LATEST NEWS
  బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు.అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.చిన్నస్వామి స్టేడియం 30వేలు మాత్రమే కానీ 3 లక్షల మంది అభిమానులు వచ్చారని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని అన్నారు.తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని, గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని ఆయన ప్రకటించారు.మంగళవారం రాత్రి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆలస్యంగా ముగియడంతో, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఈ విజయోత్సవాలను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టామని ఆయన వివరించారు."ప్రజల స్పందన మా అంచనాలను మించిపోయింది.  విధానసౌధ ముందు లక్షకు పైగా జనం గుమిగూడినా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. కానీ  స్టేడియం వద్ద ఈ విషాదం సంభవించింది. క్రికెట్ అసోసియేషన్ గానీ, ప్రభుత్వం గానీ ఇంతటి పరిణామం ఊహించలేదాని ఆయన తెలిపారు. చిన్న‌స్వామి స్టేడియం తొక్కిస‌లాట‌పై ప్ర‌ధాని మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపిన ఆయ‌న మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. అంతేకాదు ఆత్మీయుల‌ను కోల్పోయిన కుంటుంబలకు కేంద్ర త‌ర‌ఫున‌ రూ. 2 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వాళ్ల‌కు రూ. 50 వేల ప‌రిహారం చెల్లిస్తామ‌ని మోడీ వెల్ల‌డించారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు
  జగన్ పార్టీ పరాజయం పాలై సరిగ్గా ఏడాది పూర్తైంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ సీఎం జగన్ వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి రావడం మానేశారు. పోనీ ప్రజాసమస్యలపై పోరాటాలకు ప్రజల్లోకి వస్తున్నారా అంటే అదీ లేదు. తాడేపల్లి ఓటమి తర్వాత పార్టీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్ జైళ్లలో పరామర్శలు, లేకపోతే ఎక్కడెక్కడో దాడులు జరిగాయంటూ ఓదార్పులతో ఏడాది కాలం వెల్లబుచ్చడం విమర్శల పాలవుతోంది. ఆఖరికి పార్టీపరంగా  పిలుపునిచ్చిన ఆందోళనల్లో కూడా ఆయన పాల్గొనకపోవడంపై సొంత పార్టీల్లోనే అసంతృప్తులు వక్తమవున్నాయి.జూన్ 4 సరిగ్గా ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తైంది . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రానికి మహర్దశ పట్టిందని, రాష్ట్రానికి పట్టిన విరగడైందని మిత్రపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో పాల్గొనాలి అని జగన్‌ పిలుపు ఇచ్చారు. అంతలావున  పిలుపు ఇచ్చిన మాజీ  ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో ఎక్కడా కనిపించలేదు. వైసీపీ శ్రేణులు అక్కడక్కడ ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. కానీ, ఈ కార్యక్రమంలో ముందుండాల్సిన పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎక్కడ కనిపించలేదు. దీంతో జగన్ ఏమైపోయారు అని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకున్నారు. మంగళవారం తెనాలిలో తమ వారిపై పోలీసులు దాడి చేశారంటూ రౌడీ షీటర్ల కుటుంబాలను పరామర్శించిన జగన్.. అటు నుంచి అటే బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌కు వెళ్లిపోయారు. ఇంకోరోజు రాష్ట్రంలో ఉండి పార్టీ కార్యక్రమంలో పాల్గొనకపోవడం వైసీపీ క్యాడర్ కు ఏమాత్రం రుచించడం లేదంట.వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది.  అయినా ఈ కార్యక్రమంలో జగనే పాల్గొనకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీని తిరిగి పవర్ లోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడాలి.. జగన్ మాత్రం ప్యాలెస్ లో కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకుంటారా అని రుసరుసలాడుతున్నారు. మరో మూడేళ్లు ఓపిక పట్టండి, తర్వాత మనదే అధికారం అంటూ జగన్ తెగ ధీమాగా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఇంటింటికి వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు చెప్తున్న జగన్..తమ కష్టంతో అధికారంలోకి వద్దామనుకుంటున్నారా?.. అదే అసలైన వెన్నుపోటని వైసీపీ శ్రేణులు గొణుక్కుంటున్నాయి. వెన్నుపోటు దినంలో పాల్గొనకుండా బెంగళూరు వెళ్లిపోయిన జగన్ నెక్ట్స్ షెడ్యూల్‌ని ఎంపీ మిథున్‌రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి వెళ్లి పరామర్శించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్  ఈ నెల11 లేదా 12న నెల్లూరు జైలుకు వస్తారని చెప్పుకొచ్చారు.  పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనని జగన్.. జైళ్లలో పరామర్శలు, ఓదార్పులకు మాత్రమే జనంలోకి వస్తుండటంపై సోషల్ మీడియాలో కూడా తెగ సెటైర్లు వినిపిస్తున్నాయి.
