LATEST NEWS
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సందిగ్ధతలు తొలగిపోయాయి. టీవీకే విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైంది.  ఇటీవలి  అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన  తమిళగ వెట్రి కళగం  (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్   అధికార పీఠాన్ని దక్కించుకోనున్నారు. తాజా సమాచారం ప్రకారం..  విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.   తమిళగ వెట్రి కళగం ఎన్నికల బరిలో దిగి 108 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం కొన్ని స్థానాల దూరంలో విజయ్ ఆగిపోయారు. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థులతో పాటు చిన్న పార్టీల మద్దతు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వామపక్షాలు, విడుతలై చిరుత్తైగళ్ కచ్చి (వీసీకే) పార్టీలు విజయ్ కు మద్దతు ప్రకటించాయి. ఈ మూడు పార్టీల మద్దతు లేఖలతో విజయ్ నేరుగా గవర్నర్ రాజేంద్ర అక్లేకర్ తో భేటీ అయ్యారు.  భేటీకి ముందే విజయ్   గవర్నర్ కార్యాలయానికి మద్దతు లేఖలు అందజేశారు.  తన వద్ద తగినంత మెజారిటీ ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని విజయ్ ఆ మద్దతు లేఖలతో పాటు గవర్నర్ కు రాసిన మరో లేఖలో కోరారు. దీంతో గవర్నర్ విజయ్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. గవర్నర్ తో భేటీలో విజయ్ తన బలాన్ని నిరూపించుకునేందుకు మూడు పార్టీల మద్దతు లేఖలను గవర్నర్ కు అందజేశారు.  
ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గా రాజేంద్ర విశ్వ‌నాథ్ అర్లేక‌ర్ ఉన్నారు. ఈయ‌న గోవాలోని ప‌నాజీలో  1954 ఏప్రిల్ 23,న జన్మించారు. భారతీయ జనతా పార్టీలో  సుదీర్ఘ కాలం పనిచేశారు. గోవా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. గోవా శాసనసభ స్పీకర్‌గా.. 2012-2015 మ‌ధ్య కాలంలో ప‌ని చేశారు. గోవా ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు. భారతదేశంలోనే అసెంబ్లీని మొట్టమొదటిసారిగా పేపర్ లెస్ చేసిన ఘనత ఈయనకు దక్కుతుంది. ముందుగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, ఆ తర్వాత బీహార్ గవర్నర్‌గానూ పనిచేశారు.  జనవరి 2025లో కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2026 మార్చి 12 నుంచి ఆయన తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత వివాదం విష‌యానికి వ‌స్తే.. తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.  అయితే  ప్రభుత్వ‌ ఏర్పాటుకు కావాల్సిన 118 మ్యాజిక్ మార్కుకు ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఆ మద్దతును  స్పష్టంగా చూపించాలని గవర్నర్  చెబుతున్నారు. బయటి నుంచి మద్దతు ఇచ్చే పార్టీలైన కాంగ్రెస్ వంటి వాటి నుంచి రాతపూర్వక లేఖలు ఉంటేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తానని ఆయన స్పష్టం చేయడంతో తమిళనాట రాజకీయ హీటెక్కింది.  గోవా నుంచి వచ్చి తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేస్తుండటం వ‌ల్ల‌, గతంలో ఆయనకున్న బీజేపీ నేపథ్యం వల్ల.. స్థానిక నాయకులు, ఇత‌ర‌ సినీ ప్రముఖులు ఆయన తీరును విమర్శిస్తున్నారు. రజనీ, కమల్, ప్రకాష్ రాజ్ ఎందుకు గుర్రుగా ఉన్నారు? అని చూస్తే వీరందరూ గవర్నర్ తీరును విమర్శించడానికి ప్రధాన కారణం రాజ్యాంగ సంక్షోభం. కేంద్రం పంపిన గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజల తీర్పును గౌరవించడం లేద‌ని బాహాటంగానే విమర్శిస్తున్నారు ప్ర‌కాష్ రాజ్. రజనీ, కమల్.. నేరుగా గవర్నర్‌పై యుద్ధం ప్రకటించకపోయినా.. తమిళనాడులో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గవర్నర్ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతోందని వీరి ఆందోళన. గవర్నర్ అర్లేకర్  తీసుకునే నిర్ణయాలు కేంద్రంలోని బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనీ..  అందుకే ఆయన మెజారిటీ విషయంలో అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని స్థానిక పార్టీలు ఆరోపిస్తున్నాయి. విజయ్ కి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా లేదా అనేదే ఇప్పుడు కీలకం. ఒకవేళ ఆయన మద్దతు లేఖలు సమర్పిస్తే, గవర్నర్ తప్పనిసరిగా ప్రమాణ స్వీకారానికి అనుమతించాల్సి ఉంటుంది. ఈ లోపు జరుగుతున్న ఈ తాత్కాలిక అడ్డంకులే ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశమయ్యాయి.
పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జిగా వర్మ తొలగింపు నిజంగా ఒక అనూహ్య పరిణామమే. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను పీఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవి నుండి తొలగిస్తూ తెలుగుదేశం హైకమాండ్ తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాలలో పెను సంచలనం రేపింది.  పిఠాపురం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో..  ఇక్కడ జరిగే ప్రతి చిన్న మార్పు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతుంది ఈ నేపథ్యంలోనే వర్మను బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ   తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి..  క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం  మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.   గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ సాధించడంలో వర్మదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. పవన్ కల్యాణ్ కోసం తన సీటును వర్మ త్యాగం చేశారు.  వ్యక్తిగత ఆకాంక్షలను పక్కన పెట్టి మరీ  అధిష్టానం ఆదేశాల మేరకు జనసేన అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. అటువంటి నాయకుడిని ఇప్పుడు ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం స్థానిక టీడీపీ శ్రేణులలో కూడా అసంతృప్తికి కారణమైంది.  గత కొద్దిరోజులుగా పిఠాపురంలో జనసేన,  టీడీపీ స్థానిక నాయకుల మధ్య ప్రోటోకాల్ విషయంలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు లేకపోవడంపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నాయకులతో   వాగ్వాదాలకు దిగారు. ఇప్పుడు అవే తెలుగుదేశం అధిష్ఠానం వర్మపై వేటు వేయడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అదే విషయంలో వర్మ తనను ఇన్ చార్జిగా తొలగించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ  కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ బలోపేతానికి తన రక్తాన్ని ధారపోశాననీ..  ఏనాడు క్రమశిక్షణ తప్పలేదని చెబుతూ.. అర్ధంతరంగా మీడియా సమావేశాన్ని ముగించి కన్నీటిని ఆపుకుంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి.  తెలుగుదేశం శ్రేణుల్లో వర్మ పట్ల సానుభూతి వ్యక్తం అవుతోంది. అయితే వర్మను  నియోజకవర్గ బాధ్యతల నుంచే తప్పించి ముందు ముందు కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చే ఉద్దేశంతో తెలుగుదేశం హైకమాండ్ ఉందని పార్టీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.   రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలో.. ఆ కూటమిలోని ఇద్దరు ప్రధాన భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య కుదర్చడానికే అధిష్టానం ఈ  నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  రాబోయే రోజుల్లో పిఠాపురం టీడీపీలో ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. వర్మ వంటి బలమైన నేతను పక్కన పెట్టడం వల్ల కేడర్‌లో అసమ్మతి రాకుండా చూసుకోవడం ఇప్పుడు టీడీపీ అధిష్టానం ముందు ఉన్న టాస్క్ గా చెబుతున్నారు.  
