
జననాయగన్ రేపో మాపో థియేటర్స్ లోకి వస్తుందని విజయ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కాచుకొని కూర్చున్నారు. కానీ రీసెంట్ గా నిర్మాత వెంకట్ కె. నారాయణ రిలీజ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ అయితే ఒక రకమైన షాక్ లో ఉండిపోయి విజయ్ ఇప్పుడు సాధారణ వ్యక్తి కాదు ముఖ్యమంత్రి కదా అంటున్నారు. మరి పూర్తి డీటెయిల్స్ చూద్దాం.
తాజాగా వెంకట్ కె. నారాయణ ఒక దేవాలయ దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతు జన నాయగన్ కి ఇప్పటివరకు సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. త్వరలోనే సెన్సార్ క్లియరెన్స్ ఇస్తుందని, సర్టిఫికేట్ చేతికి రాగానే రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా మే 10న ప్రమాణ స్వీకారం చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాము ఏ ఉద్దేశంతో అయితే 'జన నాయగన్' (ప్రజా నాయకుడు) అని పేరు పెట్టామో, సరిగ్గా అలాగే విజయ్ ఇప్పుడు తమిళనాడుకు నిజమైన జననాయకుడయ్యారని, సీఎం కావడంతో దేవుడి ఆశీస్సుల కోసం గుడికి వచ్చానని ఆయన పేర్కొన్నారు.
Also read: Janaki ramudu: పంచాయతీలో అల్లుడికి షాక్ ఇచ్చిన అత్త
వెంకట్ కె. నారాయణ జననాయగన్ ని సుమారు 400 కోట్ల భారీ వ్యయంతో నిర్మించాడు. మెగాస్టార్ చిరంజీవి, బాబీ అప్ కమింగ్ మూవీని కూడా వెంకట్ కె. నారాయణనే నిర్మిస్తున్నాడు.






