Brahmamudi : రాజ్, కావ్యలని దూరం చేయడానికి యామిని, రుద్రాణి కొత్త ప్లాన్!
on May 17, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -723 లో.....కావ్య ని ఇంప్రెస్ చెయ్యడానికి రాజ్ రెడీ అవుతాడు. అప్పుడే రాజ్ కి అపర్ణ ఫోన్ చేస్తుంది. చెప్పండి అమ్మ అని రాజ్ అనగానే అపర్ణ మురిసిపోతుంది. నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది.. కావ్యని ఎలా ఇంప్రెస్ చెయ్యాలో ఆలోచించావా అని అపర్ణ అడుగుతుంది. లేదని రాజ్ అంటాడు. ఇంకా ఆలోచించలేదా.. ఏదైనా గిఫ్ట్ గా సారి ఇచ్చి ఇంప్రెస్ చెయ్ అనగానే రాజ్ సిగ్గుపడుతూ సరే అంటాడు.
మరొకవైపు ప్రకాష్ దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి.. అసలు మీరు కొడుకు గురించి పట్టించుకుంటున్నారా.. ఆ అప్పు అయితే వాడి గురించి పట్టించుకోవడం లేదు.. నాకు మాత్రం మనవడినో, మనవరాలినో ఎత్తుకోవాలని ఉండదా అని ధాన్యలక్ష్మి అంటుంటే వాళ్ళకి ప్లానింగ్ ఉంటుందిలే అని ప్రకాష్ అంటాడు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి యామిని వచ్చి.. బావ రేపు రెలెటివ్స్ కి కార్డ్స్ ఇవ్వాలని అంటుంది. లేదు నాకు వేరే ఇంపార్టెంట్ పర్సన్ ని కలవాలని రాజ్ చెప్తాడు. నాకు తెలుసు ఎవరో అని యామిని అనుకుంటుంది. ఆ తర్వాత అప్పుకి కళ్యాణ్ భోజనం తీసుకొని వచ్చి తినిపిస్తాడు.
ఆ తర్వాత రుద్రాణికి యామిని ఫోన్ చేస్తుంది. ఇద్దరు రాజ్ కావ్య గురించి మాట్లాడుకుంటారు. రాజ్ వస్తాడు కానీ కావ్యని కలవదు. ఎందుకంటే కావ్యకి ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది వెళ్ళిపోతుంది. రాజ్ వెయిట్ చేసి వెళ్ళిపోతాడని రుద్రాణి ప్లాన్ చేసి యామినికి చెప్తుంది. ఆ తర్వాత రాహుల్, స్వప్న నగలు తీస్తుంటే.. స్వప్న నిద్రలో నడుచుకుంటూ వెళ్లి రాహుల్ ని కొడుతుంది. మరుసటి రోజు అప్పు స్టేషన్ కి వెళ్తుంటే ఆగమని ధాన్యలక్ష్మి అంటుంది. తరువాయి భాగంలో కావ్య, రాజ్ ఇద్దరిని దూరం చెయ్యడానికి యామిని, రుద్రాణి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