వ‌ర్మ‌ను పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం ఇన్ ఛార్జ్ అనే ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం వెన‌క గ‌ల కార‌ణం.. ఆయ‌న చేష్ట‌లు, వాద‌న‌లు, విప‌రీత పోక‌డ‌లు ఎక్క‌డ కూట‌మి ధ‌ర్మానికి విఘాతం క‌లిగిస్తాయో అన్న‌ది మెయిన్ రీజ‌న్ గా తెలుస్తోంది. అంటే చంద్రబాబుకు కూటమి  ఎంత  క‌ల‌సికట్టుగా  ఉంటే  మ‌నం అంత బ‌లంగా  ఉండ‌గ‌లం అన్న‌ది    బాగా తెలుస‌న్న‌మాట‌. ఇది వ‌ర‌కు చంద్ర‌బాబు ఇలా ఉండేవారు కాదు. ఇలాంటి సున్నితాంశాల‌కు పెద్ద‌గా  విలువ‌నిచ్చేవారు కాదు.  ఈ విష‌యంపై సాధార‌ణ  కార్య‌క‌ర్త‌ల‌కు కూడా ఒక ఐడియా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వారు అనుభ‌విస్తున్న‌ది అదే కాబ‌ట్టి.. ఇందులో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు లేవు కూడా.  బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా  భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని  కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే  క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న  అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం. ప్ర‌స్తుతం వైసీపీ నేత‌ల‌కు వ‌ర్మ రూపంలో మ‌రో ల‌డ్డూ దొరికింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌ర్మ‌గానీ పిఠాపురంలో ఇండిఎండెంట్ గా నిల‌బ‌డితే  చాలు.. ప‌వ‌న్  క‌ళ్యాణ్ కి డిపాజిట్లు రావ‌ని రెచ్చ‌గొట్టుడు కామెంట్లు చేస్తున్నారు. దానికి తోడు ప‌క్క రాష్ట్రం  విజ‌య్ వ్య‌వ‌హారం ఉండ‌నే ఉంది.  విజ‌య్ ఒంట‌రిగా  నిల‌బ‌డి  గెలిచాడ‌ని..  అదే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అది సాధ్యం కావ‌డం లేద‌ని కావాల‌నే  ఊద‌ర‌గొట్టేస్తున్నారు మ‌రోప‌క్క‌.   ఇదే టైంలో వ‌ర్మ‌ను పిఠాపురం  ఇన్ ఛార్జి బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించ‌డంతో.. ఇపుడు ఫ్యాను గాలి ఇటు మ‌ళ్లింది. ఇక దంచి కొట్టుడు మొద‌లు పెట్టారు. ఇక వైసీపీ  ఇన్ ఫ్లూయెన్ష‌ర్ల‌లో కొంద‌రు అనే మాట ఏంటంటే కూట‌మి  నుంచి ప‌వ‌న్ ని అయినా వెళ్ల‌గొట్టండి  లేదా కొత్త కాపునాయ‌క‌త్వ‌మైనా  వైసీపీలోకి వ‌చ్చేలా చేయండ‌ని తెగ  స‌ల‌హాలు ఇచ్చేస్తున్నారు. అదృష్ట‌మో, దుర‌దృష్ట‌మో.. రంగా త‌ర్వాత అంత‌టి కాపు ట‌వ‌రింగ్  ప‌ర్స‌నాల్టీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గానే చెప్పాలి. ఆయ‌న కాకుండా క‌నుచూపు మేర‌లో కూడా ఎవ్వ‌రూ అలాంటి వారు లేనే లేరు. అందుకే విధిలేని ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ త‌మ పార్టీలోని కాపు నాయ‌కుడు అంబ‌టి  రాంబాబును హైలైట్ చేస్తున్నారు. కాపు టైగ‌ర్ అనే బిరుదులివ్వ‌డంతో పాటు కాపు నాయ‌క‌త్వం మొత్తాన్ని ఏకం  చేసి.. వారిలో ఒక చైత‌న్యం తీసుకొచ్చేందుకు తీవ్ర య‌త్నాలు సాగిస్తున్నారు.  దుర‌దృష్ట‌మేంటంటే, కాపు టైగ‌ర్ బిరుదాంకితుడైన  అంబ‌టికి అస‌లు కాపు కులమంటేనే గిట్ట‌దు..  క‌మ్మ‌ల‌ను ఇర‌వై నాలుగు గంట‌లు ఆడిపోసుకునే ఆయ‌న త‌న ముగ్గురు అల్లుళ్ల‌నూ క‌మ్మ‌ల‌నే చేసుకోవ‌డం ఇందులో కొస‌మెరుపు. ఎటు నుంచి ఎటు చూసినా.. జ‌గ‌న్ కి  కూట‌మిని చీల్చ‌డం ఎలాగో పాలు పోక‌, త‌న  పార్టీలోనే  కాపు టైగ‌ర్ ని ఎలా త‌యారు చేయాలో తెలీక..  నానా తంటాలు ప‌డుతున్నారు. స‌రే ఇదంతా ఇలా ఉంటే  కూట‌మి నానాటికీ   అల‌ర్ట్ అయ్యి.. త‌మ పొత్తుకు ఎవ‌రు విఘాతం క‌లిగిస్తున్నారో వారిని ప‌క్కాగా గుర్తించి ఏరిపారేస్తుండ‌టంతో.. దిక్కుతోచ‌ని  ప‌రిస్థితిలో ప‌డుతోంది పాపం వైసీపీ  అధిష్టానం. ఏ  మాట‌కామాట  ఈ  క‌ష్టం  ప‌గ‌వాడికి కూడా రాకూడ‌దు. అంత‌గా విల‌విల‌లాడిపోతోంది. వైసీపీ యంత్రాంగ‌మంతా.  
వైసీపీలో ప్రస్తుతం ‘మావిగన్’ చిచ్చు రేపుతోంది. అమరావతికి బదులుగా రాష్ట్ర రాజధానిగా మావిగన్ అంటూ జగన్ చేసిన ప్రకటన వైసీపీలో నిట్టనిలువుగా చీలిక వచ్చేలా కనిపిస్తోందన్న అభిప్రాయం పరిశీలకులనుంచి వ్యక్తం అవుతోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని ప్రాంతంగా ప్రకటించాలంటూ జగన్ చేసిన ప్రతిపాదన ప్రకంపనలు పార్టీలో ఇంకా కొనసాగుతున్నాయి. అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  గతంలో కూడా జగన్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు పార్టీకి నష్టాన్ని తెచ్చాయని.. ఇప్పుడు మావిగన్ అంతకు మించి నష్టం చేరుస్తుందని అంతర్గత సంభాషణల్లో గట్టిగా  చెబుతున్నారు.   ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ వైసీపీ నేతలు, మాజీ మంత్రులు ధర్మాన సోదరులు మావిగన్ తో విభేదిస్తున్నారు. జగన్ ప్రతిపాదనపై వారిరువురూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమచారం. జగన్ ఎవరితో చర్చించి మావిగన్ అన్నారని వారు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు.  ధర్మాన ప్రసాదరావు అయితే మావిగన్ విషయంలో తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. ఇటీవల ఆయన పాల్గొన్న ఒక కార్యక్రమంలో అయితే.. మావిగన్ పై తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన ఓ సీనియర్ వైసీపీ నేత కూడా మావిగన్ ప్రకటనను తప్పుపట్టారు. పార్టీలో సీనియర్లతో కనీసం చర్చించకుండా జగన్ చేసిన ప్రకటేన సరికాదన్నారు.  సీనియర్లతో చర్చించాలన్న ఆలోచన కూడా జగన్ చేయకపోతే.. ఇక తాము పార్టీలో ఉండి ప్రయోజనమేంటన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
ALSO ON TELUGUONE N E W S
తారాగణం: లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, నరేష్, సప్తగిరి, VTV గణేష్, మొట్ట రాజేంద్రన్, జాఫర్ సాదిక్ తదితరులు  సంగీతం: మిక్కీ జె. మేయర్ డీఓపీ: బినేంద్ర మీనన్ ఎడిటింగ్: సతీష్ సూర్య మాటలు: ఉదయ్ పొట్టిపాడు దర్శకత్వం: సత్య తాతినేని నిర్మాతలు: నాగమోహన్ బాబు. ఎమ్, రాజేష్ టి సమర్పణ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లు: దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ విడుదల తేదీ: మే 8, 2026 పెళ్ళి తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన మొదటి మూవీ 'సతీ లీలావతి'. మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా, 'భీమిలి కబడ్డీ జట్టు' ఫేమ్ దర్శకుడు తాతినేని సత్య తెరకెక్కించిన ఈ సినిమా నేడు (మే 8) విడుదలైంది. మరి ఈ భార్యాభర్తల ఫన్నీ పోరాటం ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించింది? లావణ్య సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకుందాం. (Sathi Leelavathi Movie Review) కథ: లీలావతి (లావణ్య త్రిపాఠి) ఒక సినిమా డైరెక్టర్. లీలావతి తన కెరీర్‌తో బిజీగా ఉంటూ తనకు సమయం కేటాయించడం లేదని, విడాకులు కావాలని ఆమె భర్త రామ్ (దేవ్ మోహన్) కోరుతాడు. అంతేకాకుండా తాను నికోలా (మడోన్నా సెబాస్టియన్) అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని షాక్ ఇస్తాడు. భర్తను వదులుకోవడం ఇష్టం లేని లీలావతి, అతన్ని ఇంట్లోనే కట్టేసి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? రామ్ మనసు మారిందా? లీలావతి-రామ్ ఒక్కటయ్యారా లేదా? అనేదే మిగతా కథ. విశ్లేషణ: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన తొలి సినిమా కావడం, పైగా ఇది భార్యాభర్తల మధ్య సాగే ఫ్యామిలీ డ్రామా అని ప్రచారం చేయడంతో ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి నెలకొంది. అయితే, సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో తడబడింది. సినిమా ప్రారంభంలో భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల అంశంతో కథ వేగంగానే మొదలవుతుంది. తనను కాదని మరో అమ్మాయి దగ్గరకు వెళ్తున్న భర్తను లీలావతి కొట్టి కట్టేయడం అనే పాయింట్ వినడానికి బాగున్నా, స్క్రీన్ మీద అది పండలేదు. సాగదీత సన్నివేశాలతో కథ నెమ్మదిగా నడుస్తుంది, లీలా తండ్రి (నరేష్), నిర్మాత (మొట్ట రాజేంద్రన్) ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇంటికి రావడం, కట్టేసిన భర్తను వారు చూస్తారేమో అని లీలావతి పడే టెన్షన్ ద్వారా దర్శకుడు కొంత సస్పెన్స్‌ని మెయింటైన్ చేయగలిగారు కానీ, అది కథను ముందుకు నడిపించలేకపోయింది. ఇక లీలా-రామ్ లవ్ స్టోరీకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్లు మరీ సిల్లీగా ఉన్నాయి. సెకండ్ హాఫ్‌లో సినిమా ట్రాక్ తప్పుతుంది. లీల కిడ్నాప్ డ్రామా, దొంగ ఎంట్రీ వంటి ఎపిసోడ్లతో కథను సాగదీశారు. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఎమోషనల్ బాండింగ్ కంటే, అనవసరమైన సన్నివేశాలే ఎక్కువయ్యాయి. అసలు కథ ఎటు వెళ్తుందో అర్థం కాని స్థితిలో చివర్లో ఇచ్చే రెండు ట్విస్టులు కాస్త ఊరటనిస్తాయి తప్ప, సినిమాను నిలబెట్టలేవు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: లీలావతిగా లావణ్య త్రిపాఠి నటన ఆకట్టుకుంది. డైరెక్టర్‌గా, భర్తను ప్రేమించే భార్యగా రెండు షేడ్స్‌లోనూ చక్కగా నటించారు. దేవ్ మోహన్ పాత్రలో కానీ, నటనలో కానీ పెద్దగా మెరుపులు లేవు. ఈ సినిమాలో సప్తగిరి, విటివి గణేష్, మొట్ట రాజేంద్రన్ వంటి భారీ కామెడీ తారాగణం ఉన్నప్పటికీ, సరైన రైటింగ్ లేకపోవడంతో వారు నవ్వించలేకపోయారు. ఏదో ఒకటి రెండు చోట్ల తప్ప, మిగతా సీన్స్ కామెడీ బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. 'భీమిలి కబడ్డీ జట్టు' లాంటి సినిమా చేసిన దర్శకుడు తాతినేని సత్య నుంచి ఇలాంటి సినిమా ఊహించలేం. రచన పూర్తిగా తేలిపోయింది. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. మిక్కీ జె. మేయర్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్: లావణ్య త్రిపాఠి నటన కొన్ని కామెడీ సీన్స్ క్లైమాక్స్‌ ట్విస్టులు మైనస్ పాయింట్స్: కథాకథనాలు మిస్సైన ఎమోషన్ ఫైనల్ గా.. కథాకథనాల్లో బలం లేకపోవడం వల్ల సినిమా తేలిపోయింది. లావణ్య తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ, సాగదీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. రేటింగ్: 2/5 Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.  
