
1. రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ లాంచ్:
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈరోజు ముంబైలో గ్రాండ్గా జరిగింది. మూడు నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో అదిరిపోయే కంటెంట్ ఉంటుందని ట్రైలర్ తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
2. సరికొత్త లుక్ లో బాలయ్య!
నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ కోసం బాలయ్య సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపించబోతున్నారట. ఇందుకోసం ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హాకిమ్.. బాలయ్యకు సరికొత్త హెయిర్ స్టైల్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే డ్రెసింగ్ స్టైల్ను కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట. ఆగస్టు నెలలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
3. 'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్కు టైం ఫిక్స్!
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం 'డ్రాగన్'. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సమయాన్ని ఖరారు చేసింది. మే 19 రాత్రి సరిగ్గా 11 గంటల 52 నిమిషాలకు ఈ గ్లింప్స్ను విడుదల చేయనున్నారు. ఈ గ్లింప్స్ నిడివి 4 నిమిషాలకు పైగా ఉంటుందని సమాచారం.
4. సినిమాలకు శ్రీలీల బ్రేక్!
హీరోయిన్ శ్రీలీల సినిమాలకు తాత్కాలికంగా చిన్న విరామం ప్రకటించింది. ఒకప్పుడు వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడిపిన ఈ బ్యూటీ, ప్రస్తుతం కొత్త సినిమాలను ఒప్పుకోవడం లేదు. ఆల్రెడీ ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీలీల, ఇప్పుడు నీట్-పీజీ (NEET-PG) పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోందని, అందుకే ఈ గ్యాప్ తీసుకుందని ఆమె తల్లి స్వర్ణలత స్పష్టం చేశారు. అలాగే క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ చేస్తోందంటూ వస్తున్న రూమర్లను ఆమె పూర్తిగా ఖండించారు.
5. 'పెద్ది' మూవీ ఫస్ట్ రివ్యూ!
రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఏకంగా 3 గంటల 9 నిమిషాల భారీ రన్టైమ్ తో థియేటర్లలోకి రానుందని సమాచారం. 1980ల నాటి గ్రామీణ నేపథ్యం, బలమైన ఎమోషన్స్, పవర్ఫుల్ రస్టిక్ డ్రామా కావడంతో కథకు తగినట్లుగానే ఈ రన్టైమ్ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చివరి 50 నిమిషాల ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.
6. హీరోయిన్ రష్మికకు చేదు అనుభవం!
బాలీవుడ్ మూవీ 'కాక్టెయిల్-2' ప్రమోషన్ ఈవెంట్లో హీరోయిన్ రష్మిక మందన్నాకు చేదు అనుభవం ఎదురైంది. ఈవెంట్లో రష్మిక మాట్లాడుతుండగా పక్కనే ఉన్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఆమె భుజంపై చేయి వేయడంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురైంది. పైకి నవ్వుతూనే ఆమె వెంటనే పక్కకు తప్పుకుంది. షాహిద్ ప్రవర్తన పట్ల రష్మిక ఇబ్బంది పడినట్లు స్పష్టంగా తెలుస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
7. 'కరుప్పు' వసూళ్ల వర్షం!
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ యాక్షన్ డ్రామా 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మే 15న విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. సోమవారం వారం కూడా బుకింగ్స్ బాగున్నాయి. 'మండే టెస్ట్' పాస్ అయ్యి, ఈ మూవీ లాంగ్ రన్ దిశగా అడుగులు వేస్తోంది.
8. కమల్ హాసన్, శివకార్తికేయన్ మూవీ స్టార్ట్!
'అమరన్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'సెయాన్'. రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్పై కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం సోమవారం గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శివకుమార్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్, పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
9. 'టాక్సిక్' రిలీజ్ పై యశ్ షాకింగ్ కామెంట్స్!
'టాక్సిక్' మూవీ విడుదల ఆలస్యంపై హీరో యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రిలీజ్ విషయంలో తాము హాలీవుడ్ తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నామని.. మొదట షూటింగ్ మొత్తం పూర్తి చేసి, ఆ తర్వాతే డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ పనులను చూసుకుంటామని తెలిపారు. తాము అనుసరిస్తున్న ఈ హాలీవుడ్ శైలి ఇక్కడి ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని యశ్ పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్ లక్ష్యంతోనే ఈ ఆలస్యం జరుగుతోందని, తాను ఏం చేసినా అభిమానుల కోసమేనని యశ్ స్పష్టం చేశారు.
10. ప్రముఖ నిర్మాత ఆత్మహత్య!
తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కోలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కె. రాజన్ ఆదివారం సాయంత్రం చెన్నైలోని అడయార్ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.





