LATEST NEWS
పాయకరావు పేట తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ  టీడీపీ అభ్యర్థులు ఏడుసార్లు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు విజయం సాధించాయి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో  అంటే 2014లో పాయకరావు పేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి వంగలపూడి అనిత విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికలలో వంగలపూడి అనిత పాయకరావు పేట నుంచి పోటీ చేయలేదు. ఆమె పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేశారు. అక్కడ ఆమె తానేటి వనిత చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఓటమితో ఆమె కుంగిపోలేదు. పార్టీలో మంచి వాగ్ధాటి కలిగిన నేతగా ఎదిగారు. వైసీపీ వేధింపులను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ సారి అంటే 2024 ఎన్నికలలో ఆమె మళ్లీ పాయకరావు పేట నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా అనితకు మంచి గుర్తింపు ఉంది. అదీ కాకుండా వైసీపీ దాష్టికాలను ఎదుర్కొని ప్రజల మన్ననలు కూడా పొందారు.  వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లు టీడీపీకి చెందిన మహిళా నేతలు ఎటువంటి వేధింపులకు గురయ్యారో అందరికీ తెలిసిందే. తెలుగుదేశం మహిళా నేతల చిత్రాలను మార్ఫింగ్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్య వ్యాఖ్యలతో మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేయడం వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు పరిపాటిగా మారింది. అయితే అటువంటి వేధింపులన్నిటీనీ ఎదుర్కొని వంగలపూడి అని గట్టిగా నిలబడ్డారు.  పార్టీ తరఫున వాయిస్ వినిపించే బలమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు.  పాయకరావు పేట రిజర్వ్‌డ్ నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ కాపు సామాజికవర్గం ఓట్లు కూడా చెప్పుకోదగ్గ స్ధాయిలో ఉన్నాయి. అలాగే బీసీ ఓట్లు కూడా అధికమే.  నియోజకవర్గంలోని 18 తీర గ్రామాల్లో మత్స్యకారుల ఓట్లు ఇక్కడ గెలపు ఓటములను ప్రభావితం చేస్తాయి. వంగలపూడి అనిత తన వ్యక్తిత్వంతో, సవాళ్లను దీటుగా ఎదుర్కొని పాయకరావుపేటలో బలమైన పునాది వేసుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో పాయకరావు పేటలో ఆమెకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురుకావడంతో పార్టీ అధినేత చంద్రబాబు ఆమెను నియోజకర్గం మార్చారు. అయితే ఈ సారి ఆమెకు సొంత పార్టీ నుంచి పాయకరావు పేటలో సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అలాగే నియోజకవర్గ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు.  దీంతో ఈ సారి పాయకరావు పేటలో మరో సారి తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.   
వైపీపీ ఓటమి తథ్యమన్న బలమైన సంకేతాన్ని ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్  ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 90శాతం మందికి పైగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. గతంలో ఎన్నడూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 77 శాతం మించిన దాఖలాలు లేవు. అంతెందుకు పొరుగు రాష్ట్రం తెలంగాణలో గతం కంటే తక్కువ మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉద్యోగులు ఉప్పెనలా కదలి వచ్చి మరీ తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు.  ఈ క్రమంలో వారెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు తమ ఓటు ఎక్కడ వేయాలన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇక్కడ కాదు అక్కడ అంటూ తిప్పారు. కొందరు అధికారులు వారి పని ప్రదేశంలోనే వారి ఓటు ఉంటుందని చెబితే మరి కొందరేమో వారు నివసించే ప్రాంతంలోనే వారి ఓటు ఉంటుందని చెప్పారు. ఈ గందరగోళం కారణంగా కొందరు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోలేకపోయారు. మరి కొందరి ఓట్లు గల్లంతయ్యాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ల లో సౌకర్యాలు లేవు. ఇన్ని కష్టాల మధ్య కూడా 90శాతం మందికి పైగా ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  2019 ఎన్నికలలో 77 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైతే.. వాటిలో వైసీపీకి 1.34 లక్షలు, తెలుగుదేశంకు 80 వేలు, జనసేనకు 11 వేలు, బీజేపీకి నాలుగువేల ఓట్లు వచ్చాయి.  అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి అత్యధికంగా 90శాతానికి పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇంత అధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలు కావడమే వైసీపీని ఖంగారు పెడుతోంది. ఆందోళనకు గురి చేస్తోంది. జగన్ సర్కార్ ఉద్యోగులను నానా విధాలుగా వేధించింది. వారి పీఎఫ్ డబ్బులను మళ్లించడం దగ్గర నుంచి అన్ని విధాలుగా వారిని వేధింపులకు గురి చేసింది. చులకనగా చూసింది. మద్యం దుకాణాల దగ్గర కాపలాగా పెట్టింది. అసలు మీరేం పని చేస్తున్నారని సమయానికి వేతనాలు, అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. చివరాఖరికి వారి అటెండెన్స్ విషయంలో కూడా ఫేస్ రికగ్నేషన్ అంటూ ఇబ్బందులకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అనేక కష్టనష్టాలకు ఓర్చి కూడా ఎలాగైనా ఓటు వేసి తీరాలన్న సంకల్పంతో పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోవడం వైసీపీ పట్ల వారికి ఉన్న ఆగ్రహాన్ని, ఎలాగైనా ఆ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న పట్టుదలనూ సూచిస్తోంది. వైసీపీలో అందుకే ఆందోళన వ్యక్తం అవుతోంది.  తాము సృష్టించిన సచివాలయ ఉద్యోగులు వైసీపీకే ఓట్లు వేస్తారని జగన్ సర్కార్ ఆశలు పెట్టుకంది. అయితే సచివాలయ ఉద్యోగులలో కూడా జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి కనిపిస్తోంది. పేరుకు ప్రభుత్వ ఉద్యోగమే అయినా పని ఎక్కువ వేతనం తక్కువ ఉండటంతో వారు కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.   మొత్తం మీద జగన్ పాలనలో తాము ఎదుర్కొన్న కష్టాలు, అనుభవించిన బాధలు, ఎదుర్కొన్న అవమానాలు.. ఇలా అన్నిటికీ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుని బదులు తీర్చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగులు, టీచర్ల ఆగ్రహమే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సునామీగా మారిందని అంటున్నారు. గత ఎన్నికల ముందు అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన తరువాత తుంగలో తొక్కారనీ, హామీలు నెరవేర్చడం, వాగ్దానాలు అమలు చేయడం సంగతి అటుంచి కనీసం ఒకటో తారికు నాటికి వేతనాలు వస్తే చాలు భగవంతుడా అని వేడుకునే స్ధితికి ఉద్యోగులను తీసుకువచ్చిన జగన్ ప్రభుత్వంపై వారి ఆగ్రహం ఓటుగా మారిందని అంటున్నారు.    ఉద్యోగుల ఆగ్రహాన్ని గమనించిన  వైసీపీ నాయకులు  ఏకంగా ఉద్యోగస్తులు పాదాల మీద ఓటు వేయమంటూ బతిమలాడుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.   దీనిని బట్టే ఉద్యోగుల ఆగ్రహజ్వాలల సెగ వైసీపీకి ఎంత గట్టిగా తగిలిందో అర్ధమౌతోందంటున్నారు పరిశీలకులు. 
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో  వైసీపీ ఓట‌మి దాదాపు ఖాయ‌మైంది. జ‌గ‌న్, వైసీపీ అభ్య‌ర్థుల‌పై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతున్నారు. కూట‌మికే మా ఓటు అంటూ వైసీపీ అభ్య‌ర్ధుల ఎదుటే కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తున్నారు. క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తీ రెడ్డి ప్ర‌చార స‌మ‌యంలోనూ ఆమెకు ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న సెగ ఎదురైంది. ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాలు త‌మ‌కు అంద‌డం లేద‌ని, మ‌ళ్లీ వైసీపీకి మేమెందుకు ఓటు వేయాలంటూ భార‌తిని ప్ర‌శ్నించారు. మ‌రోవైపు ఏపీలో పోస్ట‌ల్ బ్యాలెంట్ లో ఉద్యోగులు జ‌గ‌న్ కు బిగ్ షాకిచ్చిన‌ట్లు తెలుస్తోంది. అన్ని అంశాల‌ను బేరీజు వేసుకొని, ప్ర‌ముఖ స‌ర్వేల ఫ‌లితాల బ‌ట్టి ఓడిపోతున్నామ‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్లు వైసీపీ వ‌ర్గాలే చెబుతున్నాయి దీంతో ఏపీలో ఎన్నిక‌లు పూర్త‌యిన త‌రువాత ఆయ‌న దేశం విడిచి వెళ్లిపోయావాల‌ని ప్లాన్ చేసుకున్నారు. జ‌గ‌న్‌పై అవినీతి కేసులు కోర్టులో న‌డుస్తున్నాయి. దీంతో కోర్టు అనుమ‌తి లేకుండా జ‌గ‌న్ దేశం విడిచి పోకూడ‌దు.  ఈ క్ర‌మంలో విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని సీబీఐ కోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్ దాఖలు చేశారు. అయితే, జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వొద్ద‌ని కోర్టును సీబీఐ కోరింది. దీంతో ఎన్నిక‌లు అయిపోగానే విదేశాల‌కు వెళ్లిపోవాల‌ని అనుకున్న జ‌గ‌న్ కు బిగ్ షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.  ఏపీలో మే 13న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అయితే, మే 17 నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్ సీబీఐ కోర్టును కోరారు. జ‌గ‌న్ కుమార్తెలు విదేశాల్లో ఉంటారు. వారితో క‌లిసి లండ‌న్‌, ఫ్రాన్స్‌, స్విట్జ‌ర్లాండ్ ల‌లో ప‌ర్య‌టించేందుకు వీలుగా అనుమ‌తి ఇవ్వాల‌ని జ‌గ‌న్ ఆ పిటిష‌న్ లో కోరారు. దీనిపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని సీబీఐని కోర్టు ఆదేశించ‌గా.. సీబీఐ అధికారులు జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వొద్ద‌ని కోర్టును కోరారు. గ‌తంలో రెండుసార్లు కోర్టు అనుమ‌తితో జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లి వచ్చారు. అప్పుడు సీఎంగా ఉండ‌టంతో అనుకున్న స‌మ‌యానికి తిరిగి వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల జ‌రుగుతున్నాయి. