సాయి పల్లవి కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చింది
on Jul 3, 2022
ఇటీవల 'విరాట పర్వం' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి ఇప్పుడు మరో సినిమాతో అలరించడానికి సిద్ధమవుతోంది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ 'గార్గి' విడుదల తేదీని తాజాగా ప్రకటించారు.
గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన 'గార్గి' సినిమాను జులై 15 న థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు తాజాగా మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా అని, న్యాయం కోసం పోరాడే మహిళగా ఇందులో సాయి పల్లవి కనిపించనుందని తెలుస్తోంది.
జూన్ 17 న 'విరాట పర్వం'తో పలకరించింది సాయి పల్లవి. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ కలెక్షన్స్ రాబట్టలేక కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. దీంతో రెండు వారాలకే ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు నెలరోజుల వ్యవధిలో మరో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం సాయి పల్లవికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. తమిళ్ లో రూపొందిన ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
