Home

»

Latest News

sharwanand: శర్వానంద్,శ్రీను వైట్ల మూవీలో క్రేజీ హీరోయిన్ 

Jun 25, 2026 11:59AM

 


విభిన్నమైన కథలని ఎంచుకుంటూ వరుస విజయాల జోష్‌లో ఉన్న లవర్ బాయ్ శర్వానంద్, అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి 'జార్జ్ క్రిష్' అనే వైవిధ్యమైన టైటిల్‌ని ఖరారు చేయబోతునట్టుగా  టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా హీరోయిన్ ఎంపిక పై సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది.

హీరోయిన్ క్యారక్టర్  కోసం గత కొంతకాలంగా పూజా హెగ్డే, మమితా బైజు, మిస్ ఇండియా రన్నరప్ మానస వారణాసి లాంటి పలువురు ముద్దుగుమ్మల పేర్లు గట్టిగా వినిపించాయి. అయితే, తాజా ఫిలింనగర్ సమాచారం ప్రకారం హీరోయిన్‌గా నార్త్ బ్యూటీ, యువ నటి భాగ్యశ్రీ బోర్సేని  ఎంపిక చేసినట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. తన అందచందాలతో, అభినయంతో కుర్రకారు మనసు దోచుకుంటున్న ఈ భామ శర్వానంద్ సరసన మెరవడం సినిమాకు మరింత గ్లామర్ అండ్ ఫ్రెష్ లక్ తీసుకువస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. కథ వినగానే ఈ పాత్రకు భాగ్యశ్రీ బోర్సే పర్ఫెక్ట్ ఛాయిస్ అని చిత్ర యూనిట్ భావించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే, తెలియని వయసులో ఆవేశంతో హీరో తీసుకున్న ఒక బలమైన నిర్ణయం అతని జీవితాన్ని ఏ తీరానికి చేర్చింది? ఆ సంఘటన తర్వాత అతని జీవితంలో చోటు చేసుకున్న అనుకోని పరిణామాలు ఏమిటి? అనే ఆసక్తికరమైన ఎమోషనల్ అండ్ ఎంటర్టైనింగ్ పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని సమాచారం. శర్వానంద్‌కు ఈ లైన్ మరియు శ్రీను వైట్ల మార్క్ స్క్రీన్‌ప్లే బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో శ్రీను వైట్ల శైలిలో ఉండే మార్క్ కామెడీకి తోడు, బలమైన సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా అంశాలు కూడా సమపాళ్లలో ఉండబోతున్నాయట. ఈ స్క్రిప్ట్ శర్వానంద్ కెరీర్‌లో ఒక విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్.


నిర్మాణ ప్రణాళికల పరంగా చూస్తే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదటి షెడ్యూల్‌ను రాబోయే ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. తొలి షెడ్యూల్‌లోనే కథకు అత్యంత కీలకమైన కొన్ని ప్రారంభ సన్నివేశాలను మరియు భారీ తారాగణంతో కూడిన సీన్లను చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించి, వచ్చే ఏడాది ఒక పెద్ద పండుగ సీజన్‌లో థియేటర్లలోకి తీసుకురావాలనేది మేకర్స్ ఆలోచన. పండుగ సెలవుల అడ్వాంటేజ్‌తో బాక్సాఫీస్ వద్ద 100 శాతం వసూళ్లను సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అటు శర్వానంద్ ఫ్యాన్స్, ఇటు శ్రీను వైట్ల కామెడీ లవర్స్ ఈ ప్రాజెక్ట్ అధికారిక అనౌన్స్‌మెంట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com