1. పెద్ది రికార్డుల వేట మొదలు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న 'పెద్ది' మూవీ ఓవర్సీస్ లో సంచలనం సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన 4 గంటల్లోనే.. ఒక లక్ష డాలర్ల మార్కును దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, జూన్ 3న ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. 2. పవర్ ఫుల్ మ్యూజిక్ తో 'డ్రాగన్' గ్లింప్స్‌ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్'. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇందుకోసం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గత మూడు రోజులుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 'డ్రాగన్' గ్లింప్స్‌కు ఆయన 'పవర్ ఫుల్ అండ్ యూనిక్' మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. 3. 'రేజర్' మూవీ రివ్యూ రవిబాబు స్వీయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'రేజర్' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక పవర్ ఫుల్ పొలిటీషియన్ అండ్ క్రిమినల్ గ్యాంగ్ బారి నుండి.. ఒక చిన్న పాప ప్రాణాలను రక్షించే వ్యక్తిగా రవిబాబు ఈ సినిమాలో కనిపించారు. సినిమా అంతా రవిబాబు మార్క్ వైల్డ్ యాక్షన్, హింసతో నిండిపోయింది. కథలో వైవిధ్యం లేకపోవడం, ఎమోషన్స్ పండకపోవడం సినిమాకు మైనస్ గా మారాయి.  4. 'సతీ లీలావతి' మూవీ రివ్యూ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తాతినేని సత్య దర్శకత్వంలో వచ్చిన 'సతీ లీలావతి' ఒక యావరేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మిగిలిపోయింది. విడాకులు కోరిన భర్తను భార్య బంధించి మనసు మార్చే ప్రయత్నం చేయడం అనే పాయింట్ ఆసక్తికరంగా ఉన్నా.. కథనంలో బలం లేకపోవడం వల్ల సినిమా సాగదీతగా అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బలమైన ఎమోషన్ మిస్ అయ్యింది. సిల్లీ డైలాగ్స్, లాజిక్ లేని సీన్స్ బోర్ కొట్టిస్తాయి. 5. 'గోదారి గట్టుపైన' మూవీ రివ్యూ సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'గోదారి గట్టుపైన' నేడు విడుదలైంది. ఒక ఆటో డ్రైవర్, ఇంజనీరింగ్ స్టూడెంట్ మధ్య సాగే ప్రేమకథకు.. గోదావరి నేపథ్యం, నాగవంశీ అందించిన సంగీతం ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే, కథలో కొత్తదనం లేకపోవడం, సాగదీత సన్నివేశాలు సినిమాకు మైనస్ అయ్యాయి. 6. 'పెద్ది' సెట్స్‌లో మెగాస్టార్ సందడి రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్ సెట్స్‌ను మెగాస్టార్ చిరంజీవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దర్శకులు బుచ్చిబాబు, సుకుమార్‌లతో కలిసి సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "ది బాస్, మై గురు 'పెద్ది' సెట్స్‌లో అడుగుపెట్టడం నా జీవితంలో మధుర జ్ఞాపకం" అని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 7. నెవర్ బిఫోర్ లుక్ లో తారక్ జూనియర్ ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సంగీత దర్శకుడు థమన్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఎన్టీఆర్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో.. గుబురు గడ్డం, నోటిలో టూత్ పిక్ తో ఎన్టీఆర్ చూపించిన యాటిట్యూడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ లుక్ తో ఒక్క సినిమా పడితే బాక్సాఫీస్ రికార్డులు గల్లంతేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 8. శ్రీదేవి కుటుంబానికి హైకోర్టులో ఊరట దివంగత నటి శ్రీదేవి కుటుంబానికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. చెన్నై ఈసీఆర్ రోడ్డులోని 27 ఎకరాల భూమిపై వాటా కోరుతూ నటరాజన్, శివగామి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 37 ఏళ్లుగా శ్రీదేవి కుటుంబం ఆధీనంలో ఉన్న ఆస్తిపై ఇప్పుడు యాజమాన్య హక్కులు కోరడం తగదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో బోనీ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు ఆస్తి వివాదం నుండి విముక్తి లభించింది. 9. శక్తి కపూర్ ఆరోగ్యంగానే ఉన్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ తన మరణం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. తాను పూర్తి ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని, ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా శక్తి కపూర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని, మరణించారని జరుగుతున్న ప్రచారానికి ఈ వీడియోతో చెక్ పడింది.  10. ఓటీటీలోకి 'ధురందర్ 2' రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురందర్ 2: ది రివేంజ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. మే 14 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇండియాలో జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుండగా.. ఓవర్సీస్ ప్రేక్షకులకు Netflix లో అందుబాటులోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.  
హారర్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. వెన్నులో వణుకు పుట్టించే విజువల్స్, అడ్రినలిన్ పెంచే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో రూపొందిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'సతన్: ది డార్క్' (Satan: The Dark) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేస్తోంది. థియేటర్లలో విడుదలైనప్పుడు తనదైన ముద్ర వేసిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.   ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మంత్ర తంత్రాలు, క్షుద్ర పూజల నేపథ్యంలో సాగే ఒక మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. హస్తినాపురం అనే కొండ ప్రాంతం చుట్టూ తిరిగే ఈ కథలో.. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో జరిగిన ఒక క్షుద్ర పూజ వికటించి, ఒక దుష్టశక్తి బయటకు వస్తుంది. ఆ ప్రభావం ప్రస్తుత కాలంలో ఒక కుటుంబంపై ఎలా పడింది? మార్సెలిన్ అనే మహిళ ప్రవర్తన హఠాత్తుగా ఎందుకు మారింది? అనే ఆసక్తికర అంశాలతో దర్శకుడు మణికందన్ రామలింగం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రధాన పాత్రల్లో ఫ్రెడరిక్ జాన్ (FJ), అయిరా పాలక్, చాందిని తమిళరసన్, మోనా బెడ్రే తదితరులు నటించారు. ముఖ్యంగా చాందిని తమిళరసన్ చేసిన ఒక విలక్షణమైన పాత్ర ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తుంది. తన నాలుకను తనే కోసుకునే ఒక భయంకరమైన సీన్‌లో ఆమె నటన హైలైట్‌గా నిలుస్తుంది. భయం, ఆందోళన కలిగించే సన్నివేశాల్లో అయిరా పాలక్, ఫ్రెడరిక్ జాన్ తమ నటనతో మెప్పించారు.   సాంకేతికంగా చూస్తే.. బాలా జి. రామస్వామి అందించిన ఛాయాగ్రహణం, అశ్విన్ కృష్ణ అందించిన సంగీతం సినిమాలోని హారర్ మూడ్‌ను రెట్టింపు చేశాయి. సౌండ్ డిజైన్ భయపెట్టేలా ఉండటంతో పాటు హారర్ లవర్స్‌కు కావాల్సిన కిక్‌ను అందిస్తుంది. గతంలో వచ్చిన హారర్ చిత్రాలతో పోలిస్తే, ఇందులో చూపించిన క్షుద్ర పూజల సీక్వెన్స్ కాస్త కొత్తగా ఉండటంతో సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై పాజిటివ్ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సమ్మర్ సెలవులు కావడంతో ఇంట్లోనే ఉండి థ్రిల్లింగ్ సినిమాలను ఎంజాయ్ చేయాలనుకునే వారికి 'సతన్: ది డార్క్' ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. హారర్ చిత్రాలను ఇష్టపడేవారు వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూసి ఆ థ్రిల్‌ను ఫీల్ అవ్వండి. 