  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన  సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది.ఈ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కె. పార్థసారథి మీడియా సమావేశంలో సమావేశంలో వివరించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం, చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఎన్టీఆర్ సుజల కింద నీటి శుద్ది చేసే ప్లాంట్‌లకు వయబులిటీ ఫండ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ క్రమంలో ఉద్దానంకు రూ. 5.75 కోట్లు, కుప్పంకు రూ. 8.22 కోట్లు కేటాయించనున్నారు. ఉద్దానం, కుప్పంలో ప్రజలకు రూ. 2 కే 20 లీటర్లు తాగునీరు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. వన్ టైం సెటిల్‌మెంట్ కింద వయబిలిటీ ఫండ్ ఇవ్వాలని  కేబినెట్  నిర్ణయించింది .2025, ఫిబ్రవరి 1వ తేదీ నాటికి యావ జీవ శిక్ష పడిన 17మంది ఖైదీలకు క్షమాబిక్ష పెట్టి విడుదల చేయాలని నిర్ణయించింది.  సత్ప్రవర్తన కల్గినందున 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాబిక్ష ప్రసాదించాలని నిర్ణయం తీసుకుంది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన నిబంధనల ప్రకారం ఖైదీల విడుదలపై నిర్ణయం తీసుకుంది.ఏపీఎస్పీలో 248 మంది కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పిస్తూ నిర్ణయించింది.వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చుతూ మంత్రివర్గం ఆమోదించింది.ఫ్యాక్టరీల్లో మహిళా ఉద్యోగులకు ఇకపై రాత్రి పూట కూడా విధులు నిర్వహించేందుకు పూర్తి రక్షణతో చట్ట సవరణలు చేసింది.  ఫ్యాక్టరీల్లో పని చేసే మహిళలకు ప్రస్తుతం ఒవర్ టైం 50 లేదా 75 గంటలు మాత్రమే పని చేసే అవకాశం ఉండేది. ఇకపై మహిళలు క్వాటర్‌లో 144 గంటలు ఒవర్ టైం చేసేందుకు నిబంధనలు మార్చుతూ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సీఎం చంద్రబాబ కు మంత్రులు అభినందలు తెలిపారు.  కూటమిలోని పక్షాల మధ్య సమన్వయం బాగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పీ4కు సంబంధించి ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు నేరస్థుల్ని రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారని .. ఇప్పుడు నేరస్థుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఈ సందర్భంగా వైసీపీ అధినేత‘జగన్ తప్పు చేశాడు కదా? మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదు’ అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి  ప్రశ్నించగా.. ‘అతను తప్పులు చేసినట్లు రుజువులు ఉంటే చట్టానికి దొరికితే మనం చర్యలు తీసుకోవాలి. మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి’ ముఖ్యమంత్రి సూచించారు. 
