నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన తలనీలాలు సమర్పించారంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ఆమె గుండుతో ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇవి పూర్తిగా కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపొందించిన మార్ఫింగ్ ఫోటోలని ఫ్యాక్ట్ చెక్లో స్పష్టమైంది. అసలు విషయం తెలియక చాలామంది ఈ ఫోటోలను షేర్ చేస్తూ రకరకాల వార్తలను ప్రచారం చేస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నయనతార తన భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్తో కలిసి తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆ సమయంలో తీసిన అసలైన ఫోటోలను కొందరు అకతాయిలు ఏఐ టెక్నాలజీ సాయంతో మార్ఫింగ్ చేసి, నయనతార గుండు కొట్టించుకున్నట్లు క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేశారు.
రాబోయే క్రేజీ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' (Toxic) సినిమా ప్రమోషన్ల నేపథ్యంలోనే ఆమె ఇలాంటి లుక్లోకి మారారంటూ రూమర్లు సృష్టించారు. అయితే ఈ మార్ఫింగ్ ఫోటోల్లో ఏఐ వాటర్మార్క్లు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఇవి నకిలీ ఫోటోలని అందరికీ అర్థమైంది.
సాంకేతికత విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో సెలబ్రిటీల అసలైన ఫోటోలను ఏఐ సాయంతో మార్చి ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేయడం ట్రెండ్గా మారింది. గతంలోనూ పలువురు నటీనటులు ఇలాంటి డీప్ఫేక్, ఏఐ ఫేక్ ఫోటోల బారిన పడిన సంగతి తెలిసిందే.
ఈ నకిలీ ప్రచారాలను ఏమాత్రం పట్టించుకోని నయనతార, ప్రస్తుతం రాకింగ్ స్టార్ యష్ సరసన నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'టాక్సిక్'తో పాటు ఇతర లైనప్ ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అభిమానులు కూడా ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని నెటిజన్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.






