
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' (Peddi) పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా జరిగిన చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమా కథాంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు సినిమా ఎలా ఉండబోతుందో రివీల్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుకలో బుచ్చిబాబు మాట్లాడుతూ.. "పెద్ది సినిమా చూడ్డానికి మీకు పక్కా కమర్షియల్ ఫిల్మ్లా అనిపించవచ్చు. కానీ, ఇది కేవలం కమర్షియల్ సినిమా మాత్రమే కాదు. హై కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే, గుండెలను పిండేసే ఒక అద్భుతమైన ఎమోషనల్ డ్రామా ఇది" అని స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఈ చిత్రం ఒక క్రీడాకారుడి జీవితం చుట్టూ తిరుగుతుందని చెప్పారు. "ఇది ఒక ఆటగాడి ప్రయాణం. సాధారణంగా ఆట అంటే కేవలం ఒక ఆకతాయితనం అనుకుంటారు. కానీ ఆ ఆట ఒక మనిషి జీవితంలోకి ఎలాంటి మార్పులు తెస్తుంది? అతనికి సమాజంలో ఎలాంటి గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది? అలాగే అతని చుట్టూ ఉన్న మనుషుల ఆలోచనలను ఎలా మారుస్తుంది? అనే పాయింట్ చుట్టూ ఈ కథ సాగుతుంది" అని దర్శకుడు పేర్కొన్నారు.
డైరెక్టర్ లీక్ చేసిన ఈ స్టోరీ లైన్ విన్న తర్వాత మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. రామ్ చరణ్ కెరీర్లో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని, కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా చరణ్లోని అసలైన నటుడిని ఈ సినిమా బయటకు తీస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
'ఉప్పెన' చిత్రంతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు, ఈసారి రామ్ చరణ్తో ఒక స్పోర్ట్స్ బేస్డ్ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ఆడించడం విశేషం.






