ENGLISH | TELUGU  

చింతామణి నాటకాన్ని నిషేధించడం ఖచ్చితంగా తప్పే!

on Jan 25, 2022

ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ ఎంతో చరిత్ర ఉన్న చింతామణి నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతున్నారు. తాజాగా ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యం చేసి ఆ రోగాన్ని పోగొట్టాలి కానీ మనిషిని చంపుకుంటామా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

"ఏపీలో చింతామణి నాటకాన్ని నిషేధించడం ఖచ్చితంగా తప్పే. ఎంత పెద్ద తప్పంటే.. దేవాలయంలో డస్ట్ ఎక్కువగా ఉంటే.. ఆ డస్ట్ ని క్లీన్ చేయకుండా, దేవాలయాన్ని కూల్చేసినంత తప్పు. అయితే కళాకారులకు, నాటకరంగానికి కీడు తలపెడదాం అని ప్రభుత్వం చేసిన పని అయితే కాదు ఇది. ఎందుకంటే.. కళాకారులకు, రంగస్థలానికి కీడు చేద్దామనే ఆలోచన ఏ ప్రభుత్వానికైనా ఎందుకు ఉంటుంది? అసలు ఈ తప్పు జరగడానికి మూలం ఏమిటనేది ఆలోచిద్దాం. 

కాళ్ళకూరి నారాయణరావు గారనే ఓ మహానుభావుడు ఈ నాటకాన్ని రాశారు. అందులోని ప్రతి మాటా, ప్రతి పద్యం ఒక అద్భుతం. అంత గొప్ప నాటకాన్ని.. తర్వాత్తర్వాత కాళ్ళకూరి నారాయణరావు గారు రాయని బూతులను చొప్పించి.. ఆ నాటకాన్ని అపవిత్రం చేశారు. తప్పు కళాకారుల నుండే జరిగింది. అయితే దీనిని బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు. చింతామణి నాటకంలో చొప్పించబడ్డ బూతుల్ని తీసేసి.. నాటక ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలి. ప్రభుత్వం దీనిపై పునరాలోచించాల్సిందిగా కోరుతున్నాను." అని బుర్రా సాయిమాధవ్ అన్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.