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓట‌మి ఖాయ‌మ‌ని తేలిపోయింది. ఈ క్ర‌మంలో ఆయ‌న విదేశాల‌కు వెళితే తిరిగి వ‌స్తారని గ్యారెంటీ లేద‌న్న వాద‌న‌ను కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. దీంతో తీర్పును ఈనెల 14కి కోర్టు వాయిదా వేసింది. వాస్త‌వానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వేసిన‌టువంటి దాదాపు 30కిపైగా డిశ్చార్జి పిటీష‌న్ల పై గ‌త నెల 30లోగా తీర్పు రావాల్సి ఉంది. అనూహ్యంగా న్యాయమూర్తి మార‌డంతో మ‌ళ్లీ మొద‌టి నుంచి విచారణ చేపట్టాల్సిన ప‌రిస్థితి. కానీ  మే15 నుంచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అస‌లు కేసుల విచార‌ణ ప్రారంభం కానుంది. మెయిన్ కేసుల విచార‌ణ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇండియాలోనే ఉండాలి.. కేసులు జాప్యం జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. వాయిదాలు కోరి కేసులు సాగ‌దీసే అవ‌కాశం ఉంటుంద‌ని సీబీఐ   స్ట్రాంగ్ కౌంట‌ర్ దాఖ‌లు చేసింది.  ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఇటీవ‌ల వైఎస్ ష‌ర్మిల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఓట‌మి ఖాయ‌మైంద‌ని, జ‌గ‌న్ విదేశాల‌కు పారిపోయేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని ఆరోపించారు. ష‌ర్మిల వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియానూ వైర‌ల్ అయ్యాయి. దీంతో సీబీఐ సైతం అల‌ర్ట్ అయ్యింది. జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లేందుకు ఎట్టిప‌రిస్థితుల్లో అనుమ‌తి ఇవ్వొద్ద‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. గ‌తంలో రెండు సార్లు జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లిన స‌మ‌యంలో కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అప్పుడు సీబీఐ కూడా పెద్ద‌గా అడ్డు చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ విదేశాల‌కు వెళితే తిరిగి రాక‌పోవ‌చ్చున‌ని సీబీఐ భావిస్తోంది.   దీంతో కోర్టు దృష్టికి ఇదే విష‌యాన్ని తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. మోడీ, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కూట‌మి బ‌ల‌ప‌డే కొద్దీ జ‌గ‌న్ కు ఉచ్చు బిగుస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌గ‌న్‌పై దృష్టి సారించిన‌ట్లు తెలుస్తుండ‌గా.. జ‌గ‌న్ పై కేసుల్లో క‌ద‌లిక మొద‌లు కాబోతుంద‌న్న చర్చ సైతం మొదలైంది.   ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓట‌మి ఖాయ‌మైన నేప‌థ్యంలో వ‌చ్చే రెండేళ్ల‌లో జ‌గ‌న్ పై కేసుల‌న్నీ పూర్తిచేసి.. ఆయ‌న్ను జైలుకు పంపించ‌డం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయా వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎవ‌రు వ్య‌తిరేకంగా మాట్లాడిన వారి వెనుక చంద్రబాబు కుట్ర ఉంద‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేయ‌డం కామ‌న్‌. ప్ర‌స్తుతం కోర్టులో సీబీఐ వాద‌న‌ల విష‌యంలో చంద్ర‌బాబు కుట్ర ఉంద‌ని వైసీపీ నేత‌లు అన్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. సాధార‌ణంగా ఎన్నిక‌లు పూర్త‌యిన త‌రువాత ఏ పార్టీ అయినా పోలింగ్ ప్ర‌క్రియ‌పై స‌మీక్ష చేసుకుంటుంది. కానీ, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలింగ్ స‌ర‌ళిపైనా, వైసీపీకి ఏమేర‌కు ఓటు శాతం న‌మోదైంద‌న్న విష‌యాల‌పై స‌మీక్ష‌లు చేయాల్సింది పోయి.. ఎన్నిక‌లు అయిపోయిన నాలుగురోజుల్లోనే విదేశాల‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవ‌టం ప‌ట్ల ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుక‌నే సీబీఐ జ‌గ‌న్‌ విదేశాల‌కు వెళ్ల‌కుండా అడ్డుప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి మున్ముందు కాలంలో అరెస్టు నుంచి త‌ప్పించుకునేదుకు జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్నీ బెడిసికొడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అలాగే జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌డం దాదాపు ఖాయ‌మైంద‌న్న వాద‌న ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.