ALSO ON TELUGUONE N E W S
Cast: Pankaj Tripathi, Mohammed Zeeshan Ayyub, Surveen Chawla, Asha Negi, Khushboo Atre, Mita Vashisht, Shweta Basu Prasad, Barkha Singh, Khushi Bharadwaj Crew:  Created by Harman Wadala, Rahul Ved Prakash, Varsha Ramachandran, Riya Poojary Written by Harman Wadala, Sandeep Jain, Sameer Mishra Directed by Rohan Sippy Produced by Sameer Nair, Deepak Segal, Sameer Gogate Genre: Crime, Legal drama, Thriller OTT Platform: Jio Hotstar Criminal Justice series has been successful as an Indian legal drama with Pankaj Tripathi in the lead role. His character Advocate Madhav Mishra has been consistently loved by audiences because of his likeable performance. In the previous season, Shweta Basu Prasad came into the mix and now, Mohammed Zeeshan Ayyub, Surveen Chawla, Asha Negi have been added into important characters. Let's discuss about this Family Matter being dragged to court in detail.  As only three episodes have been released, we cannot give a complete plotline but Madhav Mishra is now defending Raj Napal (Mohammed Zeeshan Ayyub) who is believed to have murdered nurse Roshni Saluja (Asha Negi) at his daughter's birthday party. Anju Nagpal (Surveen Chawla, Raj's wife is trying to hard to prove the truth.  As per the first three episodes released, this season is not as good as the first three. From the first episode itself, the drama looks very unconvincing and farcical. The drama tries to showcase how Madhav Mishra is also growing a reputation and tries to give him more character but it fails to establish the case as well as it did in previous seasons.  Here, even the performances feel a little bit off and too melodramatic. The series needed much more grounded approach from the first minute rather than it going into this dramatic zone. Being a legal drama, it needed a lot more grounded approach. Pankaj Tripathi is likeable but as Madhav Mishra, he needs much more writing help and this character seems to have gone stale. Surveen Chawla and Mohammad Zeeshan Ayyub don't get great start.  Early in the show, it might not be great to judge complete one but the start is not that interesting or inspiring for needing more. Let's hope the season 4 does redeem itself in upcoming episodes and deliver better.  Rating: 2.25/5 (for first three episodes) Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them.    
  సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల సినిమా వేదికలపై మాట్లాడుతున్న మాటలు వివాదాస్పదమవుతున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఆలీని ఒక బూతు మాట అనేశారు. రోజాని దాన్ని అన్నారు. ఇలా రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. దీనిపై స్పందించిన రాజేంద్రప్రసాద్.. చనువు ఉన్నవారినే అలా సరదాగా అంటుంటానని చెప్పారు. ఆలీ కూడా రాజేంద్రప్రసాద్ కావాలని అనలేదని, ఈ విషయాన్ని పెద్దది చేసి చూడొద్దని కోరారు. తాజాగా ప్రముఖ నటుడు అశోక్ కుమార్ ఈ అంశంపై స్పందించారు.    రీసెంట్ గా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రాజేంద్రప్రసాద్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు అశోక్ కుమార్. "మా తరం నటీనటులంతా సరదాగా ఉంటాం. ఆ చనువుతో షూటింగ్ లొకేషన్స్ లో ఏరా అని మాట్లాడుకుంటాం. అయితే పదిమందిలో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. కానీ ఒక్కోసారి మనకి తెలియకుండానే మాట్లాడేస్తుంటాం. బయట ఉన్న రిలేషన్, చనువుతో ఫ్లోలో ఏదోకటి అనేస్తుంటాం. వాటిని చూసీ చూడనట్టు వదిలేయాలి. ఆలీ కూడా స్టేట్ మెంట్ ఇచ్చాడు. వాళ్ళిద్దరి రిలేషన్ బాగున్నప్పుడు.. మిగతా వాళ్ళు దానిని పెద్దది చేసి చూడకూడదు. నన్ను రాజేంద్రప్రసాద్ బయట ఏరా అంటారు. ఆ చనువుతో ఒక ఈవెంట్ లో ఏరా నీ గుండు మీద ఒట్టు అన్నారు. దానిని నేను సరదాగా తీసుకున్నాను. కానీ, కొందరు మాత్రం అశోక్ కుమార్ మీద నోరు జారిన రాజేంద్రప్రసాద్ అని రాసేశారు. నాతో ఉన్న చనువు కొద్దీ ఫ్లోలో ఆయన అలా అనేశారు అంతే." అని అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు.    
