
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) చైర్మన్గా పి. భరత్ భూషణ్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళా రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధి, టీవీ రంగ విస్తరణ, అంతరించిపోతున్న నాటకరంగ పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మూడు విభాగాలను సమన్వయం చేస్తూ, రాష్ట్రంలో షూటింగ్ సంస్కృతిని పెంచడం, కళాకారులకు సరైన వేదికను కల్పించడం భరత్ భూషణ్ ముందున్న ప్రధాన లక్ష్యాలు.