Cast: Ravi Babu, Tanish, Inaya Sultana, Banerjee Crew: Music Director: S.S. Rajesh Cinematography: Charan Madhavaneni Editing: Ramakrishna Writer-Director: Ravi Babu Producer: Ravi Babu   Razor Movie starring Ravi Babu, who also directed the film, released today in theatres. Tanish, Inaya Sultana, and Banerjee are playing prominent roles. Let's discuss about the film in detail. Plot: Rudra Pratap (Ravi Babu) runs a pet dog cleaning service, but finds himself fiercely protecting a six-year-old girl, Teju, from the ruthless politician Kanakaraju. The criminal politician wants the child dead before taking his oath as Chief Minister. Why is Rudra taking such massive risks to protect her? What is the true story behind his cleaning agency? Watch the movie to know more. Analysis: Ravi Babu delivers a very strong performance and precise direction. Satyanand's screenplay ensures the narrative logic remains gripping from the start. The first half sets a great tempo with engaging introduction scenes and a mind-blowing interval twist. Ravi Babu did give a good performance apt to the story and character. The girl also did well. But the typical Ravi Babu style performances from all other actors slightly makes it monotonous. Still, with several fights that tend to stick to awe factor do work. Not a different story but execution makes it engaging enough.  The second half reveals an emotional backstory that tries to justify Rudra's violent rampage against anti-social elements, which works in parts. Technical aspects shine throughout the film. The background score and cinematography are significant assets that elevate the mood. While the pacing and emotions work well, a few of the action sequences feel slightly over-the-top. Overall, movie is a decent watch.  Positives: Engaging story and screenplay Ravi Babu's performance Excellent background score Thrilling climax Negatives: Excessive action sequences   Bottomline: A simple story elevated by good execution   Rating: 2.5/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన నారా లోకేష్ గురించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లోకేష్ కేవలం రాజకీయాల్లోనే కాకుండా, ఒకప్పుడు టాలీవుడ్ వెండితెరపై హీరోగా మెరిసేందుకు సిద్ధమయ్యారన్న వార్త నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించి గతంలో వచ్చిన ఒక పాత పత్రికా ప్రకటన ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వెళితే.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం దర్శకుడు తేజ టాలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్స్ అందుకుంటున్న సమయం అది. 'చిత్రం', 'నువ్వు నేను', 'జయం' వంటి సినిమాలతో యూత్ పల్స్ పట్టుకున్న తేజ, అప్పట్లో నారా లోకేష్‌ను టాలీవుడ్‌కి పరిచయం చేయాలని ప్లాన్ చేశారట. ఈ మేరకు లోకేష్ హీరోగా ఒక సినిమాను పట్టాలెక్కించేందుకు స్క్రీన్ టెస్టులు కూడా నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా 'జయం' వంటి భారీ హిట్ తర్వాత తేజ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. సరిగ్గా అదే సమయంలో లోకేష్ ఫోటోలు కూడా కొన్ని సినీ మ్యాగజైన్లలో దర్శనమిచ్చాయి. ఆ కాలంలో వచ్చిన ‘సంతోషం’ వంటి పత్రికల కవర్ పేజీలపై లోకేష్ ఫోటోలు ఉండటంతో, ఖచ్చితంగా ఆయన సినిమాల్లోకి వస్తున్నారని అందరూ భావించారు. అయితే షూటింగ్ దశ వరకు వెళ్లిన ఈ ప్రాజెక్ట్ కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలోనే నిలిచిపోయిందట. సాధారణంగా రాజకీయ కుటుంబాల నుంచి వారసులు సినిమా రంగంలోకి రావడం మనం చూస్తూనే ఉంటాం. అప్పట్లో నందమూరి, నారా కుటుంబాల మధ్య ఉన్న అనుబంధంతో పాటు, లోకేష్ కూడా సినిమాలపై ఆసక్తి చూపడంతో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది. కానీ, ఆ తర్వాత ఆయన విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం, అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడంతో ఆ సినిమా ముచ్చట కేవలం రూమర్‌గానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఏపీ ఐటీ శాఖ మంత్రిగా బిజీగా ఉన్న లోకేష్‌కు సంబంధించిన ఈ పాత ఫోటోలు చూసి ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఒకవేళ లోకేష్ హీరో అయి ఉంటే, టాలీవుడ్‌లో మరో స్టార్ హీరో ఉండేవారు" అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం "రాజకీయాల్లోనే ఆయన సరిగ్గా సెట్ అయ్యారు" అని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం నాటి ఈ వార్త ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చి సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు తేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, లోకేష్ మాత్రం ప్రజా సేవలో తనదైన ముద్ర వేస్తున్నారు. అటు సినిమా, ఇటు రాజకీయాల్లో ఈ 'ఫ్లాష్‌బ్యాక్' స్టోరీ ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది.
  సినిమా పేరు: రేజర్ న‌టీన‌టులు: రవిబాబు, తనీష్, ఇనయ సుల్తానా,  బెనర్జీ  తదితరులు సినిమాటోగ్ర‌ఫీ: చరణ్ మాధవనేని  ఎడిటింగ్: రామకృష్ణ  మ్యూజిక్: ఎస్ ఎస్ రాజేష్ నిర్మాత‌: రవిబాబు  సమర్పణ:  సురేష్ ప్రొడక్షన్స్   బ్యానర్  :ఫ్లైయింగ్ ఫ్రాగ్స్  స్క్రీన్ ప్లే: సత్యానంద్ రచన,దర్శకత్వం:రవిబాబు  రిలీజ్ డేట్ : మే 8 , 2026  విభిన్న చిత్రాల హీరో, దర్శకుడు రవిబాబు నుంచి కొంతకాలంగా  సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మెరుపులు లేవు. ఈ రోజు 'రేజర్' తో టేక్ ఆఫ్ అయ్యాడు. పైగా అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ రుద్ర ప్రతాప్( రవిబాబు) పెట్ డాగ్స్ ని క్లీన్ చేసే సంస్థని రన్ చేస్తుంటాడు. అను, కృష్ణ, రాహుల్ అనే ముగ్గురు రుద్ర టీం. విష్ణు(తనీష్) కూతురు పేరు తేజు. ఆరు సంవత్సరాల పాప. ఎన్నో కబ్జాలు, హత్యలు చేసిన కరుడుగట్టిన నేరచరిత్ర కలిగిన కనకరాజు హోమ్ మినిస్టర్ స్థాయినుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహుర్తాన్ని సిద్ధం చేసుకుంటాడు. కానీ తేజు అడ్డుగా ఉంటుంది. దీంతో తేజుని చంపడానికి అత్యంత   ప్రమాదకరమైన మనుషులని పంపినా  వాళ్ళందర్నీ రుద్ర నిర్దాక్షణ్యంగా చంపుతుంటాడు. తేజు కోసం రుద్ర ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నాడు? కనకరాజు ముఖ్యమంత్రి కాకుండా ఉండటానికి  తేజు ఎందుకు అడ్డు? తేజు కథ ఏంటి? తేజుని  రుద్ర చివరి వరకు కాపాడాడా?  రుద్ర నిజంగానే పెట్ డాగ్స్ ని క్లీన్ చేసే సంస్థ అధినేతేనా? లేక అతని కథ ఏమైనా ఉందా?  అను, కృష్ణ, రాహుల్ లు ఎవరు? చివరకి రేజర్ కథ ఎలా ముగిసింది అనేదే కథ  ఎనాలసిస్  రవిబాబు సెల్యులాయిడ్ పై తన డైరెక్షన్, యాక్టింగ్ తో రఫ్ఫాడించాడు. ఇలాంటి కథలకి టెక్నాలజీని జోడించి తెరకెక్కించాలంటే మేకర్స్ కి చాలా కష్టం. ఎన్నో లాజిక్ లు  మెదులుతూ ఉంటాయి. అలాంటిది ప్రతి లాజిక్ ని దాటుకుంటూ లాజిక్ నే కధా వస్తువుగా మలుచుకున్న తీరు హాట్స్ ఆఫ్. ముఖ్యంగా ఈ విషయంలో లెజండ్రీ స్క్రీన్ ప్లే రైటర్ సత్యానంద్ గారి అనుభవం కలిసొచ్చింది. ఫస్ట్  హాఫ్ చూసుకుంటే సినిమా స్టార్టింగ్ సన్నివేశమే కథ యొక్క ఉద్దేశ్యం చెప్పారు. దీంతో కథలోకి లీనమవుతాం. రుద్ర ఇంట్రడక్షన్ సీన్ తో పాటు విష్ణు ఫ్యామిలీ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా తేజు, రుద్ర సీన్స్ తో పాటు ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ మధ్య సీన్స్ చాలా బాగున్నాయి. ఆ తర్వాత పోరాట సన్నివేశాలు రావడం, రుద్ర టీం అండ్ తేజు మధ్య వచ్చే సీన్స్ వాటి పర్పస్ అయితే సూపర్. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరింది. సెకండ్ హాఫ్ లో వచ్చిన ఆశ్చర్యకరమైన కథ థ్రిల్ కి గురి చేస్తుంది. సదరు సన్నివేశాలతో ఎమోషనల్ కి కూడా లోనవుతాం. దీంతో ఫస్ట్ హాఫ్ లో రుద్ర ఎందుకు తేజు విషయంలో పోరాటం చేస్తున్నాడు. సంఘ విద్రోహ శక్తులని ఊచకోత ఎందుకు కోస్తున్నాడో అర్ధమవుతుంది. స్టార్టింగ్ లో ఉన్న టెంపో చివరి వరకు అలాగే కొనసాగింది. పిజి హాస్టల్ సీన్ అయితే ఎక్స్ లెంట్. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ కూడా రేజర్ కి పెద్ద బలాన్ని ఇచ్చాయి.  కాకపోతే యాక్షన్ సీక్వెన్స్  శృతి మించి ఉన్నాయి నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు రుద్రగా రవిబాబు రెండు పార్శ్యాలు దాగి ఉన్న క్యారక్టర్ లో తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మ్ ప్రదర్శించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తన భార్య, కూతురు విషయంలో జరిగిన అన్యాయానికి రవిబాబు ప్రదర్శించిన పెర్ఫార్మ్ నభూతో నభవిష్యత్. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా ఇరగదీసాడు. తేజుగా చేసిన పాప కూడా తన పెర్ఫార్మ్ గురించి అందరు మాట్లాడుకునేలా మెస్మరైజ్ చేసే పడేసింది. రుద్ర టీమ్ గా చేసిన వాళ్ళు, హోమ్ మినిస్టర్ కనకరాజు, అతని కొడుకుగా చేసిన సింహ, ఆర్మీ ఆఫీసర్ గా చేసిన బెనర్జీ, తనీష్ అండ్ వైఫ్ ఇలా చెప్పుకుంటు పోతే ప్రతి ఒక్కరు రేజర్ కోసమే పుట్టినట్టుగా తమ క్యారక్టర్ కి ప్రాణం పోశారు. ఆఖరికి విలన్ బాచ్ లో వాళ్ళు కూడా. రవిబాబు దర్శకుడిగా, రచయితగా నూటికి నూరుపాళ్లు న్యాయం చేసాడు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్  అతి పెద్ద ఎసెట్ . బలాలు 1 .స్టోరీ   2 .స్క్రీన్ ప్లే ,డైలాగ్స్  3 . రవిబాబుతో పాటు ఆల్ ఆర్టిస్ట్ పెర్ ఫార్మెన్స్  4 . ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్  5 .ప్రీ క్లైమాక్స్  6 . క్లైమాక్స్  బలహీనతలు 1 .కొన్ని యాక్షన్ సీక్వెన్స్ శృతి మించడం   చివరిగా చెప్పుకోవాలంటే కథ పాయింట్ చిన్నదే అయినా హాలీవుడ్ స్టైల్ టేకింగ్ తో రేజర్ తెరకెక్కింది.  రేటింగ్ : 2.5 /5                                                                                                          అరుణాచలం 
సినీ పరిశ్రమలో ఒడిదుడుకులు సహజం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో పర్సనల్ లైఫ్‌లో వచ్చే వివాదాలు వారి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. అయితే వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని, మళ్ళీ గ్లామర్ ప్రపంచంలో తన సత్తా చాటుతోంది అందాల భామ రియా చక్రవర్తి. తాజాగా జరిగిన ఫెమినా బ్యూటీ అవార్డ్స్ వేడుకలో రియా తన అందచందాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలో రియా కేవలం అతిథిగా మాత్రమే కాకుండా, జ్యూరీ మెంబర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ, జ్యూరీ డ్యూటీని తాను ఎంతగానో ఎంజాయ్ చేశానని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోషూట్ కోసం రియా 'ద లిటిల్ బ్లాక్ బౌ' బ్రాండ్‌కు చెందిన కస్టమ్ మేడ్ గౌనును ధరించింది. షాంపైన్ కలర్ టోన్‌లో మెరిసిపోతున్న ఈ డ్రెస్, రియాకు ఒక వెస్ట్రన్ ప్రిన్సెస్ లుక్‌ను ఇచ్చింది. షోల్డర్ డ్రాప్ డిజైన్, మడతలతో కూడిన ప్లీటింగ్ స్టైల్ ఆమె గ్లామర్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. దీనికి తోడు ఆమె ఎంచుకున్న జ్యువెలరీ కూడా ఆమె లుక్‌కు రాజసం అద్దింది. రియా చక్రవర్తి కెరీర్ ప్రారంభం మన టాలీవుడ్ నుండే మొదలైందన్న విషయం మనందరికీ తెలిసిందే. 2012లో వచ్చిన 'తూనీగ తూనీగ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ 'మేరె డాడ్ కి మారుతి' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మధ్యలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత తలెత్తిన వివాదాలతో ఆమె కెరీర్ కొంతకాలం స్తంభించిపోయింది. ప్రస్తుతం ఆ చేదు జ్ఞాపకాల నుండి బయటపడిన రియా, తన సెకండ్ ఇన్నింగ్స్‌ను చాలా ప్లాన్డ్‌గా డిజైన్ చేసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోషూట్స్ మరియు వర్కవుట్ వీడియోలతో ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. ఆమె డ్రెస్సింగ్ సెన్స్ మరియు కాన్ఫిడెన్స్ చూస్తుంటే, బాలీవుడ్‌లో మళ్ళీ బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ తాజా ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "రియా ఈజ్ బ్యాక్" అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను మరికొందరు కొనియాడుతున్నారు. ఏది ఏమైనా, గ్లామర్ విషయంలో తనకు ఎవరూ సాటిలేరని ఈ ఫోటోషూట్ ద్వారా మరోసారి నిరూపించింది ఈ 'తూనీగ' భామ. ప్రస్తుతం ఆమె కొన్ని వెబ్ సిరీస్‌లు మరియు మ్యూజిక్ వీడియోలతో బిజీగా ఉండగా, త్వరలోనే ఒక భారీ ప్రాజెక్టుతో సిల్వర్ స్క్రీన్ పైకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి రియా కెరీర్ ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకున్న తర్వాత 'మెగా కోడలి'గా లావణ్య త్రిపాఠికి అభిమానుల్లో క్రేజ్ మరింత పెరిగింది. అటు వృత్తిపరంగా, ఇటు వ్యక్తిగత జీవితంలో ఎంతో హుందాగా వ్యవహరించే ఈ బ్యూటీ, తాజాగా తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లావణ్య ఒక ఇంటర్వ్యూలో తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తను సినిమాల్లోకి రాకముందు, చిన్న వయసులో ఉన్నప్పుడు చిరంజీవి గారి పాటలను చూసి ముగ్ధురాలినయ్యేదాన్ని అని తెలిపారు. ముఖ్యంగా ఆయన డ్యాన్స్‌లో ఉండే గ్రేస్, ఎనర్జీ చూసి 'ఎవరీ వ్యక్తి.. ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు' అని ఆశ్చర్యపోయేవారట. అయితే అప్పట్లో ఒక ప్రేక్షకురాలిగా చిరంజీవిని చూసి మురిసిపోయిన లావణ్య, భవిష్యత్తులో అదే మెగా కుటుంబానికి కోడలిగా వెళ్తానని కలలో కూడా ఊహించలేదని చెప్పుకొచ్చారు. కాలం చేసిన మాయో లేక అదృష్టమో కానీ, ఇప్పుడు అదే మెగాస్టార్‌ను 'మావయ్య' అని పిలిచే స్థాయికి చేరుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి, వరుస హిట్లతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వరుణ్ తేజ్‌తో కలిసి 'మిస్టర్', 'అంతరిక్షం' వంటి సినిమాల్లో నటించిన సమయంలో వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ, గతేడాది పెళ్లి పీటల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబంలో భాగమైన తర్వాత లావణ్య ప్రతి వేడుకలోనూ ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు వేడుకలైనా, ఫ్యామిలీ గెట్-టుగెదర్స్ అయినా మెగా కోడలు తన సందడిని చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు "బాస్ గ్రేస్ అలాంటిది మరి.. మావయ్యపై మీకున్న గౌరవం అభినందనీయం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్య తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే, మంచి స్క్రిప్ట్స్ వస్తే సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మెగాస్టార్ ప్రస్తుతం 'విశ్వంభర' వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, వరుణ్ తేజ్ కూడా తన తదుపరి చిత్రాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. 
సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి, అలాగే ఊహించని విపత్తులు కూడా సంభవిస్తుంటాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం కొత్తేమీ కాదు. కానీ, పెట్టిన పెట్టుబడిలో కనీసం ఒక్క శాతం కూడా తిరిగి రాకపోతే అది ఆ చిత్ర యూనిట్‌కు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. తాజాగా హాలీవుడ్‌లో ఒక సినిమా విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఏకంగా 1400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఓ చిత్రం, కేవలం 6 కోట్లు మాత్రమే వసూలు చేసి ప్రపంచ సినిమా చరిత్రలోనే 'బిగ్గెస్ట్ డిజాస్టర్'గా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు.. హాలీవుడ్ స్టార్ నటుడు ఆంథోనీ మాకీ ప్రధాన పాత్రలో నటించిన 'డెసర్ట్ వారియర్' (Desert Warrior). సౌదీ అరేబియా, బ్రిటన్, అమెరికా దేశాల సంయుక్త నిర్మాణంలో 7వ శతాబ్దపు అరేబియా పీరియడ్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు 150 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1400 కోట్లు) భారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, విడుదలయ్యాక సీన్ రివర్స్ అయింది. ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం ప్రభావం చూపలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం కేవలం 4.72 లక్షల డాలర్లు అంటే సుమారు 6 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. దీంతో నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు తప్పలేదు. నిర్మాణంలో జరిగిన జాప్యం, దర్శకుడికి మరియు నిర్మాణ సంస్థకు మధ్య వచ్చిన విభేదాలే ఈ దారుణ పరిస్థితికి కారణమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ, ఎడిటింగ్ దశలో చాలా కాలం పాటు పెండింగ్‌లో పడిపోయింది. దర్శకుడు రూపెర్ట్ వ్యాట్ అనుకున్న కథకు, చివరగా వెండితెరపై ప్రదర్శించిన వెర్షన్‌కు చాలా వ్యత్యాసం ఉండటంతో ప్రేక్షకులు దీనిని ఆదరించలేకపోయారు. సినిమాను పదే పదే రీ-షూట్ చేయడం వల్ల బడ్జెట్ అదుపు తప్పిందని, చివరకు అవుట్ పుట్ సరిగ్గా లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి కనీస స్పందన కరువైందని తెలుస్తోంది. హాలీవుడ్ మేకింగ్ విలువల పరంగా సినిమా గ్రాండ్‌గా ఉన్నప్పటికీ, ప్రమోషన్లు లోపించడం కూడా మరో మైనస్ పాయింట్‌గా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఇంత భారీ బడ్జెట్ పెట్టి కనీసం ప్రమోషన్లు చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆంథోనీ మాకీ వంటి నటుడు ఉన్నప్పటికీ, సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఈ చిత్రం ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ఫలితం హాలీవుడ్ నిర్మాణ సంస్థలను ఆందోళనలోకి నెట్టింది. ఎంత పెద్ద స్టార్లు ఉన్నా, ఎంత భారీ బడ్జెట్ పెట్టినా కథా కథనాలు మరియు పక్కా ప్లానింగ్ లేకపోతే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో 'డెసర్ట్ వారియర్' నిరూపించింది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఓటిటిలో ఎలాంటి స్పందన పొందుతుందో వేచి చూడాలి.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ (Thaman) తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్న ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్ చూసి నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' (Dragon) చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' (God Of War) చేయనున్నాడు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'డ్రాగన్' గ్లింప్స్ విడుదల కానుంది. అలాగే, 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్ మెంట్ కూడా వచ్చే అవకాశముంది. ఈ సినిమాలకు సంబంధించిన వార్తలు ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి. ఈ తరుణంలో తమన్ షేర్ చేసిన ఎన్టీఆర్ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ గుబురు గడ్డం, కోర మీసం, నోట్లో టూత్ పిక్ తో అత్యంత పవర్‌ఫుల్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. తమన్ ఈ ఫోటోను షేర్ చేస్తూ ఎమోజీలతో ఒక 'బాంబ్' హింట్ ఇచ్చాడు. దీంతో ఇది ప్రశాంత్ నీల్ సినిమాకి సంబందించిన బ్లాస్టింగ్ న్యూస్ కోసమా లేదా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసమా అనే సస్పెన్స్ మొదలైంది. ఎన్టీఆర్ లుక్ చూస్తుంటే, అది నీల్ ప్రాజెక్ట్ లోదే అనిపిస్తోంది. దీంతో 'డ్రాగన్' గ్లింప్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందని చెప్పడం కోసం తమన్ ఈ ట్వీట్ చేసుంటాడు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ ఫోటో విషయంలో మరో చర్చ కూడా జరుగుతుంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ ను త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుండటంతో.. బిగ్ బ్లాస్ట్ కి రెడీగా ఉండమని ఫ్యాన్స్ కి తమన్ హింట్ ఇచ్చాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏదైనా తమన్ షేర్ చేసిన ఫొటోలో మాత్రం ఎన్టీఆర్ లుక్ వేరే లెవెల్ లో ఉంది.  
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు. మీ ఆరోగ్యాన్ని తిరిగి మీ చేతుల్లోకి తెచ్చుకోవడానికి, ఈ VIDEO మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం హార్మోన్ల ఆరోగ్యంపై ఎందుకు దృష్టి పెట్టాలి? (Why Should We?) మన శరీరంలోని పిట్యూటరీ మరియు హైపోథాలమస్ వంటి గ్రంథులు సరిగ్గా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. గ్లూకోజ్ నియంత్రణ: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే (Hyperglycemia) అది శరీరంలో అనేక అనర్థాలకు దారితీస్తుంది. జీవనశైలి వ్యాధులు: దీర్ఘకాలిక హార్మోన్ల సమస్యలు కేవలం అలసటకే పరిమితం కావు, అవి పెద్ద ఆరోగ్య రుగ్మతలుగా మారుతాయి. సహజమైన శక్తి: హార్మోన్లు సమతుల్యంగా ఉంటే, కృత్రిమ ఉత్ప్రేరకాలు లేకుండానే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఏమి చేయకూడదు? (What Not to Do) మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు హార్మోన్లను దెబ్బతీస్తాయి: జంక్ ఫుడ్ మరియు ఇన్ఫ్లమేటరీ ఫుడ్: ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు జంక్ ఫుడ్ గ్లూకోజ్ స్థాయిలను అస్తవ్యస్తం చేస్తాయి. కెమికల్ కాస్మెటిక్స్: ప్రతిరోజూ అధికంగా మేకప్ వాడటం మంచిది కాదు. వీటిలోని జీనోబయోటిక్స్ (Xenobiotics) మరియు జీనోఈస్ట్రోజెన్స్ (Xenoestrogens) హార్మోన్ల పనితీరును గందరగోళానికి గురిచేస్తాయి. నిద్రను నిర్లక్ష్యం చేయడం: రాత్రిపూట సినిమాలు చూడటం లేదా ఫోన్ చూడటం వల్ల మీ సర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) దెబ్బతింటుంది. వ్యసనాలు: ధూమపానం, మద్యం మరియు ఇతర మత్తు పదార్థాలు మీ నాడీ వ్యవస్థను దెబ్బతీసి, హార్మోన్ల సమతుల్యతను పాడుచేస్తాయి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? (How to Balance) మీ హార్మోన్లను క్రమబద్ధీకరించడానికి ఈ 5 సూత్రాలను పాటించండి: వ్యాయామమే మందు: "Movement is medicine". ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు జిమ్ లేదా ఏరోబిక్ వ్యాయామాలు చేయండి. గ్లూకోజ్‌ను శరీరం సరిగ్గా వినియోగించుకోవడానికి ఇది అవసరం. ప్రకృతితో అనుసంధానం: ఉదయాన్నే ఎండలో గడపడం మరియు రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోండి. సేంద్రీయ పద్ధతులు: రసాయనాలతో కూడిన క్లీనర్లు మరియు వంటపాత్రలకు బదులుగా ఆర్గానిక్ పద్ధతులకు మారడానికి ప్రయత్నించండి. ఒత్తిడి నిర్వహణ: శ్వాస వ్యాయామాలు (Breathwork), జర్నలింగ్ మరియు ప్రియమైన వారితో సమయం గడపడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వ్యక్తిగత ప్రణాళిక: అందరికీ ఒకే రకమైన వ్యాయామం సరిపోదు. మీ శరీరానికి ఏది సరిపోతుందో (వెయిట్ ట్రైనింగ్ లేదా కార్డియో) నిపుణుల సమక్షంలో ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో తెలుసుకోండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: వ్యాయామం వల్ల హార్మోన్లు ఎలా మెరుగుపడతాయి?  