అల్లు అర్జున్,(Allu arjun)మంచు మనోజ్(Manchu Manoj),అనుష్క(Anushka)ముఖ్య పాత్రల్లో క్రిష్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'వేదం'(Vedam). 2010 జూన్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించగా, మంచి విజయాన్ని నమోదు చేసింది. నటుడుగా అల్లుఅర్జున్ కెరీర్ ని ఒక మలుపు తిప్పి ఒక కొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసింది. నేటితో ఈ మూవీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎక్స్(X)వేదికగా వేదం షూటింగ్ అప్పటి ఫోటోలని షేర్ చేస్తూ 'వేదం నా కెరీర్  లో ఒక విభిన్నమైన చిత్రం. ఎంతో నిజాయితితో తెరకెక్కించిన క్రిష్(Krish)కి నా కృతజ్ఞతలు. అనుష్క, మంచు మనోజ్, మనోజ్ బాజ్ పేయి లాంటి నటులతో పని చెయ్యడం నాకు ఎంతో ప్రత్యేకం. సినిమాని నిర్మించిన నిర్మాతలతో పాటు సంగీతాన్ని అందించిన కీరవాణి(Keeravani)కి నా హృదయ పూర్వక అభినందనలు. ఈ సినిమాని ఆదరించి, ఎప్పటికి నిలిచిపోయే చిత్రంగా మలిచిన అభిమానులకి నా కృతజ్ఞతలని ట్వీట్ చేసాడు.   విభిన్న పద్ధతులని, జీవన శైలిని కొనసాగిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రవాదుల నుంచి ప్రజలని కాపాడుకోవడానికి  తమ ప్రాణాలని తృణప్రాయంగా త్యాగం చేసే క్యారక్టర్ లలో అల్లు అర్జున్, మంచు మనోజ్ ఒదిగిపోయి నటించారు. మంచి మనసున్న, నిజాయితీతో కూడుకున్న వేశ్య క్యారక్టర్ లో అనుష్క జీవించిందని చెప్పవచ్చు.        
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ హరిహరవీరమల్లు(Hari Hara veeramallu)ఈ నెల 12 న విడుదల కాబోతున్న నేపథ్యంలో  ప్రమోషన్స్ కూడా మొదలైన విషయం తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో భారీ ఎత్తున జరపడానికి ప్లాన్ చేసారు. దీంతో పవన్ స్పీచ్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. కానీ  వీరమల్లు  పన్నెండవ తారీకు నుంచి కూడా వాయిదా పడనుందనే వార్తలు  సోషల్ మీడియా వేదికగా గత  రెండు రోజుల నుంచి  వినిపిస్తున్నాయి. వీరమల్లు ని నిర్మించిన ఏఏం రత్నం కి ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయని, అందుకే  వీరమల్లు  వాయిదా పడనుందని అంటున్నారు. రీసెంట్ గా  పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి వీరమల్లు కోసం తాను తీసుకున్న 11 కోట్ల రూపాయిల అడ్వాన్స్ ని ఏ ఎం రత్నం కి వెనక్కి ఇచ్చాడని, ఆ డబ్బుతో  రిలీజ్  కి ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోమని చెప్పినట్టుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఇక వీరమల్లు లో నిధి అగర్వాల్, బాబీ డియోల్, జిష్ణు సేన్ గుప్తా, అనసూయ, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  కీరవాణి సంగీత సారధ్యంలో క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.    
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) త్వరలో 'హరి హర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆ తర్వాత 'ఓజీ' లైన్ లో ఉంది. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ.. సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంది. ఇలాంటి సమయంలో షూటింగ్ కి సంబంధించిన న్యూస్ ఒకటి ఆసక్తికరంగా మారింది.   'ఓజీ' షూటింగ్ తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. నిన్నటితో ముంబై షెడ్యూలు పూర్తయింది. రేపటి నుంచి విజయవాడ షెడ్యూలు మొదలు కానుంది. తాడేపల్లిలో 10 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూలులో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ తో మొత్తం షూట్ పూర్తి అవుతుందని సమాచారం.   నిజానికి 'ఓజీ' షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా చాలా రోజులు పడుతుందని అందరూ భావించారు. కానీ, పది రోజుల్లో మొత్తం షూటింగ్ పూర్తి కానుందన్న వార్త ఆశ్చర్యం కలిగించేదే. ఈ న్యూస్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.  
