Home

»

Latest News

కన్నీళ్లు పెట్టుకుంటున్న దర్శకుడు.. అల్లు అరవింద్ నే రిలీజ్ చేసాడని తెలుసా!

Jun 22, 2026 7:18PM

 

దర్శకుడు కంట తడి పెట్టడం సినిమాకి, సినీ ప్రేమికులకి పెద్దగా మంచిది కాదనే నానుడి ఉంది. దర్శకుడు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి, , రాత్రింబగళ్లు ఒక మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడతాడు. కానీ  చివరి నిమిషంలో వచ్చే కొన్ని అడ్డంకులు ఆ చిత్ర భవిష్యత్తునే కొన్ని సార్లు మార్చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ఒక చేదు అనుభవమే ఇవాళ 'దీవాన' (Deewana)చిత్ర బృందానికి ఎదురైంది. 'మెయిల్', 'శుభం' వంటి లఘు మరియు చిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన యంగ్ హీరో హర్షిత్ రెడ్డి సోలో హీరోగా నటించిన సరికొత్త న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ 'దీవాన'. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నాటి నుంచి  విమర్శకుల ప్రశంసలు, పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. డే బై డే థియేటర్లలో జెన్యూన్ మౌత్ టాక్‌తో బుకింగ్స్ కూడా పుంజుకుంటున్న తరుణంలో సెన్సార్ బోర్డ్ ఇచ్చిన సర్టిఫికేట్ రూపంలో పెద్ద ఇబ్బంది వచ్చి పడింది.

ఈ చిత్రం ప్రమోషన్స్ మరియు సక్సెస్ మీట్ లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక రామానాయుడు స్టూడియోస్‌లో ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో సినిమా ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబుతూ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి వేదికపైనే భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్ కూడా మాట్లాడుతూ సెన్సార్ బోర్డ్ వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి మరియు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో ఉండే కొన్ని పెద్ద సినిమాల్లో విపరీతమైన బూతు డైలాగులు, అశ్లీల సీన్లు ఉన్నప్పటికీ ఎలాంటి అభ్యంతరం తెలపకుండా చాలా సులభంగా U/A సర్టిఫికేట్ ఇస్తారని, కానీ తాము ఎక్కడా అసభ్యత లేకుండా పిల్లలు, కుటుంబ సభ్యులు అంతా కలిసి చూసేలా ఒక స్వచ్ఛమైన లవ్ స్టోరీని నిర్మిస్తే  ఏకంగా 'A' (అడల్ట్) సర్టిఫికేట్ ఇచ్చారని వాపోయారు.

Also read: Samantha: 150 కోట్ల క్లబ్ లోకి మా ఇంటి బంగారం!

సెన్సార్ బోర్డ్ ఇచ్చిన ఈ ఒక్క 'A' రేటింగ్ వల్ల సినిమా చూడటానికి వెళ్లే సాధారణ ప్రేక్షకుల మనసులో నెగెటివ్ ఒపీనియన్ ఏర్పడిందని, దీని వల్ల సినిమా ఓపెనింగ్ కలెక్షన్లకు భారీగా గండి పడిందని మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. చిత్ర నిర్మాత వాసు దేవ్ కొప్పీనేని అయితే తమ సినిమాని మరింత మంది ప్రేక్షకులకి చేరువ చేయాలనే ఉద్దేశంతో  సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో  టిక్కెట్ ధరని 100 గా ఫిక్స్ చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. . కేవలం ఒక సర్టిఫికేట్ వల్ల సినిమాను తప్పుగా అర్థం చేసుకోకుండా, థియేటర్లకు వచ్చి దీవానాని   చూసి చిన్న చిత్రాలను మరియు సరికొత్త ప్రతిభను సపోర్ట్ చేయాలని చిత్ర యూనిట్ తెలుగు ప్రేక్షకులను చేతులు జోడించి అభ్యర్థిస్తోంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నే దీవానా ని రిలీజ్ చేసాడు.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com