రవితేజ, పూరీ "దేవుడుచేసిన మనుషులు" ఫిబ్రవరి 17 న
on Feb 15, 2012
రవితేజ, పూరీ "దేవుడుచేసిన మనుషులు" ఫిబ్రవరి 17 న ప్రారంభం కానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. దీని వివరాల్లోకి వెళితే మాస్ మహరాజ రవితేజ హీరోగా, నలకనడుము గోవా సుందరి ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించబోయే చిత్రం "దేవుడుచేసిన మనుషులు". ఈ "దేవుడుచేసిన మనుషులు" చిత్రం ఫిబ్రవరి 17 వ తేదీన హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.
కానీ వెన్యూ ఎక్కడ అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. మార్చ్ ఒకటవ తేదీ నుండి ఈ "దేవుడుచేసిన మనుషులు" చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయి, సింగిల్ స్కెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తారు. ఈ "దేవుడుచేసిన మనుషులు" చిత్రానికి పాటలు భాస్కరభట్ల వ్రాస్తూండగా, రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు.