ధోనీ హీరో బ్రేకప్ అయ్యాడు..!
on May 6, 2016
2016 బాలీవుడ్ కు బ్రేకప్ ఏడాదిగా గుర్తుండిపోయేలా ఉంది. వరసగా పైళ్లైన జంటలు, పెళ్లికాని జంటలు బ్రేకప్పులు చెప్పేసుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో యంగ్ బాలీవుడ్ హీరో చేరాడు. ధోనీ బయోపిక్ లో హీరోగా నటిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అతని గర్ల్ ఫ్రెండ్ అంకితా లోఖాండే బైబై చెప్పేసుకున్నారు. విడిపోయినా, ఇన్నాళ్లూ ఎప్పుడూ నోరు మెదపలేదు. రీసెంట్ గా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు పెరిగిపోవడంతో, సుశాంత్ తన సన్నిహితుల వద్ద క్లియర్ కట్ గా విషయాన్ని చెప్పేశాడట. తమ ఇద్దరి మధ్యా మాటలు కూడా లేవని, విడిపోవడం తప్పలేదని సుశాంత్ స్పష్టం చేశాడట. మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనుకున్నాను. కానీ ఇలా అయినందుకు బాధగా ఉంది అంటూ ఒక అభిమాని చేసిన ట్వీట్ కు సుశాంత్ రిప్లై ఇచ్చాడు. మనుషులు ఎదిగే క్రమంలో దారులు మారుతుంటాయి. చేసేదేమీ లేదు అని అతను చేసిన ట్వీట్, బాలీవుడ్ కు బ్రేకప్ కన్ఫర్ మేషన్ ఇచ్చేసింది. రాబ్తా సినిమాలో సుశాంత్, కృతీసనన్ లు కలిసి నటిస్తున్నారు. వారిద్దరి మధ్య చనువు పెరగటమే బ్రేకప్ కు కారణమని చెప్పుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.
Also Read