మంచు విష్ణు(Vishnu), మోహన్ బాబు(Mohanbabu)ప్రెస్టేజియస్ట్ మూవీ 'కన్నప్ప'(Kannappa). 'పరమేశ్వరుడి' పరమ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. 24ఫ్రేమ్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్ టైన్మెంట్ పై  విష్ణు,మోహన్ బాబు లే నిర్మిస్తుండగా జూన్ 27 న పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కానుంది. కొన్ని రోజుల క్రితం ముంబై నుంచి వచ్చిన కన్నప్ప కి సంబంధించిన 'హార్డ్ డిస్క్' ని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీలో పని చేసే రఘు, చరిత అనే ఇద్దరు తీసుకొని పారిపోయారు. ఈ విషయంపై పోలీస్ కేసు నమోదయ్యింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతు 'ముంబైలో ఉన్న నాలుగు విఎఫ్ఎక్స్ కంపెనీలు కన్నప్ప కోసం పని చేస్తున్నాయి. వాటిల్లో ఒక కంపెనీ  ఆన్ లైన్ లో కొంత భాగాన్ని పంపింది. క్లారిటీ లేకపోవడంతో  రెండో సారి అప్ లోడ్ చేసి, ముందు జాగ్రత్త కోసం ఒక హార్డ్ డిస్క్ ని పంపింది. నాన్నగారి ముగ్గురి పిల్లలకి సంబంధించి ఎలాంటి పార్సిల్ వచ్చినా కూడా, ఇప్పుడు వెళ్లిన అడ్రస్స్ కే వెళ్తుంది. మేనేజర్లు ఎవరి పేర్లు ఉంటే వాళ్ళకి  అందచేస్తారు. కన్నప్ప పార్సిల్ వచ్చినప్పుడు రఘు అనే వ్యక్తి చరిత అనే అమ్మాయికి  వ్వమని చెప్పాడంట. ఆ తర్వాత ఆమె తో పాటు ఇద్దరు కనపడకుండా వెళ్లిపోయారు. మాకు తెలిసిన నిజం ఏంటంటే ఆ ఇద్దరు మనోజ్ తో ఉంటారు. ఇప్పటికి హార్డ్ డిస్క్ మనోజ్ దగ్గరే ఉంది. మధ్యవర్తి ద్వారా కూడా పంపించినా ఇవ్వనున్నారు.పోలీసులకి అన్ని విషయాలు చెప్పాం కాబట్టి వాళ్లే ఎంక్వరీ చేసి తేలుస్తారు. నా చేతికైతే ఇంకా హార్డ్ డిస్క్ రాలేదు. పాస్ వర్డ్ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ కాదు.  విఎఫ్ ఎక్స్ కి భారీ ఖర్చు అయ్యింది. ఒక ఖరీదైన తప్పు చెయ్యడం వల్ల 15 కోట్లు లాస్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. కన్నప్ప లో ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Mohanlal)అక్షయ్ కుమార్(Akshay Kumar)కాజల్, ప్రీతీ ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తుండగా ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. స్టీఫెన్ సంగీతాన్ని అందించగా ఇప్పుడికే విడుదలైన పాటలు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కన్నప్ప పై అంచనాలు పెంచాయి.   
