.webp)
-వైరల్ అవుతున్న అనసూయ పోస్ట్
-ఎందుకు ఎంట్రీ ఇచ్చింది
-సమస్య ఎక్కడ స్టార్ట్ అయ్యింది.
'అ' అంటే 'అనసూయ'(Anasuya) అనే రేంజ్ కి ఎదిగింది ప్రముఖ నటి 'అనసూయ'. మరి యాంకర్ గా స్మాల్ స్క్రీన్ షో నుంచి సోలో హీరోయిన్ రేంజ్ కి ఎదగడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. పాన్ ఇండియా డైరెక్టర్స్ సైతం తన కోసమే క్యారెక్టర్స్ క్రియేట్ చేసే చరిష్మా కూడా తన సొంతం. అందుకు ఆమె నుంచి ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలే ఉదాహరణ. సోషల్ మీడియాలోను తనదైన శైలిలో దూసుకుపోతు విమర్శకులకి, ట్రోలర్స్ కి సరైన సమాధానం ఇస్తుంటుంది. అసలు అనసూయ పేరు చెప్పకుండా ఆమె పోస్ట్ లని చూపిస్తే చాలు ఇది అనసూయ పోస్ట్ కదా అంటారు. సోషల్ మీడియాలో అంత యాక్టీవ్ మోడ్ లో ఉంటుంది. ఈ కోవలోనే రీసెంట్ గా ఒక పోస్ట్ చేయగా ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ కే వైరల్ ని నేర్పిస్తుంది. పూర్తి వివరాలేంటో చూద్దాం.
రీసెంట్ గా 'హోలీ'(Holi) ఫెస్టివల్ జరిగిన విషయం తెలిసిందే. సదరు హోలీ వేడుకలలో అనసూయ ఎంతో ఉత్సాహంగా పాల్గొని మీడియాతో ముచ్చటించింది. ఆ టైంలో కొంత మంది యువకులు అనసూయని ఆంటీ అని పిలిచారు. ఆ తతంగం మొత్తానికి సంబంధించిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. దీంతో వీడియోకి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కొంత ముందైతే ఫన్నీ కామెంట్స్ చేయడంతో పాటు రీల్స్ చేస్తున్నారు. ఆ రీల్స్ అనసూయ ని చాలా బాధకి గురి చేస్తున్నట్టుగా ఉన్నాయేమో, సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక పోస్ట్ చేయడం జరిగింది. సదరు పోస్ట్ లో 'కనీస సానుభూతి, సామాజిక బాధ్యత లేకుండా ఇతరుల బాధలో ఆనందాన్ని వెతికే వారిని సమాజం నిలదీసే రోజు రావాలి. ఏజ్ ని బట్టి హేళన చేయడం, ఆడ వారి పట్ల వివక్షణ చూపించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్ధించకూడదు.
also read: s saraswathi: ఎస్. సరస్వతి హైలెట్స్ ఇవే.. వాళ్ళకి బెయిల్ ఎందుకు ఇస్తున్నారు
నాకెందుకులే అని వదిలేస్తే అలాంటి విషయాలు సాధారణమవుతాయి. అయినా నేను సాధించిన ప్రయాణం నాకెంతో గర్వకారణం. ఎన్ని విమర్శలు ఎదురైనా తట్టుకొని నిలబడే ధైర్యమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. లైఫ్ లో పైకి వచ్చే వారిని విమర్శించడానికి మీరెవరు అని అనసూయ తన పోస్ట్ లో పేర్కొంది.







