Home

»

Latest News

Ashu reddy: అషు రెడ్డి ఆడియో లీక్స్ కలకలం.. వామ్మో మరీ ఇంత దారుణమా!

Apr 28, 2026

 


  పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అభిమాని, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి చుట్టూ ఇప్పుడు తీవ్రమైన వివాదం ముసురుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయల నగదు, తీసుకోవడమే కాకుండా  ప్రాణహాని తలపెడుతుందంటు ధర్మేంద్ర అనే NRI పోలీసులను ఆశ్రయించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా కొన్ని ఆడియో క్లిప్పులు బయటకు రావడం మరిన్ని అనుమానాలకి  తావిస్తోంది.  


అషు రెడ్డి వాయిస్' నేను తీసుకున్న డబ్బులో కోటిన్నరే ఇస్తాను.  మిగతా డబ్బులు లైఫ్ లో సెటిల్ అవ్వగానే ఇస్తాను. ఈ ప్రాసెస్ కి ఒకే అనకపోతే మా ఇంటికి వచ్చి వేదిస్తున్నావని బెదిరింపుల కేసు పెడతాను. వేణుస్వామి. ప్రవీణ్ అక్క తో కలిసి రాజీ చేసుకుందాం.నీ ముఖం చూడటానికి కూడా నాకు ఇష్టం లేదని వార్నింగ్ లా అషు రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి


లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్రకు 2018లో అషు రెడ్డితో పరిచయం ఏర్పడింది. అప్పటికే తనకు విడాకులు అయిన విషయాన్ని ఆమెకు చెప్పినప్పటికీ, అషు రెడ్డి అతనితో ప్రేమలో పడిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించిందని బాధితుడు పేర్కొన్నాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత అవసరాలు, విలాసాల కోసం ధర్మేంద్ర నుండి భారీగా డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  రూ. 9.35 కోట్ల మోసం?ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం గత ఐదేళ్లలో సుమారు 5 కిలోల బంగారం, ఖరీదైన కార్లు, నగదు రూపంలో మొత్తం 9.35 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో . 3 కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు కోసం ధర్మేంద్రతో రూ. 1.80 కోట్లు కట్టించి, ఆ ఆస్తిని అషు తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందని బాధితుడు ఆరోపిస్తున్నాడు.  బెదిరింపులు మరియు ఆడియో లీక్స్డబ్బులు ఇవ్వడం ఆపివేసి, పెళ్లి గురించి ఒత్తిడి తెచ్చినప్పటి నుండి అషు రెడ్డి ప్రవర్తన మారిందని ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన డబ్బు తిరిగి అడిగితే తప్పుడు కేసులు పెడతానని, ఒక హత్య కేసు నిందితుడితో కలిసి తనను బెదిరిస్తోందని ఆరోపించాడు. 


Also read: Toxic: టాక్సిక్ మిస్టరీ.. లేట్ అవ్వడానికి అసలు కారణం ఇదేనా!


.అషు రెడ్డి కూడా ధర్మేద్ర ఆరోపణలపై  సోషల్ మీడియావేదికగా స్పందించారు. తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, తన అనుమతి లేకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిజం త్వరలోనే బయటకు వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ముగింపుప్రస్తుతం ఈ హై-ప్రొఫైల్ మోసం కేసును పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ధర్మేంద్ర సమర్పించిన బ్యాంకు లావాదేవీల రికార్డులు, ఆడియో ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఒక సెలబ్రిటీపై ఇంత భారీ మొత్తంలో మోసం ఆరోపణలు రావడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com