
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), డైరెక్టర్ సుజీత్ (Sujeeth) కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామా ‘OG’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముంబై బ్యాక్డ్రాప్లో ఓజస్ గంభీరగా పవన్ కళ్యాణ్ చూపించిన మాస్ విశ్వరూపానికి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. 2025 సెప్టెంబర్ 25న విడుదలైన మొదటి భాగం, దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ భారీ విజయం అందించిన ఉత్సాహంతో ఇప్పుడు ఈ గంభీర సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడానికి మేకర్స్ అధికారికంగా రంగంలోకి దిగారు.
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒకే ఒక్క అధికారిక ట్వీట్తో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ‘OG 2’ నామస్మరణతో మారుమోగిపోతోంది. తుఫాను వచ్చే ముందు ప్రకృతిలో ఎలాంటి నిశ్శబ్దం ఉంటుందో, ఇప్పుడు కూడా ‘OG’ ప్రపంచంలో అలాంటి నిశ్శబ్దమే ఆవరించి ఉందని, త్వరలోనే గంభీర జీవితంలోని సరికొత్త, ఇప్పటివరకు ఎవరికీ తెలియని రహస్యాలను, అసలు సిసలైన కథను ‘OG 2’ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ స్వయంగా ఈ క్రేజీ సీక్వెల్ను నిర్మిస్తుండటం గమనార్హం. మొదటి భాగాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా, ఇప్పుడు ఓజీ యూనివర్స్ను మరింత పెద్ద ఎత్తున విస్తరించేందుకు పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ను రంగంలోకి దించారు.
మొదటి భాగంలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, సుజీత్ టేకింగ్, అలాగే థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను ఒక కల్ట్ క్లాసిక్గా నిలబెట్టాయి. ఆ మ్యాజిక్ను మళ్లీ రిపీట్ చేస్తూ, పార్ట్ 2 కోసం మరింత పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం సమయాన్ని కేటాయించబోతున్నారు. అన్నీ కుదిరితే 2026 నవంబర్ తర్వాత ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్కు వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.






