Home

»

Latest News

priyanka chopra: ఆరుసార్లు రక్తం మార్పిడి.. ప్రియాంక చోప్రా అసలు విషయం బయటపెట్టేసింది

Feb 05, 2026

 


-అభిమానులకి బాధని కలిగిస్తున్న ప్రియాంక మాటలు 
-ఎందుకు అలా జరిగిందంటూ కామెంట్స్ 
-వారణాసి పై భారీ అంచనాలు

 

పాన్ ఇండియా యాక్ట్రస్ అనే స్థాయి దాటి పాన్ వరల్డ్ యాక్ట్రస్ అనే స్థాయికి ఎదిగిన 'ప్రియాంక చోప్రా(Priyanka Chopra)సినీ జర్నీ తెలిసిందే. ప్రెజంట్  మహేష్ బాబు(Mahesh Babu) రాజమౌళి(ss Rajamouli)ల 'వారణాసి'(Varanasi)తో బిజీగా ఉంది. ఆ ఇద్దరు ఏరి కోరి మందాకినీ అనే క్యారక్టర్ కి ప్రియాంక ని సెలక్ట్ చేసారు. అంటే తన వల్ల వారణాసి విజయ నాదానికి ఎంత లాభం జరగబోతుందో అర్ధం చేసుకోవచ్చు. వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద కూడా ప్రియాంక మాయాజాలం వారణాసి కి అదనపు ఆకర్షణ అని  చెప్పుకోవడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె చెప్పిన విషయాలు అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కర్ని ఎంతో ఆవేదనకి గురి చేస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం.


ప్రియాంక మాట్లాడుతు నా పాప పేరు మాల్తీ మేరీ. నెలలు నిండకుండానే మూడు నెలల  ముందుగానే మాల్తీ జన్మించింది. ఆ సమయంలో తను 765 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో కొన్ని నెలలపాటు హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చింది. పైగా అప్పుడు కరోనా సమయం. దాంతో చావు బతుకల మధ్య మాల్తీ హాస్పిటల్ లోనే పోరాటం చేసింది. మూడు నెలల్లో ఆరు సార్లు రక్తం మార్చారు. ఆ టైంలో చాలా భయంగా బతికాం. చివరకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుని మాల్తీ క్షేమంగా బయటపడిందని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూ సమయంలో తన భర్త నిక్ జోనస్ కూడా ప్రియాంక పక్కనే ఉన్నాడు. 

 

Also read: Epstein files: ఎప్ స్టీన్ కుంభకోణంలో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు! 


అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్(Nick Jonas)ప్రియాంక కి 2018 లో వివాహం జరిగింది. ప్రియాంక కి కన్నా పదేళ్ల చిన్నవాడు. సరోగసి ద్వారా మాల్తీ మేరీ కి జన్మనిచ్చారు. అమెరికాలోనే సెటిల్ అయిన ప్రియాంక వారణాసి షూటింగ్ కోసమే ఇండియాలో ఉంది.

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com