Home

»

Latest News

యూట్యూబర్ నందు ఫ్యామిలీకి షాక్.. ఎవరు ఊహించని  నోటీసులు జారీ  

Jun 5, 2026 12:11PM

 


యూట్యూబర్ నందు అలియాస్ రామానందన్ కుటుంబం యూకే వీసాల రెన్యూవల్ ప్రక్రియ పేరుతో నమ్మించి  లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లుగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితులు కూడా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు.

బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుని  ప్రారంభించారు. ఇందులో భాగంగానే  రామానందన్ కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ కావడం సంచలనం సృష్టిస్తోంది. దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు  లుక్ అవుట్  జారీ చేశారు. ఈ స్కామ్‌లో దాదాపు 15 లక్షల వరకు భారీ మోసం జరిగినట్లు ఒక కేసు నమోదైంది. నందుస్ వరల్డ్ (Nandu's World) ఛానల్ ద్వారా ఏర్పడిన పరిచయాలు, నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ఈ దందా సాగించినట్లు తెలుస్తోంది. నమ్మి డబ్బులు ఇచ్చిన అమాయక బాధితులు ఇప్పుడు తాము మోసపోయామని గ్రహించి మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు సమర్పించుకున్నాక కూడా వీసాలు రాకపోగా, అడిగితే సరైన సమాధానం చెప్పకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు పోలీసుల ఎదుట వాపోయారు. కేవలం ఈ ఒక్క కేసే కాకుండా, దీని వెనుక ఇంకా పెద్ద నెట్‌వర్క్ ఉండే అవకాశం ఉందని, బాధితుల సంఖ్య మరియు మోసం విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

also read: Pawan Kalyan: వైరల్ అవుతున్న హేమ వీడియో.. మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించే

ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల హవా నడుస్తున్న తరుణంలో, ఇలాంటి సెలబ్రిటీల నమ్మకమైన మాటలను నమ్మి మోసపోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. వీసాలు, ఉద్యోగాలు, ఇన్వెస్ట్‌మెంట్ల పేరుతో యూట్యూబర్లు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మితే భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్‌గా వెలిగిన వ్యక్తి ఇలా వీసా రిన్యూవల్ ఫ్రాడ్‌లో ఇరుక్కోవడం నెటిజన్లని  సైతం విస్మయానికి గురిచేస్తోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com