Illu illalu pillalu: ముగ్గురు కొడుకులని హానీమూన్ కి వెళ్ళమన్న రామరాజు.. కోడళ్ళు ఏం చేశారంటే!
on Jun 13, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -183 లో......చందు శ్రీవల్లీలని హానిమూన్ కి వెళ్ళమని చెప్పి రామరాజు వెళ్లిపోతుంటే.. రామరాజుని ఆపుతుంది వేదవతి. అదేంటీ ముగ్గురు కొడుకు కోడళ్ళని సమానంగా చూడాలి.. అది మన బాధ్యత అంతే కానీ ఇలా చెయ్యడం ఏంటని వేదవతి కోప్పడుతుంది. మరొకవైపు మమ్మల్ని హనీమూన్ వెళ్లామన్నారని శ్రీవల్లి డాన్స్ చేస్తుంటుంది.
అప్పుడే రామరాజు ఇంట్లోకి వచ్చి అందరిని పిలుస్తాడు. రేయ్ నడిపోడా నువ్వు మిల్ కి నాలుగు రోజులు రాకపోయిన పర్వాలేదు.. చిన్నోడా నువు డ్యూటీకి రెండు రోజులు వెళ్ళకున్నా పర్వాలేదా అని రామరాజు అడుగుతాడు. పర్వాలేదు అని వాళ్ళు చెప్పగానే అయితే మూడు జంటలు హనీమూన్ కి వెళ్ళండి అని రామరాజు చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఆ శ్రీవల్లితో వెళ్తే మనం కంఫర్ట్ గా ఉండమని ప్రేమ, నర్మద అనుకుంటారు. మావయ్య నాకు వీలు అవ్వదని ప్రేమ నర్మద చెప్తారు. వెళ్ళండి అని వేదవతి అంటుంది. వెళ్ళమని వాళ్లంటారు. దాంతో రామరాజు కోపంగా.. వెళ్తే మూడు జంటలు వెళ్ళండి, లేదంటే లేదని రామరాజు అంటాడు.
మీరు కావాలని చేశారు కదా అని శ్రీవల్లి అనగానే అవునని ప్రేమ, నర్మద అంటారు. ఆ తర్వాత ధీరజ్ వెళ్తుంటే.. నాకు అల్ ది బెస్ట్ చెప్పు అని ప్రేమ అంటుంది. ఎందుకని ధీరజ్ అంటుంటాడు. అయిన దానికి రీజన్ చెప్పదు. ప్రేమ పరిగెడుతుంటే ధీరజ్ తన వెనకాలే పరిగెడుతాడు. తనని పట్టుకుంటాడు. అప్పుడే తిరుపతి చుసాడని ప్రేమ సిగ్గుపడుతుంది. తరువాయి భాగంలో ప్రేమ పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంది. అక్కడికి ధీరజ్ ఫుడ్ తీసుకొని వస్తాడు. నర్మద చూసి ప్రేమకి చెప్తుంది. ప్రేమ లోపల దాక్కుంటుంది. అదే సమయంలో ప్రేమని అద్దంలో నుండి చూస్తాడు ధీరజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