ALSO ON TELUGUONE N E W S
జాక్వెలిన్ ఫెర్నాండేజ్..శ్రీలంక కి చెందిన ఈ ముద్దుగుమ్మ 2009 లో వచ్చిన అలాదిన్ తో హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసింది. మొదటి సినిమాతోనే అమితాబ్ బచ్చన్ వంటి టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకొని అందరి దృష్టి ఆకర్షించింది. ఆ తర్వాత హౌస్ ఫుల్ పార్ట్ 1 ,పార్ట్ 2 , రామయ్య వస్తావయ్యా, రాయ్,కిక్ ఏ జెంటిల్ మాన్, రేస్ 2 , హౌస్ ఫుల్ త్రీ, సర్కస్, సెల్ఫీ ఇలా  సుమారు  ముప్పై కి పైగా చిత్రాల్లో నటించింది. తాజాగా  ఒక కొత్త మూవీకి కమిట్ అయిందనే  వార్తలు వస్తున్నాయి.  2018 లో సంతోష్ శోభన్ ,రియా సుమన్ లు  జంటగా  వచ్చిన మూవీ పేపర్ బాయ్. జయశంకర్ దర్శకుడు. ప్రెజంట్ అరి అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.  జూన్ లో విడుదల కాబోతుంది. ఇప్పుడు ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ మూవీని జాక్వెలిన్ తో చెయ్యబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.  కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ సబ్జట్ తో తెరకెక్కబోతున్న  ఆ  మూవీ కథ జాక్వెలిన్ కి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. గతంలో  నయనతార నటించబోతుందనే రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు  నయన్ ప్లేస్ లో జాక్వెలిన్  చేరిందనే మాటలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ విషయం మీద ఎలాంటి అధికార ప్రకటన లేదు  ఇది ఎవరు  ఊహించని ఒక వెరైటీ కాంబో  అని చెప్పవచ్చు.పైగా  నార్త్ లో జాక్వెలిన్ కి మార్కెట్ ఉంది  కాబట్టి  పాన్ ఇండియా మూవీగా కూడా  మారవచ్చు.  రెబల్ స్టార్  ప్రభాస్ సాహో లో జాక్వెలిన్  ఒక ప్రత్యేక గీతంలో  మెరిసి తెలుగు ప్రేక్షకులని  తన అందంతో మెస్మరైజ్ చేసింది    
పాన్ ఇండియా లెవల్లో అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకొంటున్న మూవీ రామాయణ. బాలీవుడ్ లో నిర్మాణం జరుపుకుంటున్నా కూడా రాముడు అందరి వాడు కాబట్టి మూవీపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.  ఎలాంటి అనౌన్సుమెంట్  లేకుండానే  షూటింగ్ ని  జరుపుకుంటుంది.ఇప్పుడు ఈ మూవీని ఆపండి అని నోటీసులు వెళ్లాయి అల్లు అరవింద్..తెలుగు చిత్ర సీమలో ఉన్న బడా నిర్మాతల్లో ఒకరు.  గీత ఆర్ట్స్ బ్యానర్ పై 1974 నుంచి సినిమాలు నిర్మించుకుంటు వస్తున్నారు. దాదాపుగా అన్ని కూడా విజయవంతమైన చిత్రాలే. బాలీవుడ్ లో కూడా అమీర్ ఖాన్ తో గజని ని నిర్మించాడు. ఇప్పుడు ఈయనే  రామాయణ కి నోటీసులు పంపించారు .సినిమా షూటింగ్ ముందుకు వెళ్లకూడదని నోటిసుల్లో స్పష్టంగా ఉంది. మధు వంతెన అనే ఒక పార్టనర్ తో కలిసి అరవింద్ రామాయణ ని గతంలో అనౌన్సుమెంట్  చేసారు. ఆ మేరకు స్క్రిప్ట్ ని  కూడా రెడీ చేయించారు.ప్రైమ్ టెక్నాలజీ అనే సంస్థ కూడా వారితో భాగస్వామ్యం అయ్యింది. అలాంటిది   ఆ ఇద్దరి  అనుమతి లేకుండా ప్రైమ్ టెక్నాలజీనే రామాయణ ని  తెరకెక్కిస్తోంది. అందుకే నోటీసులు పంపించారు. షూటింగ్ కి ముందుకు వెళ్తే  చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు  ఇక రామాయణ లో బాలీవుడ్ అగ్ర నటుడు రణబీర్ కపూర్ రాముడు గా, సీతగా సాయి పల్లవి చేస్తుంది. దీంతో అందరిలోను మూవీ  మీద ఆసక్తి నెలకొని ఉంది. పైగా రావణుడుగా   కెజిఎఫ్ తో  యష్ చేస్తుండంతో మూవీ కి వెయ్యి టన్నుల బలం వచ్చినట్టయ్యింది.  మిగతా క్యారక్టర్ ల గురించి అధికార ప్రకటన అయితే రాలేదు గాని అన్ని  భాషలకి చెందిన భారీ నటులే ఇందులో నటిస్తున్నారు. నితీష్ తివారి,రవి ఉదయార్ లు కలిసి  దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మూవీకి సంబంధించిన కొన్ని స్టిల్స్ కూడా బయటకి వచ్చాయి.కాకపోతే వాటిని  యూనిట్ మాత్రం రిలీజ్ చెయ్యలేదు  
