
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా 'AA23' అని పిలుస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే సోషల్ మీడియాను షేక్ చేసింది. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే ఈ మధ్య కాలంలో ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ గట్టిగా వినిపించాయి. ఈ పుకార్ల వల్ల బన్నీ అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు.
కానీ తాజాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. గత 15 రోజుల్లోనే దర్శకుడు లోకేష్ కనగరాజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను రెండు సార్లు ప్రత్యేకంగా కలిశారని సమాచారం. కేవలం ఇదొక్కటే కాదు, ఈ ప్రాజెక్ట్కు రైటర్గా పనిచేస్తున్న రత్న కుమార్ కూడా రీసెంట్గా 'కాంట్ వెయిట్ ఫర్ AA23' అంటూ ట్వీట్ చేసి సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో రూమర్స్ అన్నింటికీ ఒక్కసారిగా చెక్ పడినట్లయింది. కథకు సంబంధించిన కీలకమైన మార్పులు, స్క్రిప్ట్ వర్క్ వేగంగా ముందుకు సాగుతున్నాయని టాక్. ఇద్దరి మధ్య జరిగిన ఈ రెండు సిట్టింగ్స్లో సినిమాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలపై ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారని తెలుస్తోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'రాకా' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. 2024 లో విడుదలైన 'పుష్ప 2: ది రూల్' సినిమా 1700 కోట్లకు పైగా గ్లోబల్ కలెక్షన్లు రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తెచ్చిన భారీ సక్సెస్ ఊపుతో అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలను మరింత జాగ్రత్తగా, పక్కా ప్లానింగ్తో ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ కనగరాజ్ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పక్కాగా గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడా బడ్జెట్ పరిమితులు లేకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. 2026 చివర్లో లేదా 2027 లో ఈ సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు.