  ప్రముఖ నటుడు ఆనందరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో 'గ్యాంగ్ లీడర్', 'పెదరాయుడు', 'సూర్యవంశం', 'చెన్నకేశవ రెడ్డి' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి ఆనందరాజ్ గురించి.. ఆయన తమ్ముడు, డ్యాన్స్ మాస్టర్ అనిల్ రాజు 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను పంచుకున్నారు.   అలనాటి గాయని స్వర్ణలత కుమారులే ఈ ఆనందరాజ్, అనిల్ రాజు. అయితే ఈ ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో దూరం పెరిగిందట. తాము పుట్టినప్పుడు అన్నదమ్ములం, పెరిగాక దాయాదులం అని అనిల్ రాజు అన్నారు.    "నేను మా అమ్మకి చిన్న కొడుకుని. నన్ను ఎంతో ప్రేమించేది. అయితే నాకు యుక్త వయసులో అమ్మాయి లక్షణాలు వచ్చాయి. జుట్టు పెంచుకోవాలని, చీర కట్టుకోవాలని అనిపించేది. దాంతో మా అన్నయ్య పాలల్లో విషం పెట్టి నన్ను చంపేద్దామని చెప్తే.. దానికి మా అమ్మ ఒప్పుకోలేదు. నాకు నచ్చినట్టు ఉండమని చెప్పింది." అని అనిల్ రాజు చెప్పుకొచ్చారు.   "నేను అమ్మ మాట వినేవాడిని. మా అన్నయ్య మాత్రం తన భార్య మాట వినేవాడు. మా వదిన మాట విని అమ్మను వృద్ధాశ్రమంలో కూడా వేయాలనుకున్నాడు మా అన్నయ్య. దాంతో మా ఇద్దరి మధ్య వాదనలు జరిగి, బాగా దూరం పెరిగిపోయింది." అని అనిల్ రాజు తెలిపారు.   "మా అమ్మ రాయలసీమ అమ్మాయి. వాళ్ళది ధనవంతుల కుటుంబం. గాయనిగానూ బాగా సంపాదించింది. పొలాలు, బంగారం బాగా ఉన్నాయి. 1997 మార్చి 5న కారులో డ్రైవర్ తో కలిసి నేను, అమ్మ వెళ్తుండగా.. మాపై దాడి చేశారు. అప్పుడు కారులో 4 లక్షల డబ్బు, కొంత బంగారం ఉంది. ఆ దాడిలో గాయపడిన అమ్మ.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ, ఆమె పుట్టినరోజు నాడే మార్చి 10న చనిపోయారు." అని అనిల్ రాజు చెప్పుకొచ్చారు.    
డిజె టిల్లు, టిల్లుస్క్వేర్ వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన హీరో సిద్దు జొన్నలగడ్డ.(Siddu Jonnalagadda)ముఖ్యంగా ఆ రెండు చిత్రాల ద్వారా ఎంతో మంది అభిమానులని సంపాదించాడు. అది  ఎంతలా అంటే సిద్దు అనే పేరుని మర్చిపోయి 'టిల్లు' అని పిలుచుకునేంతలా. టిల్లు స్క్వేర్ తో తొలి సారి  వంద కోట్ల క్లబ్ లోకి  చేరి తన కంటు ఒక ప్రత్యేకమైన బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక 'టిల్లుస్క్వేర్' తర్వాత ఏప్రిల్ 10 న 'జాక్'(Jack)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఎన్టీఆర్(Ntr)తో పాటు గతంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర జాక్ ని నిర్మించింది. బేబీ మూవీ ఫేమ్ 'వైష్ణవి చైతన్య'(Vaishnavi chaitanya) హీరోయిన్ గా చెయ్యగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడుగా వ్యవహరించాడు. దీంతో రిలీజ్ కి ముందు నుంచే జాక్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఎవరు ఊహించని విధంగా తొలి షో నుంచే ప్లాప్ టాక్ ని తెచ్చుకుంది. డిజాస్టర్ గా నిలిచినా, టిల్లు స్క్వేర్ తర్వాత వచ్చిన సిద్దు మూవీ కాబట్టి, ఒక మాదిరి కలెక్షన్స్ అయినా, రాబడుతుందేమో అని అందరు అనుకున్నారు. కానీ పది కోట్ల రూపాయిల వసూళ్ళని కూడా రాబట్టలేకపోయింది. దీంతో చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కి భారీ నష్టాలూ వచ్చాయనే టాక్ సినీ సర్కిల్స్ లో  వినిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా జాక్ మూవీకి సిద్దు తాను తీసుకున్న ఎనిమిది కోట్ల రూపాయిల  రెమ్యునరేషన్ లో నాలుగు కోట్ల రూపాయిలని  వెనక్కి ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. సిద్దు అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 'తెలుసు కదా'(Telusu Kada)అనే మూవీ చేస్తున్నాడు. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి  నీరజ కోన దర్శకత్వం వహిస్తుంది. రాశిఖన్నా, శ్రీనిధి హీరోయిన్ లుగా చేస్తుండగా దీపావళి కానుకగా అక్టోబర్ 17 న విడుదల కానుంది.           
