బిగ్బాస్: షన్నుకు కింగ్ నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
on Nov 27, 2021
బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 5 ఎండింగ్కి రోజులు దగ్గరపడుతున్నా కొద్దీ వివాదాలు మరీ ఎక్కువవుతున్నాయి. ఈ షోపై గత షోలకు మించి విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. కంటెస్టెంట్ల పరంగానూ, కింగ్ నాగ్ విషయంలోనూ దారుణంగా విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా అవి పతాక స్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం షన్ను, సిరి జంట చేసే పనులే అని తెలుస్తోంది. 12వ వారంలోకి ఎంటరైన బిగ్బాస్ సీజన్ 5 ఆసక్తికర మలుపులతో విమర్శల పాలవుతోంది.
ఇప్పటి వరకు ఈ షోకి వచ్చిన 19 మందిలో 11 మంది ఎలిమినేట్ అయి ఇంటిదారి పట్టారు. జెస్సీ అనారోగ్య కారణాల వల్ల ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంటిలో యాంకర్ రవి, సన్నీ, షన్ను, సిరి, కాజల్, మానస్, ప్రియాంక, శ్రీరామచంద్రతో కలిపి 8 మంది సభ్యులున్నారు. ఈ ఎనిమబిది మంది ఇంటి సభ్యుల్లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా వుంటే శనివారం కింగ్ నాగార్జున .. కంటెస్టెంట్ షన్నుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
కెప్టెన్సీ టాస్క్లో బాగా ఆడావని అభినందిస్తూనే ఇంటి సభ్యుల సహకారం వల్లే నువ్వు కెప్టెన్ కాగలిగావని నాగ్ .. షన్నుకు చురకలంటించారట. అంతే కాకుండా కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జరిగిన వాదనలో కాజల్ జెండర్ గురించి ప్రస్తావించినప్పుడు ఎందుకు అలా రియాక్ట్ అయ్యావని, తను ఒకసారి అంటే అదే పదాన్ని పదే పదే ఎందుకు అనాల్సి వచ్చిందని నాగ్ మండిపడ్డారట. ఇక సిరి మదర్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి అంతా బాగానే వుంది కానీ హగ్గులు మాత్రం తనకు నచ్చలేదన్నప్పుడు నువ్వెందుకు ఫీలయ్యావ్.. అలా ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చిందని పాగ్ ఓరేంజ్లో షన్నుకీ క్లాస్ పీకారని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు శనివారం ఎపిసోడ్లో నాగ్ ఎవరికి షాక్ ఇవ్వబోతున్నాడు? .. షన్నుని ఏరేంజ్లో ఆడుకున్నాడు? అన్నది తెలియాటంటే టుడే ఎపిసోడ్ ని మిస్ అవ్వకూడదంతే..
Also Read