అహ్మదాబాద్ విమాన ఘటనలో అగ్ర హీరో సోదరుడి మృతి!..అసలు నిజం ఇదే
on Jun 12, 2025
నిన్న మధ్యాహ్నం గుజరాత్(Gujarat)లోని ప్రధాన నగరమైన అహ్మదాబాద్(Ahmedabad)లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రతి ఒక్కరిని ఎంతగానో కలిచి వేస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైట్ లో రెండువందల ముపై మంది ప్రయాణికులతో పాటు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో మిగలగా, తక్కిన వారంతా చనిపోయారు. వారిలో 53 మంది విదేశీయలు కాగా, మిగతా వాళ్లంతా మన వాళ్లే. చనిపోయిన వాళ్లల్లో ప్రముఖ బాలీవుడ్ హీరో 'విక్రాంత్ మస్సే' సోదరుడు ఉన్నట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆ వార్తలపై 'విక్రాంత్ మస్సే'(Vikrant Massey)స్పందిస్తు అహ్మదాబాద్ విమాన ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్ని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. ఈ విషయంలో నా కంటే మా అంకుల్ 'క్లిఫర్డ్ కుందర్' కి ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదంలో ఆయన తన కుమారుడు క్లైవ్ కుందర్ ని కోల్పోయాడు. క్లైవ్ ఆ ఫ్లైట్ కి ఫస్ట్ ఆపరేటింగ్ ఆఫీసర్. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. క్లైవ్ నా సోదరుడు అనే వార్తలు చాలా మీడియా ఛానల్స్ లో వస్తున్నాయి. కానీ క్లైవ్ నా సోదరుడు కాదు. వారు తమ కుటుంబ స్నేహితులని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు.
హిందీ చిత్ర రంగంలో విక్రాంత్ మస్సే కి వర్సటైల్ యాక్టర్ గా ప్రత్యేక గుర్తింపు ఉంది. 2016 లో రిలీజైన 'ఏ డెత్ ఆఫ్ గంజ్' తో సోలో హీరోగా మారిన విక్రాంత్ 'హాఫ్ గర్ల్ ఫ్రెండ్, చపాక్, కార్గో, హసీన్ దిల్ రుబా, లవ్ హాస్టల్, మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్, 12 th ఫెయిల్, సెక్టార్ 36 , ది సబర్మతి రిపోర్ట్ వంటి చిత్రాలతో అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించాడు. 12 th ఫెయిల్ చిత్రానికి బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ క్రిటిక్స్ అవార్డుని అందుకున్న విక్రాంత్ ప్రస్తుతం 'ఆంఖోన్ కి గుస్టాఖియాన్, అర్జున్ ఉస్తారా అనే రెండు చిత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ రెండు చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
