నిఖిల్ పోస్ట్ ..కావ్య గురించేనా ?
on Apr 24, 2025
కొంతకాలం క్రితం వరకు నిఖిల్ - కావ్య బుల్లితెర మీద మంచి జోడిగా పేరు తెచ్చుకున్నారు. ఎవరి ద్రుష్టి పడిందో కానీ ఇద్దరూ ఇప్పుడు విడిపోయాడు. గోరింటాకు సీరియల్ తో వీళ్ళు తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ఇక నిఖిల్ కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు వరకు ఇద్దరూ కూడా ఎంతో క్లోజ్ గా ఉండేవాళ్ళు. పెళ్లి జరిగినట్టుగా కూడా వీడియోస్ కూడా క్రియేట్ అయ్యాయి. ఎన్నో షోస్ లో కలిసి ప్రేమను ఎక్స్ప్రెస్ కూడా చేసుకున్నారు. కానీ బిగ్ బాస్ టైములో ఇద్దరూ విడిపోయారు.
ఏమయ్యిందో కానీ ఇద్దరూ కారాలు మిరియాలు నూరుకున్నారు. ఇక ఇప్పుడు ఇద్దరూ ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇద్దరూ కలిసున్నవి కనిపించకుండా డిలీట్ చేసేసుకున్నారు. ఒకవేళ షోస్ లో కలవాల్సిన పరిస్థితి వస్తే చూసుకోకుండా, మాట్లాడుకోకుండా దూరంగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు నిఖిల్ దీనికి సంబంధించి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక మ్యాటర్ ని పోస్ట్ చేసాడు. "నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం మీరే. ఇంతకాలం నా మీద చూపించిన ప్రేమ, అభిమానాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను. ఐతే ఇక్కడ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. పరిస్థితులు అన్నవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళుగా మా జీవితాల్లో నిమగ్నమయ్యాము. దయచేసి నను ఎవరితోనూ కలపొద్దు, ట్యాగ్ చేయొద్దు. వర్క్ పరంగా తప్ప ఇతరత్రా ఇంటెన్షన్స్ తో నన్ను వేరే వారితో కలపొద్దు..ఎవరి పోస్టులకు కూడా నన్ను ట్యాగ్ చేయొద్దు. నన్ను అందరూ అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను. ఐ లవ్ యు ఆల్" అని రాసుకున్నాడు. అంటే ఏ షోస్ కి వెళ్లినా కూడా నిఖిల్ ని, కావ్యని కలిపి మాట్లాడ్డం, కామెంట్స్ చేయడం వంటివి చేస్తుండడంతో నిఖిల్ ఇలా రియాక్ట్ అయ్యాడంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
