LATEST NEWS
  చిత్తూరు జిల్లా కుప్పం ఘటన బాధితురాలు శిరీషను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నరు. ఇలాంటి ఘటనలను సహించబోమని ఆమెతో ముఖ్యమంత్రి తెలిపారు.గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని ఆమె చెప్పారు. ఈ ఘటనలో పిల్లలు, తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రికి బాధితురాలు గోడు వెళ్లబోసుకున్నారు. ఇలాంటి ఘటన దురదృష్ణకరమని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.  మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.ఈ సందర్భంగా బాధితురాలికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. పిల్లల చదువుకు హామీ ఇచ్చారు. అన్నివిధాలా అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని సీఎం భరోసా ఇచ్చారు.చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదన్న కారణంతో శిరీషా అనే మహిళను చెట్టుకు కట్టేసి సంగతి తెలిసిందే  
  టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఉండగా, మీడియా ముందు ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు టీపీసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి లీగల్ నోటీసులు పంపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కారు తన చేతికానీతాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి  దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే బేషరతుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.  చట్టాలను గౌరవించే వ్యక్తులుగా అక్రమంగా పెట్టిన కేసు విచారణకు సైతం హాజరై సహకరించామని తెలిపారు. ఆరు గ్యారెంటీలను, 420 హామీలను పూర్తిగా గాలికొదిలేసి ఇలాంటి దిక్కుమాలిన చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని  కేటీఆర్ హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు కూడా చూస్తూ ఊరుకోబోరని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని తేల్చిచెప్పారు.స్థానిక ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతోనే మరోసారి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు తప్ప, ఈ లొట్టపీసు కేసుతో ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతున్నట్టు కనిపిస్తోందని, రాష్ట్రాన్ని నడిపించే సత్తా, సామర్థ్యం లేకపోవడంతోనే ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ కుట్రలతో కాలం వెల్లదీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం రాజకీయంగా పబ్బం కడుక్కునేందుకు చేసే ఇలాంటి దుర్మార్గపూరిత వ్యాఖ్యల పైన మహేష్ కుమార్ గౌడ్ లాంటి నాయకులను కోర్టులకు ఈడుస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా పరిపాలన పైన దృష్టి పెట్టి, అటెన్షన్ డ్రైవరేషన్ డ్రామాలను పక్కన ప్రతిపక్ష నాయకుల పైన  ప్రాపగాండా చేయడం మానాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి చేసే అంశాల పైన దృష్టి సారించాలని హితవు పలికారు.
  ప్రముఖ నటి రమ్యశ్రీపై దాడి జరిగింది. ఆమె సోదరుడు ప్రశాంత్ వీడియో తీస్తున్నారని సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు  అనుచరులు దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్  గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. లేఅవుట్లో ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేశారు. వీడియో తీస్తున్న నటి రమ్యశ్రీ సోదరుడు పై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి ప్లాట్ యజమానురాలైన సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంతపై  కత్తి, క్రికెట్ బ్యాట్ తో దాడికి పాల్పడ్డారు.  శ్రీధర్ రావు అనుచరులు గాయాల పాలైన  సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు దుండగులు.. తమపై  హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారని  సినీ నటి రమ్యశ్రీ వాపోయారు. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ALSO ON TELUGUONE N E W S
  తెలుగు నట దిగ్గజం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను దేశ విదేశాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా సాగాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ యూనివర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్, టీడీపీ పొలిటికల్ సెక్రటరీ టీజీ జనార్థన్, టీఎఫ్ పీసీ సెక్రటరీ, ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో   నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. "తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్. సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ తన ప్రత్యేకత చూపించారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని నిరూపించారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్ని దేశ దేశాల్లో ఘనంగా నిర్వహించుకున్నాం. ఆ సక్సెస్ ను పురస్కరించుకుని ఎన్టీఆర్ యూనివర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న మా టీడీ జనార్థన్ గారికి ఇతరులకు నా అభినందనలు తెలియజేస్తున్నా. మేము విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి తెలుగు వారు ఎన్టీఆర్ పట్ల చూపించిన అభిమానం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఉన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను, ఆయన స్ఫూర్తిని ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింతగా తెలుగు ప్రజలకు చేరువచేయాలి." అన్నారు.   ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్థన్ మాట్లాడుతూ.. "ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించాం. మొదటి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారితో పాటు ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, దగ్గుబాటి వారి కుటుంబాల నుంచి అతిథులుగా పాల్గొన్నారు. ఆ తర్వాత అమెరికాలో కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం గురించి తెలిసి దేశ విదేశాల్లోని అన్నగారి అభిమానులు మా దేశంలో నిర్వహిస్తాం అంటూ ముందుకొచ్చారు. అలా దుబాయ్, సింగపూర్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి 8 దేశాల్లోని 13 నగరాల్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం జరిపారు. ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో జరిగిన కార్యక్రమాల్లో రామకృష్ణ గారు, చంద్రమోహన్ రెడ్డి, నర్సిరెడ్డి, నారా రోహిత్, బోడె ప్రసాద్  పాల్గొన్నారు. ప్రపంచ సినీ చరిత్రలో ఎన్టీఆర్ వంటి గొప్ప నటుడు లేరు. ఆయన గొప్పదనం ఈతరం వారికి తెలిసేలా మొదట్లో ఒక వెబ్ సైట్ లాంఛ్ చేశాం, ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రసంగాలతో భగీరథ గారు రచన చేసిన బుక్ ప్రింట్ చేశాం. ఇంకా ఆయన చరిత్రను చిరకాలం తెలుగు వారికి అందించేలా మీ దగ్గర ఉన్న ఫొటోస్, వీడియోస్ కూడా మాకు పంపవచ్చు. వాటిని కూడా గ్రంథస్థం చేస్తాం NTR భావజాలం ప్రజల్లోకి తీసుకెళ్తానికి కమిటీ కృషికి ధన్యవాదాలు." అన్నారు.   టీఎఫ్ పీసీ సెక్రటరీ, ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్.. "ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం దేశ దేశాల్లో ఘనంగా జరగడం సంతోషకరం. నటుడిగా, ప్రజా నాయకుడిగా ఎన్టీఆర్ గురించి ఎన్నేళ్లయినా చెప్పుకోవచ్చు. సినీ రంగంలో హీరోగా వెలుగుతున్నప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినా మన తెలుగు సినీరంగం, తెలుగు ప్రేక్షకులకే నా నటన అంకితమని చెప్పి ఆ అవకాశాలు తిరస్కరించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. ఆయన శతజయంతి వేడుకల్ని నిర్వహించేందుకు అప్పటి ఏపీ ప్రభుత్వ పాలకులు అనుమతి ఇవ్వలేదు, ఇక్కడ హైదరాబాద్ లోనూ అనేక ప్లేస్ లు మార్చి చివరకు కైత్లాపూర్ లో అనుమతి ఇచ్చారు. ఎలాంటి సహకారం అందించలేదు. అందుకే అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ప్రజలు ప్రభుత్వాలను మార్చేశారు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు గారు ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28ని సెలవు దినంగా ప్రకటించారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ప్రకటించారు. మొదటగా బాలకృష్ణ గారికి ఆ అవార్డ్ ఇవ్వడం ఆనందకరం. బాలకృష్ణ గారు నటుడిగా తాతమ్మ కల మూవీ నుంచి చూస్తే 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయనకు పద్మభూషణ్ ఇవ్వడం సముచిత గౌరవం ఇచ్చినట్లయింది." అన్నారు.  
  జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' (RRR) ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. 2022లో విడుదలైన ఆర్ఆర్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్ల గ్రాస్ రాబట్టింది. గ్లోబల్ స్థాయిలో ఎన్నో పురస్కారాలను, ప్రశంసలను అందుకుంది. తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సాధించింది.   ఇండీవైర్ అనే ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ 2020లలో ఇప్పటిదాకా వచ్చిన వంద ఉత్తమ చిత్రాల లిస్టుని ప్రకటించింది. ఇందులో ఆర్ఆర్ఆర్.. 75వ స్థానాన్ని సంపాదించుకుంది. మొదటి మూడు స్థానాల్లో 'నికెల్ బాయ్స్', 'ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్', 'ఆఫ్టర్ సన్' చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. ఏడో స్థానంలో 'టాప్ గన్: మావెరిక్', 54వ స్థానంలో 'ఓపెన్‌హైమర్', 58వ స్థానంలో 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' నిలిచాయి.   రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. ఈ యాక్షన్ అడ్వెంచర్ తో మరోసారి గ్లోబల్ వైడ్ గా రాజమౌళి పేరు మారుమోగిపోవడం ఖాయమని చెప్పవచ్చు.    
One of India’s biggest superstars ever, Hrithik Roshan, hailed as the Greek God of India cinema, has captivated the imagination of one and all with his hypnotic screen presence in the War 2 teaser in which he again looked like a million bucks. Hrithik plays the role of the super spy Kabir in the blockbuster War franchise within the YRF Spy Universe that has only delivered historic hits!  His suave look and effortless style caused an internet meltdown as soon as the War 2 teaser was released by Yash Raj Films. The costume designer of War 2, Anaita Shroff Adajania, reveals the film will push Hrithik’s magnetic presence ever further with the way his character has been styled in War 2.  Anaita says, “I’ve been incredibly fortunate to work with Hrithik over the years — on Dhoom 2, Bang Bang, countless appearances and ads—and then came War. Each project brought something new, but with War, we made a conscious decision to shift gears. We moved away from the grunge aesthetic and instead created a cleaner, sleeker look for him. It still had an edge—somewhere between real and godlike. And yes, kind of like a a super hero in plainclothes! His look determined, yet casual.” She adds, “For War 2, it felt essential to explore a deeper, darker mood in Kabir. This version of him is layered—not just emotionally, but visually too. Thinner fabrics, pieces that feel a little more lived-in, slightly unkempt even… and there’s more! But of course, Kabir is still Kabir — his sharpness always cuts through.” Anaita further says, “We built on what worked in War 1: that transformative haircut, Hrithik’s magnetic presence, and then we just pushed it further. I think that combination—the looks, the attitude, the restraint—is what truly created this Kabir for War 2.” Produced by Aditya Chopra and directed by Ayan Mukerji, War 2 pits NTR, regarded as the Man of the Masses, against Hrithik Roshan. Kiara Advani plays the female lead. War 2 is set to release on August 14th worldwide in Hindi, Tamil, and Telugu.
