
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తోంది. టాలీవుడ్లో తిరుగులేని మార్కెట్ ఉన్నప్పటికీ, ఈ సినిమాకు నార్త్ ఇండియాలో ఎలాంటి స్పందన రాబోతోంది అనేది ఇప్పుడు మెగా అభిమానులతో పాటు సినీ వర్గాలలోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
ఎలాంటి సీక్వెల్ బ్యాకప్ లేని ఒక ప్యూర్ స్టాండ్అలోన్ సినిమాగా వస్తున్న ‘పెద్ది’.. బాలీవుడ్ బెల్ట్లో రామ్ చరణ్ సోలో మార్కెట్ స్టామినాను నిరూపించేందుకు ఒక అగ్నిపరీక్షలా మారింది. గతంలో వచ్చిన భారీ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ హిందీలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేక నిరాశపరచడంతో, ఈసారి ‘పెద్ది’ చిత్రంతో నార్త్ మార్కెట్లో గట్టిగా కొట్టాలని మేకర్స్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు.
నార్త్ ఇండియాలో ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి, చరణ్ క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ భారీగా స్కెచ్ వేశారు. హిందీ బెల్ట్లో ఏకంగా 1000కి పైగా థియేటర్ల స్క్రీన్స్లో ఈ సినిమాను అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, బాలీవుడ్లో ఈ సినిమాకు మొదటి రోజు కనీసం రూ. 10 కోట్లకు పైగా నెట్ ఓపెనింగ్స్ వస్తే గనుక, అది అదిరిపోయే శుభారంభంగా భావించవచ్చు. మొదటి ఆట నుంచే ఉత్తరాది ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ కనుక వస్తే, లాంగ్ రన్లో ఈ చిత్రం బాలీవుడ్లో రూ. 75 కోట్ల నుండి రూ. 100 కోట్ల లైఫ్టైమ్ కలెక్షన్లను సులువుగా సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.
అయితే, నాణేనికి మరో వైపు ఉన్నట్టుగా ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో ట్రేడ్ వర్గాలు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాయి. ఒకవేళ ఆశించిన స్థాయిలో నార్త్లో బజ్ క్రియేట్ అవ్వక, మొదటి రోజు కలెక్షన్లు రూ. 8 కోట్ల లోపే నమోదైతే మాత్రం హిందీలో సినిమా రన్ ఊపందుకోవడం చాలా కష్టమవుతుంది. అదే గనుక జరిగితే, లాంగ్ రన్లో ఈ సినిమా కలెక్షన్స్ కేవలం రూ. 40 నుండి రూ. 50 కోట్ల దగ్గరే ఆగిపోయే ప్రమాదం ఉందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అందుకే రాబోయే ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్ ద్వారా హిందీ మార్కెట్లో గట్టి హైప్ క్రియేట్ చేయడంపైనే చిత్ర యూనిట్ పూర్తి ఫోకస్ పెట్టాల్సి ఉంది. చరణ్ పాన్ ఇండియా కెరీర్ నెక్స్ట్ లెవెల్కు వెళ్లాలంటే ‘పెద్ది’ బాలీవుడ్లో భారీ ఓపెనింగ్స్ సాధించడం అత్యంత కీలకంగా మారింది.






