  హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. నీటి నాణ్యత.. పటిక నీటిని ఎక్కువ సేపు శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది, దీనివల్ల కూలర్ ప్యాడ్‌లు త్వరగా పాడవకుండా ఉంటాయి , గాలి చల్లగా ఉంటుంది. పటికను ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. పటికను ఎక్కువ పరిమాణంలో వాడకూడదు. ఒక చిన్న ముక్క సరిపోతుంది. ఎక్కువ పటిక కలపడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా కూలర్‌లోని నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి.                                 *రూపశ్రీ.
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో తీసుకునే ఆహారాలు కేవలం కడుపు నిండినట్టు లేదా రుచి కోసం తీసుకుంటూ ఉంటారు. కానీ శరీరంలో ఎంతో ముఖ్యమైన భాగమైన పేగు ఆరోగ్యం బాగుండటం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చాలామందికి తెలియదు. ఉదయాన్నే తీసుకునే ఆహారమే పేగు ఆరోగ్యాన్ని, రోజు మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  పేగు ఆరోగ్యాన్ని ఎంతో సేఫ్ గా ఉంచే కొన్ని బ్రేక్ ఫాస్ట్ లు ఉన్నాయి.  ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ ఆహారాలు తీసుకుంటే రోజు మొత్తం హాయిగా గడిచిపోతుంది. అవేంటో తెలుసుకుంటే.. ఓట్స్, చియా సీడ్స్ స్మూతీ.. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది,  మెరుగుపరుస్తుంది. ఓట్స్ ను  చియా విత్తనాలతో కలిపితే, ఫైబర్ కంటెంట్ రెట్టింపు అవుతుంది. చియా విత్తనాలు నీటిని గ్రహిస్తాయి,  జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి, ఇది ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. వెజిటబుల్ రాగి ఇడ్లీ లేదా దోశ.. రాగులు ఫైబర్,  కాల్షియం పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇతర ధాన్యాలతో పోలిస్తే, రాగులలో  ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. తురిమిన క్యారెట్లు, బీన్స్,  పాలకూరను రాగి పిండిలో కలపాలి. ఆవిరి మీద ఉడికించి ఇడ్లీగా తినవచ్చు.  లేదంటే దీంతో దోశ కూడా ట్రై చేయవచ్చు. . ఇది తేలికగా ఉంటూనే  జీర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉంటుంది. మొలకెత్తిన ధాన్యాలు.. పెసలు, శనగలు లేదా బొబ్బర్లు వంటివి  మొలకెత్తడం వల్ల వాటి ఫైబర్,  ఎంజైమ్ కంటెంట్ పెరుగుతుంది. మొలకెత్తిన ధాన్యాలు ప్రీబయోటిక్స్‌గా పనిచేస్తాయి. మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మొలకెత్తిన పెసలను దోసకాయ, టమోటా, నిమ్మరసం,  కొద్దిగా ఉప్పుతో కలపాలి. ఇది ఫైబర్‌ను అందించడమే కాకుండా ప్రోటీన్ కూడా పుష్కలంగా అందిస్తుంది. మల్టీగ్రెయిన్ వెజిటబుల్ ఉప్మా.. సెమోలినాకు బదులుగా మల్టీగ్రెయిన్ గంజి లేదా ఓట్ ఉప్మా తయారు చేయడం వల్ల ఫైబర్  మరింత మెరుగవుతుంది. బఠానీలు, కాలీఫ్లవర్,  బీన్స్ వంటి కూరగాయలను జోడించడం వల్ల ఫైబర్ కంటెంట్ మరింత పెరుగుతుంది. తక్కువ నూనె,  ఆకుపచ్చ కూరగాయలను పుష్కలంగా జోడిండం వల్ల దీనిలో హెల్తీ బెనిఫిట్స్ మెరుగవుతాయి. జీర్ణక్రియకు ప్రయోజనకరంగా భావించే కరివేపాకును జోడిస్తే మరీ మంచిది. జొన్న రోటీ, పెరుగు.. చిరు ధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చిరు ధాన్యాలు,  జొన్నలు గ్లూటెన్ రహితంగా ఉండటమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. పెరుగు అనేది పేగులో మంచి బ్యాక్టీరియాను పెంచే ప్రోబయోటిక్. చిరు ధాన్యాల రోటీతో ఒక గిన్నెడు తాజా పెరుగు కలిపి తింటే చాలా మంచిది. ఈ కాంబో ఫైబర్,  ప్రోబయోటిక్స్ రెండూ కలిగి ఉంటుంది.                            *రూపశ్రీ.  
  కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి.  చాలా పరిశుభ్రతలో బాగంగా మౌత్ వాష్ లు వాడుతుంటారు.  కొందరు పళ్లు తోమే పని లేకుండా మౌత్ వాష్ వాడితే.. మరికొందరు పళ్లు తోమిన తర్వాత కూడా ఇంకా పళ్లు ఎక్కువగా శుభ్రం అవుతాయని అతి శుభ్రతతో మౌత్ వాష్ కూడా వాడతారు. అయితే.. మౌత్ వాష్ వాడే వారికి డాక్టర్లు ఓ చల్లని చావు కబురు చెబుతున్నారు.  మౌత్ వాష్ వాడితే రక్తపోటు సమస్య వస్తుందని అంటున్నారు.  దీని గురించి వైద్యులు చెప్పిన విషయాలు వివరంగా తెలుసుకుంటే.. మౌత్ వాష్.. నోటి ఆరోగ్యం.. నోటిలోని మంచి బ్యాక్టీరియా మానవ శరీరానికి చాలా అవసరం. ఈ బ్యాక్టీరియా ఆహారంలోని నైట్రేట్‌లను నైట్రైట్‌లుగా మార్చడానికి సహాయపడతాయి, ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ అనేది రక్తనాళాలను సడలించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి , రక్తపోటును నియంత్రించడానికి సహాయపడే ఒక ముఖ్యమైన అంశం. మౌత్ వాష్ వల్ల కలిగే నష్టం.. బలమైన యాంటీసెప్టిక్ మౌత్‌వాష్‌లు నోటిలోని  మంచి బ్యాక్టీరియాను కూడా చంపగలవని నిపుణులు అంటున్నారు. ఇది నైట్రేట్, నైట్రైట్‌గా మారే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది , శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను తగ్గించగలదు. ఇది నేరుగా రక్తనాళాల పనితీరుపై ప్రభావం చూపుతుంది, తద్వారా రక్తపోటును ప్రభావితం చేసే అవకాశం ఉంది. యాంటీ బాక్టీరియల్ మౌత్‌వాష్ వాడకం వల్ల నోటిలోని అవసరమైన బ్యాక్టీరియా 90 శాతం వరకు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలలో తేలిందని వైద్యులు కూడా చెబుతున్నారు. కేవలం కొన్ని రోజుల వాడకం కూడా లాలాజలంలో నైట్రేట్ స్థాయిలను తగ్గించగలదని, దీనివల్ల సిస్టోలిక్ రక్తపోటులో స్వల్ప పెరుగుదల ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మౌత్ వాష్ ఎక్కువ కాలం ఉపయోగిస్తే.. రోజు ఎక్కువగా మౌత్‌వాష్ ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మంచి బ్యాక్టీరియాను తగ్గించడం, నైట్రిక్ ఆక్సైడ్‌ను తగ్గించడం, , రక్తనాళాల సరైన పనితీరును దెబ్బతీసే ప్రక్రియ వలనే ఇది జరుగుతుందని అంటున్నారు. దీని ప్రభావాలు అందరిపై తీవ్రంగా ఉండనప్పటికీ, రెగ్యులర్ గా అందులోనూ ఎక్కువగా వాడటం వల్ల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చిగుళ్ల వ్యాధి, దంత చికిత్స తర్వాత, లేదా దంతాలపై అధికంగా పాచి పేరుకుపోయిన వంటి కొన్ని పరిస్థితులలో మౌత్‌వాష్ వాడకం  అవసరం అవుతుంది. అందువల్ల, మౌత్‌వాష్‌ను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని, దానిని రోజువారీ అలవాటుగా చేసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. నోటి శుభ్రతకు బ్రష్ చేయడమే మంచిదని, దీనికే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. కాబట్టి మౌత్ వాష్ ఎక్కువగా వాడకూడదు.                                      *రూపశ్రీ.
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం,  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా కీలకం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో జింక్ కూడా ఒకటి. అయితే చాలామందికి జింక్ లోపం గురించి పెద్దగా అవగాహన ఉండదు.  జింక్ లోపం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది నిజమేనా? జింక్ లోపం గురించి.  జింక్ లోపం వల్ల వచ్చే సమస్యల గురించి వైద్యులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. శరీరానికి జింక్ ఎందుకు అవసరం..  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి , చర్మానికి జింక్ చాలా అవసరం. జింక్ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి , కణజాలాలను బాగు చేయడానికి సహాయపడుతుంది. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చని, చర్మ, కడుపు సమస్యలను కూడా కలిగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. జింక్ లోపం వల్ల వచ్చే సమస్యలు.. జింక్ లోపం శరీరంలో అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. జింక్ లోపం పిల్లలలో పెరుగుదలను నిరోధించగలదు , మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇన్ఫెక్షన్లు.. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. జింక్ లోపం ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల ఫంగస్ , చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు తలెత్తవచ్చు. విరేచనాలు.. వైద్యుల ప్రకారం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా అవసరం. జింక్ లోపం జీర్ణవ్యవస్థపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో జింక్ లోపించినప్పుడు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. గాయాలు.. జింక్ లోపం చర్మం, కడుపునే కాకుండా గాయాలను కూడా ప్రభావితం చేస్తుంది. జింక్ లోపం ఉన్నవారిలో గాయాలు నెమ్మదిగా నయమవుతాయి. జింక్ లోపిస్తే కనిపించే లక్షణాలు.. జింక్ లోపం వేగంగా బరువు తగ్గడం, నీరసం , జుట్టు రాలడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. జింక్ పుష్కలంగా లభించే ఆహారాలు.. ఆహారంలో జింక్‌ను చేర్చుకోవడానికి,  గుమ్మడి గింజలు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు గింజలు , రాగులను చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలలో జింక్ ఉంటుంది. అదనంగా,  ఆవాల ఆకుకూర, మాంసం, పప్పుధాన్యాలు, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, పెరుగు, వేరుశెనగలు , గుడ్లను కూడా తినవచ్చు. ఈ ఆహారాలలో కూడా జింక్ సమృద్దిగా ఉంటుంది.                                 *రూపశ్రీ.