Sekhar Kammula's Kuberaa starring Dhanush, King Nagarjuna, Rashmika Mandanna has been in production for two years and the makers had to rush to the finish line with OTT Platform's ultimatum. They are completing the post prodcution works for the film without sleep for the movie to have smooth release on 20th June.  Producer Asian Suniel Narang himself stated that Amazon Prime Video gave them 47 crores deal for OTT rights and gave an ultimatum that if they don't release on 20th, then, the makers will have to give back 10 crores. So, the producers on tight schedules started finishing Tamil, Telugu and other language works.  Now, even Vijay Deverakonda's Kingdom is facing such a restriction from OTT platform, say reports. The movie has been in production for long time and after announcing two release dates in May, they postponed due to post production works and unconfirmed re-shoots.  As the re-shoots need time, the makers have even postponed from 4th July date. Now, reports suggest that the OTT platform Netflix, have asked the makers to release it by 25th July, otherwise they will lose money on the deal. So, Kingdom makers have started last minute rush to the finish line, suggest reports.  Also, Vijay Deverakonda wants this to be his big comeback after many disasters at the box office and hence, he is doubly working hard and co-operating to the makers in every possible way, say reports. Gowtham Tinnanuri is directing the film with Naga Vamsi producing it and Anirudh Ravichander is scoring music for it.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Suriya has a huge fan following in Tamil and Telugu states. Earlier in his career, post a film like Nandha, he started experimenting and it grew his image in both the languages. Even his consistency earned him fans in Kerala and he started trying out bigger films in commercial angle.  But his reliance on over commercialisation of certain stories lead to him not having a big blockbuster success at the box office over a decade. Even his recent film, Retro failed to become a hit even though Karthik Subbaraj kind of a director made it. Suriya has even dropped Vaadivaasal film with Vetrimaaran.  Now, director Karthik Subbaraj revealed that he is planning to release Retro's extended version as a mini-series of 40-50 minute, 4-5 episodes on OTT platform. He stated that he has the content ready to release after 4 months and if OTT platform agrees, then, it will have more detailing about the cult, characters as well.  He stated that he is happy with the kind of film it turned out to be and the layers of story needs to be unfolded at length. He stated that this kind of a step would be the first for any film and Retro would benefit big time. While his excitement is understandable, will people be ready to watch it as a series?  Even though he is promising a more thorough experience, the film is not that popular theatrically or on OTT platforms since release. Also, Suriya, Pooja Hegde kind of stars may not be able to really promise to jag up audiences interest in a film that did not receive such welcoming reception.  Karthik Subbaraj might be highly impressed by his writing and execution but it did not translate on to the screen as he intended. So, expecting people to like it in series form looks a little outlandish. Maybe the director should let go of this and move on to his next with the feedback about what did not really work.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)క్రియేటివ్ డైరెక్టర్ 'సుకుమార్'(Sukumar)కాంబోలో తెరకెక్కిన 'పుష్ప(Pushspa)పార్ట్ 1 ,పార్ట్ 2 'ఎంతగా ఘన విజయాన్ని అందుకున్నాయో  తెలిసిందే. పాన్ ఇండియా వ్యాప్తంగా రికార్డు కలెక్షన్స్ సృష్టించడంతో పాటు, అల్లుఅర్జున్ కి  కెరీర్ పరంగా కూడా మంచి బూస్టప్ ని తెచ్చాయి. పుష్ప సిరీస్ కి ముందు అల్లు అర్జున్ ఇమేజ్ వేరు, పుష్ప సిరీస్ తర్వాత వేరు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయాన్నీ అల్లు అర్జున్ స్వయంగా చెప్పాడు. పైగా నేషనల్ అవార్డు ని కూడా పుష్ప తెచ్చిపెట్టింది. దీన్ని బట్టి అల్లు అర్జున్ కెరీర్ కి పుష్ప ఎంత ఇంపార్టెన్స్ మూవీనో అర్ధం చేసుకోవచ్చు.  రీసెంట్ గా సోషల్ మీడియాలో' పుష్ప రెండు పార్ట్' లోని కొన్ని కీలక సన్నివేశాలని సూపర్ స్టార్  మహేష్ బాబు(Maheshbabu)రూపంతో ఏఐ(Ai)క్రియేట్ చేసారు. అంటే అల్లు అర్జున్ ప్లేస్ లో మహేష్ బాబు ఉంటాడు. రకరకాల గెటప్ లతో ఉన్న మహేష్ పుష్ప వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులైతే పుష్పగా మహేష్ బాబు సూపర్ గా ఉన్నాడంటు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి తొలుత పుష్ప మూవీని మహేష్ బాబుతో తెరకెక్కించాలని సుకుమార్ అనుకున్నాడంట. కాకపోతే కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదనే రూమర్స్ అప్పట్లో చాలానే వచ్చాయి. మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే దర్శక ధీరుడు రాజమౌళి(Ss Rajamouli)తో చేస్తున్న మూవీ, ఆల్రెడీ ఒక షెడ్యూల్ ని జరుపుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ని జరుపుకోవడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.మిగతా నటీ నటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.    
కార్తీక్‌రాజు...ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రిలీజ్‌ అయిన సింగిల్‌ సినిమాతో డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇది ఫిలిం నగర్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కార్తీక్‌రాజు తమిళ సినిమా ప్రయాణం విజయ్‌ సేతుపతి నటించిన ‘తిరుదన్‌ పోలీస్‌’ సినిమా విజయంతో ప్రారంభమైంది. ఆ తర్వాత  ‘ఉల్కుతు’, రెజీనా కాసాండ్రా నటించిన ద్విభాషా చిత్రం ‘నేనే నా’తో తన విజయ పరంపరను కొనసాగించారు. ఇక సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించారు. ఇక రీసెంట్‌గా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ బేనర్లో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ‘సింగిల్‌’ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించడంతో టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన దర్శకులలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ‘నిను వీడని నీడను నేనే’, ‘సింగిల్‌’ వంటి వరుస హిట్‌లతో కార్తీక్‌ రాజు పరిశ్రమలో తన సత్తా నిరూపించుకున్నారు.  ‘సింగిల్‌’ సినిమా విజయం తర్వాత ప్రముఖ హీరోలతో కొత్త ప్రాజెక్టుల కోసం అగ్ర నిర్మాణ సంస్థలు కార్తీక్‌రాజును సంప్రదిస్తున్నాయని తెలుస్తోంది. ప్రముఖ హీరోతో భారీ బడ్జెట్‌ ప్రాజెక్ట్‌ కోసం ఆయన టాప్‌ మోస్ట్‌ బ్యానర్‌తో కలిసి పనిచేయబోతున్నారు. త్వరలో ఆ ప్రాజెక్ట్‌ వివరాలు వెల్లడిరచనున్నారు. కార్తిక్‌రాజు తన విజన్‌ మరియు డిఫరెంట్‌ మేకింగ్‌ స్టైల్‌తో భవిష్యత్తులో మరిన్ని బ్లాక్‌బస్టర్‌ హిట్‌లను సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిభ, అంకితభావంతో కార్తిక్‌ రాజు భారతీయ చలనచిత్ర పరిశ్రమపై శాశ్వత ప్రభావాన్ని చూపిస్తారనడంలో సందేహం లేదు. 
లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan),లెజండ్రీ డైరెక్టర్ మణిరత్నం(Mani Rathnam)కాంబోలో తెరకెక్కిన 'థగ్ లైఫ్'(Thug Life)ఈ నెల 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీలో శింబు, త్రిష, అభిరామి, నాజర్, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. గత మే నెల 24 న 'చెన్నై'వేదికగా 'థగ్ లైఫ్' ఆడియో ఫంక్షన్ జరిగింది. కన్నడ సూపర్ స్టార్ 'శివరాజ్ కుమార్' ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ ని ఉద్దేశించి కమల్ మాట్లాడుతు కన్నడ భాష తమిళ భాష పుట్టిందనే వ్యాఖ్యలు చేసాడు. దీంతో కన్నడ భాషా సంఘాలు 'థగ్ లైఫ్' కన్నడ నాట విడుదల కావాలంటే, కన్నడ ప్రజలకి కమల్ క్షమాపణలు చెప్పాలని, ఒక వేళ రిలీజ్ చేస్తే థియేటర్స్ తగలబెడతామని బెదిరించాయి. కమల్ మాత్రం తన వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రేమ పూర్వకంగానే ఆ విధంగా మాట్లాడానని చెప్పినా కన్నడ సంఘాలు వెనకడుగు వెయ్యలేదు. దీంతో రిలీజ్ విషయంలో కమల్ కర్ణాటక హైకోర్టుకి వెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో 'థగ్ లైఫ్' చిత్ర బృందం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. రీసెంట్ గా సుప్రీంకోర్ట్(Supreme Court)తన తీర్పుని వెల్లడిస్తు  'థియేటర్ లో పలానా చిత్రం ప్రదర్శించకూడదని బెదిరించే హక్కు కన్నడ సంఘాలకి లేదు. ఏ వ్యక్తి అయినా భావ వ్యక్తికరణ ప్రకటన చేసినప్పుడు, దాన్ని మరో కామెంట్ తో ప్రతిఘటించే శక్తీ ఉంటుంది. కానీ థియేటర్స్ తగలబెడతామనే హక్కు ఎవరకి ఉండదు. కమల్ హాసన్ తో విభేదించే హక్కుని కర్ణాటక ప్రజలు కలిగి ఉన్నారు. అదే సమయంలో ఒక మనిషికి చెందిన ప్రాథమిక హక్కులని కాపాడే హక్కు కూడా ఉంది.సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఆ సినిమా విడుదల కావాల్సిందే. సినిమా చూడాలా వద్దా అనేది ప్రజల ఇష్టం. బెదిరింపులతో సినిమా ఆపకూడదు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయం చెప్పాలి. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని తీర్పులో వెల్లడించిన హైకోర్ట్ ఆదేశాల్ని కూడా ప్రశిస్తు సుప్రీం కోర్టు తన తీర్పుని వెల్లడి చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో 'థగ్ లైఫ్' రిలీజ్ అవుతుందేమో చూడాలి. ఇక పాన్ ఇండియా వ్యాప్తంగా 'థగ్ లైఫ్' డివైడ్ టాక్ ని తెచ్చుకుంది.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  వేసవికాలంలో తాహతు ఉన్నవారు ఏసీ ఏర్పాటు చేయించుకోవడం,  చల్లని గదులలో సేద తీరడం చాలా సాధారణ విషయం.  పట్టణాలలో ఎండ తీవ్రతలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంటాయి. వేసవి ముగింపుకు వచ్చినా సూర్యుడి ప్రతాపం తగ్గడం లేదు. అయితే చాలామంది ఇళ్లలో లేదా కార్యాలయాలలో ఏసీ వేసిన తరువాత కూడా గది చల్లబడకపోవడం జరుగుతూ ఉంటుంది.  ముఖ్యంగా పై అంతస్తులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.  దీని వెనుక కారణం చాలామంది తమకు  తెలియకుండానే చేసిన చిన్న తప్పు కావచ్చు.  దీని వెనుక కారణం ఏమిటి? ఇలా ఏసీ చల్లబడకపోవడం వల్ల కలిగే నష్టం ఏంటి?  తెలుసుకుంటే.. పై అంతస్తులో ఏసీ వేసినా గది చల్లబడకపోవడానికి కారణం ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వాడటమే. ఒక వైపు ఏసీ  చల్లగాలిని ఇస్తుంటే.. మరొకవైపు   ఫ్యాన్ వేడి గాలిని   వదులుతూ ఉంటుంది. దీనివల్ల నేల,  పైకప్పు మధ్య 5 నుండి 6 డిగ్రీల తేడా ఉంటుంది. తలను పైకప్పు వైపుకు కదిలిస్తే, ఉష్ణోగ్రతలో ఈ వ్యత్యాసాన్ని అనుభూతి చెందవచ్చు.  అయితే థర్మోకోల్ సీలింగ్‌తో పైకప్పును తీసుకుంటే  అది గది ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఏం చేయాలి? ఏసీతో పాటు ఫ్యాన్ కూడా నడపాల్సిన అవసరం లేదనే విషయం తెలుసుకోవాలి. వేసవిలో ఏసీ వేసిన తర్వాత కొంతకాలం ఓపిక పట్టాలి. క్రమంగా ఇల్లు చల్లబడటం ప్రారంభమవుతుంది. ఒకవేళ ఇంకా గది చల్లబడలేదు అనిపిస్తే గది కొంచెం చల్లబడిన తర్వాత ఫ్యాన్‌ను ఆన్ చేయాలి. ఇది గాలిని కలుపుతుంది. కావాలంటే ఫ్యాన్ ఆన్ చేయకుండా కూడా  హాయిగా ఉండవచ్చు. ఇది విద్యుత్తును కూడా ఆదా చేస్తుంది. ఈ లాజిక్ తెలుసుకోండి.. AC  పని ఏమిటంటే గది గాలి నుండి వేడి,  తేమను తీసుకోవడం ద్వారా దానిని చల్లబరుస్తుంది. AC గాలిని చల్లబరుస్తుంది,  దానిని క్రిందికి పంపుతుంది.  