
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (PEDDI). ముంబై వేదికగా గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఊరమాస్ విజువల్స్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉండటంతో, సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ ట్రైలర్ చూసినప్పటి నుండి మెగా ఫ్యాన్స్, నెటిజన్లలో హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) లుక్పై ఒక క్రేజీ చర్చ నడుస్తోంది. (Peddi Trailer)
ఈ సినిమాలో పక్కా రూరల్ అమ్మాయిలా కనిపించడం కోసం జాన్వీ కపూర్ తన ముంబై గ్లామర్ను పూర్తిగా పక్కన పెట్టేసింది. పల్లెటూరి లంగా ఓణీ కల్చర్తో కూడిన లుక్లో కనిపించడానికి ఆమె పడిన కష్టం ప్రతి విజువల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైలర్లో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్, కాస్ట్యూమ్స్, ఆమె పల్లెటూరి యాటిట్యూడ్ చూసిన ఆడియన్స్కు వెంటనే రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ 'రంగస్థలం' గుర్తుకు వస్తోంది. అందులో చరణ్ సరసన 'రామలక్ష్మి'గా సమంత పోషించిన విలేజ్ రోల్ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'పెద్ది'లో జాన్వీ కపూర్ లుక్ సరిగ్గా సమంత క్యారెక్టర్కు చాలా దగ్గరగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ట్రైలర్కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, సమంత తరహాలోనే జాన్వీ కపూర్ కూడా ఈ విలేజ్ గర్ల్ క్యారెక్టర్తో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్లో సరికొత్త బెంచ్మార్క్ సెట్ చేయడానికి సిద్ధమవుతున్న 'పెద్ది' చిత్రం జూన్ 4 న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది.