మూవీ : ఆవేశం నటీనటులు: ఫహద్ ఫాజిల్, హిప్ స్టర్, మిథున్ జై శంకర్, రోషన్ షానవాస్, షాజిన్ గోపు, మన్సూర్ అలీఖాన్ తదితరులు ఎడిటింగ్: వివేక్ హర్షన్ మ్యూజిక్: శుసిన్ శ్యామ్ సినిమాటోగ్రఫీ: సమీర్ తాహిర్ నిర్మాతలు: నజ్రియా నాజిమ్, అన్వర్ రషీద్ రచన, దర్శకత్వం: జీతూ మాధవన్ ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో కథ : బెంగుళూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేందుకు కేరళకి చెందిన బిబి (మిథున్ జెఎస్), శాంతన్(రోషన్ షానవాస్), అజు(యూట్యూబర్ హిప్ స్టర్) వస్తారు. ఈ ముగ్గురు ముందు తెలియకపోయినా అక్కడికి వెళ్ళాక కలిసిపోతారు. అయితే అదే కాలేజీలోని సీమియర్ బ్యాచ్ వారిని ర్యాగింగ్ పేరుతో తీవ్రంగా అవమానిస్తారు. అక్కడ వారికి సపోర్ట్ లేకపోవడంతో ఆ ముగ్గురు కలిసి లోకల్ గూండా రంగ(ఫహద్ ఫాజిల్) ని సంప్రదిస్తారు. రంగది డిఫరెంట్ క్యారెక్టర్. ప్రేమ, కోపం అన్నీ ఎక్కువగా ప్రదర్శిస్తుంటాడు. ర్యాగింగ్ విషయం తెలుసుకున్న రంగ ఆ సీనియర్ గ్యాంగ్ కి బుద్ధి చెప్తాడు. దాంతో అజు, బిబి, శంతనులపై రంగా మనుషులనే ముద్ర పడుతుంది. కాలేజీలోనూ వారి హావా సాగుతుంది. తర్వాత చదువు నిర్లక్ష్యం చేయడంతో అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అవుతారు. దాంతో కాలేజ్ డైరెక్టర్ పిలిచి ఆఖరి అవకాశం ఇస్తాడు. ఇక ఆ ముగ్గురు రంగాకి దూరంగా వెళ్ళి చదువుకోవాలనుకుంటారు కానీ రంగా వారిని వదిలిపెట్టడు. మరి ఆ ముగ్గురు ఏం చేశారు? మొదట ఆ ముగ్గురికి సపోర్ట్ చేసిన రంగానే వారిని ఎందుకు చంపాలనుకున్నాడు? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. విశ్లేషణ:  కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో ర్యాగింగ్ అనేది మాములుగా ఉంటుంది. అయితే కొంతమంది సీనియర్స్ చేసే ర్యాగింగ్ కి తట్టుకోలేక కొత్తగా వచ్చిన విద్యార్థులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. వారిలోని తిరుగుబాటు కొన్నిసార్లు వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది. దానినే తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు. తమకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ముగ్గురు కుర్రాళ్ళు కలిసి రంగా అనే రౌడీతో డీలింగ్ కుదుర్చుకోవడం.. అతను సీనియర్స్ కి బుద్ది చెప్పడం అంతా బాగుంటుంది.  రంగా పాత్రకు నెగెటివ్ షేడ్స్ తో పాటు కామెడీ, అతిగా స్పందించే తీరు అన్నీ కలిసి ప్రేక్షకుడికి నచ్చేస్తుంది. అతను నెక్స్ట్ ఎలా రియాక్ట్ అవుతాడో అనే ఉత్సుకత సీన్ మారే కొద్ది పెరిగిపోతుంది. ముగ్గురు కుర్రాళ్ళతో కలిసి రంగా చేసే సీన్లు సాధారణంగా ఉన్నా .. ఫహద్ ఫాజిల్ ఎనర్జీని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వన్ పర్సెంట్ కూడా తగ్గకివ్వకుండా చూసుకున్నాడు దర్శకుడు. గ్యాంగ్ స్టర్ గా రంగా ఎలా మారాడని తెలిపే సీన్లు కాస్త స్లోగా అనిపిస్తాయి.  సినిమా ప్రథమార్ధంలో మొదటి ముప్పై నిమిషాలు మాములుగా సాగుతుంది. ఎప్పుడైతే రంగా పాత్ర పరిచయం అవుతుందో అక్కడి నుండి కథ పరుగులు తీస్తుంది. మన తెలుగు సినిమాలలోని కొన్ని సీన్లని వాడుకున్నట్టుగా అనిపిస్తుంది. అవేంటనేది 'ఆవేశం' చూస్తేనే తెలుస్తుంది. కథ సెకండాఫ్ లో కాస్త స్లోగా సాగినా క్లైమాక్స్ ముగించిన తీరు కన్విన్సింగ్ గా ఉంటుంది. యాక్షన్ సీన్లకి కొదవలేదు. రంగా గ్యాంగ్ కి అతడి ప్రత్యర్థి గ్యాంగ్ కి మధ్య వచ్చే ఫైట్ సీన్లు మెప్పిస్తాయి. మదర్ సెంటిమెంట్ సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చింది. అడల్ట్ సీన్లు లేవు. అసభ్య పదజాలం వాడలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. శుసిన్ శ్యామ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సమీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది.  