ఎందుకంటే చల్లని గాలి భారీగా ఉంటుంది,  అది దిగువగా ఉంటుంది.  కానీ ఫ్యాన్‌ను ACతో పాటు నడిపినప్పుడు, ఫ్యాన్ గదిలోని గాలిని వేగంగా వ్యాపింపజేస్తుంది. దీనివల్ల  చల్లని గాలి గదిలో సరిగ్గా 'స్థిరపడటానికి' అనుమతించదు. ఈ నష్టం తెలుసుకోవాలి.. ఫ్యాన్ చల్లని గాలిని సరిగ్గా సెట్ చేయడానికి అనుమతించనప్పుడు, సెట్ ఉష్ణోగ్రతను నిర్వహించడానికి AC మళ్లీ మళ్లీ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. ఇది AC శీతలీకరణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది,  గది అంతగా చల్లబడదు. అదే సమయంలో AC తన పనిని సరిగ్గా చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చినప్పుడు అది ఎక్కువ విద్యుత్తును వినియోగించుకుంటుంది. ఫ్యాన్‌ను నడపడం వల్ల విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. ఇవి గుర్తుంచుకోండి.. గదిని చల్లబరచడానికి ఏసీకి తగినంత సమయం ఇవ్వాలి. ఫ్యాన్‌ను ఆన్ చేయడం ద్వారా ఏసీ పనిని పెంచవద్దు. చల్లని గాలి బయటకు వెళ్ళకుండా,  వేడి గాలి లోపలికి రాకుండా తలుపులు,  కిటికీలను సరిగ్గా మూసి ఉంచాలి. పగటిపూట మందపాటి కర్టెన్లు లేదా బ్లైండ్లను వాడాలి. తద్వారా సూర్యుడి నుండి నేరుగా వేడి గదిలోకి ప్రవేశించదు.                         *రూపశ్రీ.
పుట్టినప్పటి నుండి ఎలాంటి పరిచయం లేకుండా పెళ్లి అనే ఒక బంధంతో ఇద్దరూ ఒకటై జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం భార్యాభర్తల బంధం. భార్యాభర్తల బంధం అనేది నమ్మకం, ప్రేమ, పరస్పర గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. ఈ బంధాన్ని బలంగా, ఆనందంగా నిలుపుకోవాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను పాటించడం చాలా అవసరం. నేటి కాలంలో వివాహాలు జరిగిన తరువాత చాలా తొందరగా వివాహ బంధాలు విచ్చిన్నం అవుతున్న నేపథ్యంలో వివాహ బంధాలు బలంగా నిలబడటానికి రిలేషన్షిప్ నిపుణులు చెప్పిన కొన్ని చిట్కాలు ఇవే.. సమయం.. రోజువారీ బిజీ జీవితంలోనూ కనీసం కొంత సమయాన్ని ఒకరికి ఒకరు కేటాయించాలి. కలసి భోజనం చేయడం, ప్రాముఖ్యత ఉన్న విషయాల్లో కలిసి మాట్లాడుకోవడం అవసరం. ఇద్దరూ కలసి చేయగలిగిన పనులను పరస్పరం స్నేహభావంతో చేసుకోవాలి. ఇది ఇద్దరి మధ్య దగ్గరితనాన్ని పెంచుతుంది. పరస్పర గౌరవం.. ఒకరినొకరు అవమానించుకోవడం జరుగుతూ ఉంటే ఆ బంధం ఎప్పటికీ నిలబడదు.  ఈ కాలంలో అమ్మాయిలు  తమకంటూ ప్రాధాన్యత ఉండాలని, తమకు గౌరవం ఉండాలని అనుకుంటారు. కాబట్టి భర్తలు భార్యలను  అపహాస్యం చేయడం, గౌరవం లేకుండా మాట్లాడటం,  భార్యలు అంటే పని మనుషులు, బానిసలు అన్నట్టు ట్రీట్ చేయడం మానుకోవాలి.    ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని ఇరువురూ గౌరవించాలి .  విషయం పెద్దదైనా, చిన్నదైనా ఇరువురూ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, గౌరవించుకోవాలి. . నమ్మకం.. అబద్ధాలు, దాచిపెట్టిన విషయాలు బంధాన్ని దెబ్బతీస్తాయి.  ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా ఉండాలి.   తప్పు చేసినా సరే.. నిజాయితీగా ఒప్పుకుని సరిదిద్దుకునే అవకాశం అడగాలి. నిజాయితీగా ఉండటం వల్ల విశ్వాసం పెరుగుతుంది. సహనంగా ఉండాలి.. ప్రతి చిన్న విషయం మీద గొడవపడకూడదు.  రెండు విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఎప్పుడూ వేర్వేరు అలోచనలతో, వేర్వేరు ప్రవర్తనలతో ఉంటారు.  ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలన్నా,  ఏవైనా తప్పులు జరిగినప్పుడు వాటిని సరి చేసుకోవాలన్నా  సహనం ఉండాలి.  ఏదైనా గొడవ లేదా తప్పిదం జరిగినప్పుడు వెంటనే మాట అనడం లేదా నిందించడం చేయకూడదు. ఇది బంధాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న గొడవలను  మౌనంగా వదిలేయడమూ ఒక తెలివైన పరిష్కారం. మెచ్చుకోవడం.. ఒకరి ప్రయత్నాలను,   ఒకరి గెలుపును, ఒకరి సృజనాత్మకతను మెచ్చుకోవడం చాలా ముఖ్యం. భార్యాభర్తలలో ఎవరైనా సరే ఒక విజయం సాధించారు అంటే భాగస్వామి తోడ్పాటు ఎంతో కొంత ఉంటుంది.  