జ: వ్యాయామం చేయడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ సరిగ్గా ఖర్చవుతుంది, దీనివల్ల హైపోగ్లైసీమియా వంటి సమస్యలు రావు మరియు హార్మోన్లు క్రమబద్ధీకరించబడతాయి. ప్ర: కాస్మెటిక్స్ నిజంగా హార్మోన్లను దెబ్బతీస్తాయా?  జ: అవును, చాలా సౌందర్య సాధనాలలో ఉండే రసాయనాలు ఈస్ట్రోజెన్ లాగా ప్రవర్తించి మెదడులోని గ్రంథులను గందరగోళానికి గురిచేస్తాయి. ప్ర: నైట్ షిఫ్ట్ చేసే వారికి హార్మోన్ల సమస్యలు వస్తాయా?  జ: ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పగలు-రాత్రి చక్రానికి (Circadian Rhythm) విరుద్ధంగా నిద్రపోవడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. హార్మోన్ల సమతుల్యత అనేది ఒక రోజులో వచ్చే మార్పు కాదు, ఇది ఒక జీవనశైలి. ఈ చిన్న చిన్న మార్పులతో మీ జీవితాన్ని మరింత ఉత్సాహంగా మార్చుకోండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు వ్యాయామ చిట్కాల కోసం మా TeluguOne Health ఛానెల్‌ని సందర్శించండి! ఇప్పుడే (సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)
  పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది.  ఎంత వయసు పెరిగినా తల్లిదండ్రులకు పిల్లల గురించి ఆలోచన ఉంటుంది.  అబ్బాయిల విషయానికి వస్తే..  18 ఏళ్లలోకి వచ్చినప్పుడు వారి జీవితం చాలా కీలకమైన మలుపు తీసుకుంటుంది.  18 ఏళ్లకు మేజర్ గా గుర్తించబడతారు.  చట్ట ప్రకారం పిల్లల నుండి వయోజనులుగా మారుతారు.  అదే విధంగా మానసికంగా కలిగే మార్పులు కూడా వారిని బాధ్యతగా ఉండటంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభావితం చేయడమే కాకుండా.. చాలా వరకు ఇండిపెండెంట్ గా ఉండటానికి కూడా ఇక్కడే కీలక మలుపు వస్తుంది. 18 ఏళ్ల వయసులో పిల్లలకు మార్గదర్శకత్వం చాలా అవసరం అవుతుంది. తల్లిదండ్రులు ఈ వయసు పిల్లలతో ఎంత సున్నితంగా, ఎంత ఆలోచించే విదంగా మాట్లాడగలుగుతారో.. పిల్లలతో విషయాలను షేర్ చేసుకోగలుగుతారో..  పిల్లల జీవితం కూడా అంత సరైన దిశలో నడవడానికి సహాయపడుతుంది.   18 ఏళ్లు నిండిన పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుంటే.. బాధ్యత.. 18 ఏళ్లు రాగానే నువ్వేం పెద్దాడివి కాదు అని తరచుగా తల్లిదండ్రులు అంటూ ఉంటారు. కానీ ఇది తప్పు.. 18 ఏళ్ల వయసు పిల్లలు తమ నిర్ణయాలు తాము తీసుకోవడానికి అవకాశం దొరితే మొదటి దశ.. అయితే  తన నిర్ణయాలకు తానే బాధ్యత వహించాలని వారు తెలుసుకోవాలి. తన ఖర్చులను తాను చూసుకోవడం, , సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం, ఇంటి పనులలో పాలుపంచుకోవడం వంటి చిన్న చిన్న పనులు 18 ఏళ్ల వయసు పిల్లలకు నేర్పిస్తే.. అవి అతన్ని బాధ్యత గల వ్యక్తిని చేస్తాయి. డబ్బు విలువ.. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, తెలివిగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. 18ఏళ్ల వయసులోనే పిల్లలకు స్నేహాలు, బయటటి ఖర్చులు వంటివి చాలా పెరుగుతాయి. నిజం చెప్పాలంటే.. డబ్బు కారణంగా పిల్లలు పాడైపోయే మొదటి దశ ఇదే.. అందుకే పిల్లలకు బడ్జెట్ రూపొందించుకోవడం, అనవసరమైన ఖర్చులను నివారించడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వంటి అలవాట్లు నేర్పించాలి. ఇవి వారిని ఆర్థికంగా బలంగా చేస్తాయి. సరైన స్నేహాలు.. ఈ వయసులో స్నేహాలు, సంబంధాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మంచి స్నేహాలు..  నమ్మకమైన వ్యక్తులతో ఎలా ఉండాలో, మంచి స్నేహాలు ఎలా ఉంటాయో.. , చెడు స్నేహాలకు ఎలా దూరంగా ఉండాలో చెబుతూ ఉండాలి.  దీని వల్ల జీవితంలో వారు దెబ్బ తినే చాలా పెద్ద నష్టం నుండి బయటపడవచ్చు. డిజిటల్ జీవితం.. చిన్న పిల్లల్లా వారిని తిట్టి, కొట్టి కంట్రోల్ చేసే వయసు కాదు 18 ఏళ్ల పిల్లలది. అందుకే సోషల్ మీడియా , ఇంటర్నెట్‌ను తెలివిగా, అవగాహనతో ఉపయోగించడం చాలా ముఖ్యం.  అలాగే ఎలాంటి విషయాలను ఇంటర్నెట్ ద్వారా షేర్ చేసుకోవాలి?  ఎలాంటి విషయాలను గోప్యంగా ఉంచాలి? సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావం జీవితం మీద ఎంత వరకు ఉండాలి వంటి విషయాలు వారికి అర్థమయ్యే లాగా వివరించి చెప్పాలి. మోటివేట్.. జీవితంలో ప్రతిఒక్కరూ వైఫల్యాన్ని ఎదుర్కొంటారు. వైఫల్యం అనేది అంతం కాదని, అది నేర్చుకోవడానికి ఒక అవకాశమని వారికి వివరించాలి. ఎందుకంటే వైఫల్యాల కారణంగా తొందర పాటు నిర్ణయాలు తీసుకునే భావేద్వేగం వారిలో ఉంటుంది.  అందుకే ఎప్పుడూ స్పోర్టివ్ గా ఉండమని చెప్పాలి. ఈ ఆలోచన వారికి జీవితంలో ముందుకు  సాగడానికి బలాన్ని ఇస్తుంది.                             *రూపశ్రీ.
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి.  అయితే జీవితంలో విజయం సాధించాలంటే.. కొన్ని పనులను అస్సలు వాయిదా వేయకూడదని చెబుతాడు ఆచార్య చాణక్యుడు.  ఆచార్య చాణక్యుడు గొప్ప ఆధ్యాత్మిక వేత్త,  తత్వవేత్త.. మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలను ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే ఎంతో క్షుణ్ణంగా వివరించి చెప్పాడు.  లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఏ పనులను వాయిదా వేయకూడదు? ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడు? తెలుసుకుంటే.. ముఖ్యమైన పనులు.. ఒక మనిషి  సక్సెస్ ఫుల్  వ్యక్తి కావాలంటే ఆ వ్యక్తి తన ముఖ్యమైన పనులకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి.  తమకు ముఖ్యమైన పనుల విషయంలో  వారు చూపించే చురుకుదనమే వారిని ఆ పనిలో విజయం సాధించేలా చేస్తుంది.ముఖ్యమైన పనులు ఏవైనా సరే.. మళ్లీ చేద్దాంలే అనే ఆలోచనతో వాయిదా వేయకూడదు.  సమయం చాలా విలువైన ఆస్తి అని,  పనులను వాయిదా వేయడం వల్ల ఎంతో గొప్ప ఆస్తిని కోల్పోయినట్టేనని, దీని వల్ల  ఒత్తిడి పెరగడమే కాకుండా భవిష్యత్తులో పెద్ద సమస్యలు కూడా తలెత్తుతాయని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. నేర్చుకోవడం.. నేర్చుకోవడాన్ని అభ్యాసం అని అంటారు. చాణక్యుడి  ప్రకారం, జ్ఞానమే మనిషి  నిజమైన శక్తి. విజయవంతమైన వ్యక్తులు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపరు. వారు ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. ఎందుకంటే, ఈ రోజు తాము సంపాదించే జ్ఞానమే రేపటి విజయానికి పునాది వేస్తుందని వారికి తెలుసు. కష్టం.. విజయానికి కష్టపడటమే ఏకైక, ప్రధాన  మార్గం. సక్సెస్ కావాలంటే.. పనులను భారంగా కాకుండా.. వాటిని చాలెంజ్ గా తీసుకుని పూర్తీ చేయాలి. తమకు ఎదురొచ్చే ప్రతి పని, తమ ఎదుగుదలకు ఒక గొప్ప మార్గంగా చూడాలి. సోమరితనం , వాయిదా వేయడం మానవ పతనానికి దారితీస్తాయి. అందుకే చాణక్యుడు ప్రతి  పనిని సమయానికి పూర్తి చేయమని సలహా ఇస్తాడు. తప్పులు.. తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోకుండా పారిపోవడం  వైఫల్యానికి ప్రదాన కారణం అవుతుంది.   తన తప్పుల గురించి తెలుసుకుని,  వెంటనే వాటిని అంగీకరించి, ఏమాత్రం సమయం వృథా చేయకుండా సరిదిద్దుకునే వ్యక్తి జీవితంలో విజయం సాధించగలుగుతాడు. తప్పులను సకాలంలో సరిదిద్దుకోకపోతే, అవి భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అవకాశాలు.. జీవితంలో సువర్ణావకాశాలు కాలంతో పాటు వస్తూ ఉంటాయి. అలాగే కాలంతో పాటు చేజారి పోతాయి కూడా. ఒకసారి అవకాశం చేజారితే అది తిరిగి రాదని తెలిసి, దానిని గుర్తించి ఆలస్యం చేయకుండా వినియోగించుకోవడంలో నేర్పరి అయినవాడే విజయం సాధిస్తాడని చాణక్య నీతి చెబుతుంది.                            *రూపశ్రీ.
