.webp)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది(Peddi) సినిమా చేస్తున్నాడు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్. శివ రాజ్కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.
డాల్బీ సినిమా ఫార్మాట్లో విడుదల కాబోతున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా 'పెద్ది' రికార్డు సృష్టించనుంది. ఈ సాంకేతికత వల్ల సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు థియేటర్లో ఒక సరికొత్త లోకంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. విజువల్స్ చాలా స్పష్టంగా, రంగులు సహజంగా కనిపిస్తాయి. బుచ్చిబాబు ఈ సినిమాను విజువల్ పరంగా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా మనం థియేటర్లలో 'డాల్బీ అట్మాస్' సౌండ్ గురించి వింటుంటాం. కానీ 'డాల్బీ సినిమా' అనేది అంతకంటే మెరుగైన సాంకేతికత. ఇందులో అద్భుతమైన విజువల్స్, హై-క్వాలిటీ సౌండ్ రెండూ కలిసి ఉంటాయి. ఇప్పటివరకు హాలీవుడ్ సినిమాలు మాత్రమే ఈ ఫార్మాట్లో ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు తెలుగులో 'పెద్ది' సినిమా ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకోబోతోంది.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 30న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది.







