Home

»

Latest News

చిరంజీవి ప్లేస్ లో రామ్ చరణ్!

Jan 26, 2022 2:33PM

'మహానటి' సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ లక్ సఖి'. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌ గా కనిపించనుంది. 

తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందిన ఈ మూవీ జ‌న‌వ‌రి 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ కానుంది. ఈ నేపథ్యంలో నేడు(బుధవారం) ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను మూవీ టీమ్ గ్రాండ్ గా నిర్వహించనుంది. ఈ సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో జరగనున్న ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే తాజాగా చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఆయన స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ తాజాగా అధికారికంగా తెలుపుతూ ఒక పోస్టర్ ని విడుదల చేసింది.

ప్ర‌ముఖ నిర్మాత  దిల్‌రాజు  సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్న ఈ సినిమాకి నగేష్ కుకునూర్ ద‌ర్శ‌కుడు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ సోమవారం విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com