`కార్తీకదీపం` : మోనితపైకి చీపుర్లెత్తిన బస్తీ జనం!
on Nov 27, 2021
మహిళా ప్రేక్షకుల నీరాజనాలందుకుంటున్న బుల్లితెర సీరియల్ కార్తీక దీపం. ఈ మధ్య కాలంలో ఇంతలా పాపులర్ అయిన సీరియల్ మరొకటిలేదు. సామాన్య గృహిణుల నుంచి సెలబ్రిటీల మదర్ల వరకు ఈ సీరియల్ ఫ్యాన్స్గా మారిపోయారు. వంటలక్క వారికి హాట్ ఫేవరేట్గా మారిపోయింది. శనవారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగబోతోంది. మరీ ముఖ్యంగా కీలక పాత్రధారి మోనితకు ఈ ఎపిసోడ్ భారీ షాక్ ఇవ్వబోతోంది. అదేంటో ఓసారి లుక్కేద్దాం.
1208వ ఎపిసోడ్లోకి ఈ సీరియల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఆనందరావు, సౌందర్య ఆనందంగా కనిపిస్తుంటారు. మనసు చాలా ప్రశాంతంగా వుందని, ఈ రోజు ఎంతో ఉత్సాహంగా వుందని చాలా రోజుల తరువాత ఇలా ఆనందంగా వుండటం బాగుందని చెబుతుంటాడు ఆనందరావు ఇదే సమంలో అక్కడికి హిమ, శౌర్య వస్తారు. వీరితో వాకింగ్కి వెళుతున్నామని, ఈ విషయం దీపకు చెప్పమని పిల్లల్ని పంపిస్తారు సౌందర్య, ఆనందరావు.
కట్ చేస్తే కార్తీక్ తల స్నానం చేసి రావడంతో అతని తలని గట్టిగా తుడుస్తూ వుంటుంది దీప. కార్తీక్ చాలు అన్నా వినకుండా అతన్ని ఓ ఆటాడుకుంటుంది. ఇదంతా గమనించిన పిల్లలు మురిపిపోతారు. ఆ తరువాత ఈ ఇద్దరూ ఆనందరావు, సౌందర్యతో కలిసి వాకింగ్కి వెళ్లిపోతారు. కట్ చేస్తే ప్రియమణితో కలిసి మోనిత కారులో కార్తీక్ ఇంటి బయట ఎదురుచూస్తూ వుంటుంది. సమయం చిక్కింది కదా అని ప్రియమణి .. మోనితని తన మాటలతో విసిగిస్తూ వుంటుంది. ఇంతలో దీప తండ్రి మురళీ కృష్ణ ఇంటికి వస్తూ వస్తూ కారులో మోనిత వుండటాన్ని గమనిస్తాడు. అదే విషయాన్ని దీపకు చెబుతాడు. వెంటనే దీప కార్తీక్కి చెబుతుంది. విషయం తెలుసుకున్న కార్తీక్ కోపంతో రగిలిపోతాడు. కట్ చేస్తే బస్తీలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తాడు కార్తీక్. ఇదే అదనుగా ప్రియమణితో బాబుతో కలిసి అక్కడికి వస్తుంది మోనిత. మోనితని గమనించిన దీప బస్తీ వాసులకి తన గురించి చెప్పడంతో అంతా కలిసి మోనితపై చీపురు తిరగేస్తారు. ఆ తరువాత ఏమైంది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read