
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)నుంచి వస్తున్న భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'(Peddi). జూన్ 4, న రిలీజ్ అవుతున్న జూన్ 3 న ప్రీమియర్స్ తో బరిలోకి దిగడానికి ఉవ్విళ్ళూరుతూ ఉన్నాడు. 1980ల నాటి రూరల్ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంతో సాగే ఈ కథలో క్రికెటర్, రెజ్లర్, స్ప్రింటర్గా చరణ్ కనిపించనున్నాడు. 300 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మితమైన పెద్దిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే సెన్సార్ బోర్డు నుంచి 'U/A 16+' సర్టిఫికేట్ 189 నిమిషాల (3 గంటల 9 నిమిషాలు) సుదీర్ఘ రన్టైమ్తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా ప్రమోషన్లని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేలా చిత్రబృందం విజయవాడ(Vijayawada)నగరంలో 'పెద్ది' గ్రాండ్ ప్రీ రిలీజ్ హంగామాకి భారీ ఏర్పాట్లు చేస్తోంది.జూన్ 1 సాయంత్రం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మెగా సంబరం అత్యంత ఘనంగా జరగనుంది . బెంగళూరు, ఢిల్లీ, భోపాల్ వంటి ప్రధాన నగరాల్లో ఇప్పటికే విసృతమైన ప్రమోషన్స్ నిర్వహించిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఆంధ్రా రాజధాని నడిబొడ్డున ఉన్న విజయవాడలో నిర్వహిస్తుండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల మెగా అభిమానుల్లో ఉత్సాహం అంబరాన్ని తాకుతోంది.
Also read: Toxic: టాక్సిక్ కథపై కియారా అద్వానీ షాకింగ్ కామెంట్స్.. అసలు కథ ఇదేనా!
ఈ విజయవాడ వేడుకకు సంబంధించిన మరో మైండ్ బ్లోయింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రీ రిలీజ్ ఈవెంట్కి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడనే న్యూస్ ఇరువురి అభిమానుల్లో జోష్ ని తెస్తుంది. రామ్ చరణ్పై ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో బాలయ్య ఈ వేడుకకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి మెగాస్టార్ చిరంజీవి వస్తాడని చెప్తున్న నేపథ్యంలో బాలకృష్ణ కూడా ఒకే వేదికపైకి వస్తే గవిజయవాడ ఇంద్రకీలాద్రి పరిసరాలు మెగా, నందమూరి అభిమానుల కోలాహలంతో సరికొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలవడం ఖాయం. అలాగే హైదరాబాద్ లో కూడా మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతారా లేదా విజయవాడదే ఫైనల్ నా చూడాలి.





.webp)

