Home

»

Exclusive Movie News

'పాడుతా తీయ‌గా చ‌ల్ల‌గా..' ఈ పాట వింటూ హాయిగా నిద్ర‌లోకి జారుకోండి.! 

Aug 26, 2026 1:59PM

1964లో విడుదలై అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకొని ఒక అద్భుత‌మైన క్లాసిక్‌గా నిలిచిన సినిమా 'మూగ‌మ‌న‌సులు'. ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలోని పాట‌లు సంగీత ప్రియుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. 

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, సావిత్రి, జ‌మున ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ సినిమాకు కె.వి.మ‌హ‌దేవ‌న్ సంగీతాన్ని అందించ‌గా, ఆచార్య ఆత్రేయ‌, దాశ‌ర‌థి, కొస‌రాజు సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. 

ఆచార్య ఆత్రేయ క‌లం నుంచి జాలు వారిన పాడుతా తీయ‌గా చ‌ల్ల‌గా.. ప‌సిపాప‌లా నిద‌ర‌పో త‌ల్లిగా, బంగారు త‌ల్లిగా అనే పాట గురించి, సాహిత్యం గురించి తెలుసుకుందాం. 

పాడుతా తీయగా చల్లగా..
పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా

కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది

కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ
ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకూ

గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న ఉండవమ్మ శాన్నాళ్ళు

పోయినోళ్లు అందరూ మంచోళ్ళూ
ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు

మనిషిపోతె మాత్రమేమి మనసు ఉంటది
మనసుతోటి మనసెపుడో కలసిపోతది

సావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది
జనమ జనమకది మరీ గట్టిపడతది

పాడుతా తీయగా సల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా … బంగారు తల్లిగా

ఒక మధురమైన జ్ఞాపకం మనసును మెల్లగా తాకినట్టుంటుంది ఈ గానం.
తల్లి మమతలా ఆప్యాయతను పంచే భావం ఈ పాటలో కనిపిస్తుంది.
ఘంటసాల గాత్రంలోని మాధుర్యం ప్రతి పదాన్ని మరింత హృద్యంగా చేస్తుంది.

ఈ పాట మీ బాల్య జ్ఞాపకాల్లో ఏదైనా గుర్తు చేస్తుందా?

Old Telugu Songs, Song Of The Day, Mooga Manasulu, Ghantasala, KV Mahadevan, Acharya Athreya, Telugu Cinema, Evergreen Melody, Telugu

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com