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ఆధునిక జీవనశైలి,  ఫాస్ట్ ఫుడ్ తినడం మొదలైనవి   ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వీటి కారణంగా  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్స్,  ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో  ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు,  ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి.  ఇవి శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం,  మూత్రపిండాల పనితీరు బలహీనపడటానికి దారితీస్తాయి. మూత్రపిండాల్లో లవణాలు,  ఖనిజాలు స్ఫటికీకరించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల  మూత్రపిండాల్లో రాళ్లు నివారించవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఒక సాధారణ సమస్యగా మారుతున్నప్పటికీ, వాటిని నివారించడం సులభం. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం, సమతుల్య ఆహారం,  సహజ మూలికల వాడకంతో  రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడకూడదు అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి.. హైడ్రేషన్:  మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి  హైడ్రేటెడ్ గా ఉండటం. "రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగడం వల్ల రాళ్లు ఏర్పడటానికి దోహదపడే కాల్షియం, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్‌ల వంటి ఖనిజాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. సాధారణ నీటితో పాటు, కొబ్బరి నీరు, బార్లీ నీరు అద్భుతంగా సహాయపడతాయి.  శరీరం నుండి విషాన్ని తొలగించడాన్ని ప్రోత్సహిస్తాయి.  నిమ్మకాయలు,  నారింజ వంటి సిట్రస్ పండ్లు కూడా మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయపడతాయి. ఎందుకంటే వాటిలో ఉండే సిట్రేట్లు ఆక్సలేట్‌లు స్ఫటికాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. సరైన హైడ్రేషన్ మూత్రపిండాలలో ఖనిజాలు పేరుకుపోకుండా మూత్రపిండాల పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తాయి.   మూలికలు.. కొన్ని మూలికలు మూత్రపిండాల పనితీరుకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి.  రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తాయి. సహజ నివారణలు విషాన్ని బయటకు పంపడంలో, ఖనిజాలు పేరుకుపోకుండా నిరోధించడంలో,  మొత్తం మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అత్యంత ప్రభావవంతమైన మూలికలు.. పునర్నవ .. ఇది సహజ మూత్రవిసర్జనగా పనిచేస్తుంది, అదనపు ద్రవాలు, విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. గోక్షుర .. మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇస్తుంది,  ఖనిజ స్ఫటికీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది. అరటి కాండం రసం.. మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేసి బయటకు పంపుతుంది. శతావరి.. మూత్రపిండాల వడపోతను పెంచుతుంది, ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. బూడిద గుమ్మడికాయ రసం.. 95 శాతం నీటి శాతం,  ఆల్కలీన్ లక్షణాలతో ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.  రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ల నివారణకు ఆహార విధానాలు.. కాల్షియం తీసుకోవడం పెంచాలి..  కాల్షియం గట్‌లోని ఆక్సలేట్‌లతో బంధిస్తుంది, మూత్రపిండాలలో వాటి స్ఫటికీకరణను నిరోధిస్తుంది. సోడియం వినియోగాన్ని పరిమితం చేయాలి.. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల కాల్షియం విసర్జన పెరుగుతుంది, రాళ్ళు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను తగ్గించాలి.. పాలకూర, దుంపలు,  బెండకాయలు వంటి ఆహారాలను మితంగా తినాలి,  వాటి ప్రభావాలను సమతుల్యం చేయడానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో జత చేయాలి. ఆల్కలీన్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. దోసకాయలు, పుచ్చకాయ,  కొబ్బరి నీరు మూత్రంలో ఆరోగ్యకరమైన pH సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. జంతు ప్రోటీన్‌ను పరిమితం చేయాలి.. మాంసం, గుడ్లు,  చేపలను అధికంగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  మన శరీరంలోని అన్ని భాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి, అందుకే ఏదైనా ఒక భాగంలో సమస్య తలెత్తితే అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా గుండె-ఊపిరితిత్తుల వంటి అవయవాలలో ఏర్పడే సమస్యల గురించి మనమందరం  అప్రమత్తంగా ఉంటాము. ఆ సమస్యల గురించి తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ కళ్ళు,  చెవులు వంటి అవయవాల ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపం. ఆరోగ్య నిపుణులు  కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. కానీ ఈ అవయవాలలో సమస్యలు  తీవ్రమైన దుష్ప్రభావాల ప్రమాదాన్ని కూడా కలిగిస్తాయి. చాలామంది చెవులలో ఒకరకమైన శబ్ధం రావడం గమనిస్తుంటారు. ఇదొక టోన్ లాను, సముద్రపు హోరు లానూ, బీప్ వంటి శబ్ధం లాను ఉంటుంది. చాలామంది ఇదేమి చేస్తుందిలే.. తగ్గిపోతుంది. మనకు బాగా వినిపిస్తోంది కదా అనే నిర్లక్ష్యంతో పట్టించుకోరు. కానీ ఈ చెవి సమస్యను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది  దీర్ఘకాలిక ప్రమాదాలను కలిగి ఉండే ప్రమాదముంది. ఇలా శబ్ధం వినిపించడాన్ని టిన్నిటస్ అని అంటారు.  టిన్నిటస్ సమస్య..  టిన్నిటస్ సమస్యలో  చెవులలో ఒకటి లేదా రెండింటిలో రింగింగ్ లేదా ఇతర శబ్దాలు వినిపిస్తుంటాయి. ఇవి బయట నుండి వినిపించేవి కాదు. ఈ శబ్దాలు కేవలం ఈ సమస్య ఉన్నవ్యక్తులకే వినిపిస్తుంది . ఇతరులు దీన్ని వినలేదు. టిన్నిటస్ అనేది చాలా సాధారణ సమస్య  15% నుండి 20% మంది వ్యక్తులను ఇది ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులలో ఇది వస్తుంటుంది. సాధారణంగా టిన్నిటస్ అనేది అంతర్లీన సమస్య వల్ల వస్తుందని, దానిని గమనించి చికిత్స చేయవలసి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చెవి గాయం లేదా ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు.. ఆరోగ్య నిపుణులు, టిన్నిటస్ ను సాధారణంగా వయస్సు-సంబంధిత వినికిడి లోపం, చెవి గాయం లేదా ఇన్ఫెక్షన్  వంటి అంతర్లీన సమస్య వల్ల సంభవించవచ్చని చెబుతున్నారు. ఈ పరిస్థితులను సకాలంలో గుర్తించకపోతే లేదా చికిత్స చేయకపోతే, దీని కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.  టిన్నిటస్ సమస్యకు  జలుబు వంటి ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కూడా కారణం కావచ్చు, దీని గురించి కూడా శ్రద్ధ వహించాలి. ఈ సమస్యకు  సమయానికి చికిత్స చేయకపోతే, ఇది చెవికి సంబంధించి అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది, చెవుడు కూడా వ్వచే అవకాశం ఉంటుంది.  వినికిడి సమస్య శాశ్వతంగా తగ్గిపోవచ్చు.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు, మన చెవి లోపలి భాగంలో చిన్న, సున్నితమైన కణాలు ఉంటాయి, అవి ధ్వని తరంగాలను స్వీకరించినప్పుడు కంపిస్తాయి. లోపలి చెవిలో ఏదైనా సమస్య ఉంటే, అది టిన్నిటస్‌కు కూడా కారణమవుతుంది.  సమయానికి చికిత్స చేయకపోతే, చెవుల శక్తి  తగ్గిపోతుంది. ఇది కాకుండా, చెవి ఇన్ఫెక్షన్ లేదా చెవిలో ఏవైనా అడ్డుపడటం వల్ల కూడా  ఈ సమస్య రావచ్చు. చెవి ఇన్ఫెక్షన్‌కు సకాలంలో చికిత్స అందకపోతే, మెదడు మాత్రమే కాకుండా ఇతర భాగాలపై కూడా దాని ప్రభావం పడే ప్రమాదం ఉంది.                              *నిశ్శబ్ద.