నటీనటుల పనితీరు: కాలేజ్ కుర్రాళ్ళుగా హిప్ స్టర్, మిథున్, రోషన్ చక్కగా నటించారు. గ్యాంగ్ స్టర్ రంగా పాత్రలో ఫహద్ ఫాజిల్ నటన మరో స్థాయిలో ఉంది. మొదటి ముప్పై నిమిషాల తర్వాత సినిమా మొత్తం రంగా పాత్రే కన్పిస్తుంది. ఇక మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా..   ఫహద్ ఫాజిల్ ఆవేశం ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తుంది.  రేటింగ్ : 3.25/5 - దాసరి మల్లేశ్
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వివిధ రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎ.పి.లో మే 13న జరిగే ఎన్నికలపైనే అందరి దృష్టీ ఉంది. ముఖ్యంగా పవన్‌కళ్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం ప్రత్యేతను సంతరించుకుంది. దీంతో అతనికి మద్దతుగా స్వయంగా మెగాస్టార్‌ ఫ్యామిలీ ప్రచారంలోకి దిగుతోంది. ముందుగా చిరంజీవి స్వయంగా ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. తమ్ముడికి ఓటు వేయమని మెగాస్టార్‌ రిక్వెస్ట్‌ చేశారు.  ప్రస్తుతం రామ్‌చరణ్‌, నాని వంటి హీరోలు కూడా సోషల్‌ మీడియా వేదికగా పవన్‌కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించారు. ఆల్రెడీ సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ వంటి హీరోలు ప్రచారం జోరుగా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్‌ కూడా ఓ ట్వీట్‌ ద్వారా పవన్‌కళ్యాణ్‌ను సపోర్ట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడీ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ‘మీ ఎన్నికల ప్రయాణం సజావుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేవకే అంకితమై  మీరు ఎంచుకున్న మార్గం పట్ల నాకెప్పుడూ గర్వంగానే ఉంటుంది.. ఓ కుటుంబ సభ్యుడిగా నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను.. మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను’ అని బన్ని తన ట్వీట్‌లో ఆకాంక్షించారు.
తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆయనొక విజనరీ. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణలు, భావి తరాల భవిష్యత్తుకు వేసిన బాటలు చరిత్ర. తెలుగు జాతి ఉన్నతికి కృషి చేసిన ఆయన జీవితంపై ఓ బయోపిక్‌ తెరకెక్కింది. నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్‌ ‘తెలుగోడు’. ప్రపంచంపై తెలుగోడి సంతకం అనేది ఉపశీర్షిక. విజయవాణి ప్రొడక్షన్స్‌ పతాకంపై చీలా వేణుగోపాల్‌ సమర్పణలో సినిమా తెరకెక్కింది. కథ, కథనం, మాటలు అందించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో డాక్టర్‌ వెంకీ మేడసాని ఈ చిత్రాన్ని నిర్మించారు. యూట్యూబ్‌లో సినిమాను విడుదల చేశారు. గురువారం ఉదయం విడుదలైన ఈ సినిమా సామజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. చిత్రసీమలో ఎటువంటి నేపథ్యం గానీ, అనుభవం గానీ లేని హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ వెంకీ మేడసాని... తొలి ప్రయత్నంలో తెలుగు ప్రజానీకంపై తనదైన ముద్ర వేసిన చంద్రబాబు బయోపిక్‌ తీసి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమా విడుదలైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘’చంద్రబాబుగారి జీవితంలో, ఆయన పరిపాలనలో చేపట్టిన సంస్కరణల వల్ల ప్రజల జీవితాలు మారాయి. నన్ను ఆ అంశం ఎక్కువ ఆకర్షించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాలు గడిచినా పల్లెటూరి ప్రజల జీవితాలు మారలేదు. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కారణంగా నగరాలకు వచ్చిన పల్లె ప్రజలు ఉన్నతమైన జీవితం సాగిస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్స్‌ మాత్రమే కాదు. సమాజంలో వచ్చిన మార్పు కూడా! ఎటువంటి సామజిక అసమానతలు లేకుండా అందరూ ఒక్కటిగా బతుకుతున్నారు. ఆ పాయింట్‌ మీద సినిమా తీశా’’ అని చెప్పారు. అభివృద్ధి అందరినీ ఒక్కటి చేస్తుందనే అంశం మీద తాను సినిమా తీశానని, నారా చంద్రబాబునాయుడుగారు ఎలా ఆలోచించారు? అనేది ‘తెలుగోడు’ కాన్సెప్ట్‌ అని డాక్టర్‌ వెంకీ మేడసాని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ‘’ప్రపంచానికి తెలియని ఓ ప్రాంతాన్ని ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చాలని భావించిన ఓ నాయకుడి కథ మా సినిమా. ఐదారు నెలల క్రితం సినిమా తీయాలని నేను అనుకున్నా. కథ సిద్ధం చేశాక కొందరు నిర్మాతలను కలిశా. కొందరు పెద్దలనూ కలిశా. రాజకీయ నాయకుడి సినిమా సినిమా తీస్తే విజయం సాధించదని వారించారు. పాయింట్‌ నచ్చి సినిమా తీశా. చిన్న ఆర్టిస్టులతో పెద్ద సినిమా తీశాం. కంటెంట్‌ మీద నమ్మకంతో ప్రజలకు చేరువ అవుతుందని తీశాను. ఎక్కువ మంది ప్రజలకు సినిమా చేరాలనే ఉద్దేశంతో యూట్యూబ్‌ రిలీజ్‌ చేశాం. నేను సినిమా తీయగలననే కాన్ఫిడెన్స్‌ ఈ సినిమా ఇచ్చింది’’ అని చెప్పారు. చంద్రబాబు పాత్రలో వినోద్‌ నటించిన ‘తెలుగోడు’ చిత్రానికి ఛాయాగ్రహణం: మల్లిక్‌ చంద్ర, సంగీతం: రాజేష్‌ రాజ్‌, కథ, స్క్రీన్‌ప్లే,  డైలాగ్స్‌, ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ : డాక్టర్‌ వెంకీ మేడసాని.
రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెంబరు- 2 చిత్రం 'మహేంద్రగిరి వారాహి'.  ఈ చిత్ర గ్లిమ్స్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. అలాగే గ్రిమ్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు. గ్లిమ్స్ కు విశేష స్పందన లభించింది. లేటెస్ట్ గా మహేంద్రగిరి వారాహి సినిమాలో విలక్షణ నటుడు, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత కాలిపు మధు వెల్లడించారు. మహేంద్రగిరి వారాహి స్క్రిప్ట్ అద్భుతంగా నచ్చి బ్రహ్మానందం ఈ సినిమా చేయబోతున్నారని, త్వరలో మొదలుకాబోయే షెడ్యూల్ లో బ్రహ్మానందం పాల్గొనబోతున్నారని చిత్ర దర్శకులు సంతోష్ జాగర్లపూడి తెలిపారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత కాలిపు మధు తెలిపారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
The highly anticipated movie, "Kannappa," has welcomed another significant addition to its already star-studded cast. Prabhas has officially joined the production, adding his immense talent to the team alongside Akshay Kumar, Mohan Babu, Mohanlal, and Sarathkumar. Vishnu Manchu, the driving force behind this passion project, has dedicated seven years to meticulously shaping the narrative, infusing it with depth and grandeur. Directed by Mukesh Kumar Singh, "Kannappa" pays homage to the unwavering devotion of Bhakta Kannappa, a devout follower of Lord Shiva. "Kannappa" boasts an impressive crew, including renowned Hollywood cinematographer Sheldon Chau and action director Kecha Khamphakdee. With its blend of captivating visuals and a poignant narrative, the film is poised to leave a lasting impact on audiences worldwide.
NTR seems to be on a roll. The actor is currently busy with Devara Part 1 directed by filmmaker Siva Koratala. After "Devara," the actor has multiple big projects in the pipeline, such as "War 2," "NTR Neel," and "Devara Part 2." Everyone is excited about NTR's Bollywood debut with Yash Raj Films' Spyverse film, "War 2," where the actor shares the screen with Greek God, Hrithik Roshan. The collaboration of these two phenomenal actors for an action drama is a delight for Indian cinema fans. NTR will be playing an Indian agent in "War 2." The shoot is going on in Mumbai. Both NTR and Hrithik Roshan are highly acclaimed for their extraordinary dancing abilities. Both stars have demonstrated exceptional dance techniques in numerous films. Furthermore, NTR and Ram Charan enthralled the global audience with dance skills in the internationally super hit film “RRR,” particularly in the popular song “Naatu Naatu,” which received the prestigious Oscar Award for Best Original Song. No wonder that producer Aditya Chopra is now planning a bigger song than “Naatu Naatu” between Hrithik Roshan and NTR. Ganesh Acharya will compose and choreograph a song featuring Hrithik Roshan and NTR. This song is intended to become the next major international hit from India. The film is packed with adrenaline-pumping chases and action stunts. This exciting news raised expectations on the biggie and fans are eager witness their epic face off. The film will be directed by Ayan Mukerji and produced by Aditya Chopra.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ఖర్జూరానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన  ఖర్జూరాలు రుచికే కాదు..  ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలు కలిగిస్తాయి. అయితే ఖర్జూరాలను రాత్రి పడుకునే ముందు తేనెతో కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. తేనె, ఖర్జూరం కాంబినేషన్ కేవలం ఒకటని కాదు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది.  రాత్రి పడుకునే ముందు తేనె,  ఖర్జూరం లో ఉండే పోషకాలేంటో.. వాటిని కలిపి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. తేనె పోషకాలు.. ఒక టేబుల్ స్పూన్ తేనెలో - కేలరీలు: 64, కొవ్వు: 0 గ్రా, సోడియం: 0 mg, పిండిపదార్థాలు: 17 గ్రా, ఫైబర్: 0 గ్రా, చక్కెరలు: 17 గ్రా, ప్రోటీన్: 0.1 గ్రా, పొటాషియం: 10.9 mg, ఇనుము: 0.1 mg, కాల్షియం: 1.3 mg ఉంటాయి. ఖర్జూరం పోషకాలు.. ఎండు ఖర్జూరంలో  కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెరలు, ఖనిజాలు (కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ మొదలైనవి),  విటమిన్లు (B1, B2, C, మొదలైనవి) వంటి పోషకాలు ఉంటాయి. ఇది టానిన్లు, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ మొదలైన వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఖర్జూరాన్ని తేనెతో కలిపి తింటే.. రాత్రి పడుకునే ముందు ఈ రెండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ గుణాలు వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. తేనె, ఖర్జూరం రెండు తీసుకుంటే   శరీరంలో ఎలాంటి వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండింటిని కలిపి తింటే ఆకలి కూడా పెరుగుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. తేనె, ఖర్జూరం కాంబినేషన్ జుట్టు పెరుగుదలను కూడా పెంచుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ రెండూ వేడిగా ఉంటాయి కాబట్టి వేసవి కాలంలో వీటి వినియోగాన్ని తగ్గించాలి.                                                       *రూపశ్రీ.
వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.  ఎందుకంటే ఈ సీజన్‌లో జీర్ణక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఆహారంలో జీర్ణక్రియను ప్రేరేపించే ఆహారాలు తీసుకోవాలి. దీనివల్ల  జీర్ణక్రియ  ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వేసవి కాలంలో లిక్విడ్ ఫుడ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వేసవి కాలంలో  ఎక్కువగా పండ్లు,  కూరగాయల రసాలను తాగుతారు. ఇది  మాత్రమే కాకుండా సత్తును త్రాగితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. యూట్యూబ్ పుణ్యమా అని  ఎన్నో రాష్ట్రాలు, దేశాల ఆహారాలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో సత్తు కూడా ఒకటి.  ఇది వేసవిలో సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది. దీన్ని పాలలో కలుపుకుని తాగితే పొట్ట చల్లగా ఉండడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. సత్తులో పోషకాలు..  సత్తులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాకుండా  ఐరన్, కాల్షియం, మెగ్నీషియం,  పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. సత్తును  పాలతో కలిపి త్రాగితే ఇది పోషక లక్షణాలను పెంచుతుంది. వేసవి కాలంలో శరీరం  శక్తి స్థాయి కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. ఇలాంటి  పరిస్థితిలో సత్తును తీసుకుంటే శక్తివంతంగా ఉండవచ్చు. ఇది కాకుండా శరీరంలో రక్త హీనతతో బాధపడుతున్న వ్యక్తులు సత్తును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వేసవిలో  జీర్ణవ్యవస్థ కొద్దిగా బలహీనపడుతుంది. ఇలాంటి సమయంలో సత్తును తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, లూజ్ మోషన్ మొదలైన కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక పాలతో సత్తును తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేవారు  దీన్నితమ డైట్ లో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సత్తు కేవలం చల్లదనాన్ని, శరీరానికి పోషణను, జీర్ణ ఆరోగ్యాన్ని బాగు చెయ్యడమే కాదు.. ఎముకలకు బలాన్ని కూడా ఇస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అయితే.. దీన్ని రెగ్యులర్ గా డైట్ లో భాగం చేసుకునే ముందు  ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.                                                  *రూపశ్రీ.