అప్పుడే తాగి పడిపోయావా...సెన్స్ లెస్ గా మాట్లాడితే వినను..హమీద మీద ఫుల్ ఫైర్
on Apr 24, 2025
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఇమ్మానుయేల్ టిల్లు గెటప్ లో వచ్చాడు. ఇక హమీద ఐతే మిత్రవింద గెటప్ లో వచ్చింది. టిల్లు అనుకుంటూ వచ్చి కింద పడిపోయేసరికి ఇమ్ము ఒక ఘాటైన డైలాగ్ వేసేశాడు. "వేసిందే రెండు రౌండ్లు అప్పుడే తాగి పడిపోయావా" అనేసరికి హమీద నవ్వుకుంది. ఇక మానస్ ఐతే పవన్ కళ్యాణ్ గెటప్ లో వచ్చి "మనం డైలాగ్స్ చెప్పం పాట పాడతాం" అంటూ పాట పాడి వినిపించాడు. ఈ షోలో జడ్జెస్ శేఖర్ మాష్టర్ - అనసూయ హీరోహీరోయిన్స్ గా వచ్చారు. ఈ నెక్స్ట్ వీక్ సినిమా సినిమా అనే కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. శ్రీముఖి టాకీస్ కి హీరో శేఖర్ మాష్టర్ హీరోయిన్ అనసూయ వచ్చారు అంటూ చెప్పింది శ్రీముఖి. "ఎలా ఉన్నారు హీరో గారు" అని శ్రీముఖి అడిగేసరికి "నువ్వు హీరోగారు అనేసరికి నాకేం అర్ధం కావడం లేదు" అన్నాడు శేఖర్ మాష్టర్. హీరోయిన్ ఎవరు అనేసరికి ఇంకెవరు ఇదిగో అంటూ అనసూయని చూపించింది శ్రీముఖి. ఆమె కూడా సీరియస్ గా చూసేసరికి "ఇదంతా సినిమాలో యాక్ట్ చెయ్యి ఇక్కడ కాదు" అని సెటైర్ వేసాడు శేఖర్ మాష్టర్. ఇక ఈ ప్రోమోలో మానస్ వెర్సెస్ హమీద అన్నట్టుగా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.
ఒక టాస్క్ లో బాయ్స్ తరపున శివ్ కుమార్, అమ్మాయిల తరపున ఐశ్వర్య పోటీ పడ్డారు. పుష్ప మూవీలోని ఒక ఫోటో చూపించి దానికి సంబందించిన ఒక ప్రశ్న అడిగింది శ్రీముఖి. ఐతే శ్రీముఖి ప్రశ్న అడిగేటప్పుడే ఐశ్వర్య ముందుకు వచ్చేయడంతో ఆ బొమ్మ తనకు వచ్చింది. దీని మీద మానస్ ఫుల్ ఫైర్ అయ్యాడు. దీంతో ఐశ్వర్య కూడా వాదించింది. ఆమెకు తోడుగా హమీద కూడా గట్టిగా తిట్టింది. తాము గెలిచినప్పుడే పాయింట్స్ రైజ్ చేస్తారు అంటూ సీరియస్ అయ్యింది. తొండిగా ఆడడం కాదు డైరెక్ట్ గా గెలువు అంటూ మానస్ కూడా అరిచాడు..ఓడిపోయాక సైలెంట్ గా కూర్చోము అంటూ వార్నింగ్ ఇచ్చింది హమీద కూడా. ఇక మానస్ కి కూడా చిర్రెత్తుకొచ్చి సెన్స్ తో మాట్లాడితే వింటా కానీ సెన్స్ లెస్ గా మాట్లాడితే వినను అని చెప్పుకొచ్చాడు. ఇలా వీళ్ళ మధ్య షోలో పెద్ద న్యూసెన్స్ అయ్యింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
