Home

»

Latest News

ఓనం 2026 బాక్సాఫీస్ యుద్ధం: మలయాళంలో బాక్సాఫీస్ కింగ్ ఎవరు!

Aug 13, 2026 3:03PM

 

 

ఒకప్పుడు మన సినిమాలో కామెడీ యాక్టర్ మలయాళంలో డైలాగ్ చెపితే ఎగతాళి చేస్తూ నవ్వుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏ ఇంట్లో చేసినా ఓటిటిలో వస్తున్న మలయాళ సినిమాలు చూస్తూ ఆ క్యారక్టర్ ఇలా ఈ క్యారక్టర్ ఇలా అని ఊసులాడుకుంటూ దట్ ఈజ్ మలయాళ సినిమా అని  నిద్రలోకి జారుకుంటున్నాం. సినీ ఫార్మేట్ ప్రకారం కథ, కథనం, క్యారక్టర్ ల తీరు తెన్నులు, కథ మూడ్ కి తగ్గ సాంగ్స్ తో సినిమాలు తెరకెక్కించి విజయాన్ని అందుకుంటున్నారు. అలాంటి మలయాళ సీమలో ఓనం పండక్కి జరుగుతున్న బాక్స్ ఆఫీస్ వార్ సినీ ప్రియులని ఆకట్టుకుంటుంది.


  ఓనం 2026 సీజన్ మాత్రం మలయాళ చిత్రసీమ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన పోరుకు వేదికగా మారబోతోంది. ఒకే వారం వ్యవధిలో పరిశ్రమకు చెందిన ముగ్గురు అగ్ర యువ కథానాయకులు తమ ప్రతిష్టాత్మక చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటమే అందుకు ప్రధాన కారణం.  దర్శకుడు వైశాఖ్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఖలీఫా', నహాస్ హిదాయత్ కాంబినేషన్‌లో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా తెరెకెక్కిన 'ఐయామ్ గేమ్', మరియు గిరీష్ ఏడీ దర్శకత్వంలో నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన 'బెత్లెహెం కుటుంబ యూనిట్' చిత్రాలు ఆగస్టు 20న ఒకేసారి విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. గతంలో ఓనం సీజన్ అంటే కేవలం మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి దిగ్గజ నటుల చిత్రాల మధ్యే ప్రధాన పోటీ ఉండేది. 1980ల కాలంలో మోహన్‌లాల్ నటించిన 'సుఖమూ దేవి', 'మనకు పార్కన్ ముంతిరితొప్పుకల్' చిత్రాలు, మమ్ముట్టి నటించిన 'ఆవనాజి', 'సాయం సంధ్య' వంటి నాలుగు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడి రికార్డులు సృష్టించిన చరిత్ర ఉంది. ఆ తర్వాత ఫాజిల్ తెరకెక్కించిన 'హరికృష్ణన్స్' (1998) లాంటి మల్టీస్టారర్ బ్లాక్‌బస్టర్లు ఓనం పండుగకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  అయితే ప్రస్తుత తరం హీరోల్లో పరిస్థితి మునుపటి కంటే భిన్నంగా ఉంది. 2026 ఓనం రేసులో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, నివిన్ పౌలీ ముగ్గురూ ప్రస్తుతం సొంత గడ్డపై తమ కెరీర్‌లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వీరి స్థానాన్ని, స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడానికి ఈ ఓనం విజయం వారికి అత్యంత కీలకంగా మారింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరోలకు ఈ పండుగ బాక్సాఫీస్ రేసు నిజంగానే 'డూ ఆర్ డై' పరీక్షగా నిలుస్తోంది.  ముఖ్యంగా నివిన్ పౌలీ పరిస్థితిని పరిశీలిస్తే, గత ఏడాది చివర్లో రూ. 151 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన 'సర్వం మాయ' చిత్రంతో ఆయన మళ్లీ పూర్వ వైభవం సాధించారని అభిమానులు భావించారు. కానీ, 2026 ఏడాది ఆయనకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. సక్నిల్క్ లెక్కల ప్రకారం, సర్వం మాయ తర్వాత కేవలం రెండు నెలల వ్యవధిలో విడుదలైన 'బేబీ గర్ల్' సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 4.61 కోట్లు మాత్రమే వసూలు చేయగా, 'ప్రతిచ్ఛాయ' చిత్రం రూ. 8.59 కోట్లకు పరిమితమై అట్టర్ ఫ్లాప్‌గా నిలిచాయి

Also read: అగధ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఏం ఎస్ రాజు హిట్ కొట్టినట్లేనా!

. దీంతో నివిన్ మళ్లీ మొదటికొచ్చి పడ్డారు. ఇప్పుడు ఆయన ఆశలన్నీ 'బెత్లెహెం కుటుంబ యూనిట్' సినిమాపైనే ఉన్నాయి.  మరొకవైపు, ఇతర భాషల్లో వరుస విజయాలు సాధిస్తున్న దుల్కర్ సల్మాన్‌కు మలయాళీ ప్రేక్షకుల వద్ద సరైన హిట్ దక్కి చాలా కాలమైంది. ఓటీటీలో నేరుగా విడుదలైన 'సెల్యూట్' తర్వాత ఆయన నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం 'కింగ్ ఆఫ్ కొత్త' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2023 ఓనం సీజన్‌లో ఆర్‌డిఎక్స్ (RDX) చిత్రం సంచలన విజయం సాధించి కింగ్ ఆఫ్ కొత్తను వెనక్కి నెట్టింది. ఈ నేపథ్యంలో దుల్కర్ నటించిన 'ఐయామ్ గేమ్' విజయం సాధించడం ఆయన మలయాళ మార్కెట్‌కు ఎంతో అవసరం.  పృథ్వీరాజ్ సుకుమారన్‌కు కూడా ఈ ఓనం యుద్ధం కీలకమే. 'విలాయత్ బుద్ధ' (2025) దారుణంగా విఫలం కావడం, 'పల్లిచట్టంబి' (2026)లో వచ్చిన కామియో రోల్ ట్రోల్స్‌కు గురికావడం, అలాగే భారీ అంచనాలతో వచ్చిన 'ఐ, నోబడీ' (2026) చిత్రం కేవలం5.37 కోట్ల గ్రాస్‌కే పరిమితం కావడం ఆయన మార్కెట్‌పై ప్రభావం చూపింది.

 

కాబట్టి 'ఖలీఫా' పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతేడాది మోహన్‌లాల్ 'హృదయపూర్వం'తో బరిలోకి దిగినప్పటికీ, కళ్యాణి ప్రియదర్శన్ 'లోక: చాప్టర్ 1: చంద్ర' చిత్రం ఏకంగా303.86 కోట్ల ఆల్‌టైమ్ రికార్డు సాధించి సంచలనం సృష్టించింది. మరి ఈ 2026 ఓనం బాక్సాఫీస్ పోరులో ఈ ముగ్గురు స్టార్స్‌లో ఎవరు విజయం సాధించి తమ కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకువస్తారో చూడాలి.

Prithviraj Sukumaran,  Dulquer Salmaan, Nivin Pauly

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com