
-పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభమైన వరుణ్ తేజ్ న్యూ మూవీ
-నీహారిక కొణిదెల నిర్మాత
-2027 సంక్రాంతికి రిలీజ్
-మరి వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడితో పోటీ తప్పదా!
కొంత కాలంగా కట్ అవుట్ కి తగ్గ హిట్ ని అందుకోవడానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)అష్టకష్టాలు పడుతున్నాడు. తన క్యారక్టర్ పరిధి మేరకు బాగానే చేస్తున్నా కథ, కథనంలోని లోపాల వల్ల డిజాస్టర్స్ అనేవి చుట్టపు చూపుగా రావాల్సింది పోయి పర్మినెంట్ గా తిష్ట వేస్తున్నాయి. సోలో హీరోగా 2019 లో వచ్చిన 'గద్దలకొండ గణేష్' తప్ప మరో సినిమా హిట్ లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడితో చేసిన F3 హిట్ నే తన ఖాతాలో ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరికే వరుణ్ పోటీ రాబోతున్నాడు. డిటైల్స్ ఏంటో చూద్దాం.
వరుణ్ తేజ్ ప్రెజంట్ మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi)దర్శకత్వంలో కొరియన్ కనకరాజు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే మరో మూవీ స్టార్ట్ చేసాడు. టైటిల్ 'బరి'(Bari). వాలీబాల్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కనుంది. నిర్మాత ఎవరో కాదు వరుణ్ సోదరి నిహారిక కొణిదెల(Niharika Konidela). ఈ రోజు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చేతుల మీదుగా పూజా కార్యక్రమాలతో సదరు మూవీ స్టార్ట్ అయ్యింది. నీహారిక నిర్మాణంలో గతంలోనే వచ్చిన కమిటీ కుర్రాళ్లు దర్శకుడు యదువంశీ(Yadhu vamsi)దర్శకుడు. ఇప్పుడు ఈ మూవీ 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ విషయాన్నీ నీహారిక అధికారకంగా ప్రకటించడం రసవత్తరంగా మారింది.
Also read: Sridevi: శ్రీదేవి తర్వాత అందమైన హీరోయిన్ ఈమెనే. కానీ తన అమ్మ వల్ల ఆమె జీవితం
అందుకు కారణం లేకపోలేదు. వెంకటేష్(venkatesh),అనిల్ రావిపూడి(Anilravipudi)మూవీ త్వరలోనే స్టార్ట్ కానుంది. కళ్యాణ్ రామ్ కూడా ఒక హీరో. ఈ మూవీ కూడా సంక్రాంతి బరిలో నిలబడటం తధ్యం. అనిల్ రావిపూడితో పాటు ప్రేక్షకుల డ్రీం కూడా. మరి సెల్యులాయిడ్ పై తన F3 టీంతో వరుణ్ తేజ్ పోటీపడటం అంటే అన్నయ్య వెంకీ కే వరుణ్ యాదవ్ ఎదురొస్తున్నట్టుగానే ప్రేక్షకులు ఫీలవుతారు. అంతలా F 2 , F 3 తో వెంకీ, వరుణ్ మెస్మరైజ్ చేసారు.