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. డబ్బు సంపాదన, కార్పొరేట్ ఒత్తిడి, మరియు మారుతున్న సామాజిక విలువల మధ్య మన వ్యక్తిగత జీవితం చితికిపోతోంది. ఈ VIDEO ద్వారా మీకు సెక్స్ ఆరోగ్యం పట్ల సరైన అవగాహన కల్పించడమే మా లక్ష్యం. మనం ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) సెక్స్ అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, అది మన జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన భాగం. మానసిక ప్రశాంతత: మనం సుఖంగా, ఆనందంగా ఉండాలన్నా, మన మెదడు చురుగ్గా పనిచేయాలన్నా సెక్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన మెదడు: ఇది ప్రాథమిక అవసరాలలో ఒకటి. పశుపక్షాదులు కూడా తమ కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఆనందాన్ని పొందుతాయి, కానీ మనిషి మాత్రమే కంప్యూటర్ల ముందు కూర్చుని ఈ బేసిక్ ఫండమెంటల్స్‌ను మర్చిపోతున్నాడు. సంతానోత్పత్తి: సరైన హార్మోనల్ సెక్రేషన్ (ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్) ఉండటం వల్ల సంతానోత్పత్తి మరియు నెలసరి సక్రమంగా ఉంటాయి. ఏమి చేయకూడదు? (What Not to Do?) చాలా మంది తమకు తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి: ఆఫీస్ టెన్షన్లను ఇంటికి తీసుకురావద్దు: ఆఫీసు ఆలోచనలు ఇంటికి తీసుకురావడం వల్ల భాగస్వామిపై ధ్యాస తగ్గుతుంది, ఇది జడత్వానికి (Inertia) దారితీస్తుంది. సొంత వైద్యం వద్దు: ఎటువంటి అవగాహన లేకుండా పిల్స్ లేదా పీరియడ్స్ ఆపుకోవడానికి టాబ్లెట్లు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు: హార్మోన్ల మార్పుల వల్ల గడ్డం దగ్గర వెంట్రుకలు రావడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి, అంతేకానీ కేవలం బ్యూటీ పార్లర్లకు వెళ్లి తాత్కాలిక పరిష్కారాలు వెతకకూడదు. జనరిక్ మందుల పట్ల అపోహలు: జనరిక్ మందులు తక్కువ నాణ్యత గలవి అని అనుకోవద్దు; అవి కూడా అదే ఫార్ములాతో పనిచేస్తాయి. సమస్యను ఎలా అధిగమించాలి? (How to Improve?) జీవనశైలి మార్పులు: పిజ్జాలు, పాస్తాల వంటి వెస్ట్రన్ ఫుడ్ కంటే మన స్వచ్ఛమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఫోర్ ప్లే (Foreplay) ప్రాముఖ్యత: భాగస్వామితో అనుబంధాన్ని పెంచుకోవడానికి మరియు ప్రేరేపించబడటానికి ఫోర్ ప్లే అనేది చాలా అవసరం. సరైన రోగ నిర్ధారణ: ఏదైనా సమస్య ఉన్నప్పుడు సీనియర్ ఫిజీషియన్‌ను కలిసి కనీసం అరగంట పాటు మీ కేస్ హిస్టరీని వివరించండి. సరైన డయాగ్నోసిస్ ద్వారా ఎటువంటి సుఖవ్యాధినైనా 15-20 రోజుల్లో నయం చేయవచ్చు. డైరీ నిర్వహణ: రోజూ పడుకునే ముందు ఆ రోజు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది ఒక డైరీలో రాసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ప్రశ్నోత్తరాలు (Q&A) ప్ర: సెక్స్ పట్ల కోరికలు తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి?  జ: అధిక పని ఒత్తిడి (24 గంటలు పనిచేయడం), హార్మోన్ల అసమతుల్యత, మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మారిన మానసిక స్థితి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్ర: యువతులలో కనిపిస్తున్న హార్మోన్ల సమస్యల లక్షణాలు ఏమిటి?  జ: 18-19 ఏళ్లకే నెలసరి ఆలస్యం కావడం, ముఖంపై (గడ్డం దగ్గర) దట్టమైన వెంట్రుకలు రావడం వంటివి హార్మోన్ల లోపానికి సంకేతాలు. ప్ర: ఎయిడ్స్ (HIV) సోకితే నయం కాదా?  జ: ఒకప్పుడు అది మహమ్మారిగా ఉండేది, కానీ ఇప్పుడు దానికి రెట్రోవర్టెడ్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచే మందుల ద్వారా దానిని కూడా నియంత్రించవచ్చు. ప్ర: సహజీవనం (Living Together) సెక్స్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?  జ: సహజీవనం వల్ల ఒకరి పట్ల ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంది. పెళ్లి అనే బంధంలో ఉండే ఆకర్షణ, గౌరవం ఇక్కడ లోపించవచ్చు. డబ్బు వెనకాల పరిగెత్తే క్రమంలో మన శరీరానికి భగవంతుడు ప్రసాదించిన వరాన్ని (సెక్స్ మరియు ప్రేమ) నిర్లక్ష్యం చేయకండి. సమస్య చిన్నదైనా, పెద్దదైనా సరైన నిపుణులను సంప్రదించి సంతోషకరమైన జీవితాన్ని గడపండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు నిపుణుల సలహాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి.. (సబ్స్క్రైబ్ చేసుకోండి)
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో అనేక అపోహలు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్.జి.వి. సత్య (Dr. SGV Satya) గారు ఈ వీడియోలో శాస్త్రీయమైన సమాధానాలు ఇచ్చారు.       ఈ వీడియోలో ముఖ్యంగా చర్చించిన అంశాలు: 👇 అన్నం vs చపాతీ: రెండింటిలో ఉండే కార్బోహైడ్రేట్లు మరియు గ్లైసీమిక్ ఇండెక్స్ మధ్య తేడాలు. సరైన ఆహార విధానం: షుగర్ ఉన్నవారు అన్నం తినాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యమైన సూచనలు: క్వాంటిటీ (పరిమాణం) మరియు క్వాలిటీ (నాణ్యత) విషయంలో మనం చేసే తప్పులేమిటి? షుగర్ కంట్రోల్ చిట్కాలు: రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే భోజనంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి. ఆందోళన సహజమైనదే అయినప్పటికీ, దానిని కొనసాగనివ్వడం మానసిక,  శారీరక ఆరోగ్యానికి హానికరం.  నేటికాలంలో చాలా మంది ఈ ఆందోళన అనే ఉచ్చులో చిక్కుకుంటున్నారు.  ఆందోళన అనే ఉచ్చులో చిక్కుకున్నాక జీవితం చిన్నాభిన్నం అవుతుంది.  ఆందోళన ఉచ్చులో పడకుండా ఉండాలంటే.. కొన్నిమార్గాలు అనుసరించాలి.  దీని వల్ల  మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళనకు గురి కాకుండా ఉండగలుగుతారు. లోతైన శ్వాస.. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, రోజుకు 5-10 నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోవడం అత్యంత సులభమైన మార్గం.  లోతుగా, నెమ్మదిగా శ్వాస తీసుకున్నప్పుడు, శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం పెరిగి మనస్సు ప్రశాంతమవుతుంది.  ఇది గుండె కొట్టుకోవడాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చి, శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది.  ఉదయం నిద్రలేచిన తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు ఇలా చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ద్యానం.. ప్రతిరోజూ 15-20 నిమిషాలు ధ్యానం చేయడం మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.  ఇది మానసిక ఏకాగ్రతను పెంచి, ప్రతికూల ఆలోచనలను నియంత్రించడంలో సహాయపడుతుంది.  క్రమంగా సాధన చేయడం ద్వారా  మనస్సు మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా మారుతుంది. యోగా, వ్యాయామం.. యోగా మరియు తేలికపాటి వ్యాయామం శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్లను పెంచుతాయి. ఈ హార్మోన్లు సహజంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా నడవడం, శరీరాన్ని సాగదీసే స్ట్రెచ్చింగ్ వ్యాయాలు లేదా సాధారణ యోగాసనాలు వేయడం వల్ల శరీరం, మనస్సు రెండూ చురుకుగా ఉంటాయి. ప్రతికూల ఆలోచన.. ప్రతికూల ఆలోచనల స్థానంలో సానుకూల ఆలోచనలను నింపడం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన మార్గం.  ఎవరికి వారు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పుకోవాలి,   దేనికి కృతజ్ఞతతో ఉన్నారో గమనించాలి.  ఇది ఆందోళనను,  భయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్ర, ఆహారం.. మానసిక ఆరోగ్యానికి తగినంత నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.  నిద్రలేమి ఆందోళనను పెంచుతుంది. కెఫీన్, చక్కెర అధికంగా తీసుకోవడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం వంటివి  మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటంలో సహాయపడతాయి. సహకారం.. మానసిక స్థితి చాలా బాగోలేదని అనిపించినప్పుడు, ఎప్పుడు ఆందోళనగా అనిపిస్తూ ఉన్నప్పుడు  కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడాలి. అవసరమైతే, మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం తీసుకోవాలి. ఒంటరిగా బాధపడటం కంటే నచ్చిన వారి దగ్గర మనసు విప్పి మాట్లాడటం ద్వారా ఊరట పొందవచ్చు.                              *రూపశ్రీ.