ENGLISH | TELUGU  

మహేష్ బాబు సినిమా నేను చేసుంటే బాగుండేది..కల్కి డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు 

on Apr 15, 2025

ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్లో ఉత్తమాభిరుచిగల దర్శకుడిగా ముద్ర వేసుకున్న మేకర్ నాగ్ అశ్విన్(Nag Ashwin)ఆ తర్వాత ప్రభాస్(Prabhas)తో తెరకెక్కించిన మైథలాజికల్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడి' తో పాన్ ఇండియా స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ కీర్తిని మరింతగా పెంచాడు. ప్రస్తుతం కల్కి పార్ట్ 2 కి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు.

రీసెంట్ గా నాగ్ అశ్విన్ కొంత మంది కాలేజీ స్టూడెంట్స్ తో జరిగిన ఇంటర్వ్యూ లో సినిమా ఇండస్ట్రీలో తనకున్న అనుభవాలని పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతు నేను హీరోల్ని బట్టి కథ రాసుకోను. కథ రాసుకున్నాకే హీరోని సెలక్ట్ చేసుకుంటాను. ఆ విధంగానే కల్కి లో  క్యారెక్టర్స్ అనుకున్నాకే, మొదట అమితాబ్ బచ్చన్, ఆ తర్వాత ప్రభాస్ ని సెలెక్ట్ చేశాను. కొన్ని ప్రాజెక్టులకి ఎడిటర్ గా వర్క్ చేశాను. సినిమా బాగా రావడానికి ఎడిటింగ్ కూడా చాలా ముఖ్యం. సూపర్ స్టార్  మహేష్ బాబు నటించిన 'ఖలేజా' మూవీకి నేను ఎడిటింగ్ చేస్తే బాగుండేదని చెప్పుకొచ్చాడు.

త్రివిక్రమ్(Triviram)దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'ఖలేజా'(Khaleja)2010 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మహేష్ పెర్ఫార్మెన్సు తో పాటు మిగతా నటీనటుల పెర్ ఫార్మెన్స్ కామెడీ, త్రివిక్రమ్ డైలాగ్స్ అండ్ డైరెక్షన్ ఎక్స్ ఆర్డినరీ గా ఉంటాయి.సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి.కానీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచి మహేష్ అభిమానులకి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఖలేజా కి నేను ఎడిటింగ్ చేసుంటే బాగుండేదనే నాగ్ అశ్విన్ ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.

 

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.