
ఖుష్బూ, దర్శకుడు సుందర్ సి దంపతులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ స్టార్ కపుల్ ఇంట్లో పెళ్లి బాజాలు ఘనంగా మోగాయి. ఖుష్బూ పెద్ద కుమార్తె అవంతిక సుందర్, తన చిరకాల ప్రియుడు శ్రవణ్ శ్రీనివాసన్ తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంది.
గోవా వేదికగా జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్ కి టాలీవుడ్, కోలీవుడ్ నుంచి భారీగా సినీ తారలు గోవా తీరానికి తరలివచ్చారు. పెళ్లికి ముందే మెహందీ, సంగీత్ వంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలతో గోవా రిసార్ట్ అంతా కలర్ఫుల్గా మారిపోయింది. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. నాగార్జునే ఇప్పటికే తన భార్య అమలతో కలిసి గోవా చేరుకున్నాడు.చిరంజీవి కూడా జాయిన్ కానున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు గోవా తీరం ఇండియన్ సినీ స్టార్స్ తో కళకళ లాడనుంది.
Also read: ఆ ఇద్దరు హీరోయిన్స్ తినేది తెలుగు ప్రేక్షకుల సొమ్ము.. మరి ఆ విధంగా మాట్లాడొచ్చా!






