
స్టార్ హీరోయిన్ సమంత (Samantha), దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). ‘ఓ బేబీ’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విషయంలో సమంత ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్.
‘మా ఇంటి బంగారం’ విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించినట్టుగా మే 15న ఈ చిత్రం థియేటర్లలోకి రావడం లేదు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను జూలై నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దానికి పరోక్షంగా రామ్ చరణ్ కారణమని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో, ఆడియన్స్ మూడ్ను దృష్టిలో పెట్టుకుని మే 15 నుంచి పోస్ట్ పోన్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే జూన్ 4న విడుదల ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ, రీసెంట్ గా జూన్ 4 తేదీపై రామ్ చరణ్ ‘పెద్ది’ కర్చీఫ్ వేసింది. అలాగే జూన్ లో 'సింగ్ గీతం', 'లెనిన్' వంటి సినిమాలు కూడా ఉన్నాయి.
జూన్ నెలలో పలు చిత్రాలు లైన్లో ఉండటంతో, సోలో రిలీజ్ కోసం జూలై నెలను ఎంచుకున్నట్లు టాక్. సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావాలంటే సరైన సమయం కావాలని, అందుకే జూలైలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
ఈ సినిమాలో సమంత ఒక సాధారణ గృహిణిగా కనిపిస్తూనే, తన కుటుంబాన్ని రక్షించుకునే క్రమంలో పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్లు చేయబోతున్నారు. సామ్ తన సొంత బ్యానర్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నందిని రెడ్డి-సమంత కాంబో మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. జూలైలో సామ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.