అందుకే విజయాలు సాధించినప్పుడు థాంక్స్ చెప్పడం, నీ వల్లే ఈ పని ఫర్పెక్ట్ గా చేయగలిగాను లాంటి మాటలు సంబంధాన్ని సానుకూలంగా ఉంచుతాయి. నిర్ణయాలు.. ముఖ్యమైన విషయాల్లో ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఒకరిపై ఆధిపత్యం చూపడం వలన విభేదాలు వస్తాయి. భార్యాభర్తలలో ఇద్దరిలో ఒకరికి విషయం మీద అవగాహన లేకపోయినా సరే.. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటే అవగాహన పెరుగుతుంది. కలిసి నిర్ణయం తీసుకున్నాం అనే ధైర్యం కారణంగా పనులలో వైఫల్యాలు ఎదురైనా తప్పిదం ఒకరిమీదే ఉండదు. రొమాంటిక్ మూడ్.. చిన్న చిన్న సర్ప్రైజులు, ప్రేమపూరిత సందేశాలు, ఒకరి మీద ఒకరు శ్రద్ధ చూపడం బంధాన్ని చాలా సన్నిహితం చేస్తాయి.  రెండు వేర్వేరు జెండర్ ల మధ్య బంధం కాబట్టి శారీరక బంధం బలంగా ఉంటే అది ఇద్దరినీ ఎప్పటికీ కలిపి ఉంచుతుంది. నిందలొద్దు.. ఎవరి తప్పైనా, ఆరోపణలకన్నా పరిష్కార దిశగా ఆలోచించడం మంచిది.  "నువ్వే తప్పు చేశావు" అనే ఆలోచనను మార్చుకోవాలి. ఆర్థిక విషయాలు.. ఖర్చుల విషయంలో ఓపికగా, పరస్పర అవగాహనతో వ్యవహరించాలి. ఆర్థిక విషయాలలో దాపరికాలు ఉండకూడదు. భార్యాభర్తల మధ్య విబేధాలు రావడానికి డబ్బుకు అవకాశం ఇవ్వకూడదు. స్నేహం.. జీవిత భాగస్వామిగా కాక, స్నేహితుల్లా ఉండాలి. ఇలా ఉంటే ఏ విషయాలు అయినా ఒకరితో ఒకరు నిస్సంకోచంగా షేర్ చేసుకోగలుగుతారు.  ఇది ఒకరి మీద మరొకరికి నమ్మకాన్ని పెంచుతుంది.                               *రూపశ్రీ.
  సమాజంలో చాలా వరకు మధ్యతరగతి,దిగు తరగతి కుటుంబాలే ఉంటాయి.  అటు పేదవాళ్లలా  తమకు ఏమీ లేదని సమాధానం చెప్పుకోలేరు.  ఇటు ధనికులతో పోల్చుకుని తమ సంతోషాలు ఎందుకు వదులుకోవాలి అని సంఘర్షణ ను దాటలేరు.  రెండింటికి మధ్య రేవడిలా మధ్యతరగతి కుటంబాలు ధనికులకు, పేదవారికి మధ్య సతమతం  అయిపోతుంటారు.  అయితే చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఎదగకపోవడం అనేది వారు తీసుకునే నిర్ణయాల పైనే ఆధారపడి ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.  ఈ కింది చిట్కాలు పాటిస్తే మధ్యతరగతి వారు కూడా ధనికులుగా మారిపోవచ్చు.  దానికోసం పాటించాల్సిన చిట్కాలు తెలుసుకుంటే..  బడ్జెట్.. నెలకి ఎంత ఆదాయం వస్తుందో, ఎంత ఖర్చవుతుందో స్పష్టంగా తెలుసుకోవాలి.  అవసరమైన ఖర్చులు (ఆహారం, ఇంటి అద్దె, విద్య, వైద్యం) & అనవసరమైన  ఖర్చులు (బయట తినడం, వృధా షాపింగ్) వేరు చేయాలి.  ప్రతి నెలా ఖర్చుల లెక్క రాసే అలవాటు పెట్టుకోవాలి. ఇలా చేస్తే బడ్జెట్ ప్లానింగ్ సమర్థవంతంగా అమలు చేయవచ్చు. పొదుపు.. ప్రతి నెలా కనీసం 10%–20% ఆదాయాన్ని పొదుపుగా  మార్చాలి.  RD,SIP లాంటి సురక్షిత, స్థిరమైన పొదుపు పద్ధతులు ఎంచుకోవడం ఉత్తమం.  వీటిని చిన్న మొత్తాలతో మొదలుపెట్టాలి.  ఆ తరువాత దాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. పెట్టుబడులు.. SIP, మ్యూచువల్ ఫండ్స్, PPF, FD, RD, Gold Bonds వంటి పెట్టుబడి మార్గాల గురించి తెలుసుకుని వాటిని అనుసరించడం మంచిది. వడ్డీని సంపాదించేవాడు కంటే వడ్డీని చెల్లించేవాడు ఎప్పుడూ నష్టంలో ఉంటాడు. కాబట్టి ఆస్తులపై పెట్టుబడి పెట్టడం మంచిది. ఆర్థిక విద్య.. “ఇన్వెస్ట్ మెంట్ అంటే ఏమిటి? బీమా ఎందుకు అవసరం? రిస్క్ మేనేజ్‌మెంట్ ఎలా?” వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే పొదుపు చేయడం ఆర్థికంగా ఎదగడం సులువు అవుతుంది.  వీటి కోసం ఎక్కడో డబ్బు కట్టి క్లాసులు అటెండ్ కావాల్సిన అవసరం లేదు. YouTube, ఫ్రీ ఆన్లైన్ కోర్సులు, ఆర్థిక బ్లాగులు చదవితే సరిపోతుంది. అప్పులు.. అవసరం లేని క్రెడిట్ కార్డ్స్, వ్యక్తిగత అప్పులు తీసుకోవద్దు. అప్పులు తీసుకుంటే వాటిని తక్కువ వడ్డీతో త్వరగా తీర్చేయాలి. ఇలా లేకపోతే దీర్ఘకాలం నష్టం ఎదురవుతుంది. అదనపు ఆదాయ మార్గాలు.. వర్క్ ఫ్రం హోం అవకాశాలు, ఫ్రీలాన్స్ పనులు, వంటకాలు/హస్తకళల ద్వారా ఉపాధి మొదలైనవి అదనపు ఆదాయానికి మంచి మార్గాలు.  కుటుంబ సభ్యులు కొంతమంది పని చేసే స్థితిలో ఉంటే, వారికి ఆధునిక నైపుణ్యాలు నేర్పించడం మంచిది.  (Digital Marketing, Data Entry, Content Writing, Handicrafts మొదలైనవి). ఆర్థిక విషయాలు.. భార్యాభర్తలు కలిసి ఆర్థిక ప్రణాళిక ప్లాన్  చేయాలి. పిల్లలకు చిన్న వయసులోనే పొదుపు, ఖర్చుల విలువ నేర్పాలి. ఇది భవిష్యత్తులో పిల్లల ద్వారా ఆర్థిక దుర్వినియోగం జరిగే అవకాశాలు తగ్గించి పొదుపును ప్రోత్సహిస్తుంది. బీమా.. ఆరోగ్య బీమా (Health Insurance), జీవన బీమా (Life Insurance) తీసుకోవడం వలన అనుకోని పరిస్థితుల్లో పెద్ద వ్యయం దూరం అవుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాలు.. పిల్లల చదువు, ఇంటి కొనుగోలు, రిటైర్మెంట్ వంటి విషయాలకు ముందుగానే ప్రణాళిక వేయాలి. ఇలా ప్రతి ఒక్కటి ఆలోచనతో, చిన్నగా మొదలుపెడితే మధ్యతరగతి కుటుంబాలు కూడా ధనిక కుటుంబాలుగా ఎదుగుతాయి. ముఖ్యంగా ఒక మనిషి సంపాదన మీద కుటుంబం గడిస్తే అది మధ్యతరగతి కుటుంబాలను ఎదగనీయదు. కాబట్టి కుటుంబంలో ఎవరి సామర్థ్యం,  ఎవరి ప్రతిభకు తగ్గట్టు వారు ఏదో ఒక వర్క్ చేసి సంపాదిస్తూ ఉంటే కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది.                              *రూపశ్రీ.
  వెన్నునొప్పి చాలామంది కంప్లైంట్ చేసే సమస్య. వెన్నునొప్పిని బిజీగా ఉండే రోజులో పెద్దగా పట్టించుకోరు.   ముఖ్యంగా గంటల తరబడి డెస్క్ వద్ద పనిచేసిన తర్వాత లేదా  ఏదైనా బరువులు  ఎత్తిన తర్వాత వెన్నునొప్పి వస్తుంటుంది.  చాలామంది ఈ నొప్పి వచ్చినప్పుడు లైట్ తీసుకుంటారు.  ఓ పది నిముషాలు పడుకుంటే అంతా సర్థుకుంటుంది అని అంటుంటారు.  ఈ వెన్ను నొప్పి పదే పదే వస్తున్నప్పుడు అది కేవలం తాత్కాలిక నొప్పి  అనుకోవడం పొరపాటు అని వైద్యులు అంటున్నారు. పదే పదే వచ్చే వెన్నునొప్పి అసౌకర్యాన్ని కలిగించడం కంటే ఎక్కువ హాని చేస్తుంది.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. వెన్ను నొప్పి అనేది చాలా మంది సాధారణ సమస్యే అనుకుంటూ ఉంటారు. అయితే వెన్ను నొప్పి  వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకున్నా ఈ నొప్పి తగ్గడంలో మార్పు కనిపించకపోతే అది ప్రమాదం. ముఖ్యంగా ఏ చిన్న పని చేసినా వెన్ను బిగుసుకుపోవడం జరుగుతూ ఉంటే అది నిర్లక్ష్యం చేయాల్సిన సమస్య కాదని అంటున్నారు వైద్యులు. కాళ్లు చేతులు తిమ్మిర్లుగా ఉండటం, జలధరింపు లేదా దృఢత్వం గురించి జాగ్రత్త వహించాలని అంటున్నారు.  ఇవి నరాల సమస్యలను,  లేదా వెన్నెముక సమస్యలను సూచిస్తాయని అంటున్నారు. అయితే వెన్నెముక సమస్యలు రాకూడదన్నా,  వెన్నెముక సేఫ్ గా ఉండాలన్నా,  వెన్నెముక సమస్యలను సులువుగా తగ్గించాలని అనుకున్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే.. బరువు తగ్గడం.. అధిక బరువు వెన్నెముకపై ఒత్తిడిని కలిగిస్తుంది.  బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది,  బరువు తగ్గడం వల్ల వెన్నెముక సమస్యనే కాదు.. మరిన్ని సమస్యలను నివారించవచ్చు . పొజిషన్.. వంగి ఉండటం ప్రమాదకరం కాదు. కూర్చున్నప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు  వీపును సమతలంగా ఉంచాలి. వీపుకు మద్దతు ఇచ్చే కుర్చీలను ఉపయోగించాలి. ఎదురుగా ఉన్న పరికరాలపై వంగి ఉండకూడదు. వ్యాయామం.. "నిశ్చల జీవనశైలి వెన్నెముకను బలహీనపరుస్తుంది.  రోజువారీ దినచర్యలో కోర్ బలపరిచేటటువంటి వ్యాయామాలను చేర్చాలి. తేలికపాటి కదలిక కూడా సహాయపడుతుంది. ఎర్గోనామిక్ ఫర్నిచర్ .. అన్నింటి కంటే ముఖ్యంగా చేయాల్సిన పని కుర్చీని వెన్నెముకకు మద్దతు ఇచ్చేలా ఉన్నది ఎంచుకోవడం.  అవసరమైతే ఫుట్‌రెస్ట్‌ను జోడించి, స్క్రీన్‌ను కంటి స్థాయికి పెంచుకోవాలి. లిఫ్టింగ్ టెక్నిక్‌..   ఏవైనా బరువులు ఎత్తేటప్పుడు నడుమును కాదు మోకాళ్లను వంచాలి. సడన్ గా  జెర్కీ కదలికలను నివారించాలి.  బరువైన వస్తువును ఎత్తేటప్పుడు ఎప్పుడూ మెలితిప్పకూడదు.  బరువును.. అధిక బరువు వెన్నెముకపై ఒత్తిడిని కలిగిస్తుంది.  బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.  మరిన్ని సమస్యలు రాకుండా ఉంటాయి. నీరు.. హైడ్రేషన్ వెన్నెముక డిస్క్‌ల స్థితిస్థాపకతను నిర్వహించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వేడి వాతావరణంలో లేదా వ్యాయామం తర్వాత నీరు తాగాలి.  రోజుకు 6–8 గ్లాసులు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎక్కువసేపు కూర్చోవద్దు..   ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వెన్ను దెబ్బ తింటుంది. ప్రతి 30–45 నిమిషాలకు నిలబడుతూ ఉండాలి.  శరీరాన్ని కాస్త సాగదీయడం,  నడవడం వంటివి ఉపయోగకరంగా ఉంటాయి. నొప్పిని విస్మరించకూడదు.. నొప్పి అనేది శరీరం ఇబ్బందిలో ఉంది అనడానికి ఒక సిగ్నల్. పైన చెప్పిన చిట్కాలు అన్నీ పాటిస్తున్నా అది మళ్లీ మళ్లీ వస్తుంటే వైద్య సహాయం తీసుకోవాలి. ఈరోజు నొప్పిని విస్మరించడం వల్ల రేపు  వెన్నెముక ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు గట్టిగా చెబుతున్నారు.                             *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  భారతదేశంలో COVID-19 కేసులు పెరుగుతున్నాయి.  ఆరోగ్య మంత్రిత్వ శాఖ  COVID డాష్‌బోర్డ్‌లోని డేటా ప్రకారం 7131 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధిక కేసులు ఉన్న రాష్ట్రాలలో కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్,  మహారాష్ట్ర ఉన్నాయి. నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. COVID-19 అనేక దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉంది.  ఇది వచ్చిన మూడు సంవత్సరాల వరకు ఏదైనా కారణం వల్ల గుండెపోటు, స్ట్రోక్,  మరణ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని ఇటీవలి అధ్యయనం కనుగొంది.  టైప్ O తో పోలిస్తే A, B లేదా AB రక్త రకాలు ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. COVID-19 ఇన్ఫెక్షన్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందా? "COVID తో సంబంధం ఉన్న దీర్ఘకాలిక హృదయ సంబంధ ఆరోగ్య ప్రమాదాన్ని వైద్యులు కనుగొన్నారు. ముఖ్యంగా తీవ్రమైన COVID-19 సమస్య వచ్చి  ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న వ్యక్తులలో ఈ ప్రమాదం అధికం అంటున్నారు.  COVID-19 సంక్రమణ తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కూడా గుండెపోటు,  స్ట్రోక్ ప్రమాదం పెరిగింది. విశేషమేమిటంటే కొన్ని సందర్భాల్లో టైప్ 2 డయాబెటిస్ లేదా పరిధీయ ధమని వ్యాధి వంటి  హృదయ సంబంధ ప్రమాద కారకం ఉన్నంత ప్రమాదం పెరిగిందట. పరిశోధనలలో ఏం తేలిందంటే.. పరిశోధకులు చేసిన అధ్యయనాలలో COVID-19 వచ్చిన పెద్దలలో గుండెపోటు, స్ట్రోక్,  మరణాల ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉందని,  COVID-19 తో ఆసుపత్రిలో చేరిన పెద్దలలో ఇన్ఫెక్షన్ చరిత్ర లేని వారితో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. దాదాపు 3 సంవత్సరాల ఫాలో-అప్ కాలంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆసుపత్రిలో చేరిన COVID-19 రోగుల ప్రమాదం.. ఈ అధ్యయనంలో హృదయ సంబంధ వ్యాధులు లేదా టైప్ 2 డయాబెటిస్ లేకుండా COVID-19 తో ఆసుపత్రిలో చేరిన వ్యక్తులకు హృదయ సంబంధ వ్యాధులు,  COVID-19 ఇన్ఫెక్షన్ లేని వ్యక్తులతో పోలిస్తే గుండెపోటు, స్ట్రోక్,  మరణానికి 21% ఎక్కువ ప్రమాదం ఉందని తేలింది. కోవిడ్ ఇన్ఫెక్షన్, రక్త రకం,  గుండెపోటు ప్రమాదం.. O కాని రక్త వర్గాలు COVID-19 కారణంగా ఆసుపత్రిలో చేరేవారి మధ్య జన్యుపరమైన పరస్పర చర్య ఉందని పరిశోధకులు కనుగొన్నారట. తీవ్రమైన COVID-19 ఇన్ఫెక్షన్ ఉన్నవారికి గుండెపోటు,  స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కానీ A, B లేదా AB వంటి O కాని రక్త వర్గాలు ఉన్నవారిలో ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉందని చెబుతున్నారు.  O రకం రక్తం ఉన్నవారితో పోలిస్తే O కాని రక్త వర్గాలు గుండెపోటు,  స్ట్రోక్ వచ్చే ప్రమాదం 65% ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ఒక బిలియన్ మందికి పైగా ప్రజలు ఇప్పటికే COVID-19 సంక్రమణను అనుభవించారు. నివేదించబడిన ఫలితాలు ఒక చిన్న ఉప సమూహంలో చిన్న ప్రభావం కాదు. ఈ ఫలితాలలో దాదాపు పావు మిలియన్ మంది ఉన్నారట.  వ్యాధి పెరుగుదలకు ఇది ముఖ్య కారణం అని అంటున్నారు.  కాబట్టి కోవిడ్-19 వచ్చిన వారిలో  రక్త రకాన్ని బట్టి చాలామంది గుండెపోటుకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.  వీరందరూ జాగ్రత్తగా ఉండటం అవసరం.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...