మూవీలో నేను ఎందుకు హైలెట్ అయ్యానంటే.. శ్రియారెడ్డి చెప్పిన నిజం
on Oct 8, 2025
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఓజి'(OG)ద్వారా మరోసారి తను ఎంత బలమైన నటినో ప్రూఫ్ చేసుకుంది శ్రియారెడ్డి(Shriya Reddy).ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తమ పోర్ట్ ని రక్షించుకోవడానికి చూసే 'గీత' క్యారక్టర్ లో విజృంభించి నటించిందని చెప్పవచ్చు. ప్రీవియస్ మూవీ సలార్(Salaar)లో కూడా 'రాధారమ' రోల్ లో సూపర్ గా చేసింది. అసలు ఆ క్యారక్టర్ లో ఆమెని తప్ప మరొకర్ని ఉహించుకోలేం. ఆమె లుక్ కూడా ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్ కి ఏ మాత్రం తీసుకొని విధంగా చాలా శక్తివంతంగా ఉంది.
రీసెంట్ గా శ్రియారెడ్డి ఒక ఇంటర్వ్యూలో సలార్ లోని తన లుక్ గురించి మాట్లాడుతు సలార్ లో నా క్యారక్టర్ కి సంబంధించి కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు 50 ,60 ఫుష్ అప్స్ చేసేదాన్ని. కాస్ట్యూమ్స్ వేసుకొని ఉన్నా, క్యారవాన్ లో ఉన్నా ఇది తప్పనిసరి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయం ముందుగానే చెప్పడంతో వాళ్ళు కూడా సీన్ విషయం కొంచం ముందుగానే చెప్పేవారు. దాంతో పుష్ అప్స్ చేసి సీన్ లోకి ఎంటర్ అయ్యేదాన్ని. అందుకే నేను శక్తివంతురాలిగా కనిపించేదాన్ని. నా వరకైతే బస్కీలు తియ్యడం అనేది సులభమైన వర్క్ అవుట్ అని శ్రియారెడ్డి చెప్పుకొచ్చింది.
2002 లో సమురాయ్ అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీయారెడ్డి,ఆ తర్వాత ఏడాది 'అప్పుడప్పుడు' అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.2008 లో ప్రముఖ నటుడు, నిర్మాత విక్రమ్ కృష్ణ తో పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. సలార్ తో నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిందని చెప్పవచ్చు. ప్రముఖ హీరో విశాల్(Vishal)కి విక్రమ్ కృష్ణ సోదరుడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



