Home

»

Latest News

Peddi: 'పెద్ది' సక్సెస్ ఈవెంట్‌లో మెగా సర్‌ప్రైజ్.. చీఫ్ గెస్ట్‌ ఎవరో తెలుసా?

Jun 23, 2026 11:25AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన లేటెస్ట్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా "పెద్ది" (Peddi) బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సరికొత్త సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. గత చిత్రం 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, ఈ చిత్రం మాత్రం విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సోలో చిత్రంగా నిలిచింది.

దర్శకుడు బుచ్చిబాబు సానా సరికొత్త కథాంశంతో, ఒక పల్లెటూరి యువకుడు పారా అథ్లెట్‌గా ఎదిగి తన గ్రామానికి గుర్తింపు తీసుకువచ్చే క్రమాన్ని ఎంతో భావోద్వేగంగా తెరకెక్కించారు. ఈ భారీ విజయంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో గ్రాండ్ లెవెల్‌లో 'పెద్ది సక్సెస్ మీట్' నిర్వహించేందుకు సిద్ధమైంది. నేడు(జూన్ 23) శిల్పకళా వేదికలో జరగనున్న ఈ భారీ బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారనే న్యూస్ వైరల్ గా మారింది. తన కుమారుడు చరణ్ అద్భుతమైన నటనకు, బుచ్చి బాబు టేకింగ్‌కు ముగ్ధుడైన చిరంజీవి, ఈ వేడుకలో పాల్గొని చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించనున్నట్లు తెలుస్తోంది.

దాదాపు ₹300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, ముఖ్యంగా శృతి హాసన్ నటించిన ప్రత్యేక గీతం థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించాయి. 

మూడు వారంలోనూ 'పెద్ది' మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రికార్డుల వేట కొనసాగిస్తోంది. హైదరాబాద్‌లో జరగబోయే ఈ మెగా సక్సెస్ మీట్ ఈవెంట్ కోసం అటు మెగా అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com